క్లుప్తంగా… 25.04.2012

జాతీయం   మరోసారి రంగం మీదికి బోఫోర్స్ బోఫోర్స్ మరోసారి పతాక శీర్షికలకు ఎక్కింది. బోఫోర్స్ కుంభ కోణం బయటపడ్డ రోజుల్లో స్వీడన్ లో విచారణ నిర్వచించిన పోలీసు అధికారి తాజాగా సరికొత్త ఆరోపణలతో నోరు విప్పడంతో మంత్రులు, ప్రతిపక్షాలు వాదోపవాదాలు ప్రారంభించారు. బోఫోర్స్ కుంభకోణంపై జరిగిన విచారణను అడ్డుకోవడంలో అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ సఫలమైనాడని స్వీడన్ పోలీసు అధికారి స్టెన్ లిండ్ స్ట్రామ్ ప్రకటించి సంచలనం సృష్టించాడు. గాంధీల పాత్ర గురించి సాక్ష్యాలు లేవుగానీ…

ఇరాన్ అణుబాంబు నిర్మిస్తుందంటే నేన్నమ్మను -ఇజ్రాయెల్ కమాండర్

ఇరాన్ అణు బాంబు నిర్మిస్తుందని తాను భావించడం లేదని ఇజ్రాయెల్ ‘చీఫ్ ఆఫ్ స్టాఫ్’ లెఫ్టినెంట్ జనరల్ బెన్నీ గాంట్జ్ కుండ బద్దలు కొట్టాడు. ఇరాన్ రహస్యంగా అణు బాంబులు నిర్మిస్తోందనీ, ఇరాన్ అణు బాంబులు ప్రపంచ శాంతికి ప్రమాదకరమనీ అమెరికా, యూరప్, ఇజ్రాయెల్ లు ఓ పక్కన చెవి కోసిన మేకల్లా అరుస్తూ, ఇరాన్ పై అక్రమ యుద్ధానికి సైతం తెగబడుతున్న నేపధ్యంలో ఇజ్రాయెల్ సైన్యాధిపతి వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. మధ్య ప్రాచ్యం (Middle East)…

క్లుప్తంగా… 24.04.2012

జాతీయం జగన్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు జగన్ అవినీతి ఆస్తుల కేసులో సి.బి.ఐ ఉచ్చు బిగిస్తున్నదని ఫస్ట్ పోస్ట్ తెలిపింది. సెక్షన్ 164 కింద సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేయడం ద్వారా పకడ్బందీగా కేసు విచారణ సాగిస్తునట్లు వెల్లడించింది. మేజిస్ట్రేట్ సమక్షంలో నమోదు చేసిన సాక్షుల వాంగ్మూలాలను సాక్ష్యాలుగా కోర్టు పరిగణిస్తుందనీ, వాటిని ఆ తర్వాత సాక్షులు వెనక్కి తీసుకోవడానికి లేదనీ ఆ పత్రిక తెలిపింది. అలాంటి సాక్ష్యాలను రహస్యంగా ఉంచుతూ కింది కోర్టులో అప్పుడే వాటిని…

విదేశీ గూఢచర్యానికి ‘వాణిజ్య ముసుగు’ కోసం అనుమతి కోరిన అమెరికా మిలట్రీ

విదేశాల్లో తాము సాగించే గూఢచార కార్యకలాపాలకు ‘వాణిజ్య ముసుగు’ కావాలంటూ అమెరికా రక్షణ విభాగం కాంగ్రెస్ అనుమతి కోరింది. విదేశాలలో వాణిజ్యవేత్తల ముసుగులో మిలట్రీ గూఢచర్యానికి పాల్పడడానికి అమెరికాకి చెందిన ‘డిపార్ట్ మెంట్ ఆఫ్ డిఫెన్స్’ (డి.ఒ.డి) అమెరికా కాంగ్రెస్ ముందు ప్రతిపాదనలు ఉంచిందని ‘ఇన్ సైడ్ డిఫెన్స్’ వెబ్ సైట్ తెలిపింది. అమెరికా సైనికులను నేరుగా రంగంలోకి దించడం వల్ల వారి ప్రాణాలకు ముప్పు ఏర్పడుతోందనీ, వాణిజ్య ముసుగులో రహస్య మిలట్రీ కార్యకలాపాల కోసం అనుమతి…

ఫ్రాన్సు మొదటి రౌండ్ ఎన్నికల్లో అధ్యక్షుడు సర్కోజీకి రెండవ స్ధానం

ఫ్రాన్సు అధ్యక్షుడు నికోలస్ సర్కోజీ మొదటి రౌండ్ ఎన్నికల్లో రెండవ స్ధానంతో సరిపెట్టుకున్నాడు. సోషలిస్టు పార్టీ అభ్యర్ధి ఫ్రాంకోయిస్ హాలండే మొదటి స్ధానం చేజిక్కించుకున్నాడు. హాలండే కి 28 శాతం ఓట్లు రాగా, సర్కోజీకి 26 శాతం ఓట్లు వచ్చాయని బి.బి.సి తెలిపింది. అయితే హాలండే కి 28.63 శాతం ఓట్లు, సర్కోజీకి 27.18 ఓట్లు వచ్చాయని ‘ది హిందూ’ తెలిపింది. తీవ్ర మితవాది (far right) గా పత్రికలు అభివర్ణిస్తున్న మేరీన్ లీ పెన్ (నేషనల్…

‘బిక్రం సింగ్’ ఫైలు కోర్టుకి ఇవ్వాలని ఆదేశించిన సుప్రీం కోర్టు

ప్రస్తుత ఆర్మీ చీఫ్ పదవీ విరమణ చేశాక తదుపరి చీఫ్ గా ప్రభుత్వం నిర్ణయించిన ‘లెఫ్టినెంట్ జనరల్ బిక్రం సింగ్’ కి చెందిన ‘కాన్ఫిడెన్షియల్ ఫైలు’ ని కోర్టు ముందుంచాలని సుప్రీం కోర్టు సోమవారం ఆదేశిచింది. జస్టిస్ ఆర్.ఏం.లోధా, జస్టిస్ హెచ్.ఎల్.గోఖలే లతో కూడిన డివిజన్ బెంచి ఈ మేరకు ప్రభుత్వాన్ని కోరింది. బిక్రం సింగ్ ను తదుపరి ఆర్మీ చీఫ్ గా నియమించడాన్ని సవాలు చేస్తూ కోర్టులో దాఖలైన పిటిషన్ ను విచారిస్తూ సుప్రీం కోర్టు…

‘దళిత హత్యాకాండ’ కేసులో శిక్షలన్నీ రద్దు చేసిన బీహార్ హై కోర్టు

భారత దేశంలో దళితులకి న్యాయం సుదూర స్వప్నమేనని మరోసారి రుజువయింది. 21 మంది దళితులను, ముస్లింలను బలితీసుకున్న ‘బఠానీ టోలా’ హత్యాకాండ కేసులో బీహార్ హై కోర్టు శిక్షలన్నింటినీ రద్దు చేసేసింది. మంగళవారం నిందితులందరినీ నిర్దోషులుగా విడుదల చేసింది. సాక్ష్యాలు బలంగా లేవని చెప్పింది. ‘అనుమాన రహితం’గా నేరం రుజువు చేయడంలో పోలీసులు విఫలమయ్యారని చెప్పింది. కింది కోర్టు ముగ్గురిపై విధించిన ఉరి శిక్షను, మరో 20 మందికి విధించిన యావజ్జీవ కారాగార శిక్షనూ ఒక్క తీర్పుతో…

నా లేఖ లీక్ చేయడం మహా ద్రోహం -ఆర్మీ చీఫ్

ప్రధానికి రాసిన లేఖను తానే లీక్ చేశాడని ఆరోపిస్తూ, ఆర్మీ చీఫ్ వి.కె.సింగ్ ని పదవి నుండి తప్పించాలని ప్రతి పక్ష పార్టీలు ఓ వైపు డిమాండ్ చేస్తుండగానే ‘తన లేఖను లీక్’ చేసినవారిని జాలి, దయ లేకుండా శిక్షించాలని వి.కె.సింగ్ ప్రకటించి మరో సంచలనానికి తెరలేపాడు. ప్రధాన మంత్రికి అత్యంత రహస్యంగా తాను రాసిన లేఖను లీక్ చేయడం ‘మహా ద్రోహం’ (high treason) గా వి.కె.సింగ్ అభివర్ణించాడు. “లేఖను లీక్ చేయడాన్ని మహా ద్రోహంగా…

అమెరికాలో ఇజ్రాయెల్ ఉత్పత్తుల బహిష్కరణ

పాలస్తీనా ప్రజలపై జాత్యహంకార  ఇజ్రాయెల్ ఉత్పత్తులను బహిష్కరించాలని బ్రూక్లీన్ ప్రజలు నిర్ణయించుకున్నారు. పాలస్తీనీయుల హక్కులను ఉల్లంఘిస్తున్న ఇజ్రాయెల్ ఉత్పత్తులను వాడ కుండా ఆ దేశంపై ఒత్తిడి తేవాలని వారు కోరుతున్నారు. ‘పార్క్ స్లోప్ ఫుడ్ కోఆపరేటివ్’ అనే సహకార సంస్ధలో సభ్యులైన వేలాది సభ్యులు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు మంగళవారం ప్రకటించారు. బ్రూక్లీన్ టెక్నికల్ హైస్కూల్ దగ్గర సమావేశం అయిన వీరు ఏక గ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రెస్ టి.వి తెలిపింది. “మేము ఈ బాయ్…

బొలీవియాలో ఆయుధాలతో పట్టుబడిన అమెరికా ఎంబసీ కారు

దక్షిణ అమెరికా దేశం బొలీవియాలో అమెరికా ఎంబసీ కి చెందిన కారు పేలుడు ఆయుధాలతో పట్టుబడిందని ఎ.ఎఫ్.పి వార్తా సంస్ధ వెల్లడించింది. ఈశాన్య బొలీవియాలోని ‘ట్రినిడాడ్’ పట్టణంలో మంగళ వారం జరిగిన ఈ ఘటనను ‘జాతీయ భద్రత’ కు సంబధించిన అంశంగా బొలీవియా హోమ్ మంత్రి కార్లోస్ రొమేరో వ్యాఖ్యానించాడు. మూడు షాట్ గన్ లు, ఒక రివాల్వర్, రెండు వేల బులెట్ కాట్రిడ్జ్ లతో సహా మరి కొన్ని పేలుడు పదార్ధాలు అమెరికా ఎంబసీ కారులో…

చైనా అధ్యక్షుడి రాకను నిరసిస్తూ ఢిల్లీలో టిబెటన్ ఆత్మాహుతి -ఫొటోలు

చైనా అధ్యక్షుడు హు జీంటావో భారత దేశం సందర్శించడాన్ని నిరసిస్తూ టిబెట్ జాతీయుడొకరు న్యూఢిల్లీలో ఆత్మాహుతికి పాల్పడ్డాడు. ఢిల్లీలో నిరసన ప్రదర్శన జరుగుతుండగా దుర్ఘటన చోటు చేసుకుంది. తనకు తాను నిప్పంటించుకున్న జాన్ఫెల్ యేషి హు సందర్శనను వ్యతిరేకిస్తూ నినాదాలు ఇచ్చుకుంటూ యాభై మీటర్లు పరిగెత్తాడు. దానితో వెంటనే మంటలు ఆర్పడానికి చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. బాధితుడిని సమీపంలోని ఆసుపత్రిలో చేర్చారు. శరీరం ఎంతవరకు కాలిందీ వివరాలు తెలియలేదని పత్రికలు చెప్పాయి. టిబెట్ స్వతంత్రాన్ని కాంక్షిస్తూ…

పనికిరాని వాహనాల కొనుగోలుకు ఆర్మీ చీఫ్ కి రు.14 కోట్ల లంచం ఆఫర్

600 సబ్ స్టాండర్డ్ వాహనాల కొనుగోలుకు ఆర్మీలోనే ఉన్న మరొక ఉన్నతాధికారి తనకు రు.14 కోట్ల లంచం ఇవ్వజూపారని ఆర్మీ చీఫ్ జనరల్ వి.కె.సింగ్ వెల్లడించాడు. తనకు లంచం ఇవ్వజూపిన అధికారి ప్రస్తుతం రిటైర్ అయ్యాడని ఆయన తెలిపాడు. సంఘటన జరిగిన వెంటనే ఈ విషయం రక్షణ మంత్రి ఏ.కె.ఆంటోని కి తెలియజేశానని వి.కె.సింగ్ తెలిపాడు. అయితే వి.కె.సింగ్ పత్రికలకు ఈ సంగతి వెల్లడించాక మాత్రమే, సోమవారం, రక్షణ మంత్రి సి.బి.ఐ విచారణకు ఆదేశించడం గమనార్హం. “ఆరోపణలు…

బి.జె.పి ఎమ్మెల్యేల నీలి లీలలు: మొన్న కర్ణాటక, ఇపుడు గుజరాత్

కర్ణాటక అసెంబ్లీ లో బి.జె.పి ఎమ్మెల్యేల నీలి భాగోతం మర్చిపోక ముందే గుజరాత్ బి.జె.పి ఎమ్మేల్యేలు తాజాగా ‘నీలి’ వీధికెక్కారు. ప్రజాస్వామ్య కేంద్రాలు అని పాలక వర్గ పార్టీలు ఎంతో గొప్పగా చెప్పుకునే అసెంబ్లీ లంటే తమకు లెక్కే లేదని తేల్చేశారు. ఓ వైపు అసెంబ్లీలో కార్యకలాపాలు సాగుతుండగానే, తాము వెంట తెచ్చుకున్న ఐ ప్యాడ్ లో నీలి చిత్రాలు వీక్షించి తరించారు. తమ తలలపైనే ఉన్న జర్నలిస్టులు గమనించి స్పీకర్ కి ఫిర్యాదు చేశాక ‘అదేం…

మమత హిపోక్రసీ: పాలు, విద్యుత్ రేట్లు పెంచి, రైలు చార్జీలపై నాటకం

అధికారంలోకి వచ్చిన సంవత్సరం లోపే పశ్చిమ బెంగాల్ ముఖ్య మంత్రి మమత బెనర్జీ మూడు సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచింది. ట్రామ్ వేస్ కార్పొరేషన్ కి ఇస్తున్న సబ్సిడీ రద్దు చేయడమే కాక త్వరలో ఛార్జీలు కూడా పెంచబోతోంది. ప్రతి వంట గదిలో అత్యవసరంగా ఉపయోగించే పాల ఛార్జీలు పెంచింది. ఇన్ని చేసిన మమత రైలు ఛార్జీలు పెంచాడంటూ తన పార్టీ నాయకుడిని కేంద్ర మంత్రి పదవి నుండే తొలగించింది. “రైల్వే ఏ.సి ఛార్జీలు పెంచినా ఫర్వాలేదు…

రైలు ఛార్జీల పెంపుదల మమత కి ముందే తెలుసు -ఎన్.డి.టి.వి

తమ పార్టీకి చెందిన రైల్వే మంత్రి దినేష్ త్రివేది తనకు చెప్పకుండా రైలు ప్రయాణ ఛార్జీలు పెంచాడని ఆరోపిస్తూ, అతని సేత రాజీనామా కూడా చేయించిన మమతకి చార్జీల పెంపుదల సంగతి ముందే తలుసని ఎన్.డి.టి.వి వెల్లడించింది. రైల్వే బడ్జెట్ ప్రతిపాదిస్తున్న సమయంలోనే మమతతో రైల్వే ఛార్జీల పెంపు విషయాన్ని ప్రభుత్వ పెద్దలు చర్చించారని అభిజ్ఞ వర్గాలను ఉటంకిస్తూ ఎన్.డి.టి.వి తెలిపింది. ఒక్క మమతనే కాకుండా ప్రధాన ప్రతిపక్ష పార్టీలను కూడా ప్రభుత్వం సంప్రదించిందనీ, రైలు ఛార్జీలు…