అమెరికా వెతికిందెక్కడ? లాడెన్ దొరికిందెక్కడ?

సెప్టెంబర్ 11, 2001 న న్యూయార్కు నగరంలో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కార్యాలయం ఉన్న జంట టవర్లను ముస్లిం టెర్రరిస్టులుగా చెప్పబడుతున్నవారు అమెరికా విమానాలతో ఢీ కొట్టారు. విమానాలు ఢీకొట్టాక రెండు టవర్లు ఒక పద్ధతి ప్రకారం కూలిపోయిన దృశ్యాన్ని ప్రపంచం అంతా వీక్షించింది. కొన్ని గంటల్లోనే టవర్లను ఢీకొన్న విమానాలను నడిపినవారిని ఆ పనికి పురమాయించిందెవరో అమెరికా కనిపెట్టి ప్రకటించింది. ఆఫ్ఘనిస్ధాన్‌లో తాలిబాన్ ప్రభుత్వ రక్షణలొ ఉన్న ఒసామా బిన్ లాడెన్ ఆదేశాల ప్రకారమే టవర్లను…

అబ్బోత్తాబాద్ స్ధావరం కమాండ్ అండ్ కంట్రోల్ సెంటరా? అబ్బే, అంత సీన్ లేదు -అమెరికా, పాక్ అధికారులు

పాకిస్ధాన్‌‌లోని  అబ్బోత్తాబాద్‌ పట్టణంలో గల లాడెన్ స్ధావరమే ఆల్-ఖైదా కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌గా ఉపయోగిస్తున్నారని అమెరికా చెప్పడాన్ని అటు అమెరికాలోనూ, ఇటు పాకిస్తాన్ లోనూ చాలామంది అంగీకరించ లేకపోతున్నారు. లాడెన్ స్ధావరంగా చెప్పబడుతున్న స్ధావరంలో అతన్ని హత్య చేశాక అక్కడినుండి చాలా సమాచారాన్ని తీసుకెళ్ళినట్లుగా చెబుతున్నారు. ఈ సమాచారం ఒకేఒక టెర్రరిజం అనుమానితుడి వద్ద దొరికిన అతి పెద్ద గూఢచార సమాచారాల్లో ఒకటిగా ఇంటెలిజెన్స్ అధికారులు పేర్కొంటున్నారు. ఈ సమాచారం ద్వారా లాడెన్ చివరివరకూ చురుగ్గా…

అబ్బొత్తాబాద్ స్ధావరంలో లాడెన్ ఉన్న వీడియో విడుదల చేసిన అమెరికా -రాయిటర్స్ వీడియో

లాడెన్ పాకిస్ధాన్‌లోని తన స్ధావరంలో ఉండగా తీసిన వీడియో అని చెబుతూ 66 సెకన్ల వీడియో ని అమెరికా ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తం 66 సెకన్ల నిడివిలో లాడెన్‌గా చెప్పబడుతున్న వ్యక్తి కనిపీంచేది 12 సెకన్లు మాత్రమే. మిగిలిన భాగమంతా పాత వీడియోల అతుకులు. మంచం మీద కూర్చున్నట్లు కనిపిస్తున్న లాడెన్ వీపు ఒక పక్కనుండి కనిపిస్తోంది. మొఖంలో సగం కంటే తక్కువ భాగం కనిపిస్తోంది.లాడెన్ అని గుర్తించడానికి అనువుగా వీడియో లేదు. లాడెన్ అని…

అమెరికా అబద్ధాలకు నిలువెత్తు సాక్ష్యాలు: జెస్సికా లించ్, పేట్ టిల్‌మేన్, లిండా నార్గ్రోవ్

ఒసామా బిన్ లాడెన్ హత్య విషయంలో పొంతనలేని కధనాలు చెబుతున్న అమెరికాకి అబద్ధాలు చెప్పడం కొత్త కాదు. ఇరాక్‌పై దాడి చేయడానికి కారణంగా ఆ దేశంలో సామూహిక విధ్వంసక మారణాయుధాలు ఉన్నాయనీ, వాటి వలన అమెరికా భద్రతకు ముప్పు అనీ అబద్ధాలు చెప్పింది. దానితో పాటు ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్‌కీ, ఒసామా బిన్ లాడెన్‌కీ సంబంధాలున్నాయని పచ్చి అబద్ధాన్ని ప్రచారం చేసింది. కానీ లాడెన్‌ను చంపానని చెప్పిన తర్వాత అమెరికా అధ్యక్షుడు గానీ, అధికారులు గానీ…

ఐ.ఎం.ఎఫ్, ఇ.యుల బెయిలౌట్‌తో రిసెషన్‌లోకి జారనున్న పోర్చుగల్

గ్రీసు, ఐర్లండ్‌ దేశాల తర్వాత పోర్చుగల్ అప్పు సంక్షోభంలో కూరుకుపోయిన సంగతి విదితమే. ఐ.ఎం.ఎఫ్, యూరోపియన్ యూనియన్‌లు సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఆర్ధిక సహాయ నిధి నుండి బెయిలౌట్ ప్యాకేజి పొందే అవసరం లేదని పోర్చుగల్ మొదట చెప్పినప్పటికీ, పార్లమెంటులో బడ్జెట్ బిల్లు ఓడిపోయి ప్రభుత్వం కూలిపోవడంతో బాండ్ మార్కెట్లో పోర్చుగల్ సావరిన్ అప్పుపై వడ్డీ పెరిగిపోయి అప్పు సేకరించడం అసాధ్యంగా మారిపోయింది. దానితో అనివార్యంగా పోర్చుగల్ ఆపద్ధర్మ ప్రధాని జోస్ సోక్రటీసు గత నెల ప్రారంభంలో…

ఇండియాతో ఘర్షణ పెట్టుకుని ఒసామా హత్యపై దృష్టి మరల్చే యోచనలో పాకిస్ధాన్?

పాకిస్ధాన్ భూభాగంపై స్ధావరం ఏర్పరుచుకున్న ఒసామా బిన్ లాడెన్‌ను చంపామని అమెరికా అధ్యక్షుడు ప్రకటించడంతో పాకిస్ధాన్ ప్రభుత్వం ఇరకాటంలో పడింది. పాకిస్ధాన్ ప్రభుత్వానికి తెలియకుండా అమెరికా ఆపరేషన్ నిర్వహించిందనడంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నప్పటికీ ఇన్నాళ్ళూ ఒసామా పాకిస్ధాన్‌లోనే ఆశ్రయం తీసుకుంటున్న విషయం తెలిసి పాకిస్ధానీయులు నిశ్చేష్టులయ్యారని పత్రికలు తెలుపుతున్నాయి. పాకిస్ధాన్ ఐ.ఎస్.ఐ సంస్ధ లాడెన్‌ను తప్పిస్తుందేమో అన్న అనుమానాలున్నందునే పాక్ ప్రభుత్వానికి తెలియజేయలేదని సి.ఐ.ఏ డైరెక్టర్ చెప్పడంతో పాకిస్ధాన్‌లోని ప్రతిపక్ష పార్టీలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్త్తున్నాయి.…

లాడెన్ ఇంటిలో రక్తపు మడుగులో ముగ్గురు నిరాయుధుల శవాలు, ఫోటోలు సంపాదించిన రాయిటర్స్

ఒసామా బిన్ లాడెన్‌ స్ధావరంగా చెప్పబడుతున్న ఇంటిలో రక్తపు మడుగులో పడి ఉన్న ముగ్గురు యువకుల శవాల ఫోటోలను రాయిటర్స్ వార్తా సంస్ధ సంపాదించింది. వీరి వద్ద ఎటువంటి ఆయుధాలు లేవని రాయిటర్స్ సంస్ధ తెలిపింది. అమెరికా కమేండోలు దాడి చేసి వెళ్ళిన గంట తర్వాత ఈ ఫోటోలు తీశారని ఆ సంస్ధ తెలిపింది. పాకిస్ధాన్ భద్రతా అధికారి ఒకరు ఒసామా స్ధావరంగా చెబుతున్న ఇంటిలోకి అమెరికన్ కమెండోలు వెళ్ళిన గంట తర్వాత వెళ్ళి తీసిన ఫోటోలను…

ఒసామా మృతి తాలూకు ఫోటోల విడుదలకు భయపడుతున్న ఒబామా

ప్రపంచ పోలీసు అమెరికా అధ్యక్షుడు ఒబామాని చనిపోయిన ఒసామా బిన్ లాడెన్ ఇంకా భయపెడుతూనే ఉన్నాడు. ఒసామాని చంపినట్లు రుజువులు చూపాలని అమెరికాలోని వివిధ వర్గాల ప్రజలు, రాజకీయ నాయకులతో పాటు ప్రపంచంలోని వివిధ దేశాల ప్రభుత్వాలు ప్రముఖులు డిమాండ్ చేస్తున్నారు. కాని ఒసామా మృతి చెందిన ఫోటోలు విడుదల చేస్తే, భీకరంగా ఉన్న ఆ చావు వలన అమెరికా జాతీయ భద్రతకు ముప్పు ఏర్పడుతుందని తాను భావిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ఒబామా ఎన్.బి.సి టెలివిజన్‌కి ఇచ్చిన…

నిరాయుధుడు లాడెన్‌ను హత్య చేయడం అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధం

కమెండోలు దిగుతుండగానే లాడెన్ భవంతి నుండి కాల్పులు ఎదురయ్యాయనీ, లాడెన్ సాయుధంగా ప్రతిఘటించడంతోనే కాల్చి చంపామనీ మొదట చెప్పిన అమెరికా అధికారులు మెల్ల మెల్లగా నిజాలను ఒక్కొక్కటీ వెల్లడిస్తున్నారు. లాడెన్ భార్య దాడి చేయడంతో అమెనూ కాల్చి చంపామని చెప్పినవారు ఇప్పుడు ఆమె లాడెన్‌కు అడ్డుగా రావడంతో కాలిపై కాల్చామనీ, అమె బతికే ఉందనీ ఇప్పుడు చెబుతున్నారు. హెలికాప్టర్లపై కాల్పులు జరిగాయన్నవారు ఇప్పుడు దానిగురించి మాట్లాడ్డం లేదు. లాడెన్ సాయుధంగా ప్రతిఘటించాడన్న వారు ఇప్పుడు అతను నిరాయుధంగానే…

లాడెన్‌ని అమెరికా చంపినట్టే అమెరికాలో చొరబడి ముంబై దాడి నిందితుడు హేడ్లీని చంపేద్దామా!?

వరల్డ్ ట్రేడ్ సెంటర్ కి చెందిన జంట టవర్లను కూల్పించి మూడు వేల మంది అమెరికన్లను చంపాడన్న ఆరోపణపై ఒసామా-బిన్-లాడెన్ ను పాకిస్ధాన్‌కి చెప్పకుండా అతని ఇంటిపై దాడి చేసి చంపింది. “దాడి సంగతి మాకు తెలియదు” అని పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది. పాకిస్ధాన్ ప్రభుత్వానికి చెబితే ఒసామాను తప్పించవచ్చన్న అనుమానంతో వాళ్ళకి చెప్పలేదని సి.ఐ.ఏ డైరెక్టర్ టైమ్స్ మేగజైన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కుండబద్దలు కొట్టాడు. “మీ అబ్బాయిని చంపినవాడు మాయింట్లో దాచిపెడితే ఏం చేస్తావు? నా…

గడ్డాఫీని టార్గెట్ చేయాలంటున్న బ్రిటన్, చట్టవిరుద్ధమని లాయర్ల హెచ్చరిక

“లిబియా ప్రభుత్వ కమాండ్ అండ్ కంట్రోల్ (గడ్డాఫీ) ను టార్గెట్ చెయ్యడం చట్టబద్ధమే” అని బ్రిటన్ డిఫెన్స్ సెక్రటరీ లియామ్ ఫాక్స్ ప్రకటించాడు. అయితే “గడ్డాఫిపైన గానీ, లిబియా ప్రభుత్వ సైన్యంపైన గానీ దాడుల చేయడానికీ, లిబియా తిరుగుబాటుదారులకు ట్రైనింగ్ ఇవ్వడానికీ ఐక్యరాజ్య సమితి తీర్మానం అనుమతి ఇవ్వలేదు. అలా చేస్తే చట్ట విరుద్ధం” అని బ్రిటన్ ప్రభుత్వ లాయర్లు హెచ్చరిస్తున్నారు. బ్రిటన్ ప్రధాని కామెరూన్ కూడా లిబియా తిరుగుబాటుదారులకు ఆయుధాలిచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని తమ ఎం.పిలకు…

ఇండియాకు టైఫూన్, రాఫేల్ లలో ఏ ఫైటర్ జెట్ విమానం మంచిది?

ఇండియా చాలా కాలంగా ఫైటర్ జెట్ యుద్ధ విమానాలను కొనడానికి ప్రయత్నిస్తోంది. అమెరికా, ఫ్రాన్సు, స్వీడన్ లతో పాటు బ్రిటన్, జర్మనీ, స్పెయిన్, ఇటలీ దేశాల ఉమ్మడి కంపెనీ లు తమ ఫైటర్ జెట్ లే కొనమని పోటీ పడుతూ వచ్చాయి. గురువారం భారత ప్రభుత్వ మిలట్రీ అమెరికా, స్వీడన్ లను తన జాబితానుండు తొలగించింది. ఇప్పుడు రెండు ఫైటర్ జెట్లు పోటీ పడుతున్నాయి. ఒకటి నాలుగుదేశాల ఉమ్మడి కంపెనీ యూరో ఫైటర్ తయారు చేసే “టైఫూన్”…

ఇరాక్ ప్రభుత్వ హత్యాకాండకు స్పందించని అమెరికా, యూరప్‌లు

ఇరాక్‌లోని అష్రాఫ్ క్యాంపులో నివసిస్తున్న పౌరులపై ఏప్రిల్ 8 తేదీన ఇరాక్ ప్రభుత్వ సైనికులు విరుచుకుపడి విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో 34 మంది మరణించారు. ఆ తర్వాత విడుదలైన వీడియో ద్వారా ఇరాస్ సైన్యం ఉద్దేశ్యపూర్వకంగానే క్యాంపుపై దాడి చేసి కాల్పులు జరిపిందని స్పష్టమయ్యింది. సైనికులు తాపీగా పౌరులపై కాల్పులు జరపడం, తమ వాహనాలను వారిమీదుగా నడపడం వంటివన్నీ చూసిన వారికి అక్కడ ఉన్నవారిని చంపడానికే సైనికులు కాల్పులు జరిపారని స్పష్టమవుతుంది. ఈ ఘటన పట్ల…

బాంబుదాడిలో ఆఫ్ఘన్ ఆల్-ఖైదా నెం.2 మరణం -నాటో దురాక్రమణ సేనలు

అమెరికా నాయకత్వంలోని దురాక్రమణ సేనలు ఆఫ్ఘనిస్ధాన్ ఆల్-ఖైదా నెం.2 నాయకుడిని బాంబు దాడిలో చంపేశామని ప్రకటించాయి. ఆఫ్ఘనిస్ధాన్ లోని కూనార్ రాష్ట్రంలో రెండు వారాల క్రితం జరిపిన బాంబు దాడిలో ఆఫ్ఘనిస్ధాన్‌కి చెందిన ఆల్-ఖైదా సంస్ధకు నెం.2 నాయకుడిగా పేర్కొనదగ్గ “అబ్దుల్ ఘనీ” చనిపోయాడని అమెరికా నాయకత్వంలోని నాటో సేనలు తెలిపాయి. ఇతనిని అబు హాఫ్స్ ఆల్-నజ్ది అన్న పేరుతో కూడా సంబోధిస్తారు. సౌదీ అరేబియా దేశానికి చెందిన ఘనీ అనేక మంది అమెరికా సైనిక అధికారుల…

ది గ్రేట్ ఎస్కేప్: అమెరికా భద్రతా వ్యవస్ధను హేళన చేస్తూ 488 తాలిబాన్ ఖైదీల పరారీ

ఆఫ్ఘనిస్ధాన్‌లో అమెరికా సైన్యం, దాని తొత్తు ప్రభుత్వం ఖైదు చేసిన కాందహార్ జైలునుండి 488 మంది తాలిబన్ ఖైదీలు పరారయ్యారు. ఐదు నెలలపాటు తవ్వీన్ సొరంగం ద్వారా, డూప్లికేట్ తాళాలను ఉపయోగించి వీరు పరారయ్యారు. సర్పోజా జైలుగా పిలిచే ఈ జైలునుండి తాలిబాన్లు పరారు కావడం ఇది రెండో సారి. 2008 సంవత్సరంలో వెయ్యిమందికి పైగా ఖైదీలు ప్రధాన ద్వారం నుండే పరారయ్యారు. ఆ సంఘటన తర్వాత అమెరికా కాందహార్ జైలుకు గట్టి భద్రతా ఏర్పాట్లు చేసింది.…