సిరియాపై భద్రతా సమితిలో చర్చించడానికి ఒప్పుకోం -చైనా, రష్యా

సిరియాలో జరుగుతున్న ఆందోళనల విషయాన్ని భద్రతా సమితిలో చర్చించడానికి అంగీకరించేది లేదని చైనా, రష్యాలు తెగేసి చెబుతున్నాయి. వీటో అధికారం గల ఈ రెండు దేశాలు ఓటింగ్‌లో పాల్గొనకుండా విరమించుకోవడంతో లిబియా దేశంపై “నిషిద్ధ గగన తలం” అమలు చేయడానికీ, లిబియా పౌరులను రక్షించడానికి “అవసరమైన అన్ని చర్యలూ” తీసుకోవడానికీ బ్రిటన్, ఫ్రాన్సులు ప్రవేశపెట్టిన తీర్మానం ఆమోదం పొందింది. తీరా తీర్మానం ఆమోదం పొందాక అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సులు లిబియా పౌరులను రక్షించే పేరుతో గడ్దాఫీని చంపడానికి…

పశ్చిమ బెంగాల్‌లో వామపక్షాల భారీ ఓటమి

1977 నుండి పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని అప్రతిహతంగా ఏలుతూ వచ్చిన వామపక్ష కూటమి ఎల్.డి.ఎఫ్ 2011 ఎన్నికల్లో ఘోరంగా పరాజయం పాలయ్యింది. కేరళలో మాత్రం కొద్దిలో అధికారానికి దూరమయ్యింది. ముఠా తగాదాలను అధిగమించినట్లయితే కేరళలో అధికారం నిలిచేదని పత్రికలు వ్యాఖ్యానిస్తున్నాయి. సి.పి.ఐ, సి.పి.ఎం పార్టీలు పార్లమెంటరీ రాజకీయాలు చేపట్టడంతోటే కమ్యూనిస్టు సిద్ధాంతాలనుండి వైదొలిగాయని భారత దేశంలోని మార్క్సిస్టు, లెనినిస్టు పార్టీలు ఎప్పటినుండో వాదిస్తూ వచ్చాయి. 1968 లో సి.పి.ఎం పార్టీ నయా రివిజనిజాన్ని చేపట్టిందని నిర్ణయించుకున్న అనేక…

ఇరాక్‌పై దాడికోసమే అబద్ధాలతో రిపోర్టు తయారు చేశాం -ఇంగ్లండ్ ఇంటలిజెన్స్ మాజీ అధికారి

ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ “సామూహిక విధ్వంసక మారణాయుధాలు” కలిగి ఉన్నాడనీ, వాటివలన ఇంగ్లండు భద్రతకు ముప్పు అనీ నిర్ధారిస్తూ తయారు చేసిన నివేదిక (డొసియర్) వాస్తవాలపై ఆధారపడిన నివేదిక కాదనీ, తమకు వచ్చిన ఆదేశాల మేరకు ఇరాక్‌పై దాడిని అనివార్యం చేస్తూ లేని సాక్ష్యాలతో తయారు చేశామనీ నివేదిక రచయితల్లో ఒకరైన బ్రిటన్ ఇంటలిజెన్స్ మాజీ సీనియర్ అధికారి ఇంగ్లండ్ ప్రభుత్వం నియమించిన చిల్కాట్ కమిషన్ ముందు సాక్ష్యం ఇస్తూ చెప్పాడు. సెప్టెంబరు 2002…

బిన్ లాడెన్ హత్య ఆల్-ఖైదాపై ప్రభావం చూపుతుందా?

ఆల్-ఖైదాకు సంకేతాత్మకంగా నాయకత్వం వహిస్తూ వచ్చిన ఒసామా బిన్ లాడెన్ ను చంపేశామని అమెరికా అధ్యక్షుడు విజయ గర్వంతో ప్రకటించుకున్నాడు. హాలివుడ్ సినిమాల్లొ చూపినట్టు బిన్ లాడెన్ స్ధావరంగా చెబుతున్న ఇంటిలోకి అమెరికన్ కమేండోలు వెళ్ళడం అక్కడ ఉన్న ముగ్గురు యువకులను (ఒకరు లాడెన్ తనయుడుగా భావిస్తున్నారు) రక్తపు మడుగులో మునిగేలా కాల్చి చంపడం, బిన్ లాడెన్ తో ఉన్న అతని భార్యను మోకాలిపై కాల్చి అనంతరం లాడెన్ కంటిలోనా, గుండెపైనా కాల్చి చంపడం… వీటన్నింటినీ అమెరికా…

పాకిస్ధాన్ సైనికాధికారులను “మోస్ట్ వాంటెడ్” జాబితాలో చేర్చిన ఇండియా

భారత ప్రభుత్వం గత మార్చి నెలలో పాకిస్ధాన్ ప్రభుత్వానికి సమర్పించిన వాంటెడ్ వ్యక్తుల జాబితాలో ప్రస్తుతం సైన్యంలో అధికారులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న వారి పేర్లు ఉన్న సంగతి వెల్లడయ్యింది. ఇండియా తన భూభాగంపై జరిగిన టెర్రరిస్టు దాడుల వెనక పాకిస్ధాన్ సైనికాధికారులు, మిలట్రీ గూఢచార సంస్ధ ఐ.ఎస్.ఐ పాత్ర ఉందని చాలా కాలంనుండి ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఇండియా హోం మంత్రిత్వ శాఖ కార్యదర్శి జి.కె.పిళ్ళై మార్చి నెలలో పాకిస్ధాన్ హోమ్ కార్యదర్శి ఖమర్ జమాన్ చౌదరితో…

మధ్యధరా సముద్రంలో 63 మంది శరణార్ధులను వారి చావుకు వదిలేసిన నాటో యుద్ధనౌక

లిబియా పౌరుల రక్షణే తమ ధ్యేయమనీ, వారిని రక్షించండి అని ఆదేశించిన సమితి తీర్మానాన్ని పూర్తిగా అమలు చేయడమే తమ కర్తవ్యమనీ నాటో ఆధ్వర్యంలో లిబియాపై బాంబులు మిస్సైళ్ళుతో దాడులు చేస్తున్న అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సు దేశాలు చెబుతున్నాయి. గడ్డాఫీ ఇంటిపై బాంబులేసి అతన్ని చంపాలని ప్రయత్నించినా, అతని కొడుకూ, ముగ్గురు మనవళ్ళను చంపినా, ప్రభుత్వ ఆయుధ గిడ్డంగులను నాశనం చేసినా, చివరికి లిబియా పౌరులే చనిపోయినా అవన్నీ అంతిమంగా లిబియా పౌరుల రక్షణకోసమే నని ఆ…

మసీదు-మందిరం తీర్పుని సస్పెండ్ చేసిన సుప్రీం కోర్టు

వివాదాస్పద బాబ్రీ మసీదు, రామ జన్మ భూమి స్ధలాన్ని మూడు భాగాలు చేసి పంచిన అలహాబాద్ హై కోర్టు తీర్పును సుప్రీం కోర్టు సస్పెన్షన్‌లో ఉంచింది. మూడు భాగాలుగా పంచడం వెనక హై కోర్టు ఇచ్చిన కారణాలను ఇద్దరు సభ్యులు గల సుప్రీం బెంచ్ ప్రశ్నించింది. బాబరు నిర్మించాడని చెబుతున్న మసీదును ఒక హిందూ దేవాలయాన్ని కూల్చి నిర్మించినట్లుగా ఆరోపిస్తూ 1992 డిసెంబరు 6 తేదీన హిందూ మత సంస్ధలకు చెందిన కార్యకర్తలు కూల్చివేశిన విషయం విదితమే.…

అబ్బోత్తాబాద్ స్ధావరం కమాండ్ అండ్ కంట్రోల్ సెంటరా? అబ్బే, అంత సీన్ లేదు -అమెరికా, పాక్ అధికారులు

పాకిస్ధాన్‌‌లోని  అబ్బోత్తాబాద్‌ పట్టణంలో గల లాడెన్ స్ధావరమే ఆల్-ఖైదా కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌గా ఉపయోగిస్తున్నారని అమెరికా చెప్పడాన్ని అటు అమెరికాలోనూ, ఇటు పాకిస్తాన్ లోనూ చాలామంది అంగీకరించ లేకపోతున్నారు. లాడెన్ స్ధావరంగా చెప్పబడుతున్న స్ధావరంలో అతన్ని హత్య చేశాక అక్కడినుండి చాలా సమాచారాన్ని తీసుకెళ్ళినట్లుగా చెబుతున్నారు. ఈ సమాచారం ఒకేఒక టెర్రరిజం అనుమానితుడి వద్ద దొరికిన అతి పెద్ద గూఢచార సమాచారాల్లో ఒకటిగా ఇంటెలిజెన్స్ అధికారులు పేర్కొంటున్నారు. ఈ సమాచారం ద్వారా లాడెన్ చివరివరకూ చురుగ్గా…

ప్రజల ప్రయోజనాలకు హాని చేశానని ఒప్పుకున్న దమ్మున్న మంత్రి జైరాం రమేశ్

పర్యావరణ చట్టాల అమలు విషయంలో చాలా సార్లు రాజీ పడ్డానని కేంద్ర పర్యావరణ మంత్రి జైరాం రమేశ్ అంగీకరించారు. అనేక పర్యావరణ ఉల్లంఘనలను తాను మాఫీ చేశానని తెలిపారు. చట్టాల ఉల్లంఘనలను క్రమబద్ధీకరించడానికి తాను బద్ధవ్యతిరేకిననీ, కానీ కొన్ని కేసుల్లో రాజీ పడే విధంగా ఒత్తిడులు వచ్చాయనీ తెలిపారు. జైరాం రమేశ్ పర్యావరణ మంత్రిత్వ శాఖను చేపట్టినప్పటినుండీ వాణిజ్య, పరిశ్రమల, వ్యవసాయ మంత్రివర్గాలనుండీ విమర్శలను ఎదుర్కొన్నాడు. చట్టాలంటూ ముంకు పట్టు పట్టి అర్ధిక వ్యవస్ధ వృద్ధికి ఆటంకంగా…

ఒసామా ఓ సీరియస్ విద్యార్ధి -తైవానీస్ జుడో కోచ్ జిమ్మీ వూ

“ఒసామా నేను కోచింగ్ ఇచ్చిన విద్యార్ధుల్లో ప్రత్యేక విద్యార్ధి. అతని ఎత్తువలన ప్రత్యేకం అని చెప్పడం లేదు. అతని సీరియస్‌నెస్, అతని కన్సర్వేటివ్ భావాలు అతన్ని ప్రత్యేకంగా నిలిపాయి” అని ఒసామాకు విద్యార్ధి దశలో జుడో కోచింగ్ ఇచ్చాడని భావిస్తున్న జిమ్ వూ రాయిటర్స్ కి ఇచ్చిన ఇంటర్వూలే చెప్పాడు. అప్పటి ఒసామాయే ఇప్పటి ఒసామా బిన్ లాడెన్ అని నిర్ధారించలేక పోతున్నట్లుగా రాయిటర్స్ వార్తా సంస్ధ తెలిపింది. తాయిచుంగ్ నగరంలో జరుగుతున్న జుడో టోర్నమెంటు సందర్భంగా…

ఒసామా హత్యను నిర్ధారించిన ఆల్-ఖైదా, శవం అప్పగించాలని డిమాండ్

ఒసామా-బిన్-లాడెన్‌ నిజంగా అమెరికా కమెండోల దాడిలో చనిపోయాడా లేదా అన్న అనుమానాలకు తెర దించుతూ అతను చనిపోయిన విషయాన్ని ఆల్-ఖైదా సంస్ధ నిర్ధారించింది. లాడెన్ శవాన్ని అప్పగించాలని ఆల్-ఖైదా డిమాండ్ చేసింది. శవాన్ని అరేబియా సముద్రంలో పాతిపెట్టామంటున్న అమెరికా మాటలను ఆల్-ఖైదా నమ్మడం లేదని ఈ డిమాండ్ ద్వారా అర్ధం చేసుకోవచ్చునా లేక శవం పాతిపెట్టిన చోటుని చెప్పాలని ఈ డిమాండ్ అంతరార్ధమో తెలియడం లేదు. ఒసామా-బిన్-లాడెన్ హత్యకు అమెరికా పైనా, దాని మిత్రుల పైనా ప్రతీకారం…

అమెరికా అబద్ధాలకు నిలువెత్తు సాక్ష్యాలు: జెస్సికా లించ్, పేట్ టిల్‌మేన్, లిండా నార్గ్రోవ్

ఒసామా బిన్ లాడెన్ హత్య విషయంలో పొంతనలేని కధనాలు చెబుతున్న అమెరికాకి అబద్ధాలు చెప్పడం కొత్త కాదు. ఇరాక్‌పై దాడి చేయడానికి కారణంగా ఆ దేశంలో సామూహిక విధ్వంసక మారణాయుధాలు ఉన్నాయనీ, వాటి వలన అమెరికా భద్రతకు ముప్పు అనీ అబద్ధాలు చెప్పింది. దానితో పాటు ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్‌కీ, ఒసామా బిన్ లాడెన్‌కీ సంబంధాలున్నాయని పచ్చి అబద్ధాన్ని ప్రచారం చేసింది. కానీ లాడెన్‌ను చంపానని చెప్పిన తర్వాత అమెరికా అధ్యక్షుడు గానీ, అధికారులు గానీ…

ఇండియాతో ఘర్షణ పెట్టుకుని ఒసామా హత్యపై దృష్టి మరల్చే యోచనలో పాకిస్ధాన్?

పాకిస్ధాన్ భూభాగంపై స్ధావరం ఏర్పరుచుకున్న ఒసామా బిన్ లాడెన్‌ను చంపామని అమెరికా అధ్యక్షుడు ప్రకటించడంతో పాకిస్ధాన్ ప్రభుత్వం ఇరకాటంలో పడింది. పాకిస్ధాన్ ప్రభుత్వానికి తెలియకుండా అమెరికా ఆపరేషన్ నిర్వహించిందనడంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నప్పటికీ ఇన్నాళ్ళూ ఒసామా పాకిస్ధాన్‌లోనే ఆశ్రయం తీసుకుంటున్న విషయం తెలిసి పాకిస్ధానీయులు నిశ్చేష్టులయ్యారని పత్రికలు తెలుపుతున్నాయి. పాకిస్ధాన్ ఐ.ఎస్.ఐ సంస్ధ లాడెన్‌ను తప్పిస్తుందేమో అన్న అనుమానాలున్నందునే పాక్ ప్రభుత్వానికి తెలియజేయలేదని సి.ఐ.ఏ డైరెక్టర్ చెప్పడంతో పాకిస్ధాన్‌లోని ప్రతిపక్ష పార్టీలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్త్తున్నాయి.…

లాడెన్ ఇంటిలో రక్తపు మడుగులో ముగ్గురు నిరాయుధుల శవాలు, ఫోటోలు సంపాదించిన రాయిటర్స్

ఒసామా బిన్ లాడెన్‌ స్ధావరంగా చెప్పబడుతున్న ఇంటిలో రక్తపు మడుగులో పడి ఉన్న ముగ్గురు యువకుల శవాల ఫోటోలను రాయిటర్స్ వార్తా సంస్ధ సంపాదించింది. వీరి వద్ద ఎటువంటి ఆయుధాలు లేవని రాయిటర్స్ సంస్ధ తెలిపింది. అమెరికా కమేండోలు దాడి చేసి వెళ్ళిన గంట తర్వాత ఈ ఫోటోలు తీశారని ఆ సంస్ధ తెలిపింది. పాకిస్ధాన్ భద్రతా అధికారి ఒకరు ఒసామా స్ధావరంగా చెబుతున్న ఇంటిలోకి అమెరికన్ కమెండోలు వెళ్ళిన గంట తర్వాత వెళ్ళి తీసిన ఫోటోలను…

ఒసామా మృతి తాలూకు ఫోటోల విడుదలకు భయపడుతున్న ఒబామా

ప్రపంచ పోలీసు అమెరికా అధ్యక్షుడు ఒబామాని చనిపోయిన ఒసామా బిన్ లాడెన్ ఇంకా భయపెడుతూనే ఉన్నాడు. ఒసామాని చంపినట్లు రుజువులు చూపాలని అమెరికాలోని వివిధ వర్గాల ప్రజలు, రాజకీయ నాయకులతో పాటు ప్రపంచంలోని వివిధ దేశాల ప్రభుత్వాలు ప్రముఖులు డిమాండ్ చేస్తున్నారు. కాని ఒసామా మృతి చెందిన ఫోటోలు విడుదల చేస్తే, భీకరంగా ఉన్న ఆ చావు వలన అమెరికా జాతీయ భద్రతకు ముప్పు ఏర్పడుతుందని తాను భావిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ఒబామా ఎన్.బి.సి టెలివిజన్‌కి ఇచ్చిన…