రాహుల్ ప్రసక్తి లేని యు.పి కాంగ్రెస్ ఓటమి సమీక్ష -కార్టూన్
యు.పి లో కాంగ్రెస్ ఓటమిని సమీక్షించడానికి ఎ.కె.ఆంటోని, షీలా దీక్షిత్, సుశీల్ కుమార్ షిండే లతో కాంగ్రెస్ నియమించిన కమిటీ, నివేదికను పూర్తి చేసినట్లు పత్రికలు తెలిపాయి. యు.పి ఎన్నికలకు చాలా ముందు నుండె ప్రచారంలోకి దూకిన రాహుల్ గాంధీ ప్రసక్తి లేకుండానే కమిటీ తన నివేదికను పూర్తి చేసినట్లు అవి తెలిపాయి. సరైన అభ్యర్ధులకి టిక్కెట్లు ఇవ్వకపోవడం, అవినీతిపై ప్రజల దృక్పధం, అధిక ధరలు, వివాదాస్పద ప్రచారం కాంగ్రెస్ ఓటమికి కారణాలని కమిటీ నివేదించిందని తెలుస్తోంది.…

