చంద్రబాబునాయుడు ఆస్తులపై సి.బి.ఐ విచారణకు హైకోర్టు ఆదేశం

వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి విసిరిన పాచిక తాత్కాలికంగానైనా పని చేసినట్లు కనిపిస్తోంది. దాదాపు రెండు వేల పేజీల సాక్ష్యాలతో మాజీ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు అక్రమ ఆస్తుల సంపాదించాడంటూ జగన్ తల్లి వై.విజయమ్మ ద్వారా వేసిన పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు డివిజన్ బెంచి పిటిషనర్ల కోరిక మేరకు సి.బి.ఐని రంగంలోకి దించింది. వై.విజయమ్మ ఆరోపించినట్లుగా మాజీ ముఖ్యమంత్రి తన అధికారాన్ని ఉపయోగించుకుని, రామోజీరావును ముందుంచి అక్రమ ఆస్తులను సంపాదించిందీ లేనిదీ విచారించవలసిందిగా హైకోర్టు బెంచి సి.బి.ఐని ఆదేశించింది.…

ఆపరేషన్ ‘ఇటలీ’ -కార్టూన్

యూరప్ రుణ సంక్షోభం కేంద్ర స్ధానం ఇప్పుడు గ్రీసు నుండి ఇటలీకి మారింది. ఇటలీ సావరిన్ రుణ బాండ్లపైన వడ్డీ రేట్లు బాగా పెరగడంతో ఆ దేశానికి రుణ సేకరణ కష్టంగా మారింది. అంటే ఇటలీకి అప్పు పుట్టడం కష్టంగా మారింది. ఈ పరిస్ధితి కొనసాగితే ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ లు బెయిలౌట్ రుణ ఇవ్వాల్సి ఉంటుంది. కాని ఇటలీ, యూరప్ లొ మూడో పెద్ద ఆర్ధిక వ్యవస్ధ కావడంతో దానికి బెయిలౌట్ ఇచ్చే పరిస్ధితి యూరప్ కు…

‘అజ్మల్ కసబ్’ ను ఉరి తియ్యాలి -పాకిస్తాన్ హోం మంత్రి

పాకిస్ధాన్ మొదటిసారిగా కసబ్ ను టెర్రరిస్టు అని పేర్కొంది. “కసబ్ ఒక టెర్రరిస్టు. అతను ప్రభుత్వేతర వ్యక్తి. అతనిని ఉరి తీయాలి” అని పాకిస్ధాన్ అంతర్గత (హోం) శాఖా మంత్రి రెహ్మాన్ మాలిక్ అన్నాడు. మాల్దీవుల లో జరుగుతున్న సార్క్ సమావేశాల సందర్భంగా హాజరైన రెహ్మాన్ మాలిక్ అక్కడ భారత విలేఖరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. పాకిస్ధాన్ నుండి త్వరలో జ్యుడీషియల్ కమిషన్ ఇండియా సందర్శించనున్నదనీ, ఆ సందర్శన ముంబై టెర్రరిస్టు దాడులపైన పాక్ లో…

డబ్బులు చెట్లకు కాయడం లేదు, పెట్రోల్ రేట్లు పెంచాల్సిందే -ప్రధాని

ప్రధాని మన్మోహన్ మరొకసారి తాను ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకిననీ నిరూపించుకున్నాడు. తనకు కావలసిందల్లా కార్పొరేట్ల ప్రయోజనాలు వారి బాగోగులేననీ వారి ప్రయోజనాల కోసం ప్రజలు ఏమైపోయినా ఫర్వాలేదనీ తన వ్యాఖ్యల ద్వరా నిరూపించుకున్నాడు. పెట్రోల్ ధరలు ప్రభుత్వం నియంత్రించడానికి వీలు లేదనీ పెట్రోల్ ఉత్పత్తుల ధరలను మార్కెట్ లో ఉండే కంపెనీలే నిర్ణయించాలి తప్ప ప్రభుత్వం కాదనీ నిర్ద్వంద్వంగా ప్రకటించాడు. ప్రస్తుతం ఫ్రాన్సులో కేన్స్ నగరంలో జరుగుతున్న జి20 సమావేశాలలో పాల్గొంటున్న ప్రధాని అక్కడే ఈ ప్రకటన…

పెట్రోల్ ధర తగ్గించకపోతే మద్దతు ఉపసంహరిస్తా -మమత బెనర్జీ

యు.పి.ఎ కూటమిలో భాగస్వామ్య పార్టీగా ఉన్న త్రిణమూల్ కాంగ్రెస్ శుక్రవారం పెట్రోల్ ధర పెంపును నిరసించింది. పెంచిన ధరలను ఉపసంహరించుకోకపోతే తాను యు.పి.ఏ కు మద్దతు ఉపసంహరిస్తానని ప్రకటించింది. “నేను కేంద్ర ప్రభుత్వాన్ని బ్లాకె మెయిల్ చేయడం లేదు. కాని మా పార్టీని అసలు పరిగణనలోకి తీసుకోవడం లేదు” అని మమతా బెనర్జీ వ్యాఖ్యానించింది. తన హెచ్చరికను ప్రధాని మన్మోహన్ జి20 సమావేశాలనుండి వెనక్కి వచ్చేవరకూ పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. అయితే మమతా బెనర్జీ అభ్యంతరం తమ పార్టీతో…

ఆర్ధిక సంక్షోభం దెబ్బకు కుప్పకూలనున్న గ్రీసు ప్రభుత్వం

గ్రీసు ప్రభుత్వం అంతిమ క్షణాల్లో ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఇ.యు దేశాలు, ఐ.ఎం.ఎఫ్ సంస్ధ ఇవ్వ జూపిన 130 బిలియన్ యూరోల బెయిలౌట్, దానితో పాటే వచ్చే కఠినమైన షరతులను గ్రీసు ప్రజల ఆమోదానికి పెట్టడానికై రిఫరెండం నిర్వహిస్తామని గ్రీసు ప్రధాని గత సోమవారం ప్రకటించినప్పటినుండీ అక్కడి పరిణామాలు వేగవంతం అయ్యాయి. ఆశ్చర్యం ఏమిటంటే యూరప్ పెద్ద తలకాయలైన జర్మనీ, ఫ్రాన్సు దేశాల ప్రభుత్వాధిపతులు ఇద్దరూ రిఫరెండం ఆలోచనను సమర్ధించారు. ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ ల బెయిలౌట్ పైనే కాకుండా…

యూరోజోన్ విచ్ఛిన్నం ప్రారంభం, గ్రీసును సాగనంపడానికి ప్రయత్నాలు

12 సంవత్సరాల వయసులోనే యూరోజోన్ విచ్ఛిన్నం అనివార్యంగా మారింది. ఎంతో అట్టహాసంతో, మరెన్నో ఆశలతో ప్రారంభమైన యూరోజోన్ మానిటరీ యూనియన్ ఆర్ధిక సంక్షోభాల ధాటికి పన్నెండో సంవత్సరంలోనే విచ్ఛిన్నానికి దగ్గరయ్యింది. ప్రపంచ దేశాలకు ఉమ్మడి కరెన్సీగా, అందరూ కోరుకునే అంతర్జాతీయ మారక కరెన్సీగా డాలర్ చెలాయిస్తున్న ఆధిపత్యానికి గండికొట్టి పోటీగా ఎదగడానికి ఏర్పాటు చేసుకున్న యూరో కరెన్సీ తన లక్ష్యాన్ని సాధించకపోగా అప్పుడే ఒక సభ్య దేశాన్ని సాగనంపడానికి సిద్ధపడుతోంది. యూరో గ్రూపు రాజకీయ నాయకుడుగా ఉన్న…

వికీలీక్స్ అస్సాంజ్ ను స్వీడన్‌ అప్పగింతకు బ్రిటిష్ అప్పిల్ కోర్టు నిర్ణయం

తనను స్వీడన్ కు అప్పగించడానికి వ్యతిరేకంగా అప్పీలు కోర్టుకు నివేదించుకున్న జులియన్ అస్సాంజ్, అక్కడ అప్పీలును కోల్పోయాడు. స్వీడన్ పోలీసులకు జులియన్ ను అప్పగించడానికి అనుకూలంగా అప్పీలు కోర్టు తీర్పునివ్వడంతో జులియన్ అస్సాంజ్ అప్పగింత అనివార్యం అయ్యింది. అయితే హైకోర్టుకు వెళ్ళడానికి జులియన్ కు ఇంకా అవకాశం ఉంది. సుప్రీం కోర్టుకు వెళ్ళే అవకాశం ఉన్నదీ లేనిదీ హై కోర్టులోనే తేలనున్నది. వికీలీక్స్ అధినేత జులియన్ అస్సాంజ్ గత సంవత్సరం డిసెంబరు నెలలో బ్రిటన్ లో అరెస్టు…

ముంబై దాడులపై ప్రణబ్ ముఖర్జీ మాటలకు బెంబేలెత్తిన పాకిస్ధాన్ -రైస్ ఆత్మకధ

26/11 దాడులు గా పేరు పొందిన ముంబై టెర్రరిస్టు దాడుల అనంతరం అప్పటి కేంద్ర విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ కటువుగా చేసిన వ్యాఖ్యలతో పాకిస్దాన్ బెంబేలు చెందినట్లుగా అమెరికా మాజీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ కొండొలిజా రైస్ తన ఆత్మకధలొ పేర్కొంది. “మేము యుద్ధానికి దిగడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేకుండా చేస్తున్నారు” అని ప్రణబ్ ముఖర్జీ ఫోన్ లో మాట్లాడుతూ అనడంతో పాకిస్ధాన్ తీవ్ర స్ధాయిలో అప్రమత్తమయ్యిందని ఆమె పేర్కొన్నది. చైనా నుండి అమెరికా…

భారత్ వెబ్‌సైట్లను హ్యాక్ చేసిన పాక్ హ్యాకర్లు, ప్రతీకారమే కారణం

పాకిస్ధాన్ కి చెందిన హ్యాకర్లు భారత ప్రభుత్వానికి చెందిన కొన్ని కంపెనీలు, విభాగాల వెబ్ సైట్లను హ్యాకింగ్ చేసారు. భారత హ్యాకర్లు పాకిస్ధాన్ ప్రభుత్వ కంప్యూటర్లను పలుమార్లు హ్యాకింగ్ చేస్తున్నాయనీ, అందుకే తాము భారత ప్రభుత్వ వెబ్ సైట్లు హ్యాకింగ్ చేస్తున్నామని  వారు ప్రకటించారు. దాదాపు ఎనిమిది ప్రభుత్వ వెబ్ సైట్లను హ్యాకింగ్ కి గురయినట్లుగా తెలుస్తోంది. హ్యాకింగ్ చేసిన వెబ్ సైట్లలో అభ్యంతరకరమైన వార్తలు ప్రచురించారని ‘ది హిందూ’ తెలిపింది. పాకిస్ధాన్ హ్యాకర్ తననుతాను ‘khantastic…

జపాన్ రాయబార కార్యాలయాలపై సైబర్ దాడులు

జపాన్ విదేశీ మంత్రిత్వ శాఖతో పాటు వివిధ దేశాల్లో ఉన్న జపాన్ రాయబార కార్యాలయాలలోని కంప్యూటర్లపై సైబర్ దాడులు జరిగాయని జపాన్ ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. ఈ దాడులు జూన్ నెలనుండి జరుగుతున్నాయని తెలిపింది. ఉత్తర అమెరికా, ఆసియా దేశాలలో ఉన్న జపాన్ కార్యాలయాలపైనా ఈ దాడులు జరిగాయని క్యోడో వార్తా సంస్ధ తెలిపింది. పేరు చెప్పడానికి ఇష్టపడని ప్రభుత్వాధికారులు ఈ విషయం తెలిపాయని క్యోడో ప్రకటించింది. విదేశాలలో ఉన్న కొన్ని కార్యాలయాల కంప్యూటర్లలోకి వైరస్ ప్రవేశపెట్టారని…

పాకిస్ధాన్‌తో అమెరికా రాజీ, భారత్ ప్రయోజనాలకు ఎసరు?

బహిరంగంగా పాకిస్ధాన్ పై నిప్పులు చెరుగుతున్న అమెరికా రహస్యంగా రాజీ చేసుకోవడానికి సిద్ధపడుతున్నదన్న అనుమానాలు బలపడుతున్నాయి. కొద్ది రోజుల క్రితమే అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ పాకిస్ధాన్ కు హెచ్చరికలు జారీ చేసింది. ఇటీవలి కాలంలో అమెరికా సైనికులపైనా, ఆఫ్ఘన్ లోని అమెరికా ఎంబసీపైనా జరిగిన వరుస దాడులకు హక్కానీ గ్రూపుదే బాధ్యత అని అమెరికా అధికారులు భావిస్తున్నారు. పాక్ గూఢచార సంస్ధ ఐ.ఎస్.ఐ మద్దతుతోనే హక్కానీ గ్రూపు దాడులు చేయగలుగుతున్నదని కూడా వారు భావిస్తున్నారు.…

పాక్‌పై అమెరికా దాడి చేస్తే ఆఫ్ఘనిస్ధాన్ పాక్ పక్షమే నిలుస్తుంది -ఆఫ్ఘన్ అధ్యక్షుడు

“పరిస్ధితులు అనుకూలించక అమెరికా పాకిస్ధాన్ పైన దాడి చేసినట్లయితే, దైవం నివారించుగాక, ఆఫ్ఘనిస్ధాన్ నిస్సందేహంగా పాకిస్ధాన్ కే మద్దతుగా నిలుస్తుంది” అని ఆఫ్ఘనిస్ధాన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ వ్యాఖ్యానించాడు. అమెరికా, పాక్ పై దాడి చేయడం ప్రస్తుత పరిస్ధితుల్లొ పూర్తిగా అసంగతం అయినప్పటికీ మాటమాత్రంగానైనా ఆఫ్ఘనిస్ధాన్ అధ్యక్షుడు పొరుగు దేశం పక్షానే నిలుస్తానని చెప్పడం సంతోషించ దగిన విషయం. కనీసం మాటల్లోనైనా ఆఫ్ఘన్ అధ్యక్షుడు పొరుగు దేశం పక్షాన నిలిచాడు. నిజానికి ఆఫ్ఘనిస్ధాన్, పాకిస్ధాన్ దేశాల మధ్య…

సరిహద్దులో భారత్ హెలికాప్టర్ ను బలవంతంగా దింపిన పాకిస్ధాన్ ఫైటర్ జెట్లు

భారత హెలికాప్టర్ ఒకటి పాకిస్ధాన్ గగనతలంలోకి చొరబడడంతో పాకిస్ధాన్ మిలట్రీకి చెందిన ఫైటర్ జెట్ విమానాలు దానిని బలవంతంగా కిందికి దింపాయి. హెలికాప్టర్ లో నలుగుతు భారత్ మిలట్రీ అధికారులు ఉన్నారు. పాకిస్ధాన్ గగనతలంలోకి జరిగిన చొరబాటు ఉద్దేశ్యపూర్వకంగా జరిగింది కాదనీ, దట్టంగా మంచు కమ్మడంతో జరిగిందనీ భారత ఆర్మీ అధికారులు చెబుతున్నారు. నలుగురు అధికారులు ప్రస్తుతం పాకిస్ధాన్ కస్టడీలో ఉన్నారు. నలుగురు క్షేమంగా ఉన్నారని పాకిస్ధాన్ అధికారులు చెప్పినట్లుగా రాయిటర్స్ తెలిపింది. మధ్యాహ్నం ఒంటి గంట…

నరేంద్ర మోడిపై ఛార్జి షీటు దాఖలుకు పుష్కల అవకాశాలు

గుజరాత్ మారణకాండలో హత్యకు గురైన కాంగ్రెస్ ఎం.పి జాకియా జాఫ్రి కేసులో నిజా నిజాలను వెల్లడించడానికి సుప్రీం కోర్టు నియమించుకున్న అమికస్ క్యూరీ ‘రాజు రామచంద్రన్’ నివేదిక పుణ్యమాని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడిపైన ఛార్జి షీటు దాఖలు చేసి విచారించడానికి అవకాశాలు పెరిగాయి. అమికస్ క్యూరి నివేదికలో పొందుపరిచిన వివరాల ఆధారంగా 2002లో జరిగిన ముస్లింల మారణకాండకు బాధ్యుడిగా నరేంద్రమోడిపైన ఛార్జిషీటు దాఖలు చేయడం కోసం తగిన పునాది ఏర్పడిందని చెప్పవచ్చు. నివేదిక ఇంకా రహస్యంగా ఉన్నప్పటికీ…