పాక్ చెక్ పోస్టులపై దాడి మిలట్రీ ఆపరేషన్ లో భాగమే -అమెరికా

ఎట్టకేలకు అమెరికా మిలట్రీ అధికారి ద్వారా పాక్షికంగానైనా నిజం బైటకి వచ్చింది. ఆఫ్ఘన్, పాకిస్ధాన్ (ఆఫ్-పాక్) సరిహద్దులో పాక్ చెక్ పోస్టులపైన అమెరికా హెలికాప్టర్లు, జెట్ ఫైటర్లు జరిపిన దాడి అమెరికా మిలట్రీ ఆపరేషన్ లో భాగంగానే జరిగిందని అమెరికా మిలట్రీ ప్రతినిధి, నేవీ కెప్టెన్ జాన్ కిర్బీ చెప్పినట్లుగా ‘ది హిందూ’ వెల్లడించింది. ఈ దాడిలో పాకిస్ధాన్ సైనికులు 24 మంది చనిపోవడం పట్ల అమెరికా రక్షణ శాఖ ఉన్నత స్ధాయి వర్గాలు ఇప్పటికే విచారం…

మద్యధరా సముద్రంలో సిరియా సమీపాన మొహరించిన అమెరికా, రష్యా యుద్ధ నౌకలు

లిబియా విషయంలో పచ్చి అబద్ధాలు ప్రచారం చేసి, లేని తిరుగుబాటుకి సాయంగా సైనిక జోక్యం చేసుకుని చివరికి ఆ దేశ అధ్యక్షుడిని చంపి, ఆల్-ఖైదాతో కుమ్మక్కయ్యి మరీ తొత్తు ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న అమెరికా, ఫ్రాన్సు, బ్రిటన్ లు అదే తరహాలో సిరియాలో కూడా జోక్యం చేసుకోవడానికి అనేక కుట్రలు పన్నుతున్నాయి. అందులో భాగంగా అమెరికా ప్రవేశపెట్టిన అద్దె తిరుగుబాటుదారులే సిరియా ప్రజలపై కాల్పులు జరిపి పొట్టనబెట్టుకుంటున్నా, పశ్చిమ పత్రికలు రోజూ అనేక అబద్ధాలని సృష్టించి, సిరియా…

అమెరికా పాకిస్ధాన్ ల మధ్య ఉద్రిక్తతలు ఏర్పడుతున్న ఆఫ్-పాక్ సరిహద్దు -ఫొటోలు

ఆఫ్ఘనిస్ధాన్, పాకిస్ధాన్ దేశాల మధ్య సరిహద్దు, ముఖ్యంగా డ్యురాండ్ లైన్ గా భావించే సరిహద్దు సరిగ్గా గుర్తించలేదు. ఆఫ్ఘనిస్ధాన్, పాకిస్ధాన్ లు పరస్పరం అంగీకరించిన సరిహద్దు రేఖ ఇంకా లేకపోవడమే దానికి కారణం. సరిహద్దులో ఉన్న ప్రాంతాలు ఇరు దేశాల్లో ఏ దేశానికి చెందినవన్న దానిపైన ఏకాభిప్రాయం లేకపోవడం వల్ల సమస్య పరిష్కారానికి నోచుకోక అలానే పడి ఉంది. ఈ ప్రాంతాలు అమెరికాను ముప్పు తిప్పలు పెడుతున్న పష్తూన్ తెగకు చెందిన మిలిటెంట్లకు గట్టి స్ధావరాలుగా ఉండడంతో…

పాక్ సైనికుల హత్యకు బదులు, ఆఫ్గన్ కాన్ఫరెన్సు బహిష్కరణకు పాక్ నిర్ణయం

ఆఫ్ఘనిస్ధాన్, పాకిస్ధాన్ సరిహద్దు వద్ద రెండు చెక్ పోస్టుల వద్ద మొహరించి ఉన్న పాక్ సైనికులను 28 మందిని అమెరికా హెలికాప్టర్లు, జెట్ ఫైటర్లు చంపినందుకు నిరసనగా జర్మనీ లోని బాన్ నగరంలో జరగనున్న ఆఫ్ఘనిస్ధాన్ కాన్ఫరెన్సుకు హాజరు కాకూడదని పాకిస్ధాన్ నిర్ణయించింది. కాన్ఫరెన్స్ ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. ఆఫ్ఘన్ యుద్ధానికి సంబంధించి కీలక పాత్ర పొషిస్తున్న పాకిస్ధాన్ గైర్హాజరీ లో ఆఫ్ఘనిస్ధాన్ పై కాన్ఫరెన్స్ జరగడం ఇదే మొదటిసారి కావచ్చు. పాకిస్ధాన్ సహాయం లేనట్లయితే ఆఫ్ఘనిస్ధాన్…

పాకిస్ధాన్ కు కొత్త రాయబారి, పంత నెగ్గించుకున్న పాక్ మిలట్రీ

అమెరికాలో పాకిస్ధాన్ రాయబారిగా కొత్త వ్యక్తి నియమితులయ్యారు. పాకిస్ధాన్ మిలట్రీని కట్టడి చేయాలంటూ అమెరికా మిలట్రీ ఛీఫ్ కు మెమో రాశాడంటూ పాత రాయబారి హుస్సేన్ హక్కానీ పైన ఆరోపణలు రావడంతో ఆయన రాజీనామా చేసిన సంగతి విదితమే. పాకిస్ధాన్, అమెరికాల మధ్య సంబంధాలు మెరుగుపడడానికి హుస్సేన్ హక్కానీ చాలా కృషి చేశాడనీ కావున ఆయన రాజీనామా ఆమోదం పొందక పోవచ్చనీ చేసిన ఊహాగానాలను పటా పంచలు చేస్తూ హక్కానీ రాజీనామాను పాకిస్ధాన్ ప్రభుత్వం ఆమోదించింది. పాకిస్ధాన్…

అమెరికాకి ఒక తలుపు మూసుకుంటే మరొక తెలుపు తెరుచుకుంటుంది -కార్టూన్

అమెరికా అధ్యక్షుడు ఒబామా ఇటీవలి కాలంలో రెండు కీలక నిర్ణయాలను ప్రకటించాడు. అవి రెండూ ప్రపంచ దేశాలపైన అమెరికా ఆధిపత్యానికి సంబంధించినవి. మరీ ముఖ్యంగా ఆసియా, మధ్య ప్రాచ్యం ప్రాంతాలలో అమెరికా ఉనికికి సంబంధించినవి. ఇరాక్ ప్రభుత్వం వచ్చే సంవత్సరం నుండి విదేశీ సైనికులని ప్రాసిక్యూట్ చేస్తామని హెచ్చరించడంతో ఇరాక్ లో పనైపోయింది కనుక అక్కడి నుండి ఉపసంహరించుకుంటున్నామని అట్టహాసంగా ప్రకటించాడు. ఆఫ్ఘనిస్ధాన్ నుండి కూడా దాదాపు అదే కారణంతో సైనిక ఉపసంహరణను ప్రకటించాడు. ఆ క్రమం…

నాలుగు రాష్త్రాలుగా ఉత్తర ప్రదేశ్ విభజనకు అసెంబ్లీ అంగీకారం

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాన్ని నాలుగు చిన్న చిన్న రాష్ట్రాలుగా విభజించాలని కోరుతూ ఆ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించింది. తీర్మానన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపుతామని ముఖ్యమంత్రి మాయవతి ప్రకటించింది. విభజన తీర్మానం ఆమోదం పొందిన కొద్దిసేపటికే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది. కొద్ది వారాల క్రితం ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి, తమ రాష్ట్రాన్ని పూర్వాంచల్, పశ్చిమ ప్రదేశ్, బుందేల్ ఖండ్, అవధ్ ప్రదేశ్ అనే నాలుగు చిన్న రాష్ట్రాలుగా విభజించాలని ప్రకటించింది. చిన్న రాష్ట్రాలు…

పాకిస్ధాన్ ‘మెమో గేట్’ పాక్ ఆర్మీ కుట్రా?

పాకిస్ధాన్ రాజకీయ రంగాన్ని ఇప్పుడు మెమో గేట్ కుంభకోణం ఊపేస్తోంది. ఒసామా బిన్ లాడేన్ హత్యానంతరం పాకిస్ధాన్ ఆర్మీ ప్రభుత్వాన్ని మళ్ళీ తన ఆధీనంలోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నదని పాకిస్ధాన్ అధ్యక్షుడు అసిఫ్ ఆలీ జర్దారీ ఆరోపిస్తూ, అది జరగకుండా చూడాలని అమెరికా ఛీఫ్ ఆఫ్ స్టాఫ్ మైక్ ముల్లెన్ కు సంతకం లేని మెమో పంపినట్లుగా వార్త వెలువడింది. ఇది “మెమో గేట్” గా పత్రికలలో వ్యాప్తి చెందింది. పాకిస్ధానీ అమెరికన్ వ్యాపారవేత్త మన్సూర్ ఇజాజ్ ఆ…

ఎయిర్ టెల్, వొడాఫోన్ లపై సి.బి.ఐ దాడులు, ఇక బి.జె.పి వంతు?

ఇక సి.బి.ఐ కన్ను బి.జె.పి పాలనలోని స్పెక్ట్రమ్ అవకతవకలపై పడింది. శనివారం వొడాఫోన్ భారతీయ యూనిట్ కార్యాలయం పైనా, ఎయిర్ టెల్ కార్యాలయం పైనా దాడులు చేసింది. 2001-02 లో ప్రభుత్వం చేసిన స్పెక్ట్రం కేటాయింపులపైన వివరాలు సేకరించే లక్ష్యంతో ఈ దాడులు నిర్వహించింది. బి.జె.పి ప్రభుత్వ కాలంలో జరిగిన స్పెక్ట్రం కేటాయింపులలో అవకతవకలు జరిగాయో లేదో నిర్ధారించుకునే క్రమంలో తగిన సమాచార సేకరణకు ఈ దాడులు నిర్వహించినట్లుగా సి.బి.ఐ ప్రతినిధి ధరణి మిశ్రా తెలిపింది. “ప్రభుత్వ…

మరో లిబియా కానున్న సిరియా, అమెరికాకు అరబ్ లీగ్ సహకారం -కార్టూన్

లిబియాలో గడ్డాఫీ ప్రభుత్వ కూల్చివేతకు అమెరికా, యూరప్ లతో సహకరించిన అరబ్ లీగ్, ఇప్పుడు సిగ్గు విడిచి సిరియాను కూడా పశ్చిమ దేశాల విష పరిష్వంగంలోకి నెట్టడానికి శాయశక్తులా ప్రయత్నిస్తోంది. లిబియా గగనతలాన్ని ‘నిషిద్ధ గగనతలం’ గా ప్రకటించి అమలు చేయడంలోనూ, ఆదేశంపై పశ్చిమ దేశాలు ఏడు నెలలపాటు బాంబు దాడులు చేసి సర్వనాశనం చేయడంలోనూ అరబ్ లీగ్ కూటమి అమెరికా, యూరప్ లకు పూర్తిగా సహకరించింది. పశ్చిమ దేశాల ఎంగిలి మెతుకులకు రుచిమరిగిన అరబ్ లీగ్,…

దక్షిణ చైనా సముద్రం జోలికి రావద్దు, అమెరికాకు చైనా పరోక్ష హెచ్చరిక

‘దక్షిణ చైనా సముద్రం’ విషయంలో గల వివాదాల్లో బైటి శక్తులు జొక్యం చేసుకోవడానికి వీల్లేదని చైనా శుక్రవారం హెచ్చరించింది. చైనా హెచ్చరిక అమెరికా ని ఉద్దేశించినదేనన్నది బహిరంగ రహస్యం. ఆసియా ప్రాంతాన్ని వదిలి పెట్టి వెళ్ళేది లేదని ఆష్ట్రేలియా పార్లమెంటులో చేసిన ప్రసంగంలో అమెరికా అధ్యక్షుడు ఒబామా చైనాకు పరోక్షంగా సూచించిన అనంతరం చైనానుండి ఈ హెచ్చరిక రావడం గమనార్హం. ఆసియా శిఖరాగ్ర సభ జరాగనున్న సందర్భంగా అమెరికా, చైనా ల మధ్య మాటల యుద్ధం జోరందుకుంది.…

ఒబామా పై హత్యా ప్రయత్నం, ఒకరి అరెస్టు

గత శుక్రవారం, నవంబరు 11 వ తేదీన వైట్ హౌస్ పై కాల్పులు జరిపిన నేరానికి 21 సంవత్సరాల యువకుడిపై అమెరికా ప్రభుత్వం అమెరికా అధ్యక్షుడిపై హత్యా ప్రయత్నం నేరం మోపింది. బారక్ ఒబామాను “క్రీస్తు వ్యతిరేకి” గానూ, “దయ్యం” గానూ ‘అస్కార్ ఒర్టెగా-హెర్నాండెజ్ గా అభివర్ణించినట్లుగా తెలుస్తోంది. వైట్ హౌస్ పై కాల్పులు జరిగిన అనంతరం వైట్ హౌస్ అధికారులు వెంటనే కాల్పుల గురించి స్పందించలేదు. కాల్పులు జరిపిన వ్యక్తి కారులో పారిపోయినట్లుగా వార్తలు వెలువడ్డాయి…

ఆసియా నుండి మేము కదిలేదే లేదు, చైనాకు ఒబామా పరోక్ష హెచ్చరిక

ఆఫ్ఘనిస్ధాన్, ఇరాక్ లనుండి అమెరికా సైన్యాన్ని విరమించుకుంటున్నట్లు కొద్దివారాల క్రితం ప్రకటించిన బారక్ ఒబామా, ‘ఆసియాలో అమెరికా ఉనికి కొనసాగుతుందని’ ఆస్ట్రేలియా పార్లమెంటులో ప్రసంగిస్తూ తేల్చి చెప్పాడు. అయితే ఆఫ్ఘనిస్ధాన్, ఇరాక్ లనుండు విరమించుకునే ఆలోచనలో అమెరికాకి మరో ఉద్దేశ్యం లేదు. ఆఫ్ఘనిస్ధాన్, ఇరాక్ లనుండి ఉపసంహరించుకుంటున్నంత మాత్రాన తాము ఆసియా నుండి వెళ్ళిపోతున్నట్లు కాదన్ ఒబామా చెప్పదలుచుకున్నాడు. మరీ ముఖ్యంగా ఆసియాలో చైనా తన ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి కృషి చేస్తున్న నేపధ్యంలో ఒబామా ప్రసంగం చేనాను…

తెలంగాణ డిమాండ్ ను ఎందుకు సమర్ధించాలి?

బ్రిటిష్ వాడికి కోస్తా జిల్లాలనుండి రెవిన్యూ వసూళ్ళు రావడానికి రెండు డ్యాంలు కట్టించాడు. విజయవాడ, ధవళేశ్వరం. కొన్ని కాలవలు తవ్వించాడు. కేవలం వాడి ప్రయోజనాల కోసమే. వాటి ద్వారా కృష్టా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో భూస్వాములు వ్యవసాయం చేసి అభివృద్ధి చెందారు. బ్రిటిష్ వాడు వెళ్ళిపోయేనాటికి వారి వద్ద పెట్టుబడి సమకూరింది. పెట్టుబడి సమకూరాక అది ఊరికే కూర్చోదు. లాభాల కోసం పరుగులు పెడుతుంది. లాభాలకోసం కృ, గుం, ఉ.గో జిల్లాల భూస్వాములు హైద్రాబాద్ వచ్చి…

‘తెలంగాణ’ ఏర్పాటుపై ఇంత ద్వేషం అవసరమా?

ఒక కొత్త రాష్ట్రం ఏర్పాటుపైన ఇంత నటన, రాజకీయం, ఎగతాళి, విద్వేషం అవసరమా? తెలంగాణ ప్రాంతం వాళ్ళు భారత దేశం నుండి విడిపోతామని కోరుతున్నారా? కేంద్ర ప్రభుత్వ అధికారం తమపై వద్దని నిరాకరిస్తున్నారా? తెలంగాణకు స్వయం ప్రతిపత్తి కావాలని అడుగుతున్నారా? పాకిస్ధానీ ఐ.ఎస్.ఐ కి గూఢచారుల్ని సరఫరా చేస్తున్నారా లేక చైనా ఇంటెలిజెన్స్ కు సమాచారం ఇస్తున్నారా? తెలంగాణ రాష్ట్రం అడుగుతున్నారా వాళ్ళు, లేక తెలంగాణ దేశం అడుగుతున్నారా? కేవలం రాష్ట్రం మాత్రమే తెలంగాణ ప్రజలు అడుగుతున్నది.…