ఫుకుషిమా శుభ్రతకు దశాబ్దాలు, అణు పరిశ్రమకు అంతం పలకాలని కోరుతున్న జపాన్

“జపాన్ కాంగ్రెస్ ఎగైనెస్ట్ అటామిక్ అండ్ హైడ్రోజన్ బాంబ్స్” మొదటి సమావేశం, భూకంపం, సునామీల వలన అణు ప్రమాదం సంభవించిన ఫుకుషిమాలో సోమవారం ప్రారంభమయ్యింది. అణు విద్యుత్ పరిశ్రమకు ఇక అంతం పలకాలని ఆ సదస్సు కోరింది. అణు విద్యుత్ కానీ, అణు బాంబులు కానీ ఏవీ వాంఛనీయం కాదనీ రెండూ మానవాళికి ప్రమాదకారులేననీ సమావేశం తెలిపింది. రిక్టర్ స్కేల్ పై 9 పరిమాణంతో మార్చి 11 న ఫుకుషిమా దైచి అణు ప్లాంటు వద్ద సంభవించిన…

నార్వే ఊచకోత నిందితుడికి ఇంగ్లండ్‌ రైటిస్టు తీవ్రవాదులతో సంబంధాలు?!

నార్వే ఊచకోతతో యూరప్ ఉలిక్కిపడింది. తమ దేశాల్లొ రైటిస్టుల గురించి ఆరా తీయడం ప్రారంభిస్తున్నారు. నార్వే రాజధాని ఓస్లోలో జంట దాడుల్లో 92 మందిని ఊచకోత కూసిన ఏండర్స్ బెహ్రింగ్ బ్రీవిక్, తనకు ఇంగ్లండులోని రైటిస్టు తీవ్రవాద సంస్ధలతో సంబంధాలున్నాయని చెప్పడంతో స్కాట్లండ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ముఖ్యంగా “ఇంగ్లీష్ డిఫెన్సు లీగ్” (ఇ.డి.ఎల్) సంస్ధతొ తనకు గట్టి సంబంధాలున్నాయని బ్రీవిక్ తెలిపాడు. ఇ.డి.ఎల్ సంస్ధ కూడా ముస్లిం వ్యతిరేక సంస్ధ. వలసదారులను వ్యతిరేకిస్తుంది. బహుళ సంస్కృతి…

నార్వే హత్యాకాండ నిందితుడితో ఇండియా కనెక్షన్!

జులై 22 తేదీన నార్వేలో సమ్మర్ క్యాంప్ కోలాహలంలో మునిగి ఉన్న టీనేజి యువతీ యువకులు 85 మందిని ఊచకోత కోసిన ముస్లిం ద్వేషి, మితవాద క్రిస్టియన్ తీవ్రవాది ఏండర్స్ బెహ్రింగ్ బ్రీవిక్ తో ఇండియాతో గల కనెక్షన్ ఒకటి బైటపడింది. ఆందోళన పడవలసిన కనెక్షన్ కాదు గాని, అనూహ్యమైన కనెక్షన్. బ్రీవిక్ వెబ్‌సైట్ లో ఉంచిన మానిఫెస్టోలో పేర్కొన్న తీవ్రవాద సంస్ధ సభ్యులు ధరించడానికి బ్యాడ్జిని తయారు చేయడానికి ఆయన భారత దేశానికి చెందిన ఒక…

“దారుణమే, కాని అవసరం” -నార్వే బాంబు పేలుళ్ళు, కాల్పుల నిందితుడు

నార్వే రాజధాని ఓస్లోలో ప్రధాని కార్యాలయం వద్ద బాంబు పేలుళ్ళకు పాల్పడి 7 గురినీ, కాల్పులు జరిపి 85 మందినీ చంపిన నేరంలో అనుమానితుడిగా అరెస్టయిన ఏండర్స్ బెహ్రింగ్ బ్రీవిక్ తానే ఆ నేరాలకు పాల్పడినట్లు అంగీకరించాడని అతని లాయర్ ‘గీర్ లిప్పెస్తాద్’ తెలిపాడు. తన చర్యలు “దారుణమే, కాని అవసరం” అని బ్రీవిక్ పేర్కొన్నట్లుగా ఆయన తెలిపాడు. మృతుల కోసం ఉటోవా ద్వీపంలో పోలీసుల గాలింపు కొనసాగుతోంది. మరింతమంది నీటిలో మునిగి పోయి ఉండవచ్చన్న అనుమానంతో…

నార్వే బాంబు పేలుళ్ళ నిందితుడికి నచ్చిన కొటేషన్

ఓ నమ్మకం కలిగిన ఒక వ్యక్తి, కేవలం ప్రయోజనాలు మాత్రమే కలిగి ఉన్న లక్షమంది బలగంతో సమానం -ఇంగ్లీష్ తత్వవేత్త జాన్ స్టువర్డ్ మిల్. One person with a belief is equal to the force of 100,000 who have only interests. -English Philosopher John Stuart Mill. నార్వే రాజధాని ఓస్లోలో బాంబు పేలుళ్లకు పాల్పడి 7 గురినీ, సమీపంలోని ఉటావో ద్వీపంలో విచక్షణా రహిత కాల్పులకు పాల్పడి 84…

కుట్రదారులు కావలెను -కార్టూన్

“ప్రపంచీకరణ” ప్రపంచాన్ని కుగ్రామంగా చేసి అందరికీ లాభం సమకూర్చుతుందని చెప్పారు. ఆచరణలో ఏం జరిగింది? పెట్టుబడుల ప్రపంచీకరణ జరిగింది కానీ శ్రమ జీవులకీ, వేతన జీవులకీ అది ఒఠ్ఠి బూటకంగా మిగిలింది. పశ్చిమ దేశాల పెట్టుబడులు, ఎమర్జింగ్ దేశాలతో సహా మూడవ ప్రపంచ దేశాల పెట్టుబడులు ఏకమై మూడో ప్రపంచ ప్రజలనూ, వారి వనరులనూ కొల్లగొడుతున్నాయి. ఈ ఆటలో పశ్చిమ దేశాల బహుళజాతి గుత్త సంస్ధలు మాస్టర్లు కాగా, మూడో ప్రపంచ దేశాల బడా కంపెనీలు వారికి…

నార్వే బాంబు పేలుళ్ళు, ఉన్మాది కాల్పులు -ఫొటోలు

4.8 మిలియన్ల జనాభా ఉన్న నార్వే శుక్రవారం బాంబు పేలుళ్ళు, ఉన్మాది కాల్పులతో అట్టుడికింది. రాజధాని ఓస్లో నగరంలో ప్రధాన మంత్రి కార్యాలయం సమీపంలో బాంబులు పేలి 7 గురు చనిపోయారు. బాంబు పేలుళ్ళకు కారణమైన వ్యక్తే సమీపంలోని ఉటావో ద్వీపంలో సభ జరుపుకుంటున్న పాలక పార్టీ యువజన సంఘం స్ధలం వద్ద విచక్షణా రహితంగా కాల్పులకు దిగి 84 మందికి పైగా టీనేజి యువతీ యువకుల్ని చంపాడు. ఓస్లోలో బాంబు పేలుడు శక్తిని బట్టి చూస్తే…

తుమ్మలపల్లె యురేనియం ప్రాజెక్టు, ఫుకుషిమా అణు ప్రమాదం, కొన్ని సంగతులు

ప్రపంచంలోనే అత్యధిక మొత్తంలో యురేనియం నిల్వలున్న ప్రాంతంగా పేరు సంపాదించుకున్న తుమ్మలపల్లె గ్రామం కడప జిల్లా పులివెందుల మండలంలో ఉంది. ఇక్కడ 49,000 టన్నుల యురేనియం నిల్వలు ఉన్నాయని నిర్ధారించారని మాత్రమే నిన్నటి వరకూ లోకానికి తెలుసు. అయితే రాజస్ధాన్‌లో, దేశంలోని 25వ అణు విద్యుత్ రియాక్టర్ నిర్మాణానికి శంకుస్ధాపన కోసం విచ్చేసిన భారత అటామిక్ ఎనర్జీ కమిషన్ ఛైర్మన్ శ్రీకుమార్ బెనర్జీ, తుమ్మలపల్లెలో గతంలో నిర్ధారించినట్లుగా 49,000 టన్నులు కాకుండా దానికి మూడు రెట్లు, అంటే…

రుమేనియా రైలునుండి 64 మిసైల్ వార్‌హెడ్స్ దొంగిలించిన దుండగులు

రుమేనియాకి చెందిన రైలులో రవాణా అవుతున్న మిసైళ్ళ వార్‌హెడ్స్ ను గుర్తు తెలియని దుండగులు దొంగిలించిన ఉదంతం సంచలన కలిగిస్తోంది. ఆదివారం, రుమేనియా నుండి బల్గేరియాకు రవాణా అవుతున్న మిసైళ్ళనుండి వార్ హెడ్స్ తొలగించి దొంగిలించినట్లుగా రుమేనియా ఇంటీరియర్ మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రాసిక్యూటర్లు, దొంగతనాన్ని విచారిస్తున్నట్లు తెలిపారు. ఇంటీరియర్ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మేరియస్ మిలిటారు, దొంగిలించబడిన విడిభాగాలు వాటంతట అవే ప్రమాదకరం కావనీ మిసైల్ వ్యవస్ధతో కలిసి ఉంటేనే ప్రమాదకరమనీ తెలిపాడు. మిలట్రీ పరికరాలతో…

ముంబై పేలుళ్ళ నిందితుల్లో ఒకరి ఊహా చిత్రం రెడీ -ఎ.టి.ఎస్

ముంబై వరుస పేలుళ్ళ నిందితుల్లో ఒకరి ఊహా చిత్రం సిద్ధం చేశామని “యాంటి టెర్రరిస్టు స్క్వాడ్” (ఎ.టి.ఎస్) తెలిపింది. ఊహాచిత్రాన్ని ప్రజలు చూడడానికి విడుదల చేయడం లేదని తెలిపింది. బహుశా నిందితులు అప్రమత్తం అవుతారన్న అనుమానంతో ఎ.టి.ఎస్ ఈ నిర్ణయం తీసుకొని ఉండవచ్చు. బాంబు పేలిన ఒక స్ధలంవద్ద ప్రత్యక్ష సాక్షి కధనంపై ఆధారపడి ఈ ఊహాచిత్రాన్ని గీయించినట్లుగా ఎ.టి.ఎస్ తెలిపింది. చిత్రాన్ని వివిధ దర్యాప్తు సంస్ధలకు అందజేశామని తెలిపింది. దర్యాప్తు సంస్ధలతో పాటు కొద్దిమంది ఎన్నుకున్న…

ఐ.ఎస్.ఐ అధిపతి అమెరికా పర్యటన విజయవంతం, బాగుపడిన ఐ.ఎస్.ఐ, సి.ఐ.ఎ ల సంబంధాలు

90 మందికి పైగా సి.ఐ.ఎ గూఢచారులను పాకిస్ధాన్ ప్రభుత్వం దేశం నుండి వెళ్ళగొట్టడంతో పాక్, అమెరికాల మధ్య సంబంధాలు బెడిసి కొట్టిన సంగతి విదితమే. సి.ఐ.ఎ గూఢచారులను వెనక్కి పంపడంతో అమెరికా కూడా పాకిస్ధాన్ కి ఇవ్వవలసిన 800 మిలియన్ డాలర్ల సహయాన్ని నిలిపివేసింది. తమ గూఢచారులు పాకిస్ధాన్ సైన్యానికి శిక్షణ ఇవ్వడానికే అక్కడ ఉన్నారనీ, వారే లేకపోతే ఇక శిక్షణకి ఇచ్చే సొమ్ము ఇవ్వవలసిన అవసరం లేదనీ సి.ఐ.ఏ అధికారులు, సహాయం నిలిపివేస్తున్నట్లు చేసిన ప్రకటన…

ఆఫ్ఘన్‌లో కొనసాగుతున్న ‘నాటో’ నరమేధం, పౌర నష్టంపై పచ్చి అబద్ధాలు, బుకాయింపులు

ఆఫ్ఘనిస్ధాన్‌లో అర్ధ రాత్రుళ్ళు గ్రామాలపై దాడి చేసి పౌరుల ఇళ్ళపై కాల్పులు జరిపి వారిని కాల్చి చంపడం కొనసాగుతోంది. టెర్రరిస్టు గ్రూపుల సమావేశం జరుగుతోందని చెప్పడం, పౌరుల ఇళ్ళపై విచక్షణా రహితంగా కాల్పులు జరపడం, పౌరులను కాల్చి చంపి చనిపోయినవారు టెర్రరిస్టులను బుకాయించడం నాటో దళాలకు ముఖ్యంగా అమెరికా సైన్యానికి నిత్యకృత్యంగా మారింది. ఆఫ్ఘనిస్ధాన్ దురాక్రమణను ప్రతి ఒక్క ఆఫ్ఘన్ దేశీయుడూ వ్యతిరేకిస్తున్నాడనీ, తమ దేశం నుండి అమెరికా సైనికులు తక్షణమే వెళ్ళిపోవాలని ప్రతీ ఆఫ్ఘన్ జాతీయుడు…

ముంబైలో మళ్ళీ బాంబు పేలుళ్ళు, 21 మంది దుర్మరణం, 141 మందికి గాయాలు -అప్ డేట్

ముంబైలోని జన సమ్మర్దమైన ప్రాంతాల్లో బుధవారం సంభవించిన బాంబు పేలుళ్ళలో దుర్మరణం పాలైనవారి సంఖ్య 21 కి చేరుకోగా, 141 మంది గాయపడ్డారని తేలింది. పేలుళ్ళలో ఆత్మాహుతి బాంబుదాడిని కొట్టిపారేయలేమని పోలీసులు చెబుతున్నారు. గం.6:54ని.లకు దక్షిణ ముంబైలోని జావేరి బజార్లో పేలిన మొదటి బాంబు శక్తివంతమైనదని తెలుస్తోంది. గం.6:55ని.లకు రెండవ బాంబు సెంట్రల్ ముంబైలో దాదర్ సబర్బన్ రైల్వే స్టేషన్ సమీపంలోని కబూతర్‌ఖానా బస్ స్టాప్ వద్ద పేలిందనీ, గం.7:05ని.లకు మూడవ బాంబు దక్షిణ ముంబైలోని ఒపేరా…

7/11 (జులై 2011) ముంబై బాంబు పేలుళ్ళు -ది హిందూ ఫొటోలు

జులై 13, 2011 రోజు, భారత ప్రజల జీవితాల్లో మరొక దుర్దినంగా నమోదు కానున్నది. నేడు జరిగిన బాంబు పేలుళ్ళ దృశ్యాలను ఫోటో గ్రాఫర్ వివేక్ బెంద్రె కెమెరాలో బంధించగా ‘ది హిందూ’ పత్రిక తన వెబ్‌సైట్ లో ప్రచురించింది. ఫోటోలు చూడ్డానికి భయానకంగా ఉన్నాయి. ఇక్కడ ఉన్న ఏడు ఫొటోలు ఒపేరా హౌస్ వద్ద జరిగిన పేలుడు అనంతరం తీసినవి కాగా ఒకటి దాదర్ స్టేషన్ దగ్గరి దృశ్యాన్ని టీవి ఛానెల్ చూపుతోంది. పాకిస్ధాన్ ప్రభుత్వం…

ముంబైలో మళ్ళీ బాంబు పేలుళ్ళు, 13 మంది మరణం, 100 మందికి గాయాలు

అప్ డేట్ – 3: బుధవారం జరిగిన బాంబు పేలుళ్ళలో మరణించినవారి సంఖ్య 13 కు చేరుకుందని పోలీసులు చెప్పారని ‘ది హిందూ’ పత్రిక తెలిపింది.. మహా రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా 13 మంది చనిపోయారని ధృవీకరించాడు. ఐ.ఇ.డి (ఇంప్రూవైజ్‌డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్) లతో పేలుళ్ళు జరిపారని పోలీసులు చెప్పారు. దాదర్ లో కారులో ఉంచిన బాంబు పేలిందని తెలుస్తోంది. గొడుగు కింద ఉంచిన మరొక బాంబుని నిర్వీర్యం చేశారు. అప్ డేట్ – 2: ఈరోజు…