ఫ్రాన్సు అతి తెలివి – ట్యునీషియా మచ్చ లిబియాకు సహాయంతో మటుమాయం?

కల్నల్ మౌమ్మర్ గడ్డాఫీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి ప్రస్తుతం గడ్డాఫీ వ్యతిరేకుల ప్రభావంలో ఉన్న లిబియా తూర్పు ప్రాంతానికి సహాయం చేసే పనిలో ఫ్రాన్స్ ఉంది. డాక్టర్లు, నర్సులు, మందులతో రెండు విమానాలు లిబియాలో తిరుగుబాటు దారులకు కేంద్రంగా ఉన్న బెంఘాజీ పట్టణానికి బయలుదేరినట్లు ఫ్రాన్స్ ప్రధాన మంత్రి ఫ్రాంకోయిస్ ఫిల్లాన్ ప్రకటించాడు. ట్యునీషియాలో ప్రజల తిరుగుబాటుతో మాజీ అధ్యక్షుడు జైన్ ఎల్-అబిదైన్ బెన్ ఆలీ పదవీచ్యుతుడయిన విషయం తెలిసిందే. నియంతృత్వ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చెలరేగుతున్న…

చైనాలో ప్రదర్శనకు పిలుపు, ఉక్కుపాదం మోపిన చైనా పోలీసులు

  అరబ్ దేశాల్లో ప్రజాస్వామిక హక్కుల కోసం చెలరేగుతున్న ప్రజా ఉద్యమాలు చైనా ప్రభుత్వానికి సమస్యలను తెచ్చి పెడుతున్నాయి. ఆదివారం ట్యునీషియా తరహాలో చైనాలోని బీజింగ్, షాంగై నగరాల్లో జాస్మిన్ గేదరింగ్ జరపాలని అమెరికానుండి నిర్వహించబడుతున్న ఒక వెబ్ సైట్ చేసిన ప్రచారానికి ఎవరూ గుమిగూడకుండా చైనా పోలీసులు కట్టుదిట్టం చేశారు. విదేశీ విలేఖరులను కూడా వదల కుండా కెమెరాలను లాక్కొని ఫోటోలను తొలగించారు. ప్రదర్శన కోసం పిలుపునిచ్చిన ప్రాంతంలో ఎవరూ ఎక్కువ సేపు ఆగకుండా చీపుర్లతో…

దక్షిణ కొరియా మానసిక ప్రచారానికి ప్రతిగా ఉత్తర కొరియా మిలట్రీ చర్య హెచ్చరిక

  అరబ్ దేశాల్లో ప్రజాస్వామిక సంస్కరణల కోసం చెలరేగుతున్న తిరుగుబాట్ల గురించి సమాచారం ఉన్న కర పత్రాలను ఉత్తర కొరియాలో జారవిడవడం ఆపకపోతే దక్షిణ కొరియాపై మిలట్రీ చర్య తీసుకోవలసి ఉంటుందని ఉత్తర కొరియా హెచ్చరించింది. ఉత్తర కొరియా తన పౌరులకు బయటి ప్రపంచం నుండి ఎటువంటి సమాచారం అందకుండా గట్టి చర్యలు తీసుకొంటుంది. బయటి దేశాలకు ఫోన్ సౌకర్యాలను సైతం అనుమతించదు. దానితో ఉత్తర కొరియా ప్రజలకు ప్రపంచంలో ఏం జరుగుతున్నదీ తెలిసే అవకాశం లేదు.…

రెండో రోజూ కొనసాగిన ట్యునీషియా ప్రదర్శనలు

శుక్రవారం “ఆగ్రహ దినం” గా పాటిస్తూ రాజధాని ట్యునిస్ లో లక్ష మందితో సాగిన ప్రజా ప్రదర్శనలు శనివారం కూడా కొన సాగాయి. శనివారం పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు పౌరులు జరిపారు. ప్రదర్శకుల రాళ్ళ దాడిలో పోలీసులు కూడ గాయ పడ్డారు. తాత్కాలిక ప్రభుత్వానికి ప్రధాన మంత్రి గా ఉన్న ఘన్నౌచీ రాజీనామా కోరుతూ ట్యునీషియా ప్రజలు ఆందోళనలు జరుపుతున్నారు. కొంతమంది రాజధాని ట్యునిస్ లో గుడారాలు వేసుకుని నిరసన కొనసాగిస్తున్నారు. ప్రధాన మంత్రి, పదవీచ్యుతుడైన…

లిబియాపై ఆంక్షలను ఆమోదించిన భద్రతా సమితి

ఐక్యరాజ్య సమితిలో శక్తివంతమైన సంస్ధ ఐన భద్రతా సమితి లిబియా పై ఆంక్షలు విధిస్తూ తీర్మానాన్ని ఏకగ్రీవంగా అమోదించింది. దానితో పాటు లిబియా పౌరులపై సైనికులు పోలీసులచేత విమాన దాడులు చేసినందుకు గడ్డాఫీపై “మానవతపై నేరపూరిత దాడులు” (క్రైమ్స్ ఎగైనెస్ట్ హ్యూమానిటీ) చట్టం కింద విచారణ జరపాలని అంతర్జాతీయ క్రిమినల్ కోర్టుకు సిఫారసు చేస్తూ ఆమోదించింది. అటువంటి సిఫారసు తర్వాత తమను కూడా ఇబ్బందుల్లోకి నెడుతుందని కొంతమంది సంశయించినప్పటికీ చివరికి ఆమోదముద్ర వేశారు.  చైనా అభిప్రాయంపై అనుమానాలు…

మధ్యంతర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్యునీషియా ప్రజల భారీ ప్రదర్శన

  ప్రజల తిరుగుబాటుతో దేశం వదిలి పారిపోయిన ట్యునీషియా మాజీ అధ్యక్షుడు బెన్ ఆలీ మద్దతుదారులే తాత్కాలిక ప్రభుత్వం నడుపుతుండడంతో మొదటినుండి నుండి అసంతృప్తితో ఉన్న ట్యునీషియా ప్రజలు తాత్కాలిక ప్రధాన మంత్రి మహమ్మద్ ఘన్నౌచీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం రాజధాని ట్యునీస్ లో భారీ ప్రదర్శన నిర్వహించారు. బెన్ ఆలీ ప్రభుత్వంలో ఉన్నవారెవరూ ప్రభుత్వంలో ఉండకూడదని ప్రజలు మాజీ అధ్యక్షుడు సౌదీ అరేబియా పారిపోయిన దగ్గర్నుండీ డిమాండ్ చేస్తున్నారు. తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడినప్పటికీ…

లిబియాలో కొనసాగుతున్న అంతర్యుద్ధం, ఆంక్షలు విధించిన అమెరికా

  లిబియాలో గడ్డాఫీ మద్దతుదారులకూ వ్యతిరేకులకూ మధ్య అంతర్యుద్ధం కొనసాగుతున్నది. గడ్డాఫీ వ్యతిరేకులు క్రమంగా రాజధాని ట్రిపోలిని సమీపిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ట్రిపోలీ పైనే ఇప్పుడు అటు ఆందోళనకారులూ, ఇటు గడ్డాఫీ ప్రభుత్వ బలగాలూ కేంద్రీకరించాయి. రాజధాని ఆందోళనకారుల వశం కాకూడదని ప్రభుత్వం ప్రయత్నిస్తుండగా ట్రిపోలీని పట్టుకొని గడ్డాఫీనీ అతని అనుకూలురనూ తరిమివేయాలని తిరుగుబాటుదారులు చూస్తున్నారు. గడ్డాఫీ వ్యతిరేక తిరుగుబాటుకు ఒసామా బిన్ లాడెన్ పూర్తి మద్దతు ఉందని గడ్డాఫీ ప్రకటించాడు. ముస్లిం తీవ్రవాదులుగా అమెరికా ముద్ర…

రైల్వేల ప్రైవేటీకరణకు పచ్చ జెండా ఊపిన మమత రైల్వే బడ్జెట్

పాపులిస్ట్ నినాదాల మాటున మమత రైల్వే బడ్జెట్, రైల్వేల రంగంలో ప్రైవేటీకరణకు పచ్చ జెండా ఊపింది. ప్రైవేటీకరణ గాయత్రీ మంత్రంగా మారిన ఈ రోజుల్లో పాపులర్ బడ్జెట్లు విమర్శలు ఎదుర్కొంటున్నట్లే మమత గారి కొత్త రైల్వే బడ్జెట్ కూడా జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ పండితులనుండి విమర్శలను ఎదుర్కొంటోంది. మమత మాత్రం “మానవీయ ముఖం (తొడుగు లేదా మాస్క్ అంటే సరిగ్గా సరిపోతుంది) తో ఆర్ధిక వ్యవస్ధ మెరుగుదలకు దోహదం చేసే బడ్జెట్ నాది,” అని అభివర్ణించింది. వచ్చే…

వికీలీక్స్ ఛీఫ్ ఎడిటర్ ను స్వీడన్ కు అప్పగించడానికి బ్రిటన్ కోర్టు ఆమోదం

  వికీలీక్స్ ఛీఫ్ ఎడిటర్ జులియన్ అస్సాంజ్ కు ప్రపంచ వ్యాపింతంగా ఉన్న అభిమానులకు నిరాశ కలిగిస్తూ బ్రిటన్ కోర్టు అతనిని స్వీడన్ పోలీసులకు అప్పగించడానికి ఆమోదం తెలిపింది. స్వీడన్ లో తనకు నిష్పక్షపాత న్యాయం దొరకదని జులియన్ వాదించినప్పటికీ కోర్టు అంగీకరించ లేదు. అయితే కోర్టు రూలింగ్ పై అప్పీలుకు వెళ్ళటానికి జులియన్ నిర్ణయించుకున్నట్లుగా అతని లాయర్లు తెలిపారు. స్విడన్ లో రేప్ చట్టాలు స్త్రీలకు మనోభావాలకు అనుగుణంగా సున్నితంగా ఉంటాయన్న పేరుంది. సహచరి అయినప్పటికీ…

పతనం బాటలో గడ్డాఫీ ప్రభుత్వం, ప్రపంచ దేశాల మధ్య విభేదాలు?

  కల్నల్ మౌమ్మర్ గడ్డాఫీ రోజు రోజుకీ ఒంటరి అవుతున్నాడు. విదేశీ రాయబారుల్లో చాలామంది గడ్డాఫీకి ‘బై’ చెప్పేశారు. ప్రజలపై హింస ఆపమని డిమాండ్ చేస్తున్నారు. ఆందోళనకారులవి న్యాయమైన్ డిమాండ్లు, వాటిని ఒప్పుకొని దిగిపో అని సలహా ఇస్తున్నారు. గడ్డాఫీ అనుకూల సైనికులు వీధుల్లో జరిపిన కాల్పుల్లో ఇప్పటివరకూ 1,000 మంది పౌరులను చనిపోయారని ఇటలీ విదేశాంగ మంత్రి ఫ్రాట్టిని ప్రకటించాడు. వ్యాపార సంబంధాల వలన లిబియాలో ఉన్న తమ పౌరులను అక్కడినుండి ఖాళీ చేయించడానికి త్వరపడుతున్నారు.…

గడ్డాఫీ చేజారుతున్న లిబియా, లిబియానుండి వెళ్ళిపోతున్న విదేశీయులు

  65 లక్షల జనాభా గల ఎడారి దేశం లిబియా క్రమంగా గడ్డాఫీ చేజారుతోంది. విదేశాల్లో లిబియా తరపున నియమించబడిన రాయబారులు ఒక్కొక్కరు గడ్డాఫీకి ఎదురు తిరుగుతున్నారు. సైనికులు గడ్డాఫీకి వ్యతిరేకంగా ఆందోళనకారుల్లో చేరిపోతున్నారు. వ్యతిరేకులుగా మారిన సైనిక బ్యారక్ లపై ప్రభుత్వ దళాలు విమానాలనుండి బాంబు దాడులు చేస్తున్నారు. హింసాత్మకంగా మారుతున్న లిబియానుండి విదేశీయులు తమ తమ స్వస్ధలాలకు వెళ్ళిపోతున్నారు. వివిధ దేశాల ప్రభుత్వాలు విమానాల ద్వారా, ఓడల ద్వారా తమ దేశీయులను వెనక్కి రప్పించుకుంటున్నాయి.…

బలహీన పడుతున్న గడ్డాఫీ, వదిలి వెళ్తున్న మద్దతుదారులు

  42 సంవత్సరాల నుండి లిబియాను ఏకచ్ఛత్రాధిపత్యంతో ఏలిన కల్నల్ మహమ్మద్ గడ్డాఫీని మద్దతుదారులు ఒక్కొక్కరు వదిలి ఆందోళనకారులకు మద్దతు తెలుపుతుండడంతో క్రమంగా బలహీన పడుతున్నాడు. రెండు తెగలు కూడా ఆందోళనకారులకు మద్దతు తెలిపాయి. ఆందోళనకారులపై హింసను ప్రయోగించడాన్ని ఆ తెగల పెద్దలు తప్పు పట్టారు. లిబియాలో అది పెద్ద తెగ “వార్ఫ్లా” కూడా ఆ తెగల్లో ఉండటం గమనార్హం. లిబియా తరపున ఇండియా కు రాయబారిగా ఉన్న అలీ అల్-ఎస్సావీ భద్రతా దళాల దాడులను, కాల్పులను…

మొరాకోలో రాజకీయ సంస్కరణలు కోరుతూ ప్రదర్శనలు

గత డిసెంబరులో ట్యునీషియాలో ప్రారంభమై అక్కడి అధ్యక్షుడిని జనవరికల్లా దేశం నుండి పారిపోయేలా చేసిన అరబ్ ప్రజా ఉద్యమ తుఫాను కొద్దో గొప్పో ధనిక దేశమైన మొరాకోను సైతం తాకింది. మొరాకో రాజు మొహమ్మద్ VI, తన అధికారాల్లో కొన్నింటిని వదులుకొని ప్రజాస్వామిక పరిపాలనకు మార్గం సుగమం చేయాలని డిమాండ్ చేస్తూ మొరాకో ప్రజలు దేశం లోని వివిధ పట్టణాలలో ప్రదర్శనలు నిర్వహించారు. రాజధాని “రాబత్” లో ప్రదర్శన పార్లమెంటు వరకు వెళ్ళటానికి పోలీసులు అనుమతించారు. “బానిసలకోసం…

లిబియా పోలీసు కాల్పుల్లో వందల మంది మృతి, చెదరని గడ్డాఫీ ఆధిపత్యం

లిబియాలో సైనికులు ఆందోళన చేస్తున్న ప్రజలపై నేరుగా కాల్పులు జరపడంతో అనేక మంది మరణించడమో, గాయపడటమో జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఎంతమంది మరణించినదీ ఖచ్చితమయిన సంఖ్య తెలియటం లేదు. ఇంటర్నెట్ సౌకర్యాన్ని దాదాపుగా అడ్డుకోవటం, మీడియా పై అనేక ఆంక్షలు అమలులో ఉండటంతో ఆందోళనలు, కాల్పులకు సంబంధించిన వివరాలను ధృవపరిచేవారు లేరు. రెండు వందల మందికి పైగా చనిపోయారని ఆసుపత్రి డాక్టర్లను ఉటంకిస్తూ బిబిసి తెలియజేయగా, అమెరికాకు చెందిన హ్యూమన్ రైట్స్ వాచ్ సంస్ధను ఉటంకిస్తూ రాయిటర్స్…

సిగ్గూ, లజ్జా వదిలేసిన అమెరికా, ఐక్యరాజ్యసమితిలో మరో సారి నవ్వుల పాలు

  పాపాల పుట్ట అమెరికా తాను సిగ్గూ, లజ్జా ఎప్పుడో వదిలేశానని మరోసారి ఋజువు చేసుకుంది. తాను నిత్యం వల్లించే విలువలూ, సూత్రాలూ తనకు ఏ మాత్రం వర్తించవని ప్రపంచ వేదిక ఐక్యరాజ్యసమితి లోనే విలువల వలువలు ఊడదీసుకుని మరీ చాటి చెప్పుకుంది. తనకు నీతీ, నియమాలు ఒక లెక్క కాదనీ, తనకు ఉపయోగం అనుకుంటే ఎన్నిసార్లు మొఖం మీద ఉమ్మేసినా తుడుచుకు పోగలననీ నిస్సిగ్గుగా ప్రకటించుకుంది. తన హీనపు బతుక్కి వేరే ఎవరూ అద్దం పట్టనవసరం…