అమెరికా డ్రోన్ విమానదాడిలో మరో 25 మంది పాక్ పౌరుల దుర్మరణం

పాక్, ఆఫ్ఘనిస్ధాన్ సరిహద్దులోని నార్త్ వజీరిస్తాన్ రాష్ట్రంలో అమెరికాకి చెందిన డ్రోన్ విమానం దాడిలో మరో పాతిక మంది దుర్మరణం చెందారు. డ్రోన్ విమానదాడులకు తాను భాధ్యురాలిగా అమెరికా సాధారణంగా ధృవీకరించదు. కాని ఈ ప్రాంతంలో డ్రోన్ విమానాలు ఒక్క అమెరికాకి తప్ప మరొక దేశానికి లేవు. ప్రారంభంలో డ్రోన్ దాడులు కొన్నింటికి భాధ్యత తనదిగా పేర్కొన్నప్పటికీ, ఇటీవల కాలంలో అటువంటి ప్రకటనలు రావడం లేదు. డ్రోన్ విమాన దాడుల్లో వందల కొద్దీ పాకిస్తాన్ పౌరులు చనిపోతుండడంతో…

లిబియాపై యుద్ధానికి హంతక డ్రోన్ విమానాలను పంపిన అమెరికా

వందలకొద్దీ పాకిస్తాన్ పౌరులను చంపిన డ్రోన్ విమానాలను లిబియా పౌరులను రక్షించడానికి(!) పంపేందుకు ఒబామా ఆమోదముద్ర వేశాడు. ఇప్పటికే ఒక సారి దాడికి వెళ్ళిన డ్రోన్ విమానం వాతావరణం అనుకూలించక వెనుదిరిగినట్లు అమెరికా సైనిక దళాలా జాయింట్ ఛీఫ్ తెలిపాడు. తక్కువ ఎత్తులో ప్రయాణించే మానవరహిత డ్రోన్ విమానాలను అమెరికా, ఆఫ్ఘనిస్ధాన్, పాకిస్తాన్ సరిహద్దుల్లో పాకిస్తాన్ భూభాగంలో ఉన్న తాలిబాన్ నాయకులను, మిలిటెంట్లను చంపడానికి విస్తృతంగా వినియోగిస్తోంది. వాటిబారిన పడి పాకిస్ధాన్ పౌరులు అనేకమంది చనిపోయారు. డ్రోన్…

లిబియా తిరుగుబాటుదారులకు పశ్చిమ దేశాల మిలట్రీ ట్రైనింగ్

ఐక్యరాజ్య సమితి 1973 వ తీర్మానం ప్రకారం గడ్దాఫీ బలగాల దాడుల్లో చనిపోతున్న లిబియా పౌరులను రక్షించడానికి సమితి సభ్య దేశాలు “అవసరమైన అన్ని చర్యలూ” తీసుకోవచ్చు. దీన్ని అడ్డం పెట్టుకుని తమ సైన్యాలను బహిరంగంగా లిబియాలో దింపడానికి అమెరికా, ఫ్రాన్సు, బ్రిటన్, కెనడా తదితర దేశాలకు ధైర్యం చాలడం లేదు. వారు భయపడుతున్నది గడ్దాఫీని గానీ, వారి సైనికులను చూసిగానీ కాదు. తమ సొంత ప్రజలకు అవి భయపడుతున్నాయి. ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ యుద్ధాల్లో అనేకమంది సైనికులు…

హోండురాస్ లో మరో మిలట్రీ స్ధావరాన్ని తెరవబోతున్న అమెరికా

2009 లో మిలట్రీ కుట్ర ద్వారా హోండురాస్ ప్రభుత్వాన్ని కూల్చివేసిన తర్వాత అక్కడ మరో మిలట్రీ స్ధావరం నెలకొల్పడానికి అమెరికా ఒప్పందం కుదుర్చుకుంటోంది. ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన మాన్యువల్ జెలాయా నాయకత్వంలోని ప్రభుత్వాన్ని అక్కడి మిలట్రీ, ప్రతిపక్షాలు కుమ్మక్కయ్యి కుట్ర తో కూల్చి వేశాయి. రాజ్యాంగాన్ని ఉల్లంఘించాడన్న నేరాన్ని మోపి రాత్రికి రాత్రి విమానం ఎక్కించి కోస్టారికా దేశానికి ప్రవాసం పంపారు. జెలాయా అధికారంలోకి వచ్చాక కార్మికులకు కనీస వేతనాలను పెంచడం తదితర చర్యలను చేపట్టడంతో పెట్టుబడిదారులు,…

గడ్డాఫీ అమ్ములపొదిలో క్లస్టర్ బాంబులు, హక్కుల సంస్ధ ఆందోళన

లిబియాలో గడ్డాఫీ బలగాలు పౌరులపై క్లస్టర్ బాంబులు ప్రయోగిస్తున్నాయని మానవహక్కుల సంస్ధ హ్యూమన్ రైట్స్ వాచ్ సంస్ధ ఆరోపించింది. ఈ ఆరోపణలను లిబియా ప్రభుత్వం తిరస్కరించింది. క్లస్టర్ బాంబులుగా పెర్కొంటూ న్యూయార్క్ టైమ్స్ పత్రిక కొన్ని ఫోటోలను ప్రచురించింది. పౌరుల నివాస ప్రాంతాల్లో క్లస్టర్ బాంబుల్ని పేల్చడం వలన మానవ నష్టం అపారంగా ఉంటుందనీ, గడ్డాఫీ ఈ బాంబుల వాడకాన్ని వెంటనే నిలిపివేయాలనీ హక్కుల సంస్ధ డిమాండ్ చేసింది. అయితే న్యూయార్క్ టైమ్స్ విలేఖరికి కనిపించిన బాంబు…

సెజ్ లపై త్రిణమూల్ కాంగ్రెస్ అతి తెలివితేటలు

సెజ్ (ఎస్.ఇ.జెడ్ – స్పెషల్ ఎకనమిక్ జోన్) ల ఏర్పాటుపై రైల్వే మంత్రి మమత నాయకత్వంలోని త్రిణమూల్ కాంగ్రెస్ అతి తెలివితేటలు ప్రదర్శిస్తోంది. పశ్చిమ బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 18 నుండి మే 10 వరకు ఐదు విడతల్లో జరగనున్న సంగతి విదితమే. ఎన్నికల కోసం మమత పార్టీ బెంగాలీ, ఇంగ్లీషు భాషల్లొ మేనిఫెస్టో (ఎన్నికల ప్రణాళిక) విడుదల చేసింది. రెండూ ఒకే విధంగా ఉంటాయని అందరూ భావిస్తారు. కానీ వాస్తవం అందుకు విరుద్ధంగా…

ప్రజల డాక్టరు డా.బినాయక్ సేన్ కు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు

సెడిషన్ ఆరోపణలపై యావజ్జీవ శిక్షను ఎదుర్కొంటున్న డాక్టర్ బినాయక్ సేన్ ను సుప్రీం కోర్టు శుక్రవారం బెయిల్ పై విడుదల చేసింది. “మనది ప్రజాస్వామ్య వ్యవస్ధ. ఆయన మావోయిస్టులకు సానుభాతిపరుడు మాత్రమే. అంతమాత్రాన ఆయనను సెడిషన్ ఆరోపణల కింద దోషిగా నిర్ధారించలేము.  సానుభూతిపరుడు తప్ప అంతకంటే ఏమీకాదు” అని సుప్రీం కోర్టు తన తీర్పులో పేర్కోంది. బినాయక్ సేన్ విడుదల వార్త తెలిస్తే ఆయన వైద్య సేవ చేసిన చత్తీస్ ఘడ్ లోని గిరిజన తెగల ప్రజలు…

లిబియా తిరుగుబాటుదారులకు ఆయుధాలిస్తాం -పశ్చిమ దేశాలు

లిబియా ఆయిల్ వనరులను పూర్తిగా తమకు అప్పగించడానికి నిరాకరిస్తున్న గడ్డాఫీని గద్దె దించడానికి పశ్చిమ దేశాలైన అమెరికా, బ్రిటన్ లు లిబియా తిరుగుబాటుదారులకు ఆధునిక ఆయుధాలు అందించడానికి రెడీ అయ్యారు. లిబియా పై ఐక్యరాజ్యసమితి ఆయుధ రవాణా నిషేధం విధించినప్పటికీ పశ్చిమ దేశాలు దాన్ని పట్టించుకోదలచుకోలేదు. ఐక్యరాజ్యసమితి 1970 వ తీర్మానం ద్వారా లిబియాలోని ఇరు పక్షాలకు ఆయుధాలు సహాయం చేయకుండా, అమ్మకుండా నిషేధం విధించింది. 1973 వ తీర్మానం ద్వారా లిబియాలో పౌరల రక్షణకు అవసరమైన…

సామ్రాజ్యవాదుల ఆధ్వర్యంలో లిబియా విప్లవం

విక్టర్ నీటో వెనిజులాకి చెందిన కార్టూనిస్టు. ఈ కార్టూను మొదట ఆయన బ్లాగులోనూ, తర్వాత మంత్లీ రివ్యూ పత్రిక ఇండియా ఎడిషన్ లోనూ ప్రచురితమయ్యింది. సాధారణంగా ఏదైనా దేశంలో విప్లవాలు సంభవిస్తే వాటికి ప్రజల చొరవ ప్రధానంగా ఉంటుంది. అలా ప్రజల చొరవ ఉంటేనే ఏ విప్లవమైనా విప్లవం అనిపించుకుంటుంది. కానీ లిబియాలో గడ్డాఫీకి వ్యతిరేకంగా చెలరేగిందని చెబుతున్న విప్లవానికి సామ్రాజ్యవాద దేశాలయిన అమెరికా, ఫ్రాన్సు, బ్రిటన్ లు నాయకత్వం వహిస్తున్నాయి. లిబియా అధ్యక్షుడు గడ్డాఫీ సేనలు…

పాకిస్తాన్ ప్రభుత్వం, ఐ.ఎస్.ఐ ల ఆదేశంతోనే ముంబై దాడులు -అమెరికా కోర్టులో హేడ్లీ, రాణాలు – 2

తన “మెమొరాండం ఒపీనియన్ అండ్ ఆర్డర్” లో కోర్టు రాణా డిఫెన్స్ వాదనను ప్రస్తావించింది. “పబ్లిక్ అధారిటీ డిఫెన్స్” కింద తనను తాను డిఫెండ్ చేసుకునే ప్రయత్నంలో భాగంగా రాణా హేడ్లీ సాక్ష్యాన్ని మద్దతుగా ప్రస్తావిస్తున్నాడని కోర్టు పేర్కొంది. అంటే పాకిస్తాన్ ప్రభుత్వ ప్రతినిధికి ఉండే మినహాయింపులను రాణా కోరుతున్నాడు. హేడ్లీ తన సాక్ష్యంలో ఏమేమీ ప్రస్తావించిందీ రాణాకు చెప్పినట్లు తెలపడంతో రాణాకు హేడ్లీ సాక్ష్యాన్ని డివెన్సు గా వినియోగించాడు. కోర్టు ప్రొసీడింగ్స్ వలన పాకిస్తాన్ కి…

పాకిస్తాన్ ప్రభుత్వం, ఐ.ఎస్.ఐ ల ఆదేశంతోనే ముంబై దాడులు -అమెరికా కోర్టులో హేడ్లీ, రాణాలు – 1

ముంబై లోని తాజ్ హోటల్ పై టెర్రరిస్టు దాడులు పాకిస్తాన్ ప్రభుత్వం, దాని గూఢచార సంస్ధ ఐ.ఎస్.ఐ ల ఆదేశమ్ మేరకే చేశామని అమెరికా కోర్టులో నిందితులు హేడ్లీ, రాణాలు సాక్ష్యం ఇచ్చినట్లు బయటపడడంతో సంచలనానికి తెర లేచింది. ముంబై టెర్రరిస్టు దాడుల్లో తాజ్ హోటల్ లో బస చేసిన దేశ, విదేశీ అతిధులు 200 మంది వరకూ మరణించిన సంగతి విదితమే. ముంబై దాడుల్లో పట్టుబడ్డ పాకిస్తాన్ యువకుడు కసబ్ కి కోర్టు మరనశిక్ష విధించింది.…

సి.ఐ.ఏ హద్దు మీరుతోంది -అమెరికాకు పాకిస్తాన్ హెచ్చరిక

ఆఫ్ఘనిస్తాన్ లోని తాలిబాన్, ఆల్-ఖైదా లపై యుద్ధానికి పాకిస్తాన్ పైనే పూర్తిగా ఆధారపడ్డ అమెరికా, ఇటీవలి కాలంలో పాకిస్తాన్ నుండి ప్రతిఘటనను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా పాకిస్తాన్ లో సి.ఐ.ఏ కార్యకలాపాల పట్ల పాకిస్తాన్ ప్రభుత్వం, మిలట్రీ, ఐ.ఎస్.ఐ లు ఆగ్రహంతో ఉన్నాయి. సి.ఐ.ఏ ఆధ్వర్యంలో నడిచే డ్రోన్ విమానాల దాడుల్లో వందలమంది పాకిస్తాన్ పౌరులు చనిపోతుండడంతో పాకిస్తాన్ ప్రజల్లో అమెరికా పట్ల విపరీతమైన ద్వేషం పెరిగింది. పాకిస్తాన్ అణ్వస్త్రాలను నిర్వీర్యం చేయడమే అమెరికా`ప్రభుత్వ అసలు ఉద్దేశమని కూడా…

విద్య, ఆరోగ్యాలకు బదులు న్యాయ, పోలీసు రంగాలకు సాయం చెయ్యండి -ప్రపంచ బ్యాంకు

ప్రపంచ బ్యాంకు తన నగ్న స్వరూపాన్ని సిగ్గు లేకుండా బైట పెట్టుకుంది. పేద దేశాలకు సహాయం పేరుతో అప్పులిచ్చే అభివృద్ధి చెందిన దేశాలు తాము కేంద్రీకరించే రంగాలను మార్చాలని కోరింది. విద్య, ఆరోగ్య రంగాల అభివృద్ధికి అభివృద్ధి చెందిన దేశాలు ఇప్పటివరకు సహాయం చేస్తూ వచ్చాయనీ, అలా కాకుండా న్యాయ వ్యవస్ధ, పోలీసు వ్యవస్ధలు అభివృద్ధి చెందటానికి సహాయం చేయడం ప్రారంభించాలని కోరింది. సోమవారం విడుదల చేసిన ఒక రిపోర్టులో “ఆయా దేశాల్లో స్ధిరమైన ప్రభుత్వాలను నిర్మించడంపై…

ఫ్రాన్సు కండకావరం

ఆఫ్రికాలో ఫ్రాన్సు కండకావరానికి మరో దేశం బలయ్యింది. ఐవరీకోస్టు దేశానికి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికయిన అధ్యక్షుడు లారెంట్ జిబాగ్బోను శాంతి పరిరక్షణ పేరుతో దేశంలొ తిష్ట వేసిన ఫ్రాన్సు సైన్యాలు అరెస్టు చేశాయి. ఫ్రాన్సు సేనలు అధ్యక్షుడి ఇంటిపైకి తమ ట్యాంకులను నడిపించాయి. ఇంటి ప్రహరీగోడను కూల్చివేస్తూ లోపలికి చొచ్చుకెళ్ళి అధ్యక్షుడు జిబాగ్బోను అరెస్టు చేసినట్లుగా అతని సహాయకుడు వార్తా సంస్ధలకు తెలిపాడు.అరెస్టుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియవలసి ఉంది. గత నవంబరులో జరిగిన ఎన్నికల్లో లారెంట్…