ఈజిప్టులో మళ్ళీ ఆందోళనలు, ముబారక్ ను మరిపిస్తున్న ఈజిప్టు సైనిక ప్రభుత్వం

ఫిబ్రవరి 11 న ఈజిప్టు నియంత హోస్నీ ముబారక్ ను గద్దె దింపిన ప్రజల ఆందోళనలు తిరిగి మొదలయ్యాయి. ముబారక్ నుండి అధికారం నుండి చేపట్టిన సైనిక ప్రభుత్వం తానిచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో ఈజిప్టు ప్రజలు మళ్ళీ తాహ్రిరి స్క్వేర్ లో శుక్రవారం పెద్ద ప్రదర్శన నిర్వహించారు. ముబారక్ గద్దె దిగి దేశంనుండి వెళ్ళి పోయిన తర్వాత కూడా కొంతమంది ఆందోళనకారులు విమోచనా కూడలి వద్ద బైఠాయింపు కొనసాగించారు. ప్రజలు డిమాండ్ చేసిన ప్రజాస్వామిక సంస్కరణలను…

లిబియా తిరుగుబాటు సైనికుల్ని చంపినందుకు క్షమాపణ నిరాకరించిన నాటో

లిబియా ప్రభుత్వ సైనికులుగా పొరబడి తిరుగుబాటు సైనికులను చంపినందుకు క్షమాపణ చెప్పడానికి నాటొ దళాల రియర్ ఆడ్మిరల్ రస్ హార్డింగ్ నిరాకరించాడు. గురువారం అజ్దాబియా, బ్రెగా పట్టణాల మధ్య జరుగుతున్న యుద్దంలో పాల్గొనటానికి తిరుగుబాటు బలగాలు తీసుకెళ్తున్న ట్యాంకుల కాన్వాయ్ పై నాటో వైమానిక దాడులు జరపడంతో పదమూడు మంది మరణించిన సంగతి విదితమే. “గడ్డాఫీ బలగాలకు చెందిన ట్యాంకులు మిస్రాటా పట్టణంలొ పౌరులపై నేరుగా కాల్పులు జరుపుతున్నాయి. పౌరులను రక్షించడానికే మేం ప్రయత్నిస్తున్నాము. గురువారం నాటి…

ఐవరీకోస్టులో కొనసాగుతున్న శాంతిదళాల అక్రమ ఆక్రమణ

అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న ఐవరీకోస్టు దేశంలో ఐక్యరాజ్యసమితి, ఫ్రాన్సులకు చెందిన శాంతి దళాల అక్రమ దాడులు కొనసాగుతున్నాయి. ఐవరికోస్టు ప్రజల రక్షణ పేరుతో అడుగుపెట్టిన సమితి శాంతి దళాలు, ఫ్రాన్సు తన ప్రయోజనాల కోసం తలపెట్టిన మిలట్రీ చర్యకు మద్దతుగా అధ్యక్షుడి నివాస భవనాన్ని చుట్టుముట్టాయి. సోమవారం సమితి, ఫ్రాన్సుల సైన్యాల మద్దతుతో అధ్యక్ష ఎన్నికల్లో గెలిచానంటున్న ‘అలస్సానె ఒట్టోరా’ బలగాలు “అంతిమ దాడి” పేరుతో చేసిన దాడిని అధ్యక్షుడు జిబాగ్బో సైన్యాలు తిప్పికొట్టాయి. ప్రస్తుతం సమితి, ఫ్రాన్సుల…

లిబియా తిరుగుబాటు బలగాల ఉసురు తీస్తున్న పశ్చిమదేశాల దాడులు

లిబియాపై పశ్చిమ దేశాల దాడులు వాటిని సహాయం కోసం పిలిచిన వారినే చంపుతున్నాయి. బుధవారం అజ్దాబియా పట్టణం నుండి వెనక్కి వెళ్తున్న తిరుగుబాటు బలగాలపై పశ్చిమ దేశాలు నాలుగు క్షిపణులను పేల్చడంతో కనీసం 13 మంది చనిపోగా మరింతమంది గాయపడ్డారని బిబిసి తెలిపింది. లిబియా అధ్యక్షుడు కల్నల్ గడ్డాఫీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, తూర్పు లిబియాలో తిరుగుబాటు ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. వారిపై వైమానికి బాంబుదాడులు చేస్తూ పౌరులను కూడా గడ్డాఫీ చంపుతున్నాడనీ పశ్చిమ దేశాలు నిందించాయి.…

ఇజ్రాయెల్ గూండా బాంబు దాడుల్లొ ఇద్దరు సూడాన్ కారు ప్రయాణికుల దుర్మరణం

మధ్యప్రాచ్యం ప్రాంతంలో ఇజ్రాయెల్ రౌడీ చర్యలు కొనసాగుతున్నాయి. ప్రపంచ పోలీసు అమెరికాకి అనుంగు మిత్రుడైన ఇజ్రాయెల్ తాజాగా సూడాన్ లో కారులో ప్రయాణిస్తున్న ఇరువురిని పొట్టన బెట్టుకుంది. చనిపోయినవారు ఎవరైందీ ఇంకా గుర్తించలేదు. పాలస్తీనా ప్రాంతం ‘గాజా’ లోని ప్రభుత్వానికి ఇతర దేశాలు గానీ వ్యక్తులు గానీ ఆయుధాలు సరఫరా చేయకుండా ఉండడానికి ఇజ్రాయెల్ కాపలా కాస్తుంటుంది. పశ్చిమాన మధ్యధరా సముద్రంలో, దక్షిణాన ఎర్ర సముద్రంలోనూ ఇజ్రాయెల్ వాయు, నౌకా బలగాలు కాపలా కాస్తూ అనుమానం వచ్చిన…

లిబియా తిరుగుబాటు ప్రభుత్వానికి మరిన్ని దేశాల గుర్తింపు, మొదలైన ఆయిల్ ఎగుమతులు

లిబియా తూర్పు ప్రాంతంలో పెద్ద పట్టణమైన బెంఘాజీ కేంద్రంగా ఏర్పదిన తాత్కాలిక తిరుగుబాటు ప్రభుత్వం (లిబియా జాతీయ కౌన్సిల్) మరిన్ని దేశాల గుర్తింపును పొందింది. కౌన్సిల్ ఏర్పడడంతోనే ఫ్రాన్సు గుర్తించిన సంగతి విదితమే. ఫ్రాన్సు, బ్రిటన్ లు కాలికి బలపం కట్టుకుని మరీ యూరోపియన్ దేశాలను కోరినప్పటికీ అవి తిరుగుబాటు ప్రభుత్వాన్ని గుర్తించడానికి ముందుకు రాలేదు. యూరోపియన్ యూనియన్ కు ఆర్ధికంగా నాయకత్వం వహిస్తున్న జర్మనీ తిరుగుబాటు ప్రభుత్వాన్ని గుర్తించడానికి గట్టిగా నిరాకరించింది. పశ్చిమ దేశాలు లిబియాపై…

పౌరుల రక్షణ పేరుతో ఐవరీకోస్ట్ అధ్యక్షుడి నివాసంపై దాడి చేసిన సమితి, ఫ్రాన్సు సైన్యాలు

ప్రతి సభ్య దేశం పట్ల నిష్పాక్షింగా వ్యవహరించాల్సిన ఐక్యరాజ్యసమితి నిజానికి అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సు తదితర పశ్చిమ దేశాల జేబు సంస్ధ అని మరో సారి రుజువయ్యింది. ఐవరీ కోస్టు దేశ అధ్యక్షుడి భవనంపై ఐక్యరాజ్యసమితికి చెందిన శాంతి స్ధాపనా సైనికులు, ఫ్రాన్సుకి చెందిన సైనికులు సోమవారం బాంబు దాడులు నిర్వహించాయి. అధ్యక్షుడు లారెంట్ జిబాగ్బో నివాస భవనం, ప్రభుత్వ టెలివిజన్ ప్రధాన కార్యాలయం, రిపబ్లికన్ గార్డుల భవనం, పారామిలిటరీ కార్యాలయం లపై ఫ్రాన్సు, సమితి సైన్యాలు…

పశ్చిమదేశాల విమాన దాడుల్లో లిబియా పౌరుల దుర్మరణం

పశ్చిమ దేశాల రక్తదాహానికి అంతులేకుండా పోతోంది. ఇరాక్ పై దాడికి ముందుగానే ఆంక్షల పేరుతో లక్షలాది ఇరాకీ పసిపిల్లల ఉసురు పోసుకున్నాయి. పసిపిల్లల పాల డబ్బాల రవాణాపై కూడా ఆంక్షలు విధించడంతో పోషకార లోపంవలన లక్షలాదిమంది ఇరాకీ పిల్లలు చనిపోయారు. సంవత్సరాల తరబడి విచక్షణా రహితంగా బాంబు దాడులు చేసి లక్షలమంది రక్తమాంసాల్ని ఆరగించాయి. ఆఫ్ఘనిస్తాన్ పై దురాక్రమణ దాడి చేసి మిలియన్లమంది పౌరులను చంపిన సంగతి వికీలీక్స్ బైట పెట్టిన ఆఫ్ఘన్ యుద్ధ పత్రాల ద్వారా…

లిబియా తిరుగుబాటుదారులకు రహస్య ఆయుధ సాయానికి ఒబామా ఆదేశం

అనుకున్నంతా అయ్యింది. అమెరికా ఐక్యరాజ్య సమితి తీర్మానాన్ని అతిక్రమిస్తూ లిబియా తిరుగుబాటుదారులకు రహస్యంగా ఆయుధాలు అందించడానికి నిర్ణయించాడు. అమెరికా ప్రభుత్వ అధికారులు కొందరిని ఉటంకిస్తూ రాయిటర్స్ సంస్ధ ఈ వార్త ప్రచురించింది. తిరుగుబాటుదారులకు రహస్యంగా ఆయుధాలు అందించే రహస్య ఉత్తర్వుపై ఒబామా సంతకం చేశాడని ఆ సంస్ధ తెలిపింది. గత కొద్ది వారాల్లో “ప్రెసిడెన్షియల్ ఫైండింగ్’ అని పిలవబడే ఆదేశంపై ఒబామా సంతకం చేశాడు. సీఇఏ చేపట్టే అటువంటి రహస్య కార్యకలాపాలకు చట్టపర ఇబ్బందులు ఎదురు కాకుండ…

ఆసియా-ఫసిఫిక్ ప్రాంతంలో అమెరికా ఆయుధ పోటీ -చైనా శ్వేతపత్రం

ఆసియా-ఫసిఫిక్ ప్రాంతంలొ అమెరికా ఆయుధ పోటీ పెంచుతున్నదని చైనా అభిప్రాయపడింది. చైనా ప్రభుత్వం జారీ చేసిన ‘జాతీయ రక్షణ శ్వేత పత్రం’ లో చైనా, దాని చుట్టూ ఉన్న రక్షణ పరిస్ధితులను విశ్లేషించింది. ఆసియా-ఫసిఫిక్ ప్రాంతంలో అమెరికా మిలట్రీ ఉనికి పెరుగుతున్నదని శ్వేత పత్రం తెలిపింది. ఈ ప్రాంతంలోని సైనిక చర్యలు అంతిమంగా చైనాకు వ్యతిరేకంగా ఎక్కుపెట్టబడి ఉన్నాయని పత్రం తెలిపింది. భద్రతాంశాలపై చైనా దృక్పధాన్నీ, తన రక్షణ బలగాల గురించిన సమగ్ర దృక్పధాన్ని శ్వేత పత్రం…

గడ్డాఫీకి ఆశ్రయం ఇవ్వడానికి మేం రెడీ -ఉగాండా

గడ్డాఫీ కోరితే ఆశ్రయం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని ఉగాండా ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఆల్-అరేబియా టీవి చానెల్ ఉగాండా ప్రభుత్వాన్ని ఉటంకిస్తూ బుధవారం ప్రకటించింది. అయితే పూర్తి వివరాలను ఛానెల్ తెలపలేదు. మంగళవారం లండన్ లో పశ్చిమ దేశాలతో పాటు కొన్ని అరబ్ దేశాలు సమావేశమై లిబియా భవిష్యత్తు పై చర్చించాయి. లిబియాలో ఘర్షణలను ముగించడానికి వీలుగా గడాఫీ వెంటనే వేరే దేశంలో ఆశ్రయం కోరవచ్చునని మంగళవారం సమావేశం అనంతరం ఆ దేశాలు ఉమ్మడిగా ప్రకటించాయి.…

అమెరికాతో ‘ఎస్.ఒ.ఎఫ్.ఏ’ ఒప్పందం కుదుర్చుకోవాలని ఇండియాపై అమెరికా ఒత్తిడి

అమెరికాతో ఇండియా “సోఫా” ఒప్పందం (ఎస్.ఓ.ఎఫ్.ఏ) ఒప్పందం కుదుర్చుకోవాలని ఇండియాపై తీవ్ర ఒత్తిడి తెచ్చిన సంగతి వికీలీక్స్ వెల్లడించిన కేబుల్ ద్వారా బయటపడింది. అమెరికా రాయబార కార్యాలయానికి చెందిన ఉప ప్రధానాధికారి ఆగష్టు 16, 2005 తేదీన రాసిన కేబుల్ నెం. 38759 ద్వారా ఈ విషయం వెల్లడయ్యింది. మిలట్రీ డ్రిల్లు నిమిత్తం ఇండియా వచ్చే మిలట్రీ అధికారులకు, రాజకీయ, రాయబార అధికారులకు ఇచ్చిన విధాంగానే “డిప్లోమేటిక్ ఇమ్యూనిటీ” (రాయబార కార్యాలయ ఉద్యోగులకు వారు నియమించబడిన దేశాల…

చైనా, దక్షిణకొరియా, జర్మనీ లను దాటి అమెరికా వరకూ వ్యాపించిన జపాన్ అణుప్రమాద రేడియేషన్

జపాన్లోని ఫుకుషిమా అణువిద్యుత్ కేంద్రంలో జరిగిన ప్రమాదం ప్రపంచంలోని ఇతర దేశాలకూడా పాకింది. వాతావరణం ద్వారా గాలితో వ్యాపించి అమెరికా దాకా చేరుకుంది. ఫుకుషిమా దైచి కర్మాగారం వద్ద రేడియేషన్ తో కూడిన గాలి సహజంగా వేడిగా ఉంటుంది. వేడిగా ఉన్న గాలి తేలిక పడి వాతావరణంలోని పైపొరలకు చేరుకుని అక్కడ పశ్చిమం నుండి తూర్పుకు వీచే గాలి ద్వారా చైనా వరకూ వ్యాపించింది. అయితే చాలా దూరం ప్రయాణించి రావడం, కొద్ది పరిమాణంలో ఉండే రేడియేషన్…

ఇజ్రాయెల్ వ్యతిరేక తీర్మానానికి మద్దతిచ్చిన ఇండియాపై అమెరికా ఆగ్రహం -వికీలీక్స్

ఇండియాపై అమెరికా కర్రపెత్తనానికి ఇది మరో ఋజువు. ఈ సారి అమెరికా చెప్పినట్టు ఇండియా వినకపోవడమే వార్త. అయితే అందులో ఇండియా పాలక వర్గాల ప్రయోజనం ఇమిడి ఉండటంతో అమెరికా గీసిన గీత దాటడానికి ఇండియా పాలకులు ధైర్యం చేశారు. డిసెంబరు 2008లో ఇజ్రాయెల్ పాలస్తీనా ప్రాంతం గాజా పై దాడి చేసి అక్కడి పౌరులను చంపడాన్ని ఖండిస్తూ చేసిన తీర్మానానికి ఇండియా మద్దతు తెలిపింది. ఓటింగ్ కుముందు అమెరికా లాబీయింగ్ ను ఇండియా వ్యతిరేకించిన విషయాన్ని…

‘ఉగ్రవాద వ్యతిరేక యుద్ధం’పై అమెరికాకు ప్రోగ్రెస్ రిపోర్టు సమర్పించుకున్న భారత ప్రభుత్వం -వికీలీక్స్ – 2

2005, 2007 ల మధ్య కాలంలో అమెరికా, ఇండీయా లమధ్య అణు ఒప్పందం కుదరడం వెనక అన్ని పనులు పూర్తి కావడంలో తీవ్రంగా శ్రమించిన జై శంకర్ ఇప్పుడు ఇండియా తరపున చైనాకు రాయబారిగా పని చేస్తున్నాడు. రాబర్ట్ బ్లేక్ ఆ తర్వాత శ్రీలంక, మాల్దీవులకు అమెరికా రాయబారిగా పని చేశాడు. ఈయన ఇప్పుడు అమెరికా ప్రభుత్వంలోని స్టేట్ డిపార్ట్ మెంటు లో దక్షిణ, మధ్య ఆసియా దేశాల వ్యవహారాల శాఖకు అసిస్టెంట్ సెక్రటరీగా పని చేస్తున్నాడు.…