‘కాబూల్ దాడి’ సూత్ర ధారి పాకిస్ధానీ ‘హకానీ నెట్ వర్క్’

ఆదివారం మధ్యాహ్నం నుండి సోమవారం ఉదయం వరకూ కొనసాగిన ‘కాబూల్ దాడి’ నిర్వహించింది పాకిస్ధాన్ కి చెందిన ‘హక్కానీ గ్రూపు’ అని అసోసియేటేడ్ ప్రెస్ తెలిపింది. కాబూల్ తో పాటు మరో మూడు ఆఫ్ఘన్ నగరాలపైన దురాక్రమణకి వ్యతిరేకంగా పోరాడుతున్న మిలిటెంట్లు ఒకేసారి దాడులకు పాల్పడ్డారు. ‘దురాక్రమణకు తాలిబాన్ ప్రతిఘటన బలహీన పడిందని ఫిబ్రవరిలో వ్యాఖ్యానించిన అమెరికాకి తమ అంచనా తప్పని తెలియజేయడానికే ఈ దాడులకు పాల్పడ్డామని తాలిబాన్ ప్రతినిధి జబీయుల్లా తెలిపాడు. తమ ‘వేసవి దాడులకు’…

కాబూల్ లో పశ్చిమ దేశాల ఎంబసీలపై తాలిబాన్ బహుముఖ దాడులు

పశ్చిమ దేశాల దురాక్రమణ లో ఉన్న ఆఫ్ఘనిస్ధాన్ లో తాలిబాన్ ఆదివారం మరోసారి విరుచుకుపడింది. రాజధాని కాబూల్ లో దుర్భేద్యంగా భావించే సెంట్రల్ డిస్ట్రిక్ట్ ప్రాంతంపై బహుముఖ దాడులకి దిగింది. పశ్చిమ కాబూల్ లోని పార్లమెంటు భవనం వద్ద పెద్ద ఎత్తున పేలుళ్ళు వినబడుతున్నాయనీ, జర్మనీ, బ్రిటన్, నాటో లకు చెందిన ఎంబసీలపై అనేక వైపుల నుండి మిలిటెంట్లు కాల్పులు సాగిస్తున్నారనీ, రాకెట్లు ప్రయోగిస్తున్నారనీ బి.బి.సి తెలిపింది. దాడులకు తామే బాధ్యులమని తాలిబాన్ ప్రతినిధి తెలిపాడని ఆ…

pacific competition

పసిఫిక్ లో అమెరికా, చైనా పోటీ -కార్టూన్

సాపేక్షికంగా చూస్తే చైనా ఇప్పుడు ప్రపంచంలో ప్రధానమైన ఆర్ధిక శక్తి. జిడిపి లో అమెరికా తర్వాత స్ధానం చైనాదే. చాలా తక్కువ కాలంలో అది ఈ స్ధానం చేరుకుంది. చైనాకు విదేశాలతో ఉన్న సంబంధాలు ప్రధానంగా వ్యాపారానికి సంబంధించినవే. చైనా విదేశాంగ విధానం ప్రో యాక్టివ్ కాదు. మిలట్రీ చర్యలు తీసుకునైనా వాణిజ్య సంబంధాలు కాపాడుకునే విదేశాంగ విధానం చైనా రూపొందించుకోలేదు. కాని అమెరికా అలా కాదు. దాని విదేశాంగ విధానం పూర్తిగా జోక్యం దారీ విధానమే.…

అమెరికా యుద్ధ నౌకల్ని మేం ఫోటోలు తీశాం -ఇరాన్

ఇరాన్ గూఢచార విమానాలు అమెరికా యుద్ధ నౌకాలను ఫోటోలు తీశాయని ఇరాన్ మిలట్రీ కమాండర్ ప్రకటించాడు. పర్షియా ఆఘాతంలో తిష్ట వేసి ఉన్న అమెరికా యుద్ధ విమాన వాహక నౌకతో పాటు ఇతర యుద్ధ విమానాలను, తమ మానవ రహిత డ్రోన్ లు ఆకాశం నుండి ఫోటోలు తీసాయని బ్రిగేడియర్ జనరల్ ఫర్జాడ్ ఎస్మాయిల్ మంగళవారం ప్రకటించినట్లు ప్రెస్ టి.వి తెలిపింది. ఇరాన్ గగన తాళంలోకి జొరబడి గూఢచర్య కార్యకలాపాలు నిర్వహిస్తున్న అమెరికా డ్రోన్ విమానాన్ని గత…

14 వ సారి పేలిపోయిన ఈజిప్టు-ఇజ్రాయెల్ ఆయిల్ పైప్ లైను

ఈజిప్టు ప్రజలు మరోసారి తమ దేశం నుండి ఇజ్రాయెల్ కి ఆయిల్ సరఫరా చేసే పైప్ లైన్ ను పేల్చేశారు. అమెరికా బలవంతంతో మార్కెట్ ధరల కంటే తక్కువకు తమ బద్ధ శత్రువుకి ఆయిల్ సరఫరా చేయడాన్ని వారు దశాబ్దాలుగా వ్యతిరేకిస్తున్నారు. ప్రజాస్వామిక తిరుగుబాటు ఫలితంగా నియంత హోస్నీ ముబారక్ గద్దె దిగాక ఇప్పటికీ 13 సార్లు ఆయిల్ పైప్ లైన్ ను పేల్చేశారు. హోస్నీ బుమారక్ ను గద్దె  దింపినప్పటికీ అమెరికా కు అనుకూలమైన మిలట్రీ…

గంటర్ గ్రాస్ ను ‘పర్సోనా నాన్ గ్రాటా’ గా ప్రకటించిన ఇజ్రాయెల్

ప్రఖ్యాత జర్మన్ రచయిత గంటర్ గ్రాస్ ను ఇజ్రాయెల్ ‘పర్సనా నాన్ గ్రాటా’ (ఆహ్వానించ దగని వ్యక్తి) గా ప్రకటించింది. తద్వారా తన జాత్యహంకార బుద్ధిని బహిరంగంగా చాటుకుంది. పాలస్తీనా భూములను అక్రమంగా ఆక్రమించుకుని సెటిల్ మెంట్లు నిర్మిస్తున్న ఇజ్రాయెల్ దురాక్రమణ విధానాన్నీ, పశ్చిమాసియాలో ఏకైక అణ్వాయుధ దేశంగా ఉంటూ ఇరాన్ అణు విద్యుత్ కర్మాగారాలపై బాంబు దాడులు చేస్తామని ప్రకటించడాన్నీ గంటర్ గ్రాస్ తన కవిత ద్వారా విమర్శించడమే నేరంగా ఇజ్రాయెల్ పరిగణిస్తున్నది. “What Must…

ఆఫ్ఘన్ దురాక్రమణకు వ్యతిరేకంగా జర్మన్ల ప్రదర్శన

ఆఫ్ఘన్ దురాక్రమణ యుద్ధానికి వ్యతిరేకంగా వేలాదిమంది జర్మన్లు శనివారం నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. జర్మనీ వ్యాపితంగా ఉన్న డెబ్బై పైగా నగరాలలో పదుల వేలమంది జర్మన్లు ఈ ప్రదర్శనలలో పాల్గొన్నారని ప్రెస్ టి.వి. తెలిపింది. సాంప్రదాయక ఈస్టర్ ‘పీస్ మార్చ్’ లో భాగంగా నిర్వహించిన ప్రదర్శనలో, ప్రదర్శకులు నాటో దురాక్రమణ యుద్ధాలకు వ్యతిరేకంగా, అణ్వాయుధాలకు వ్యతిరేకంగా నినాదాలిచ్చారు. రాజధాని బెర్లిన్ లో  అమెరికా ఎంబసీ ముందు వందలమంది నిరసనలు చేపట్టారు. ఆఫ్ఘనిస్ధాన్ లోనూ, పశ్చిమాసియాలోనూ అమెరికా అనుసరిస్తున్న…

కాశ్మీర్ లో 130 మంది పాక్ సైనికులు ‘మంచులో సమాధి’

కాశ్మీర్ మంచు పర్వతాలలో 130 మంది పాక్ సైనికులు మంచులో సమాధి అయ్యారు. మంచు తుఫానులో వేగంగా కిందికి జారుతున్న భారీ మంచు గడ్డ కింద చిక్కుకుపోయి చనిపోయారు. 130 మంది కంటే ఎక్కువ సంఖ్యలోనే సైనికులు చనిపోయి ఉండవచ్చని భావిస్తున్నారు. అతి పెద్ద హిమాలయ పర్వతాలపైన గల సియాచిన్ గ్లేసియర్ పైన భారత సరిహద్దుకి సమీపంలో ఉన్న పాకిస్ధానీ ఆర్మీ శిబిరంపైకి మంచు గడ్డ దూసుకు రావడంతో తప్పించుకునే అవకాశం లభించలేదని తెలుస్తోంది. సియాచిన్ గ్లేసియర్…

War-Drums

(ఇరాన్) వార్ డ్రమ్స్ -కార్టూన్

వియత్నాంలో పరాభవం ఎదురైంది. ఇరాక్ లో చావు తప్పి కన్ను లొట్టబోయింది. వెనిజులాలో తరిమి తరిమి కొట్టారు. బొలీవియా ‘ఛీ ఫో’ అంటోంది. ఆఫ్ఘనిస్ధాన్ లో ఉతికి ఆరేస్తున్నారు. సిరియా ప్రజల్లో వినేవాడే లేడు. అయినా అమెరికా పాలకులకి సిగ్గూ లజ్జా లేకుండా పోయాయి. ఇరాన్ పై దురాక్రమణ దాడికి ‘వార్ డ్రమ్స్’ మోగిస్తోంది. – –

తాలిబాన్ చేతిలో మరో నలుగురు అమెరికా సైనికులు హతం

ఆఫ్ఘన్ దురాక్రమణ యుద్ధంలో తాలిబాన్ మిలిటెంట్ల బాంబు దాడిలో బుధవారం మరో నలుగురు అమెరికా సైనికులు చనిపోయినట్లు ప్రెస్ టి.వి తెలిపింది. సాపేక్షికంగా తాలిబాన్ కి బలం లేదని భావించే ఉత్తర ఆఫ్ఘనిస్ధాన్ లోని ఫార్యబ్ రాష్ట్రంలో ఈ దాడి చోటు చేసుకుంది. నాటోకి చెందిన ఐ.ఎస్.ఏ.ఎఫ్ (ఇంటర్నేషనల్ సెక్యూరిటి ఆసిస్టెన్స్ ఫోర్స్) మాత్రం ఇద్దరు సైనికులు మరణించినట్లు ప్రకటించింది. అయితే ఫార్యబ్ బాంబు దాడుల్లో మరణించినవారు తమ లెక్కలో లేరని ఐ.ఎస్.ఏ.ఎఫ్ తెలిపింది. ఈ లెక్కన…

అజరబైజాన్ ఇజ్రాయెల్ రహస్య ఒప్పందం లీక్ చేసిన అమెరికా

తన ప్రమేయం లేకుండా ఇజ్రాయెల్ అంతర్జాతీయ సంబంధాలు అభివృద్ధి కావడం ఇష్టం అమెరికాకి ఇష్టం లేకపోవడమే, అజరబైజాన్ తో ఇజ్రాయెల్ కుదుర్చుకున్న రహస్య ఒప్పందాన్ని లీక్ చేయడానికి కారణం అని రష్యా టైమ్స్ పత్రిక తెలిపింది. ఇరాన్ అణు కర్మాగారాలపై బాంబులు వేసి ధ్వంసం చేయడానికి ఉవ్విళ్లూరుతున్న ఇజ్రాయెల్ ఉత్సాహం తన పుట్టి పుంచుతుందని అమెరికాకి భయం. దురాక్రమణ యుద్ధాలు, ప్రభుత్వాల కూల్చివేతలు అమెరికాకి కొత్తేమీ కాదు. కాకపోతే కాస్త సమయం తీసుకుందామన్నదే అమెరికా అభిప్రాయం. ఇజ్రాయెల్…

సిరియా తరలి వెళ్ళిన రష్యా యుద్ధ నౌక ‘డిస్ట్రాయర్’

రష్యన్ నేవీ కి చెందిన యుద్ధ నౌక సిరియా ఓడ రేవు కి బయలుదేరినట్లు రష్యా మిలట్రీ అధికారులు తెలిపారు. గత వారాంతంలో నల్ల సముద్రంలోని సేవాస్టోపోల్  స్ధావరాన్ని డిస్ట్రాయర్ వదిలి వెళ్లిందని వారు తెలిపారు. మధ్యధరా సముద్రంలోని సిరియా ఓడరేవు ‘టార్టస్’ కు అది మరి కొద్ది రోజుల్లో చేరుకుంటుందని తెలుస్తోంది. ముందుగా అనుకున్న ‘మిలట్రీ డ్రిల్లు’ లో ‘డిస్ట్రాయర్’ పాల్గొంటుందని రష్యా మిలట్రీ ని ఉటంకిస్తూ ‘డి డెయిలీ స్టార్’ పత్రిక తెలిపింది. సిరియాలో…

ఆఫ్ఘన్ లో మరో హెలికాప్టర్ కూల్చివేత, 14 మంది అమెరికా సైనికుల మరణం

ఆఫ్ఘన్ మిలిటెంట్లు మరొక అమెరికా హెలికాప్టర్ ని కూల్చివేసినట్లు ప్రెస్ టి.వి తెలిపింది. తూర్పు ఆఫ్ఘన్ రాష్ట్రం ఘజని లోని అందర్ జిల్లాలో అమెరికా హెలికాప్టర్ ని కూల్చి వేసినట్లు తాలిబాన్ మిలిటెంట్లను ఉటంకిస్తూ ప్రెస్ టి.వి తెలిపింది. హెలికాప్టర్ లో ఉన్న 14 మంది అమెరికా సైనికులు చనిపోయారని తాలిబాన్ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ చెప్పాడు. హెలికాప్టర్ కూల్చివేతపై నాటో దళాల నుండి ఇంకా సమాచారం ఏదీ అందలేదని ప్రెస్ టి.వి తెలిపింది. 82 ఎం.ఎం…

అజర్ బైజాన్ ఎయిర్ బేస్ నుండి ఇరాన్ పై దాడి చేయనున్న ఇజ్రాయెల్?

వైమానిక బాంబుదాడులతో ఇరాన్ అణు కర్మాగారాలను నాశనం చేయడానికి ఉవ్విళ్లూరుతున్న ఇజ్రాయెల్ కు తమ ఎయిర్ బేస్ లు వినియోగించుకోవడానికి అజర్ బైజాన్ అంగీకరించినట్లు అమెరికాకి చెందిన ‘ఫారెన్ పాలసీ’ పత్రిక వెల్లడించింది. ఈ వార్తలను అజర్ బైజాన్ ప్రబుత్వం ఆగ్రహంగా తిరస్కరించింది. “ఇజ్రాయెల్ ఒక ఎయిర్ ఫీల్డ్ కొనుక్కుంది. ఆ ఎయిర్ ఫీల్డ్ పేరు అజర్ బైజాన్” అని ఒక అమెరికా అధికారి చెప్పినట్లుగా ఫారెన్ పాలసీ పత్రిక చెబుతోంది. అజ్ఞాత సీనియర్ రాయబారులనూ, ఆర్మీ…

Obama-Decorations

అధ్యక్షుడుగా ఒబామా సాధించేమిటి? -కార్టూన్

ఇరాక్, ఆఫ్ఘన్ యుద్ధాలు ముగించి అమెరికా సైనికుల్ని తిరిగి స్వదేశం రప్పిస్తానని గత అధ్యక్ష ఎన్నికల్లో వాగ్దానం చేసిన బారక్ ఒబామా మళ్ళీ ఎన్నికలు వస్తున్నా తన హామీ నిలుపుకోలేదు. పైగా పదవిని అధిష్టించినవెంటనే ఆఫ్ఘనిస్ధాన్ కి ‘ట్రూప్ సర్జ్’ పేరుతో మరో 30,000 సైనికుల్ని పంపించాడు. అధ్యక్ష ఎన్నికలు జరిగే 2012 చివరి నాటికి ఈ ముప్ఫై వేలమంది సైనికుల్ని ఉపసంహరిస్తున్నానని గత సంవత్సరం ప్రకటించాడు. అంటే, ఎన్నికల సంవత్సరంలో ‘సైనికుల ఉపసంహరణ’ పేరుతో తాను…