సరైన లోక్‌పాల్ బిల్లును పార్లమెంటుకు పంపండి, సోనియాను కోరిన హజారే బృందం

శనివారం లోక్‌పాల్ బిల్లుపై అఖిలపక్ష సమావేశం జరగనున్న నేపధ్యంలో అన్నా హజారే, అరవింద్ కేజ్రీవాల్ లు కాంగ్రెస్ అధినాయకురాలు సోనియా గాందీని కలిశారు. లోక్‌పాల్ బిల్లు పరిధిలోకి ప్రధాన మంత్రి, ఛీఫ్ జస్టిస్ లను కూడా తేవాలని సోనియా గాంధీని గట్టిగా కోరామని సమావేశం అనంతరం అన్నా హజారె విలేఖరులకు తెలిపాడు. సోనియా గాంధీతో 30 నిమిషాలు సమావేశమైన హజారే బృందం సరైన బిల్లు పార్లమెంటు ముందుకు వెళ్ళేలా చూడాలనీ, ఆ తర్వాత పార్లమెంటు ఏ విధమైన…

ఆఫ్ఘనిస్ధాన్ నుండి వెళ్ళిపోవద్దు -అమెరికాని కోరిన భారత ప్రభుత్వం

ఆఫ్ఘనిస్ధాన్‌లో కొనసాగుతున్న నిత్య మారణహోమం భారత పాలకులకు దీపావళి లాగా కనిపిస్తున్నట్లుంది. కాకుంటే ఎక్కడినుండో ఏడేడు సముద్రాల ఆవలినుండి వచ్చిన అమెరికా, దాని తైనాతీ దేశాలు పొరుగు దేశాన్ని ఆక్రమించి బాంబుదాడులతో, సైనిక కాల్పుల్లో ఆఫ్ఘన్ ప్రజల ఉసురు తీస్తుంటే దాన్ని ఖండించి ఆఫ్ఘన్ ప్రజలకు సంఘీభావం ప్రకటించే బదులు దురాక్రమణ సైన్యాన్ని మరికొంత కాలం కొనసాగించాలని బ్రతిమాలుతుందా? బ్రిటిష్ వలసవాదులు, భారత ప్రజల పోరాటాలకు తలొగ్గి 1947లో దేశం విడిచి వెళ్ళిపోవడానికి నిశ్చయించినప్పుడు ఏ చైనా,…

అమెరికా ఒత్తిడి ఫలితం: ఇరాన్ ఆయిల్ ఇండియాకిక దుర్లభమేనా?

ఇండియా ఆయిల్ అవసరాలలో 12 శాతం తీర్చే ఇరాన్, ఇకనుండి ఇండియాకి ఆయిల్ సరఫరా చేయడం మానేస్తుందా? అంతర్జాతీయ రాజకీయాలలో భాగంగా అమెరికా ఒత్తిడికి గురైన భారత ప్రభుత్వం ఇరాన్ నుండి దిగుమతి చేసుకున్న ఆయిల్‌కి ఇంకా చెల్లింపులు చేయకపోవడంతో భారత దేశానికి ఆయిల్ సరఫరా చేయడం కష్టమేనని ఇరాన్ ప్రకటించింది. ఇరాన్ సరఫరా చేసిన ఆయిల్ కి గాను, ఇండియా ఆ దేశానికి 12 బిలియన్ డాలర్లు (రు.54,000 కోట్లు) చెల్లించవలసి ఉండగా ఒకటిన్నర సంవత్సరాలుగా…

ఇంటర్నెట్‌ వినియోగదారులపై నిఘా పెట్టమని ఇండియా చాలాసార్లు కోరింది -గూగుల్

తమది గొప్ప ప్రజాస్వామ్యం అని డబ్బా కొట్టుకునే దేశాలే ఇంటర్నెట్ వినియోగదారులపై నిఘా పెట్టమని కోరిన వాటిలో ముందుంటున్నాయి. గూగుల్ తెలిపిన సమాచారం ప్రకారం అమెరికా, బ్రెజిల్ ల తర్వాత ఎక్కువసార్లు వినియోగదారులపై నిఘా పెట్టమనిగానీ, వినియోగదారుల సమాచారాన్ని ఇవ్వమని గానీ భారత ప్రభుత్వమే ఎక్కువ సార్లు కోరింది. గత సంవత్సరం (2010) జులై నుండి డిసెంబరు లోపు భారత ప్రబుత్వం 1699 సార్లు యూజర్ ఎకౌంట్ల సమాచారాన్ని కోరిందని గూగుల్ తెలిపింది. గూగుల్‌ని వినియోగదారుల సమాచారాన్ని…

జులై 5 నుండి రానున్న 5 సంవత్సరాల వరకూ క్రిస్టీన్ లాగార్డే ఐ.ఎం.ఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్

అంతా ఊహించినట్లే ఫ్రాన్సు ఆర్ధిక మంత్రి క్రిస్టిన్ లాగార్డే ని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధ (International Monetary Fund) “మేనేజింగ్ డైరెక్టర్‌” గా ఏకాభిప్రాయంతో ఎంపిక చేసుకుంది. క్రిస్టిన్ లాగార్డే, ఆమె పోటీదారు అగస్టీన్ కార్‌స్టెన్స్ లకు అందిన మద్దతును, ఆమోదాలను (endorsements) సమీక్షించిన ఐ.ఎం.ఎఫ్ బోర్డు క్రిస్టిన్ లాగార్డే కి అధిక మద్దతు ఉన్నట్లు భావించి ఆమెను ఎంపిక చేసినట్లుగా ప్రకటించింది. గతంలో ఎన్నడూ లేనట్లుగా ఐ.ఎం.ఎఫ్ ఉన్నత పదవికి పోటీ ఏర్పడింది. ఎమర్జింగ్ మార్కెట్…

“పౌర అణు ఒప్పందం” విషయంలో అమెరికా, ఇండియాను మోసగించనున్నదా?

2008 సంవత్సరంలో అమెరికా, ఇండియాలు “పౌర అణు ఒప్పందం” పై సంతకాలు చేశాయి. ఆ ఒప్పందం ద్వారా అప్పటివరకు అణు విషయాల్లో ప్రపంచంలో ఏకాకిగా ఉన్న ఇండియా అణు వ్యాపారంలో భాగస్వామ్యం పొందడానికి అమెరికా వీలు కల్పించిందని అంతర్జాతీయ కార్పొరేట్ పత్రికా సంస్ధలు వార్తలు రాశాయి. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందంపై ఇండియా సంతకం చేయనప్పటికీ అణు వ్యాపారం చేయడానికి ఇండియాకి అవసరమైన అణు పరికరాలు అమ్మడానికీ మినహాయింపు లభించిందని నిపుణులు వ్యాఖ్యానించారు. ఇది అరుదైన విషయమనీ…

ఐ.ఎం.ఎఫ్ ఉపాధ్యక్ష పదవికోసం బ్రిక్స్ కూటమి తీర్మానానికి పాతరేసిన చైనా

బ్రిక్స్ నిర్ణయానికి పాతరేస్తూ చైనా ఫ్రాన్సు అభ్యర్ధి క్రిస్టిన్ లాగార్డేకి ఐ.ఎం.ఎఫ్ అధ్యక్షురాలుగా ఉండడానికి మద్దతు ప్రకటించింది. బ్రిక్స్ (BRICS) అనేది ఐదు లీడింగ్ ఎమర్జింగ్ దేశాల కూటమి. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా లు ఇందులో సభ్య దేశాలు. ఐ.ఎం.ఎఫ్ అధ్యక్ష పదవి ఖాళీ అయ్యాక యూరప్ దేశాలు యూరప్ అభ్యర్ధిని ఆ పదవిలో నియమించాలని కోరింది. యూరప్ అప్పు సంక్షోభం ఎదుర్కొంటున్నందున అది న్యాయమని చెప్పింది. ఆత్రుతగా ఫ్రాన్సు ఆర్ధిమ మంత్రి…

అమెరికా సెనేట్‌లో విచిత్రం, వివాద పరిష్కారానికి చైనా బలప్రయోగంపై ఖండన తీర్మానం

అమెరికా సెనేట్‌లో సోమవారం ఒక విచిత్రం చోటు చేసుకుంది. బహుశా ప్రపంచ వింతల్లో ఒకటిగా ఇది స్ధానం సంపాదించుకోవచ్చు. దక్షిణ చైనా సముద్రంలో వివాదాల పరిష్కారానికి చైనా బల ప్రయోగం చేయడాన్ని ఖండిస్తూ అమెరికా సెనేట్ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. అదీ ఏకగ్రీవంగా. ఒక దేశానికి ‘బల ప్రయోగం చేయడం తగదు” అని సుద్దులు చెప్పే అర్హత అమెరికా తనకు తాను దఖలు పరుచుకోవడమే ఇక్కడ వింత. బల ప్రయోగం చేస్తే చైనాని నిస్సందేహంగా తప్పు పట్టవలసిందే.…

ఆఫ్-పాక్ లతో కలసి అమెరికా వ్యతిరేక కూటమి నిర్మిస్తున్న ఇరాన్?

అమెరికా-ఇరాన్ దేశాల వైరం జగద్విదితం. ఇరాన్ అణు విధానానికి అడ్డుపడుతూ అణ్వాయుధాలు నిర్మిస్తున్నదన్న ప్రచారంతో ఆ దేశంపై ఇప్పటికి నాలుగు విడతలుగా అంతర్జాతీయ వాణిజ్య ఆంక్షలను విధింపజేసింది అమెరికా. అమెరికా నాయకత్వంలో ఇరాన్‌పై విధించిన ఆంక్షలు “వాడి పారేసిన రుమాలు”తో సమానమని ఇరాన్ అధ్యక్షుడు అహ్మది నెజాద్ పశ్చిమ దేశాల అహంపై చాచి కొట్టినంత పని చేశాడు. ఆంక్షలు అమలులో ఉండగానే ఇరాన్ నేరుగా అమెరికా కంపెనీతోనే వ్యాపారం చేసి వారి ఆంక్షలను తిప్పికొట్టింది ఇరాన్. మధ్య…

ఆఫ్ఘనిస్ధాన్‌పై పాకిస్ధాన్ రాకెట్ల దాడి, తాలిబాన్‌కి మద్దతుగానేనని కర్జాయ్ ఆరోపణ

గత మూడు వారాలనుండి పాకిస్ధాన్ కనీసం 470 రాకెట్లు ప్రయోగించిందనీ, ఈ దాడిలో 36 మంది పౌరులు మరణించారనీ ఆఫ్ఘన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ ఆరోపించాడు. చనిపోయినవారిలో 12 మంది పిల్లలు కూడా ఉన్నారనీ ఆయన తెలిపాడు. పాకిస్ధాన్ సరిహద్దుల్లో ఉన్న కూనార్, నంగర్‌హార్ రాష్ట్రాలలో ఈ దాడులు చోటు చేసుకున్నాయని ఆఫ్గన్ సరిహద్దు అధికారులు తెలిపారని వాల్‌స్ట్రీట్ జర్నల్ పత్రిక తెలిపింది. నాటో బలగాలు ఈ రాష్ట్రాలనుండి ఖాళీ చేశాయి. రాకెట్ దాడులతో పౌరులు అక్కడినుండి…

బ్రిటన్ కూడా ఆఫ్ఘనిస్ధాన్‌నుండి సైన్యాన్ని ఉపసంహరిస్తుందట!

అమెరికా సైనికులను 33,000 మందిని వచ్చే సంవత్సరం సెప్టెంబరు లోపల ఆఫ్ఘనిస్ధాన్ దురాక్రమణ నుండి ఉపసంహరిస్తానని ప్రకటించాక ఫ్రాన్సు, తాను కూడా తన సైనికులు కొద్దిమందిని ఉపసంహరిస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బ్రిటన్ కూడా అమెరికాను అనుసరిస్తానని ప్రకటిస్తోంది. కనీసం 500 మంది బ్రిటిష్ సైనికుల్ని వెనక్కి రప్పించే అంశాన్ని బ్రిటన్ ప్రధాని కామెరూన్ పరిగణిస్తున్నట్లుగా వాల్‌స్ట్రీట్ జర్నల్ పత్రిక తెలిపింది. ఈ మేటర్‌తో సంబంధం ఉన్న విశ్వసనీయమైన వ్యక్తి తెలిపిన సమాచారంగా ఆ పత్రిక…

అణ్వాయుధ సామర్ధ్యంపై పరస్పర విశ్వాసం పెంపొందించుకుంటాం -పాక్, ఇండియా

అణ్వాయుధాలు, ఇతర సాంప్రదాయక ఆయుధాల సామర్ధ్యాలపై పరస్పరం విశ్వాసం పెంపొందించుకుంటామని పాకిస్ధాన్, ఇండియా దేశాలు ప్రకటించాయి. ఇతర అంశాల్లో కూడా నమ్మకం, విశ్వాసాలు పెంపొందించుకోవడానికి వీలుగా అదనపు చర్యలను తీసుకునే విషయం కూడా పరిశీలిస్తామనీ, అందుకోసం నిపుణుల సమావేశం జరిపి శాంతి, భద్రతల మెరుగుదలకు కృషి చేస్తామనీ ఇరు దేశాల విదేశాంగ కార్యదర్శులు అంగీకార పత్రంపై సంతకాలు చేశారు. భారత విదేశాంగ కార్యదర్శి నిరుపమా రావు పాకిస్ధాన్ విదేశీ కార్యదర్శితో చర్చల నిమిత్తం రెండు రోజుల క్రితం…

లిబియాపై దాడుల కొనసాగింపుకు అమెరికా ప్రతినిధుల సభ నిరాకరణ

శనివారం అమెరికా కాంగ్రెస్ లిబియాకి సంబంధించి రెండు బిల్లులపై ఓటింగ్ నిర్వహించింది. రెండు బిల్లులపై ప్రతినిధుల సభ ఇచ్చిన తీర్పు పరస్పర విరుద్ధంగా ఉన్నట్లు కనిపించడం ఆశ్చర్యకరం. నాటో నాయకత్వంలో లిబియాపై కొనసాగుతున్న మిలట్రీ ఆపరేషన్‌ను కొనసాగించడానికి అధ్యక్షుడు ఒబామాకు అధికారం ఇవ్వడానికి ప్రవేశపెట్టిన బిల్లును మెజారిటీ సభ్యులు తిరస్కరించారు. గత కొద్దివారాలుగా లిబియాలో అమెరికా నిర్వహిస్తున్న పాత్ర వివాదాస్పదం అయ్యింది. కాంగ్రెస్ ఆమోదం లేకుండానే అధ్యక్షుడు లిబియా యుద్ధంలో కొనసాగుతుండడాన్ని రిపబ్లికన్ పార్టీ సభ్యులు వ్యతిరేకించారు.…

మిలట్రీకి ఎక్కువ, కాంగ్రెస్‌కి తక్కువ; సేనల ఉపసంహరణతో ఒబామా రాజకీయ క్రీడ

ఆఫ్ఘనిస్ధాన్‌లో దురాక్రమణ యుద్ధం కొనసాగిస్తున్న ఒక లక్షా ఒక వెయ్యి మంది అమెరికా సైనికుల్లో 33,000 మందిని 2012 సెప్టెంబరు మాసాంతంలోపు వెనక్కి రప్పిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు, అమెరికా త్రివిధ దళాల సర్వ సైన్యాధ్యక్ధుడు అయిన బారక్ ఒబామా బుధవారం ప్రకటించాడు. ఒబామా ప్రకటించిన ఉపసంహరణ సంఖ్య అమెరికాలోని వివిధ అధికార కేంద్రాలు ఒకే దృష్టితో చూడలేకపోవడం, భిన్న ధృవాలుగా చీలి ఉండడం గమనార్హమైన విషయం. 2012 చివర్లో మరోమారు అధ్యక్షుడిగా పోటీ చేయాలని భావిస్తున్న ఒబామా…

పాకిస్ధాన్‌పై దాడి చేశారా, జాగ్రత్త! -ఇండియాకు ‘జమాత్ ఉద్-దవా’ హెచ్చరిక

ఇండియా, పాకిస్ధాన్ దేశాల విదేశీ కార్యదర్శులు ఈ వారంలోనే పాకిస్ధాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో చర్చలు జరపనున్నారు. దీనికి సంబందించిన ఏర్పాట్లలో ఇరు దేశాలు మునిగి ఉండగా, తలవని తలంపుగా ఊడిపడిందో ప్రకటన. అది “జమాత్ ఉద్-దవా” (జెయుడి) అనే సంస్ధ, తన సంస్ధాగత సమావేశాలను జరుపుకుంటున్న సందర్భంగా ఇండియాకు చేసిన హెచ్చరిక. కరాచిలో కాన్ఫరెన్సు జరుపుకున్న ఈ సంస్ధ ముగింపులో ఓ డిక్లరేషన్‌ను విడుదల చేసింది. కాన్ఫరెన్సులో పాల్గొన్న నాయకులంతా ఒకే కల కన్నారేమో తెలియదు గానీ…