సౌదీ అరేబియా ‘దరిద్రం’పై వీడియో తీసినందుకు అరెస్టు (+వీడియో)

కొద్ది వారాల క్రితమే మహిళలకు ఓటు హక్కు ఇస్తున్నట్లు ప్రకటించి అరబ్ ఆందోళనలనుండి తప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికీ సౌదీ అరేబియా రాజు తన నియంతృత్వ పాలనను కొనసాగిస్తూనే ఉన్నాడు. కారు నడిపిన నేరానికి స్త్రీలను అరెస్టు చేసిన కొద్ది రోజులకే ‘సౌదీ అరేబియా’లో కూడా దరిద్రం తాండవిస్తున్నదనీ, అది కూడా రాజధాని నగరంలోనే ఉన్నదని చూపిస్తూ వీడియో తయారు చేసినందుకు ‘ఫెరాస్ బగ్నా’ అనే పౌరుడిని అరెస్టు చేయించాడు. ‘ఫెరాస్ బగ్నా’ తాను తీసిన వీడియో ఇంటర్నెట్…

ఒబామా దర్శకత్వంలో యాక్షన్ ధ్రిల్లర్: ‘ఇరాన్ కాన్స్పిరసీ’ -కార్టూన్

అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా దర్శకత్వంలో గొప్ప యాక్షన్ ధ్రిల్లర్ విడుదల కానుంది. గతంలో ప్రచ్ఛన్నయుద్ధ కాలం నాటి హాలీవుడ్ సినిమాల్లో సోవియట్ రష్యా గూఢచారులు, కంపెనీలు, అధికారులు విలన్లుగా ఉండేవారు. ప్రచ్ఛన్నయుద్ధం అంతం అయ్యాక విలన్లకు కరువు ఏర్పడింది. కాని త్వరలోనే అమెరికా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో కృత్రిమ విలన్లను తయారు చేసుకుంది. ‘టెర్రరిజం’ కధలను ధీమ్ గా చేసుకుంటూ ఆఫ్ఘనిస్ధాన్, ఇరాక్, లిబియా, ఇరాన్ దేశాలను ‘రోగ్ స్టేట్స్’ అనీ, ‘యాక్సిస్ ఆఫ్ ఈవిల్’…

అరబ్ దేశాల్లో పరువు కోసం డ్రోన్ హత్యలకు పాల్పడుతున్న అమెరికా -2

ఖచ్చితంగా చెప్పవలసివస్తే, ఎ.క్యు.ఎ.పి నిర్వహించిందని చెబుతున్న చర్యలు సాంకేతిక నైపుణ్యంలో దాని అసమర్ధతను మాత్రమే వెల్లడించాయి. నిజానికి ముతాలబ్ స్వయంగా అంగీకరించినదాని ప్రకారం, అతను చేపట్టిన బాంబుదాడి పధకంలో గానీ, నిర్వహణలో గానీ అవలాకి పాత్ర లేనేలేదని ఆనాడే ఎన్.బి.సి వార్తా సంస్ధ వెల్లడించింది. ముతాలిబ్ ను ఆల్-ఖైదాకు పరిచయం చేయడంవరకే అవలాకి పాత్ర ఉందని ఆ పత్రిక తెలిపింది. యెమెన్ లో జరుగుతున్న రాజకీయ ఉద్యమంలో అవలాకి అత్యంత చిన్న వ్యక్తి. ఇతర అరబ్ దేశాలలోని…

భూకుంభకోణం కేసులో యెడ్యూరప్ప అరెస్టుకు రంగం సిద్ధం

భూకుంభకోణం కేసులో యెడ్యూరప్ప దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ ను ప్రత్యేక లోకాయుక్త కోర్టు కొట్టివేసింది. దీనితో యెడ్యూరప్ప అరెస్టు ఖాయమయ్యింది. బెంగుళూరులోని లోకాయుక్త ప్రత్యేక కోర్టు శనివారం యెడ్యూరప్ప బెయిల్ పిటిషన్ ను కొట్టివేస్తూ ఆయన అరెస్టుకు వారంట్ జారీ చేసింది. దరిమిలా బి.జె.పి కేంద్ర నాయకత్వం సమావేశమై యెడ్యూరప్ప అరెస్టు విషయమై ఏం చేయాలన్నదీ చర్చిస్తున్నట్లుగా వార్తా ఛానెళ్ళు చెబుతున్నాయి. ప్రభుత్వ భూములను డీ నోటిఫై చెయ్యడంలో యెడ్యూరప్ప అక్రమాలకు పాల్పడ్డాడని యెడ్యూరప్ప అభియోగాలు…

మా బృందంలో ప్రశాంత్ భూషణ్ కొనసాగేదీ లేనిదీ తర్వాత నిర్ణయిస్తాం -అన్నా హజారే

అన్నా హజారే బృందంలో ప్రముఖ సభ్యుడు లాయర్ ప్రశాంత్ భూషణ్ పై శ్రీరాం సేన, భగత్ సింగ్ క్రాంతి సేన సభ్యులుగా చెప్పుకుంటున్న ముగ్గురు వ్యక్తులు దాడి చేసి కొట్టాక అన్నా హజారే బృందం కేంద్రంగా కొన్ని మార్పులు వేగంగా జరిగిపోతున్నాయి. ‘కాశ్మీరు ప్రజలలో ప్రజాభిప్రాయ సేకరణ జరిపి వచ్చే ఫలితాల్లో వేరు పడాలని వారు కోరితే వారికా అవకాశం ఇవ్వాలి” అని ప్రశాంత్ భూషణ్, వారణాసిలో జరిగిన ఒక సమావేశంలో చెప్పడమే తమ దాడికి కారణమని…

అమెరికా పచ్చి అబద్ధాల చరిత్రలో ఇంకొక పేజీ

ఈ సారి ఇరాన్ ప్రభుత్వం నేరుగా అమెరికా గడ్డపైనే సౌదీ అరేబియా రాయబారి హత్యకు కుట్ర చేసింది. అందుకు విచిత్రంగా మెక్సికో ‘హిట్ మేన్’ (ఖచ్చితంగా చెబితే కిరాయి గూండా) ను ఇరాన్ కాంట్రాక్టుకు మాట్లాడుకుంది. కాంట్రాక్టు కిల్లర్ ను మాట్లాడాడని అమెరికా చెబుతున్న వ్యక్తి, డ్రగ్స్ కేసుల్లో సి.ఐ.ఎ కి ఇన్‌ఫార్మర్ అన్న విషయం కూడా మరిచిపోయి అమెరికా గొప్ప కుట్రను బైటపెట్టాయి. ఇరాన్ కుట్రకు శిక్షగా అమెరికా తాజాగా మరికొన్ని ఆంక్షలను ఇరాన్ పైన…

హర్యానాలో టెర్రర్ కుట్ర విఫలం

హార్యానా రాష్ట్రం, అంబాలాలో పార్క్ చేసి ఉన్న కారు నుండి పోలీసులు డిటోనేటర్లు, ఇతర పేలుడు పదార్ధాలు, టైమర్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల తనిఖీలలో భాగంగా ఇది వెల్లడి కాకపోవడం గమనార్హం. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఉప్పందించారని పోలీసులు తెలిపారు. దీనితో మరోసారి టెర్రరిస్టు పేలుళ్ళు జరగకుండా తప్పించుకున్నట్లైంది. సమాచారం అందుకున్నాక ఢిల్లీ, హర్యానా పోలీసులు ఇరువురూ ఉమ్మడిగా పార్కింగ్ చేసి ఉన్న బ్లూ ఇండికా కారును తనిఖీ చేశారు. “ఐదు డిటోనేటర్లు, రెండు టైమర్…

టీం అన్నా సభ్యుడిపై ‘శ్రీరాం సేన’ దాడి, కాశ్మీరు సమస్యపై వ్యాఖ్యే కారణం

మత మూఢులకి పరమత సహనం ఎలాగూ ఉండదు. వారికి ప్రజాస్వామ్య భావాల పట్ల కూడా గౌరవం ఉండదు. తమ నమ్మకాలకు భిన్నమైన భావాలను సహించడాం వారి వల్ల కాదు. అది ముస్లిం మతం కావచ్చు, హిందూ మతం కావొచ్చు, లేదా క్రిస్టియన్ మతం కావొచ్చు. అందుకు తార్కాణంగా సాక్ష్యాత్తూ సుప్రీం కోర్టు ప్రాంగణంలోనే బుధవారం ఒక సంఘటన చోటు చేసుకుంది. అన్నా హజారే బృందంలో ప్రముఖ సభ్యుడు, సుప్రీం కోర్టులో ప్రముఖ న్యాయవాది అయిన ప్రశాంత్ భూషణ్…

‘ఇరవై సంవత్సరాల్లో ఇజ్రాయెల్ నాశనం’, రెండేళ్ళ క్రితమే హెచ్చరించిన అమెరికా

తన మూర్ఖ పద్ధతులను మార్చుకోకపోతే మరో ఇరవై ఏళ్లలో ఇజ్రాయెల్ ఒక దేశంగా అంతరించడం ఖాయమని అమెరికా రెండేళ్ల క్రితమే హెచ్చరించింది. ఈజిప్టు, ట్యునీషీయా తిరుగుబాట్లగురించి రెండేళ్ల క్రితం అసలు ఊహించనైనా సాధ్యం కాదు. అటువంటి పరిస్ధుతుల్లోనే అమెరికా ఇటువంటి హెచ్చరిక చేసిందంటే గత తొమ్మిది నెలలుగా అరబ్ దేశాల్లో జరుగుతున్న పరిణామాలను బట్టి ఇజ్రాయెల్ అంతానికి ఇరవై సంవత్సరాలు కూడా అవసరం లేదేమో! ఒబామా అధ్యక్ష భాధ్యతలు స్వీకరించిన మూడు వారాల తర్వాత జనవరి 2009లో…

ముంబై దాడులపై పాక్ కోర్టు విచారణ: దాడుల పర్యవేక్షకుని గొంతుతో పాక్ నిందితుడి గొంతు సరిపోలింది

ముంబై టెర్రరిస్టు దాడులకు సంబంధించి పాకిస్ధాన్ కోర్టులో విచారణ ఎదుర్కొంటున్న ఏడుగురు నిందితులలో ఒకరి గొంతు ముంబై దాడులను పాకిస్ధాన్ నుండి పర్యవేక్షించిన వ్యక్తి గొంతుతో సరిపోలిందని పాకిస్ధాన్ పోలీసు సాక్షి పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. పాకిస్ధాన్ కి చెందిన యాంటి టెర్రరిజం కోర్టు (ఎ.టి.సి) ముంబై దాడులపై విచారిస్తున్న సంగతి తెలిసిందే. ముంబై దాడులకు సంబంధించి వివిధ సాక్ష్యాలను ఇండియా, పాకిస్ధాన్ కు సమర్పించింది. ఈ సాక్ష్యాలలో పాకిస్ధాన్ నుండి ముంబై దాడులను పర్యవేక్షించిన వ్యక్తి గొంతును…

ముంబై దాడుల నిందితుడు ‘అజ్మల్ కసబ్’ ఉరి శిక్షపై స్టే విధించిన సుప్రీం కోర్టు

26/11 ముంబై దాడుల నిందితులలో సజీవంగా ఉన్న ఏకైక టెర్రరిస్టు ‘అజ్మల్ కసబ్’ కు విధించిన ఉరిశిక్ష పై సుప్రీం కోర్టు సోమవారం స్టే విధించింది. చట్టం ఎటువంటి అరమరికలు లేకుండా తన ప్రక్రియను తాను అనుసరించడానికి వీలుగా అజ్మల్ కసబ్ అప్పీలును తాము పూర్తి స్దాయిలో విచారించదలుచుకున్నామని సుప్రీం కోర్టు ఈ సందర్భంగా తెలిపింది. అనేక సంస్ధలు, వ్యక్తులు ప్రాణాలు తీసే ఉరిశిక్షను రద్దు చేయాలనీ, ఉరి శిక్ష వలన నేరస్ధుడు తనను తాను సంస్కరించుకునే…

తెలంగాణ అంశాన్ని కేంద్ర త్వరలోనే తేల్చేస్తుంది -సి.ఎం కిరణ్ కుమార్

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సమస్యను కేంద్ర ప్రభుత్వం త్వరలోనే పరిష్కరిస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శనివారం ఢిల్లీలో విలేఖరులకు తెలిపాడు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో కేంద్ర తెలంగాణ సమస్యను పరిష్కరిస్తుందని ఆయన పేర్కొన్నాడు. కాంగ్రెస్ అధిష్టానం పిలుపుతో ఢిల్లీ వచ్చిన సి.ఎం కిరణ కుమార్ రెడ్డి, డెప్యుటి సి.ఎం దామాదర రాజ నరసింహరాజు లు సీనియర్ మంత్రులు ప్రణబ్ ముఖర్జీ, ఎ.కె.ఆంటోని, పి.చిదంబరం, గులాం నబీ ఆజాద్ లతో…

జార్జియాను బెదిరించడం మానుకోవాలి, రష్యాకు ఫ్రాన్స్ హెచ్చరిక

మూడు రోజుల కాకసస్ పర్యటనలో ఉన్న ఫ్రాన్సు అధ్యక్షుడు నికొలస్ సర్కోజి చివరిగా జార్జియా పర్యటిస్తూ ఆ దేశానికి సంతోషం కలిగించే ప్రకటన చేశాడు. జార్జియ రాజధాని టిబ్‌లిసిలో వేలమంది జార్జియన్లను ఉద్దేశించి ప్రసంగిస్తూ నికొలస్ సర్కొజీ రష్యా తన పొరుగుదేశం జార్జియాను బెదిరించడం సమర్ధనీయం కాదని పేర్కొన్నాడు. రష్యా తమ మిత్రదేశమేనని భావిస్తున్నామని కాని జార్జియాను బెదిరించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నాడు. 2008లో జార్జియా, రష్యాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని…

సిరియా సంస్కరణలకు అమెరికాయే అడ్డం -కార్టూన్

అరబ్ ప్రజల ప్రజాస్వామిక విప్లవ ఆకాంక్షలను ఆసరా చేసుకుని అమెరికా వేలుపెట్టిన దేశాల్లో లిబియా మొదటిది కాగా సిరియా రెండవది. వ్యూహాత్మకంగా సిరియా ఉన్న ప్రాంతానికి ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా ఆ దేశంపై అమెరికా, ఇజ్రాయెల్ లు ఎప్పటినుండో కన్నేశాయి. అమెరికా, ఇజ్రాయెల్ ల బద్ధ శత్రువు ఇరాన్‌కు మిత్ర దేశంగా, పాలస్తీనాలో గాజాలో ప్రభుత్వం నడుపుతున్న హమాస్ సంస్ధకు మద్దతుదారుగా ఉన్న సిరియాలో తమ అనుకూల ప్రభుత్వం నిలపాలని అవి వేయని ఎత్తుగడా, పన్నని పన్నాగాలు…

ప్రధాని పదవి కోసం బిజెపిలో అప్పుడే పోరు మొదలు

సాధారణ ఎన్నికలు జరగడానికి ఇంకా రెండున్నర సంవత్సరాలు ఉందనగానే బి.జె.పి లో పదవీ కుమ్ములాటలు మొదలైనట్లు కనిపిస్తోంది. శుక్ర, శనివారాలలో జరిగిన బి.జె.పి జాతీయ కార్యవర్గ సమావేశానికి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి హాజరు కాకుండా ఎగవేయడంతో ఈ కుమ్ములాటలు బైటికి వచ్చాయి. మోడి రాకపోవడాన్ని బి.జె.పి ప్రతినిధులు చిన్నవిషయంగా కొట్టి పారేస్తున్నప్పటికీ ఆయన గైర్హాజరీకి వారు ఇచ్చిన కారణాలు ఒకరికొకరు పొంతన లేకుండా ఉండడంలోనే అసలు విషయం వెల్లడవుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. దేశంలో రాజకీయ పరిస్ధితిపై…