ఒక తీవ్రవాది, ఒక స్నేహబంధం, కొన్ని కార్టూన్లు

అమెరికాకీ, అమెరికా వాదనని నమ్మినవారికీ ఒసామా బిన్ లాడెన్ నెం. వన్ తీవ్రవాది. దక్షీణాసియాలో అమెరికాకి పాకిస్ధాన్ అత్యంత నమ్మకమైన మిత్రుడు. వారిది ఆరు దశాబ్దాల స్నేహబంధం. లాడెన్‌ని వెతకటంలో తన మిత్రుడు సహాయపడుతున్నాడని అమెరికా సెప్టెంబరు 11, 2001 నుండి ఇప్పటి వరకు 20.7 బిలియన్ డాలర్లను పాకిస్ధాన్‌కి ధారపోసింది. పది సంవత్సరాల నుండీ వెతుకుతున్న తన శత్రువు తన మిత్రుడి బెడ్ రూంలోనే హాయిగా సేద తీరడం చూసిన అమెరికా బిత్తరపోయింది. మిత్రుడుగా భావిస్తున్న…

16 సం. నాన్ బెయిలబుల్ వారంట్ తప్పించుకొని ఇప్పుడు లొంగిపోయిన బీహార్ ఎం.ఎల్.ఎ

ఆయన పేరు రామాధర్ సింగ్. బీహార్‌లో బి.జె.పి పార్టీ తరఫున ఔరంగాబాద్ నియోజక వర్గం నుండి నాలుగుసార్లు ఎన్నికయిన ఎం.ఎల్.ఎ. 2010 లో ఎన్నికయ్యాక నితీష్ కుమార్ ప్రభుత్వంలో సహకార శాఖా మంత్రిగా పని చేస్తున్నాడు. ఈయన గురువారం మంత్రి పదవికి రాజీనామ చేశాడు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సలహా మేరకు గవర్నర్ ఆ ఎం.ఎల్.ఏ రాజీనామాని ఆమోదించాడు. మే 19న రాజీనామా చేశాక బీహార్ హై కోర్టు ఆయనను క్రింది కోర్టులో లొంగిపొమ్మని ఆదేశాలు ఇచ్చింది.…

అమెరికాకు పాకిస్ధాన్ “తలాక్! తలాక్!! తలాక్!!!” చెప్పనున్నదా?

జరుగుతున్న పరిణామాలు అమెరికా పట్టునుండి పాకిస్ధాన్ జారిపోనున్నదా అన్న అనుమాలు కలగజేస్తున్నాయి. పాకిస్ధాన్ నుండి అమెరికా మనుషుల (ప్రత్యేక భద్రతా బలగాలు లేదా సి.ఐ.ఏ గూఢచారులు) సంఖ్యను సగానికి తగ్గించాల్సిందిగా పాకిస్ధాన్ మిలట్రీ అమెరికాను డిమాండ్ చేసింది. పాకిస్ధాన్ మిలట్రీ కోరిక మేరకు తమ పాకిస్ధాన్ నుండి తమ మనుషులను వెనక్కి పిలిపిస్తున్నామని అమెరికా కూడా ప్రకటించింది. “అనవసరమైన మనుషులు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళు మాకు సాయం చేయడానికి బదులు మరిన్ని సమస్యలు సృష్టిస్తున్నారు”…

ఐ.ఎం.ఎఫ్ పదవికి దేశం కాదు, ఏకాభిప్రాయమే ప్రాతిపదిక -ఇండియా

ఐ.ఎం.ఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ పదవికి ప్రతిభ, ఏకాభిప్రాయమే ప్రాతిపదికగా ఉండాలి తప్ప జాతీయత, దేశం కాదని ఇండియా ప్రకటించింది. యూరోపియన్ దేశం నుండి మాత్రమే ఆ పదవికి ఎన్నుకోవాలని యూరోపియన్ యూనియన్ ప్రకటించడం పట్ల ఇండియా తో పాటు ఇతర బ్రిక్స్ దేశాలైన చైనా, రష్యా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా అభ్యంతరం తెలిపిన సంగతి తెలిసిందే. ఫ్రాన్సు ఆర్ధిక మంత్రి క్రిస్టీన్ లాగార్డే తాను ఐ.ఎం.ఎఫ్ అత్యున్నత పదవికి పోటీ చేయనున్నట్లు ప్రకటించింది. ఇ.యు ఆమెకు పూర్తి…

టెర్రరిస్టు అజ్మల్ కసబ్‌ను 1 1/2 సం.లు భద్రంగా ఉంచడానికి ఐన ఖర్చు రు.11 కోట్లు

ముంబై టెర్రరిస్టు దాడుల్లో పాల్గొని దొరికిపోయిన అజ్మల్ కసబ్ భద్రత కోసం ఇప్పటి వరకు పెట్టిన ఖర్చు 10.87 కోట్ల రూపాయలని తేలింది. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసు (ఐ.టి.బి.పి) విభాగం అజ్మల్ కసబ్ కి సెక్యూరిటీ అందిస్తున్నందుకు ఇప్పటివరకూ ఖర్చయిన రు. 10.87 కోట్లను తమకు తిరిగి చెల్లించాలని బిల్లు పంపడంతో మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం షాక్‌కి గురైంది. ఐటిబిపి డైరెక్టర్ జనరల్ ఆర్.కె.భాటియా ఈ బిల్లును పంపాడు. మార్చి 28, 2009 నుండి సెప్టెంబరు…

పాకిస్ధాన్ నావల్ బేస్‌పై పాక్ తాలిబాన్ దాడి దృశ్యాలు -ఫోటోలు

సోమవారం పాకిస్ధాన్ తాలిబాన్‌కి చెందిన 6 గురు మిలిటెంట్లు కరాచిలోని “పి.ఎన్.ఎస్ మెహ్రాన్” అనే పేరుగల నావల్ అండ్ ఎయిర్ బేస్ పై ఆకస్మిక దాడి చేశారు. ఈ బేస్ లోనే పాకిస్ధాన్ తన అణ్వస్త్రాలను భద్రం చేసిందని భావిస్తున్నారు. దాదాపు 16 గంటలపాటు ఆరుగురు మిలిటెంట్ల వందలమంది పాక్ సైనికుల్ని నిలువరించారు. జలాంతర్గాముల్ని నాశనం చేయగల రెండు యుద్ధ విమానాల్ని (అమెరికా తయారీ) వాళ్ళూ ధ్వంసం చేశారు. 12 మంది సైనికుల్ని చంపేశారు. ఆరుగురిలో నలుగురు…

అమెరికాలో ముంబై దాడులపై ట్రయల్స్ ప్రారంభం, ఐ.ఎస్.ఐ టెర్రరిస్టుల సంబంధాలను ధృవపరిచిన హేడ్లీ

ముంబై టెర్రరిస్టు దాడులపై అమెరికాలోని చికాగో కోర్టులో ట్రయల్స్ కోర్టులో సోమవారం విచారణ ప్రారంభమయ్యింది. రాణాపై ప్రారంభమైన విచారణలో అతను నిర్ధోషీ అనీ కేవలం హేడ్లీతో బాల్య స్నేహితుడిగా ఉండడమే అతని దోషమని రాణా లాయరు వాదించాడు. బాల్య స్నేహితుడిగా నమ్మి తన కంపెనీలో చేర్చుకున్నందుకు హేడ్లీ రాణాను మోసం చేశాడనీ ఆయన వాదించాడు. అయితే మంగళవారం హేడ్లీ కోర్టులో సాక్ష్యం ఇచ్చాడు. ఐ.ఎస్.ఐ తో లష్కర్-ఎ-తొయిబా సంస్ధకు సంబంధాలున్నాయని తన సాక్ష్యంలో ధృవ పరిచాడు. ఐ.ఎస్.ఐ…

కరుణానిధి నిరాహార దీక్ష ఒఠ్ఠి నాటకం -దయానిధి మారన్

శ్రీలంక తమిళులపై అక్కడి ప్రభుత్వం జరుపుతున్న కాల్పులను విరమింప జేసేలా ఒత్తిడి తేవాలని డిమాండ్ చేస్తూ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి 2008 లో చేసిన ఒక రోజు నిరాధార దీక్ష, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని బెదిరించడం, వాస్తవానికి ప్రజల దృష్టి మరల్చడానికి ఆడిన నాటకం అని కేంద్ర మాజీ ఐ.టి మంత్రి దయానిధి మారన్ అమెరికా రాయబార కార్యాలయ అధికారులతో చెప్పిన విషయం వికీలీక్స్ బైట పెట్టిన అమెరికా డిప్లొమాటిక్ కేబుల్స్ ద్వారా వెల్లడయ్యింది.…

పాకిస్తానే కాదు అవసరమైతే ఏదేశంపైనైనా దాడి చేస్తాం! -ఒబామా

అమెరికా మరోసారి తన అహంభావాన్ని బైట పెట్టుకుంది. అధ్యక్షుడు ఒబామా నోటి ద్వారా అమెరికా ప్రపంచ పోలీసు బుద్ధి మరోసారి బైట పడింది. అంతర్జాతీయ చట్టాలు తనకు పూచిక పుల్లతో సమానమని చాటి చెప్పుకుంది. టెర్రరిస్టు ఉన్నాడని తెలిస్తే పాకిస్ధాన్ పై మరోసారి అక్కడి ప్రభుత్వానికి చెప్పకుండా దాడి చేస్తామని ఒబామా ప్రకటించాడు. అసలు పాకిస్ధానేం ఖర్మ, తాను చంపదలుచుకున్న వాళ్ళెవరైనా ఉన్నాడని తెలిస్తే ఏ దేశంపైనైనా దాడి చేస్తామని ప్రకటించాడు. తమకు కావలసింది అమెరికా ప్రజల…

తన హత్యకు ముందు అమెరికా శరణు వేడిన బేనజీర్ భుట్టో -వికీలీక్స్

డిసెంబరు 2007లో పాకిస్ధాన్ మాజీ ప్రధాని బేనజీర్ భుట్టో దారుణంగా హత్యకు గురయ్యింది. అమెరికా, బ్రిటన్‌ల మధ్యవర్తిత్వంతో ప్రవాస జీవితం విడిచి పాకిస్ధాన్‌లో అడుగు పెట్టగలిగిన బేనజీర్ కొద్ది రోజులకే తనను చంపడానికి ముషార్రఫ్ ప్రభుత్వంలోని ఓ వర్గం ప్రయత్నిస్తోందని తెలియడంతో నేరుగా అమెరికాని రక్షణ కోరిన విషయం వికీలీక్స్ బైటపెట్టిన అమెరికా డిప్లొమాటిక్ కేబుల్స్ ద్వారా వెల్లడయ్యింది. బేనజీర్ భుట్టో విన్నపాన్ని అమెరికా నిర్ద్వంద్వంద్వంగా తిరస్కరించడమే కాకుండా, “ఎన్నికల ప్రచారం జరుగుతున్న సందర్భంలో అమెరికా సెక్యూరిటీ…

తప్పుల తడక “మోస్ట్‌వాంటేడ్” పాకిస్ధానీయుల జాబితా ఉపసంహరించుకున్న ఇండియా

కొద్ది రోజుల క్రితం టెర్రరిజం నేరాల క్రింద భారత ప్రభుత్వం ప్రచురించిన “మోస్టు వాంటేడ్ పాకిస్తానీయుల” జాబితోలో తప్పులను భారత పత్రికలు ఎత్తి చూపడంతో ఆ జాబితాను ప్రభుత్వం ఉపసంహరించుకోక తప్పలేదు. టెర్రరిజం నేరాలము పాల్పడిన పాకిస్తానీయులను తమకు అప్పజెప్పాలంటూ 50 మంది పాకిస్తాన్ దేశీయుల పేర్లను ఇండియా గత మార్చి నెలలో పాకిస్ధాన్ ప్రభుత్వానికి సమర్పించింది. కొద్ది రోజుల క్రితం ఆ జాబితాను తన వెబ్ సైట్ లో సి.బి.ఐ ఉంచింది. జాబితాలోని కనీసం ఒక…

అమెరికాతో చెడిన నేపధ్యంలో చైనా కార్డుని ముందుకి తెస్తున్న పాకిస్ధాన్

ఒసామా బిన్ లాడెన్ ని హత్య చేయకముందు వరకూ ఏడు సంవత్సరాలనుండి అబ్బోత్తాబాద్ లోనే ఉంటున్నామని ఆయన భార్య చెప్పిన నేపధ్యంలో లాడెన్‌ని దాచిపెట్టడంలో పాక్ గూఢచార సంస్ధ ఐ.ఎస్.ఐ పాత్ర ఉందని అమెరికా అనుమానం వ్యక్తం చేసిన సంగతి విదితమే. ఇంతకాలం లాడెన్ పాక్‌లో దాగి ఉండటం పాక్‌లోని కనీసం కొందరి అధికారులకైనా తెలియకుండా సాద్యం కాదని అమెరికా ప్రతినిధుల సభ అనుమానాలు వ్యక్తం చేసింది. పాక్‌కి అందిస్తున్న బిలియన్ డాలర్ల సహాయాన్ని రద్దు చేయాలని…

పాక్‌తో సంబంధాల మెరుగుకు అమెరికా ప్రయత్నాలు

సి.ఐ.ఏ ఏజెంట్ డేవిస్ అప్పగింత, ఒసామా బిన్ లాడెన్ హత్య లతో పాక్, అమెరికాల మధ్య అడుగంటిన సంబంధాలను పునరుద్ధరించుకోవడానికి అమెరికా ప్రయత్నాలు ప్రారంభించింది. దాన్లో భాగంగా సెనేటర్ జాన్ కెర్రీ ఆఫ్ఘన్, పాక్ లలో పర్యటిస్తున్నాడు. వచ్చింది సంబంధాల మెరుగుకే అయినా పాక్ పై నిందలు మోపడం మానలేదు. ఒసామా బిన్ లాడెన్ ఆరు సంవత్సరాల పాటు పాక్ లో ఉండటానికి పాక్ సంస్ధల సాయం ఉందన్న విషయం నమ్మకాన్ని చెదరగోట్టేదని కెర్రీ ఆఫ్ఘనిస్ధాన్ లో…

నాటో దాడులకు ఫలితం, గౌరవప్రదమైన వీడ్కోలు కోరుకుంటున్న గడ్డాఫీ?

లిబియాపై పశ్చిమ దేశాల దురాక్రమణ దాడులకు ఫలితం వస్తున్నట్టే కనిపిస్తోంది. లిబియాను 42 సంవత్సరాలనుంది ఏలుతున్న కల్నల్ మౌమ్మర్ గడ్డాఫీ ఎలాగూ తాను గద్దె దిగక తప్పదన్న అవగాహనతో గౌరవప్రదమైన వీడ్కోలు కోరుకుంటున్నాడని గడ్డాఫీ పాలనా బృందంలోని వారిని ఉటంకిస్తూ ‘ది గార్దియన్’ పత్రిక వార్తను ప్రచురించింది. తాను నలభై సంవత్సరాలపాటు పాలించీన లిబియాలో ఒక గాడ్ ఫాదర్ లాంటి ఇమేజ్ తో పదవినుండి నిష్క్రమించాలని కోరుకుంటున్నట్లుగా ఆయన సన్నిహితుల్లో కనీసం నలుగురిని ఉటంకిస్తూ ఆ పత్రిక…

అబ్బోత్తాబాద్‌ దాడిపై స్వతంత్ర దర్యాప్తు జరపాలి, డ్రోన్ దాడులు ఆపాలి -పాక్ పార్లమెంటు

పాకిస్ధాన్ పార్లమెంటు ఊహించని విధంగా ఓ ముందడుగు వేసింది. అది సంకేతాత్మకమే (సింబాలిక్) అయినప్పటికీ ఇప్పటి పరిస్ధితుల్లో అది ప్రశంసనీయమైన అడుగు. దాదాపు పది గంటలపాటు జరిగిన సుదీర్ఘ చర్చలో అమెరికన్ కమెండోలతో కూడిన హెలికాప్టర్లు మే 2 తేదీన అనుమతి లేకుండా పాకిస్ధాన్ గగనతలం లోకి జొరబడి అబ్బొత్తాబాద్ లో సైనిక చర్య చేపట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తూ తీర్మానాన్ని ఆమోదించింది. అలాగే మానవ రహిత డ్రోన్ విమానాలు పాకిస్తాన్ ప్రభుత్వానికి ముందస్తు సమాచారం లేకుండా మిలిటెంట్లను…