రేమాండ్ ఖైదు, ఒసామా హత్యలతోనే అమెరికా-పాకిస్ధాన్‌ల సావాసం చెడింది -ఒబామా

పాకిస్ధాన్‌కు చెప్పకుండా పాక్ లోకి చొరబడి ఒసామా బిన్ లాడెన్‌ను అమెరికా కమెండోలు హత్య చేయడం వల్లనే పాకిస్ధాన్, అమెరికాల సంబంధాలు చెడిపోయాయని ఇప్పటిదాకా బిబిసి, రాయిటర్స్, న్యూయార్క్ టైమ్స్ లాంటి పశ్చిమ కార్పొరేట్ పత్రికలు వాదిస్తూ వచ్చాయి. వాస్తవానికి ఒసామా బిన్ లాడెన్ హత్య కోసం అమెరికా హెలికాప్టర్లు పాక్ గగనతలంలోకి చొరబడడం పాకిస్ధాన్ కు తెలియకుండా జరగదనీ, పాక్, అమెరికాల సంబంధాలు చెడడానికి ఒసామా హత్య కారణం కాదనీ ఈ బ్లాగర్ రెండు మూడు…

పుతిన్ చేతిలో మెడ్వెడెవ్, మెడ్వెడెవ్ చేతిలో పుతిన్ -కార్టూన్

ప్రస్తుత రష్యా అధ్యక్షుడు మెడ్వెడెవ్ తన అనంతరం పుతిన్ రష్యా అధ్యక్ష పదవికి పోటీ చేయనున్నాడని అధికారికంగా ప్రకటించేశాడు. మెడ్వెడెవ్ అధ్యక్షుడు కాక ముందు పుతిన రష్యా అధ్యక్షుడుగా రెండు సార్లు పనిచేశాడు. వరుసగా మూడో సంవత్సరం కూడా అధ్యక్షుడుగా పని చేసే అవకాశం రష్యా రాజ్యాంగం ఇవ్వదు. అందువలన తన కీలు బొమ్మగా అధ్యక్ష స్ధానానికి తన అనుచరుడు మెడ్వెడెవ్ ను అధ్యక్షుడిగా చేసి తాను ప్రధానిగా పుతిన్ పని చేశాడు. ఇప్పుడు మెడ్వెడెవ్ పదవీకాలం…

జూనియర్ అధికారిదే పాపం అంతా, ప్రణబ్ నోట్ పై చేతులు దులుపుకున్న మంత్రివర్యులు

“2జి కుంభకోణ చోటు చేసుకున్న రోజుల్లో ఆర్ధిక మంత్రిగా వ్యవహరించిన పి.చిదంబరం, స్పెక్ట్రంను వేలం వేయడమే సరైందన్న తన నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లయితే కుంభకోణం జరగడానికి ఆస్కారం ఉండేది కాదు” అంటూ ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ ఆమోదంతో ఆర్ధిక శాఖలోని డెప్యుటీ సెక్రటరీ, ప్రధాన మంత్రి కార్యాలయానికి పంపిన నోట్ లో పేర్కొన్న సంగతి ప్రణబ్ ముఖర్జీ తనకు సంబంధం లేదనీ, అంతా ఆ జూనియర్ అధికారి చేసిందే నంటూ గురువారం విలేఖరుల సమావేశంలో ప్రకటించాడు.…

పాకిస్ధాన్‌పై దాడులు విస్తృతం చేస్తాం -అమెరికా

పాకిస్ధాన్ ప్రాంతాలపై ఒక్క డ్రోన్ దాడులే కాకుండా మరిన్ని విస్తృత పద్ధతుల్లో దాడులు చేస్తామని అమెరికాకి చెందిన రిపబ్లికన్ సెనెటర్ ఒకరు తెలిపారని రాయిటర్స్ తెలిపింది. సీనియర్ సెనెటర్ అయిన లిండ్సే గ్రాహం, పాకిస్ధాన్‌లో అమెరికా మిలట్రీ చర్యలను విస్తృతపరచాలన్న అంశంపై అమెరికా విధాన కర్తలలో ఏకీభావం అంతకంతకూ పెరుగుతోందని ఆ సంస్ధ తెలిపింది. డ్రోన్ దాడులు ఇప్పటికే మిలిటెంట్లను టార్గెట్ చేస్తున్నాయని వాటితో పాటు బాంబర్లను కూడా వినియోగించే అవకాశం ఉందని గ్రాహం ఉప్పందించాడు. “అమెరికా…

కొనసాగుతున్న ఇజ్రాయెల్ జాత్యహంకారం, మరిన్ని సెటిల్‌మెంట్ల నిర్మాణానికి ఆమోదం

ఓవైపు ఐక్యరాజ్యసమితి సాధారణ సమావేశంలో పాలస్తీనా దేశ ప్రకటనపై తీవ్రమైన చర్చలు జరుగుతుండగానే మరోవైపు ఇజ్రాయెల్, పాలస్తీనా నుండి ఆక్రమించుకున్న భూభాగంలో ఇజ్రాయెల్ దేశస్ధులకు కొత్త సెటిల్‌మెంట్లు నిర్మిస్తున్నట్లుగా ప్రకటించింది. అంతర్జాతీయ సమాజాన్ని పరిహసించడం ఇజ్రాయెల్ కు ఇది కొత్త కాదు. ఐక్యరాజ్య సమితితో ఇజ్రాయెల్ వ్యవహారం అంతా మొదటినుండీ జాత్యహంకార పద్ధతుల్లోనే ఉంటూ వచ్చింది. 1967 యుద్ధంలో పాలస్తీనా నుండి ఆక్రమించుకున్న భూభాగంపై ఇజ్రాయెల్ సెటిల్‌మెంట్లు నిర్మించడం అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని అమెరికా నుండి శ్రీలంక…

పట్టేవాడుంటే యు.పి.ఎ అవినీతి పుట్టలో బోలెడు అవినీతి “నోట్”లు

మంత్రుల మధ్య “నోట్”ల రూపంలో జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు, ప్రధానమంత్రి కార్యాలయానికి వివిధ మంత్రులు పంపిన “నోట్”లు ఇప్పుడు 2జి కుంభకోణంలో కొత్త పాత్రధారులను వెలికి తెస్తున్నాయి. ఆర్.టి.ఐ చట్టాన్ని ఉపయోగిస్తూ ఆర్.టి.ఐ కార్యకర్తలు ఈ నోట్ లను వెల్లడి చేయడంతో అప్పటి ఆర్ధిక మంత్రి పి.చిదంబరం, ప్రధాని మన్మోహన్ లు కూడా తెలిసీ 2జి కుంభకోణాన్ని అడ్డుకోలేదని వెల్లడయ్యింది. ఎ.రాజా, దయానిధి మారన్ లు అడ్డంగా అవినీతికి పాల్పడుతుంటే, అడ్డుకుని దేశ సంపదను కాపాడవలసింది పోయి,…

అమెరికా ఇండియావైపు మొగ్గడం సమ్మతం కాదు -పాక్ ప్రధాని

దక్షిణాసియాలో అమెరికా పాకిస్ధాన్‌ను విస్మరించి ఇండియావైపు ముగ్గు చూపడం తమకు సమ్మతం కాదని పాక్ ప్రధాని యూసఫ్ రజా గిలానీ పేర్కొన్నాడు. రాయిటర్స్ సంస్ధకు ఇంటర్వ్యూ ఇస్తూ ఆయన ప్రచ్ఛన్న యుద్ధం కాలమంతా అమెరికా, పాకిస్ధాన్ లు మిత్రులుగా మెలిగిన సంగతిని గుర్తు చేశాడు. అలాంటిది అమెరికా పాకిస్ధాన్ ను వదిలిపెట్టి ఇండియాతో పౌర అణు ఒప్పందం కుదుర్చుకోవడం అమెరికాకి మేలు చేయగల చర్య కాదని గిలాని అభిప్రాయం వ్యక్తం చేశాడు. గత ఐదు సంవత్సరాలుగా అమెరికా…

“నెగిటివ్ సందేశాలు పంపొద్దు” అమెరికాని కోరిన పాక్ ప్రధాని

అమెరికా, పాకిస్ధాన్ దేశాల రాజకీయ నాయకులు, అధికారుల మధ్య ‘మాటల యుద్ధం’ కొనసాగుతోంది. అమెరికానుండి ప్రతికూల సందేశాలు అందుతుండడం పట్ల పాకిస్ధాన్ ప్రధాని యూసఫ్ రజా గిలానీ మంగళవారం విచారం వ్యక్తం చేశాడు. హక్కానీ గ్రూపు మిలిటెంట్లపై దాడి పేరుతో పాకిస్ధాన్, ఆఫ్ఘన్ సరిహద్దును దాటి అమెరికా దాడులు చేసినట్లయితే అది పాక్ సార్వభౌమత్వానికి భంగం కలిగినించినట్లేనని హెచ్చరించాడు. “ప్రతికూల (నెగిటివ్) సందేశాలు మా ప్రజలను ఆందోలనకు గురిచేస్తున్నాయి. మా స్నేహ సంబంధాలకు అనుగుణం కాని రీతిలో…

పాక్‌కు అన్ని సాయాలు బంద్, అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం

పాకిస్ధాన్‌కు అన్ని సహాయాలు బంద్ చేయాలంటూ అమెరికా కాంగ్రెస్ సభ్యుడొకరు ప్రతినిధుల సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టాడు. టెక్సాస్ నుండి ఎన్నికైన సభ్యుడొకరు ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టాడు. ఈయన అమెరికా ప్రతినిధుల సభలో కీలక సభ్యుడని డెయిలీ భాస్కర్ పత్రిక పేర్కొంది. ఈ తీర్మానం కాంగ్రెస్ లో ఆమోదం పొందినట్లయితే అమెరికా, పాకిస్ధాన్ కు అందజేస్తున్న అన్ని సహాయాలు స్తంభించిపోతాయి. పాకిస్ధాన్ అణ్వస్త్రాలను భద్రపరచడానికి అందిస్తున్న సహాయాన్ని దీన్నుండి మినహాయించాడు. కాంగ్రెస్ సభ్యుడు టెడ్ పో, తాను ప్రవేశపెట్టిన…

సి.ఐ.ఎ కి ఇష్టమైన నీలి కళ్ల బాలుడే హక్కానీ నెట్ వర్క్ -పాక్ మంత్రి హీనా రబ్బానీ

పాకిస్ధాన్ విదేశాంగ మంత్రి అమెరికాపై తన దండయాత్రను కొనసాగిస్తోంది. తీక్షణమైన ఖండన ప్రకటనలను జారీ చేయడంలో పేరు పొందిన హీనా రబ్బానీ తన పేరున నిలబెట్టుకుంటూ మరొక ప్రకటనను జారీ చేసింది. ప్రమాదకరమైన సంస్ధగా అమెరికా పరిగణిస్తున్న హక్కానీ గ్రూపు నెట్ వర్క్ మరొకటేదో కాదనీ, సి.ఐ.ఎ అత్యంత ఇష్టంగా రూపొందించుకున్న “నీలి కళ్ల బాలుడే” ననీ అమెరికా చేస్తున్న ప్రకటనలను తిప్పి కొట్టింది. రెండు వారాల క్రితం ఆఫ్ఘనిస్ధాన్ లో అమెరికా ఎంబసీపై తాలిబాన్ మిలిటెంట్లు…

అతి చేస్తే ఫ్రెండ్‌షిప్ ఉండదు, జాగ్రత్త! అమెరికాకి పాక్ హెచ్చరిక

పాకిస్ధాన్ విదేశాంగ మంత్రి హైనా రబ్బాని అమెరికాని ఘాటుగా హెచ్చరించింది. పదే పదే పాకిస్ధాన్ పైన టెర్రరిస్టులతో సంబంధాలున్నాయనీ, పాకిస్ధాన్ ఇంటలిజెన్స్ సంస్ధ ఐ.ఎస్.ఐ ఇటీవల అమెరికా ఎంబసీపై దాడికి సాయం చేసిందనీ అమెరికా ఆరోపణలు చేస్తుండడంతో పాకిస్ధాన్ ప్రభుత్వం ఈ హెచ్చరిక చేసింది. టెర్రరిజంపై యుద్ధంలో పాకిస్ధాన్ డబుల్ గేమ్ ఆడుతోందని పదే పదే ఆరోపణలు చేసినట్లయితే ఒక మిత్రుడిని అమెరికా కోల్పోవలసి ఉంటుందనీ పాక్ విదేశాంగ మంత్రి హైనా హెచ్చరించింది. ఆఫ్ఘనిస్ధాన్, పాకిస్ధాన్ లలో…

లిబియాలో వందల పౌరుల్ని పొట్టన బెట్టుకుంటున్న నాటో దాడులు

గడ్డాఫీ లిబియా విడిచి పారిపోయాడని చెబుతున్నప్పటికీ నాటో వైమానిక దాడులు ఆగ లేదు. దుష్టత్రయం ఫ్రాన్సు, అమెరికా, బ్రిటన్ తమ ఆయిల్ దాహం తీర్చుకోవడానికి లిబియా పౌరుల రక్తాన్ని తోడేయడం ఆపలేదు. గత కొద్ది రోజులలోనే వందలమంది సిర్టే నగర పౌరుల్ని నాటో వైమానిక దాడులు పొట్టనబెట్టుకున్నాయి. లిబియా పౌరుల్ని గడ్డాఫీ నుండి రక్షిస్తామని వైమానిక దాడులు ప్రారంభించిన అమెరికా, ఫ్రాన్సు, బ్రిటన్ దేశాలు గడ్డాఫీ దేశంలో లేకుండా చేస్తున్న వైమానిక దాడులు ఎవర్నుండి పౌరుల్ని రక్షించడానికి…

ఆత్మాహుతి దాడిలో ఆఫ్గన్ మాజీ అధ్యక్షుడు హతం

ఆఫ్ఘనిస్ధాన్ మాజీ అధ్యక్షుడు బర్హనుద్దీన్ రబ్బాని ఆత్మాహుతి దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. ప్రభుత్వం నియమించిన పీస్ కౌన్సిల్ కు నాయకత్వం వహిస్తున్న రబ్బానీ హత్యతో శాంతి ప్రయత్నాలకు తీవ్ర విఘాతం ఏర్పడిందని ఆఫ్గన్ అధికారులతో పాటు వార్తా సంస్ధలు, పత్రికలు బాధపడుతున్నాయి. ముఖ్యంగా ఆఫ్ఘనిస్ధాన్, అమెరికా ప్రభుత్వాల అధికారులు చాలా తీవ్రంగా బాధపడుతున్నారు. ఆఫ్ఘనిస్ధాన్‌లో శాంతి నెలకొల్పే అవకాశం లేకుండా పోయిందన్నది వారి బాధ. అసలు ఆఫ్ఘనిస్ధాన్‌లో ఎందుకు శాంతి లేకుండా పోయిందో వీరు ఆఫ్ఘనిస్ధాన్ ప్రజలకు…

హోటల్ మెయిడ్‌తో నా ప్రవర్తన నైతిక పతనమే -స్ట్రాస్ కాన్

ఐ.ఎం.ఎఫ్ మాజి మేనేజింగ్ డైరెక్టర్ స్ట్రాస్ కాన్ జైలునుండి బైటకు వచ్చాక మొదటిసారి నోరు విప్పాడు. హోటల్ మెయిడ్‌పైన తాను బలవంతం చేయనప్పటికీ ఆమెతో తన ప్రవర్తన నా నైతిక పతనమేనని అంగీకరించాడు. “భారత దేశ రాజకీయ నాయకుడు స్ట్రాస్ కాన్ ఉన్న పరిస్ధితిలో ఉన్నట్లయితే, మొత్తం ఘటననే పెద్ద అభద్దం అని బొంకి ఉండేవాడు. అసలు అటువంటిది ఏమీ జరగనే లేదనీ, మెయిడ్‌ని తానసలు ఇంతవరకూ చూడనేలేదనీ అనేక ఒట్లు పెట్టి ఉండేవాడు. కావాలంటే బహిరంగ…

సొరంగం చివర వెలుగును చూస్తున్న యూరో -కార్టూన్

అమెరికా ఆధిపత్యానికి దీటుగా ఎదగాలన్న ఆకాంక్షతో యూరప్ దేశాలు యూరోపియన్ యూనియన్ (ఇ.యు) ఏర్పాటు చేసుకున్నాయి. డాలర్ ఆధిపత్యాన్ని నిలువరించి పైచేయి సాధించాలన్న కోరికతో ఉమ్మడి కరెన్సీ ‘యూరో’ అవి ఏర్పాటు చేసుకున్నాయి. ఇ.యులో 25 దేశాలను ఆకర్షించగలిగినా, యూరోజోన్ లోకి 17 దేశాలను ఆకర్షితులయ్యాయి. యూరో జోన్ వలన చాలా వరకు దేశీయ ద్రవ్య, ఆర్ధిక, పన్నుల చట్టాలను రద్దు చేసుకోవడంతో జర్మనీ, ఫ్రాన్సు లాంటి పెద్ద దేశాలే వీటినుండి లబ్ది పొందగలుగుతున్నాయి. కాని బలహీన…