బి.జె.పి నోట సెక్యులరిజం మాట

దేశంలో సెక్యులరిస్టు శక్తులకు నిరాశ కలిగించే పరిణామాలు జరుగుతున్నాయంటూ భారతీయ జనతా పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. అది కూడా ఒక ముస్లిం వ్యక్తిని ఒక యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌గా తొలగించినందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆయన తొలగింపు దేశంలోని సెక్యులరిస్టు శక్తులకు నిరాశను కలిగించిందని వాపోయింది. లక్నోలోని దారుల్ ఉలూమ్‌కు మొహతామిమ్ (వైస్ ఛాన్సలర్‌)గా జనవరిలో నియమితుడయిన మౌలానా గులామ్ మొహమ్మద్ వాస్తన్విని తొలగిస్తూ యూనివర్సిటీ గవర్నింగ్ బాడీ ఐన మజ్లిస్-ఎ-షూరా  ఆదివారం నిర్ణయం తీసుకుంది.…

ఆఫ్ఘనిస్ధాన్ నుండి అమెరికా సైనికుల ఉపసంహరణ ప్రారంభం -కార్టూన్

వచ్చే సంవత్సరం జరిగే ఎన్నికల్లో బారక్ ఒబామా పోటీ చేయనుండడం, ఆఫ్ఘన్ యుద్ధం పట్ల అమెరికన్లలో నానాటికీ వ్యతిరేకత పెరుగుతుండడంతో పాటు ఒసామా బిన్ లాడెన్ హత్య (?) కూడా కలిసి రావడంతో ఆఫ్ఘనిస్ధాన్ దురాక్రమణ నుండి ఈ సంవత్సరం 10,000 మంది అమెరికా సైనికుల్ని ఉపసంహరించుకుంటున్నట్లు ఒబామా ప్రకటించాడు. మొదటి విడత ఉపసంహరణ ప్రారంభం అయ్యిందని కూడా పత్రికలు రాస్తున్నాయి. ఆర్ధిక బలహీనత నేపధ్యంలో ఆఫ్ఘన్ యుద్ధం అమెరికాకి నానాటికీ భారంగా మారింది. వ్రతం చెడ్డా…

కర్ణాటక ముఖ్యమంత్రి, మంత్రులు, గనుల యజమానులే గనుల మాఫియా సృష్టికర్తలు -లోకాయుక్త

కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి, కొందరు మంత్రులు, అధికారులు, గనుల యజమానులు అంతాకలిసి బళ్లారి ఇనుప గనుల్లో మాఫియా లాంటి వ్యవస్ధను సృష్టించారని కర్ణాటక లోకాయుక్త జస్టిస్ సంతోష్ హెగ్డె వెల్లడించారు. సుప్రీం కోర్టులో మాజీ న్యాయమూర్తిగా పని చేసిన జస్టిస్ సంతోష్ హెగ్డే, ముఖ్యమంత్రి, సంబంధిత మంత్రులతో పాటు గనుల యజమానులు అవినీతికి పాల్పడి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి 1800 కోట్ల రూపాయల నష్టం కలగజేశారని వెల్లడించారు. మార్చి 2009 మే 2010 వరకూ 14 నెలల…

‘ఓటుకు నోటు’ కేసులో రెండవ అరెస్టు, ఈ సారి బిజెపి వంతు?

సుప్రీం కోర్టు జోక్యంతో “ఓటుకు నోటు” కేసు ముందుకు కదులుతున్నట్లు కనిపిస్తోంది. ముగ్గురు బి.జె.పి ఎం.పిలు యు.పి.ఎ-1 ప్రభుత్వం ప్రవేశ పెట్టిన విశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేయకుండా ఓటింగ్ నుండి నిష్క్రమించడానికి కాంగ్రెస్ పార్టీవారు తమకు కోటి రూపాయలు ఇచ్చారంటూ, విశ్వాస పరీక్షరోజే ఆరోపించిన సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితం ఈ కేసులో ఢిల్లీ పోలీసులు సమాజ్ వాదీ పార్టీ మాజీ నాయకుడు అమర్ సింగ్‌కు సయాయకుడుగా ఉన్న సంజీవ్ సక్సేనాను అరెస్టు చేశారు.…

ప్రభుత్వ లోక్‌పాల్ డ్రాఫ్టు దేశ ప్రజల పైకి విసిరిన ఓ పెద్ద జోక్ -ప్రధానికి లేఖలో హజారే

ప్రభుత్వ లోక్ పాల్ డ్రాఫ్టు చాలా బలహీనమైనదనీ, తప్పించుకోవడానికి అవసరమైన అనేక రంధ్రాలు కలిగి ఉన్నదనీ కనుక తాము రూపొందించిన జన్ లోక్‌పాల్ డ్రాఫ్టును పార్లమెంటులో ప్రవేశ పెట్టాలని సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నాడు. ప్రభుత్వం రూపిందించిన లోక్ పాల్ డ్రాఫ్టు భారత దేశ ప్రజల మీదికి విసిరిన ఒక పెద్ద జోక్ అని ఆయన అభివర్ణించారు. ప్రధానికి రాసిన లేఖలో అన్నా హజారే, ఆమరణ దీక్షకు దిగుతానన్న తన నిర్ణయాన్ని…

సుప్రీం కోర్టు తలంటుతో కదిలిన ఢిల్లీ పోలీసులు, ‘నోటుకు ఓటు’ స్కామ్‌లో సంజీవ్ సక్సేనా అరెస్టు

ఎట్టకేలకు ఢిల్లీ పోలీసులు ఒకడుగు ముందుకేశారు. ‘నోటుకు ఓటు’ కుంభకోణం పరిశోధనలో రెండు సంవత్సరాలనుండి ఎటువంటి పురోగతి లేకపోవడంపై సుప్రీం కోర్టు రెండ్రోజుల క్రితం తీవ్ర స్ధాయిలో తలంటడంతో, తమ దర్యాప్తుకు శ్రీకారం చుట్టారు. ముగ్గురు బి.జె.పి ఎం.పిలు యు.పి.ఎ ప్రభుత్వ విశ్వాస పరీక్షలో అనుకూలంగా ఓటు వేయడానికి అమర్ సింగ్ అనుచరుడు సంజీవ్ సక్సేనా కోటి రూపాయలు ఇచ్చిన ఆరోపణపై సంజీవ్ సక్సేనాను అరెస్టు చేశారు. అయితే అసలు పాత్రధారుడు సంజీవ్ సక్సేనా కాదు. ఆయన…

కొత్తశాఖలో జైరాం రమేష్ మార్కు విధానాలు ప్రారంభం, గ్రామీణాభివృద్ధికి 90,000 కోట్లు

పర్యావరణ శాఖ మంత్రిగా పర్యావరణ నిబంధనలను గట్టిగా అమలు చేయడానికి ప్రయత్నించి ఇతర మంత్రుల నుండి వ్యతిరేకతను ఎదుర్కొన్న జైరాం రమేష్ తనకు అప్పజెప్పిన గ్రామిణాభివృద్ధి శాఖలో కూడ తన మార్కు విధానాలను ప్రారంభించాడు. 12వ పంచవర్ష ప్రణాళిక కాలంలో (2012-17) గ్రామీణాభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం రూపొందించే పధకాలన్నింటికీ స్వస్తి చెప్పి, పూర్తిగా నిర్వహణ రాష్ట్రాలకే అప్పజెప్పాలని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లూవాలియా నిర్ణయించగా, దానికి జైరాం రమేష్ పక్కకు నెట్టి కేంద్ర…

ముంబై పేలుళ్ళ నిందితుల్లో ఒకరి ఊహా చిత్రం రెడీ -ఎ.టి.ఎస్

ముంబై వరుస పేలుళ్ళ నిందితుల్లో ఒకరి ఊహా చిత్రం సిద్ధం చేశామని “యాంటి టెర్రరిస్టు స్క్వాడ్” (ఎ.టి.ఎస్) తెలిపింది. ఊహాచిత్రాన్ని ప్రజలు చూడడానికి విడుదల చేయడం లేదని తెలిపింది. బహుశా నిందితులు అప్రమత్తం అవుతారన్న అనుమానంతో ఎ.టి.ఎస్ ఈ నిర్ణయం తీసుకొని ఉండవచ్చు. బాంబు పేలిన ఒక స్ధలంవద్ద ప్రత్యక్ష సాక్షి కధనంపై ఆధారపడి ఈ ఊహాచిత్రాన్ని గీయించినట్లుగా ఎ.టి.ఎస్ తెలిపింది. చిత్రాన్ని వివిధ దర్యాప్తు సంస్ధలకు అందజేశామని తెలిపింది. దర్యాప్తు సంస్ధలతో పాటు కొద్దిమంది ఎన్నుకున్న…

తమ రాజీనామాలను ఆమోదించాలని డిమాండ్ చేస్తూ స్పీకర్‌ను కలిసిన తెలంగాణ తెలుగు దేశం ఎం.ఎల్.ఎ లు

తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ గత జులై 4 న చేసిన తమ రాజీనామాలను తక్షణమే ఆమోదించాలని తెలంగాణ ప్రాంతానికి చెందిన తెలుగు దేశం ఎం.ఎల్.ఎ లు స్పీకర్ నాదెండ్ల మనోహర్ ను శనివారం కలిసి విజ్ఞప్తి చేసారు. టి.డి.పి ఫోరం కన్వీనర్ ఇ.దయాకర రావు తెలుగుదేశం ఎం.ఎల్.ఎ ల బృందానికి నాయకత్వం వహించాడు. రాజీనామాలను ఆమోదించడానికి గానీ కేంద్ర ప్రభుత్వం నుండి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నిర్ధిష్ట హామీని పొందడం గానీ…

ముంబైలో బాంబులు పేలాక పావు గంట వరకూ మొబైల్ ఫోన్లు పని చేయలేదు -మహారాష్ట్ర సి.ఎం

మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృధ్వీరాజ్ చౌహాన్ మొబైల్ ఫోన్ నెటవర్క్ లపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ముంబైలో జులై 13 తేదీన టెర్రిరిస్టులు బాంబులు పేల్చాక తాను అధికారులతో మాట్లాడడానికి ప్రయత్నిస్తే కనీసం 15 నిమిషాల వరకూ తనకు వీలు కాలేదని ఆయన తెలిపాడు. “ఇది చాలా సీరియస్ విషయం. అధికారులతో మాట్లాడ్డానికి, ప్రభుత్వపరంగా సత్వర నిర్ణయాలు తీసుకోవడానికి మేము మొబైల్ ఫోన్లపై ఆధారపడుతున్నాం. కీలక సమయంలో ఇలా మొబైళ్ళు జామ్ అయితే ఇక ఉపయోగం ఏముంది?” అని…

పార్లమెంటు విశ్వాస పరీక్షలో ‘ఓటుకు నోట్లు’ కేసు దర్యాప్తుపై సుప్రీం కోర్టు ఆగ్రహం

2008 సంవత్సరంలో పార్లమెంటు విశ్వాసం పొందడం కోసం యు.పి.ఎ – 1 ప్రభుత్వం డబ్బులిచ్చి ప్రతిపక్షాల ఓట్లు కొన్న కేసులో దర్యాప్తు కొనసాగుతున్న తీరు పట్ల సుప్రీం కోర్టు శుక్రవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండు సంవత్సరాల నుండి కేసు విచారణలో పురోగతి లేకపోవడంతో ఢిల్లీ పోలీసుల పనితీరుపై అసహనం వ్యక్తం చేసింది. “ఢిల్లీ పోలీసులు చేసిన దర్యాప్తు పట్ల మేము ఏ మాత్రం సంతోషంగా లేము. ఇటువంటి తీవ్రమైన నేరంతో కూడిన అంశంలో, నేరం…

అమెరికా అప్పు రేటింగ్ తగ్గించడానికి సిద్ధంగా ఉన్న రేటింగ్ సంస్ధలు

ప్రపంచంలో అతి పెద్ద ఆర్ధిక వ్యవస్ధను కలిగి ఉన్న అమెరికా సావరిన్ అప్పు రేటింగ్‌ను తగ్గించడానికి ప్రపంచంలోని టాప్ రేటింగ్ సంస్ధలు మూడూ సిద్ధంగా ఉన్నాయి. స్టాండర్డ్ & పూర్స్ (ఎస్ & పి), ఫిచ్, మూడీస్ లు ప్రపంచ రేటింగ్ సంస్ధల్లో మొదటి మూడు సంస్ధలుగా పేరు పొందిన రేటింగ్ సంస్ధలు. ఇవి ఆయా దేశాల సావరిన్ అప్పు బాండ్లకు రేటింగ్ లు ఇస్తాయి. ఇంకా వివిధ ద్రవ్య సంస్ధలు, బ్యాంకులు, ఇన్‌వెస్ట్‌మెంట్ బ్యాంకులు తదితర…

ముంబైలో మళ్ళీ బాంబు పేలుళ్ళు, 13 మంది మరణం, 100 మందికి గాయాలు

అప్ డేట్ – 3: బుధవారం జరిగిన బాంబు పేలుళ్ళలో మరణించినవారి సంఖ్య 13 కు చేరుకుందని పోలీసులు చెప్పారని ‘ది హిందూ’ పత్రిక తెలిపింది.. మహా రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా 13 మంది చనిపోయారని ధృవీకరించాడు. ఐ.ఇ.డి (ఇంప్రూవైజ్‌డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్) లతో పేలుళ్ళు జరిపారని పోలీసులు చెప్పారు. దాదర్ లో కారులో ఉంచిన బాంబు పేలిందని తెలుస్తోంది. గొడుగు కింద ఉంచిన మరొక బాంబుని నిర్వీర్యం చేశారు. అప్ డేట్ – 2: ఈరోజు…

ఎన్నికలలోపు ఇదే చివరి ‘మంత్రివర్గ పునర్వ్యవస్ధీకరణ’ -ప్రధాని

మంత్రివర్గ పునర్వ్యవస్ధీకరణ అనంతరం 11 మంది మంత్రుల ప్రమాణ స్వీకారాలు ముగిశాక ప్రధాని మన్మోహన్ ఎవరూ ఊహించని ప్రకటన చేశాడు. మంత్రివర్గ మార్పులు, చేర్పులు అనంతరం అసంతృప్తిపరులు, అసంతుష్టులు ఇంకా ఉండగానే ఆయన “ఇదే చివరి ‘మంత్రివర్గ పునర్వ్యవస్ధీకరణ’” అని ప్రకటించి ఆహూతులను ఆశ్చర్యపరిచారు. తదుపరి పునర్వ్యవస్ధీకరణలో చోటు దక్కకపోతుందా అని ఆశిస్తున్నవారి ఆశలపై నీళ్ళు జల్లాడు. 2014 ఎన్నికలలోపు, అంటే ఇంకా మూడు సంవత్సరాల పదవీకాలం మిగిలి ఉండగానే చివరి మార్పులని ప్రకటించడం నిజంగానే ఆశ్చర్యకరమైన…

‘సి’ ఫర్ ‘కేపిటలిజం’ -కార్టూన్

నూతన మిలీనియంలో భాషలో ఇప్పటికే ఉన్న పదాలకు కొత్త అర్ధాలు వచ్చి చేరుతున్నాయి. నిన్న ఉన్న అర్ధం నేడు ఉండకపోవచ్చు. ఈ రోజున్న అర్ధం రేపు పాతబడిపోవచ్చు.  పాత సీసాలోనే కొత్త సారా అన్నమాట! పైకి ఎప్పటిలాగే కనపడినా లోపల సారంలో మాత్రం  తీవ్ర మార్పులు వస్తున్నాయి. ఒక దేశంపైకి దాడి చేయడానికి ఆ దేశంలో ప్రపంచాన్ని నాశనం చేయగల “సామూహిక విధ్వంసక ఆయుధాలు” ఉన్నాయని సాకు చూపడం నిన్నటి టెక్నిక్కు. ఆ దేశంలోని ప్రజల రక్షణకే…