బిన్ లాడెన్ ఇంట్లో కూలిన అమెరికా హెలికాప్టర్ చూడ్డానికి చైనాను అనుమతించిన పాక్

అమెరికా, పాక్ ల మధ్య చెడిన సంబంధాలను పునర్నిర్మించుకోవడానికి ఇరు దేశాలు ప్రయత్నిస్తున్న నేపధ్యంలో ఆ ప్రయత్నాలకు ఆటంకం కలిగించే ఒకసంఘటనను ఫైనాన్షియల్ టైమ్స్ పత్రిక వెల్లడించింది. లాడెన్ హత్యలో పాల్గొన్న స్టెల్త్ (రాడార్ల లాంటి పరికరాలకు దొరకనివి) హెలికాప్టర్లలో ఒకటి లాడెన్ ఇంటివద్దనే కూలిపోయింది. అత్యాధునిక పరికరాలు ఆ విధంగా కూలిపోయినపుడు వాటి గురించిన సమాచారం ఇతర దేశాలకు తెలియకుండా ఉండడానికి కూలిపోయిన వెంటనే అమెరికా ధ్వంసం చేస్తుంది. లాడెన్ స్ధావరంలో కూలపోయిన హెలికాప్టర్ బాడీ…

పారిన కాంగ్రెస్ పాచిక? ఆరోపణలపై అన్నా హజారే భీషణ భీష్మ ప్రతిజ్ఞ

అన్నా హజారే పై కాంగ్రెస్ విసిరిన పాచిక పని చేస్తోందా? అవినీతి, లోక్ పాల్ బిల్లుల చుట్టూ తిరిగిన అన్నా హజారే పత్రికా సమావేశాలు కాంగ్రెస్ ఆరోపణలతో ఆవేశపూరితుడై ఒకింత ఆవేదనా పూరితుడై పట్ట కూడని బాట పట్టాడనిపిస్తోంది. “ప్రభుత్వం జన్ లోక్ పాల్ బిల్లునే పార్లమెంటులో ఆమోదించినా నా దీక్ష విరమించేది లేదు. నాపైన ఆరోపణలు చేస్తున్నారు కదా! నాకు వ్యతిరేకంగా ఎఫ్.ఐ.ఆర్ దాఖలు చేసి విచారణ అయినా జరపాలి. లేదా నాపై ఆరోపణలు నిజం…

ఆగష్టు 16 దీక్షపై గుబులు? అన్నా హజారే పై కాంగ్రెస్ ముప్పేట దాడి!

ఆగష్టు 16 న లోక్‌పాల్ బిల్లుపై హజారే చేస్తానంటున్న నిరవధిక నిరాహార దీక్ష తేదీ దగ్గరు పడుతున్నకొద్దీ కాంగ్రెస్ పార్టీ పెద్దలతో పాటు, సచివులలో కూడా గుబులు పుట్టిస్తోంది. ఇన్నాళ్ళూ సామ, భేదో పాయాల్లో హజారేతో వ్యవహరిస్తూ వచ్చిన కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వాలు అంతిమంగా దండోపాయానికి దిగిన సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రభుత్వంలో రాజకీయ నాయకులు, అధికారులు పాల్పడే అవినీతిని విచారించడానికి సమర్ధవంతమైన లోక్‌పాల్ వ్యవస్ధను ఏర్పాటు చేయాలని అన్నా హాజారే నేతృత్వంలోని సామాజిక కార్యకర్తల బృందం…

ఒలింపిక్ జ్యోతి రాకమునుపే తగలబడుతున్న లండన్ -కార్టూన్

2012 ఒలింపిక్ ఆటల సంరంభానికి ఇంకా సంవత్సరం మిగిలే ఉంది. ఒలింపిక్ ఆటలు నిర్వహిస్తామని పోటీపడి గెలిచిన లండన్ నగరం అప్పుడే తగలబడిపోతోంది. దశాబ్దాల తరబడి అసమానతకీ, అవమానాలకీ గురైన తొట్టెన్ హామ్, ఇంకా అలాంటి ప్రాంతాల యువత ఉగ్ర రూపం దాల్చి అల్లర్లై లండన్ నగరాన్ని తగలబెడుతోంది. “లూటీలూ, దహనాలతో మీరు సాధించిందేమిటి?” అని అడిగిన విలేఖరులకి “వేలమందిమి శాంతియుత ప్రదర్శనలు చేసినా అస్సలు పట్టించుకోని మీరు మా దగ్గరికి వచ్చి మరీ ఇప్పుడెందుకా ప్రశ్నని…

జగన్ అరెస్టు కావొచ్చు, ఆస్తులూ పోవచ్చు -న్యాయ నిపుణులు

దేవుడి పాలనలో ఒక వెలుగు వెలిగిన దైవ కుమారుడికి కష్టాలు వచ్చిపడ్డాయి. న్యాయ వ్యవస్ధ క్రియాశీలంగా మారడం వల్లనో లేదా అది తను నిజానికీ చేయవలసిన పని నిజాయితీగా చేస్తున్నందునో దొంగ దేవుళ్ళ పాపాల సామ్రాజ్యాలు కూలుతున్న  శబ్దాలు వినపడుతున్నాయి. అవి పాపాల రాయుళ్ళకు కర్ణ కఠోరంగా ఉంటే, ఆ పాపాలలో సమిధలయిన సామాన్య మానవునికి వీనులవిందుగా తోస్తోంది. న్యాయ నిపుణులు ‘ముందుంది మొసళ్ల పండగ’ అంటున్నారు. జగన్‌ పాల్పడ్డాడంటున్న నేరాలను బట్టి చూస్తే భవిష్యత్తులో జగన్…

నీతికి కట్టుబడ్డ పోలీసు అధికార్లపై సి.ఎం మోడి కక్ష సాధింపు!

గోధ్రా రైలు దుర్ఘటనను అడ్డు పెట్టుకుని గుజారాత్ లో ముస్లింలపై నెలరోజులకు పైగా నరమేధాన్ని సాగించిన ముఖ్యమంత్రి నరేంద్ర మోడి, ఇప్పుడు, తాను సాగించిన ఘోర కృత్యాలకు సాక్ష్యాలను విచారణా కమిషన్ కు అందిస్తున్నందుకు పోలీసు అధికారులను శిక్షించడానికి నిస్సిగ్గుగా తెగబడుతున్నాడు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి ముస్లింల మారణకాండకు స్వయంగా ఆదేశాలిచ్చాడనీ, అ ఆదేశాలిచ్చిన సమావేశంలో తాను కూడా పాల్గొన్నాననీ అయినా తన స్టేట్ మెంట్ ను విచారణ కమిషన్ రికార్డు చేయడం లేదని సుప్రీం…

రాహుల్ రేటింగ్ AAA, మన్మోహన్ రేటింగ్ AA+ -కార్టూన్

అట్లాంటిక్ సముద్రానికి అవతల ఒడ్డున అమెరికా రేటింగ్‌ని, స్టాండర్డ్ & పూర్ సంస్ధ AAA నుండి AA+ కి తగ్గించింది. హిందూ మహా సముద్రానికి ఇవతలి ఒడ్డున భారత ప్రజలు ప్రధాని మన్మోహన్ రేటింగ్‌ని AAA నుండి AA+ కి తగ్గించేశారు. అదే చేత్తో ఇప్పటి దాకా చెప్పుకోదగ్గ రేటింగ్ లు ఏమీ లేని రాహుల్ గాంధీకి అమాంతం AAA రేటింగ్ ఇచ్చేశారు. సి.ఎన్.ఎన్-ఐ.బి.ఎన్ మరియు సి.ఎన్.బి.సి-టి.వి18 సంస్ధల  ‘స్టేట్ ఆఫ్ ది నేషన్ పోల్’ ను,…

ఈజిప్టు, ట్యునీషియా తిరుగుబాట్లకు ట్విట్టర్, ఫేస్ బుక్ లు సహాయపడ్డాయనడం నిజం కాదు

ముఖ్యమైన విషయం ఏంటంటే కార్పొరేట్ పత్రికలు ప్రచారం చేసినట్లు ఈజిప్టు ఉద్యమ నిర్మాణంలో ట్విట్టర్, ఫేస్ బుక్ ల పాత్ర ఏమీ లేదు. ఉద్యమ వార్తలను ట్విట్టర్, ఫేస్ బుక్ లలో రాసుకున్నారు గానీ ఉద్యమ వ్యాప్తికి అవేమీ ఉపయోగపడలేదు. అసలు ట్విట్టర్,  ఫేస్ బుక్ ల ద్వారా ఉద్యమాలు వస్తాయనడమే పెద్ద తప్పు, మోసం కూడా. కేవలం ఇంటర్నెట్ లో సందేశాలతో ఉద్యమ కాంక్షలను రగిల్చే పనైతే ఫేస్ బుక్ లో కాజ్ ల పేరుతో…

14(F) రద్దుకు బందు సరే; కె.సి.ఆర్-కాంగ్రెస్ నాటకాల బందు ఎన్నడు?

పోలీసు ఉద్యోగాల నియామకాల కోసం హైద్రాబాదును ఫ్రీ జోన్ గా పరిగణిస్తూ రాష్ట్రపతి జారీ చేసిన 14(F) ఉత్తర్వులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్ధి సంఘాల ఐక్యకార్యాచరణ సమితి ఇచ్చిన పిలుపుమేరకు తెలంగాణ బందు విజయవంతమైనట్లుగా వార్తలు తెలుపుతున్నాయి. తెలంగాణ విద్యార్ధుల జాయింట్ యాక్షన్ కమిటీ, ఇతర తెలంగాణ ప్రజా సంఘాల మద్దతుతో తెలంగాణ బందును విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు వార్తా ఛానెళ్ళు ప్రకటించాయి. 1975 రాష్ట్రపతి ఉత్తర్వులనుండి 14(F) క్లాజును తొలగించాలని తెలంగాణ విద్యార్ధులు, తెలంగాణ…

కరప్షన్ వెల్త్ గేమ్స్ – 2010 -కార్టూన్

కామన్ వెల్త్ గేమ్స్ సందర్భంగా జరిగిన అవినీతిపై కాగ్ నివేదిక ఢిల్లీ ప్రభుత్వాన్ని తూర్పారబట్టింది. ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ పై కూడా ఆరోపణలు చేసింది. సరిగా దర్యాప్తు చేయడం లేదని ఢిల్లీ హై కోర్టు మరోవైపు ఢిల్లీ పోలీసులను చెండాడుతోంది. అసలు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధిపతిగా సురేష్ కల్మాడిని నియమించింది ఎన్.డి.ఏ ప్రభుత్వమేనని కాంగ్రెస్ పార్టీ చల్లగా చెప్పడంతో బి.జె.పి పరిస్ధితి కుడితిలో పడ్డ ఎలకలా తయారైంది. అప్పటికే సురేష్ కల్మాడిపై అనేక ఫిర్యాదులు…

లిబియా తిరుగుబాటుదారుల్లో వెల్లివిరుస్తున్న ఐకమత్యం -కార్టూన్

అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సు దేశాల ప్రాపకంతో లిబియాలో కొనసాగుతున్న తిరుగుబాటుదారుల్లో ఐకమత్యం వెల్లివిరుస్తున్నట్లు అక్కడి నుండి వస్తన్న వార్తలు తెలుపుతున్నాయి. యుద్ధంలో ఫ్రంట్ లైన్‌ లో పాల్గొంటున్న కమేండర్‌ను వెనక్కి పిలిపించి మరీ కాల్చి చంపేటంత ఐకమత్యం వారిలో అభివృద్ధి చెందింది. జనరల్ అబ్దెల్ ఫతా యోనెస్, తిరుగుబాటు ప్రారంభంలొ గడ్డాఫీని వదిలి తిరుగుబాటు శిబిరంలోకి మారాడు. ఆయన రహస్యంగా గడ్డాఫీ బలగాలకు సమాచారం చేరవేస్తున్నాడన్న అనుమానంతో లిబియా తిరుగుబాటుదారుల్లోని ఒక సెక్షన్, ఆగస్ఠు ప్రారంభంలో ఆయనని…

అబ్బే, అమెరికా కాంగ్రెస్ పనితీరు సరిగా లేదు -అమెరికా ప్రజలు

అమెరికా ప్రజలు అమెరికా కాంగ్రెస్ (House of Representatives or Congress) పనితీరుని అత్యధిక సంఖ్యలో వ్యతిరేకిస్తున్నారు. గతంలో ఎన్నడు లేనంత అధిక స్ధాయిలో వ్యతిరేకిస్తున్నారు. అమెరికా కాంగ్రెస్ లోని రిపబ్లికన్ సభ్యులు, డెమొక్రట్ సభ్యులు రుణ పరిమితిని మరో 2.4 ట్రిలియన్ డాలర్లు పెంచాలనీ, బడ్జెట్ లోటుని 2.1 ట్రిలియన్ డాలర్లు తగ్గించాలనీ ఒప్పందం కుదుర్చుకుని చట్టాన్ని ఆమోదించాక జరిపిన సర్వేలో అమెరికా ప్రజల్లో 82 శాతం మంది కాంగ్రెస్ పనితీరు బాగాలేదని తేల్చారు. న్యూయార్క్…

దేశంలోని టెర్రరిస్టులే ముంబై పేలుళ్ళకు బాధ్యులు కావొచ్చు -హోం మంత్రి

జులై13 తేదీన ముంబైలో చోటు చేసుకున్న మూడు వరుస పేలుళ్ల వెనక దేశంలోపలి టెర్రరిస్టు మాడ్యూల్సే బాధ్యులు అయి ఉండవచ్చని కేంద్ర మంత్రి పి.చిదంబరం గురువారం పార్లమెంటుకు తెలిపాడు. ముంబైలో మూడు చోట్ల జరిగిన వరుస పేలుళ్లలో 26 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. రాజ్య సభలో జరిగిన చర్చలో పాల్గొంటూ కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం భారత దేశంలో తలెత్తిన టెర్రరిస్టు మాడ్యూళ్ళు ఈ పేలుళ్లకు బాధ్యులని చెప్పడానికి సూచనలు వెల్లడయ్యాయని తెలిపాడు. “ఇంకా…

యెడ్యూరప్ప అవినీతి విచారణకు కర్ణాటక గవర్నర్ అనుమతి మంజూరు

మరి కొద్ది గంటల్లో మాజీ ముఖ్యమంత్రిగా మారనున్న యెడ్యూరప్పపై మరొక దెబ్బ పడింది. ఆయనపై లోకాయుక్త కనుగొన్న అవినీతి ఆరోపణలను విచారించడానికి కర్ణాటక గవర్నర్ ‘హంసరాజ్ భరద్వాజ్’ లోకాయుక్త పోలీసులకు అనుమతి మంజూరు చేశాడు. అక్రమ మైనింగ్ జరిపిన కంపెనీలతో కుమ్మక్కయ్యాడని లోకాయుక్త చేసిన ఆరోపణలపై క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి గవర్నర్ అనుమతి ఇచ్చేశాడు. దీనితో యెడ్యూరప్పకు కష్టాలు మరిన్ని పెరిగాయి. కాంగ్రెస్, బి.జె.పి పార్టీల మధ్య జరుగుతున్న ఈ నాటకటకం ఎంతవరకూ దారి తీస్తుందో చూడవలసి…

అబ్బే, నేనసలు ల్యాప్ టాపే మొయ్యను, పగిలిందెప్పుడు? -వెంకయ్య నాయుడు

ఆగ్రహంతో ఉన్న యెడ్యూరప్ప తన ల్యాప్ టాప్ ను లాక్కొని విసిరేసి పగలకొట్టాడని మీడియాలో వచ్చిన వార్తను వెంకయ్య నాయుడు ఖండించాడు. తానసలు లాప్ ట్యాప్ ని మోసే పనిని పెట్టుకోననీ ఇక మరొకరు లాక్కొని పగలగొట్టే పరిస్ధితే తలెత్తదనీ వెంకయ్య నాయుడు అన్నాడు. తనకు మద్దతు ఇస్తూ రాసిన లేఖలో సంతకం పెట్టడానికి నిరాకరించడంతో అగ్రహంతో వెంకయ్య నాయుడు చేతిలోని ల్యాప్ టాప్ లాక్కొని నేలకేసి విసిరి కొట్టినట్లుగా టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇండియా టు…