“పౌర అణు ఒప్పందం” విషయంలో అమెరికా, ఇండియాను మోసగించనున్నదా?

2008 సంవత్సరంలో అమెరికా, ఇండియాలు “పౌర అణు ఒప్పందం” పై సంతకాలు చేశాయి. ఆ ఒప్పందం ద్వారా అప్పటివరకు అణు విషయాల్లో ప్రపంచంలో ఏకాకిగా ఉన్న ఇండియా అణు వ్యాపారంలో భాగస్వామ్యం పొందడానికి అమెరికా వీలు కల్పించిందని అంతర్జాతీయ కార్పొరేట్ పత్రికా సంస్ధలు వార్తలు రాశాయి. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందంపై ఇండియా సంతకం చేయనప్పటికీ అణు వ్యాపారం చేయడానికి ఇండియాకి అవసరమైన అణు పరికరాలు అమ్మడానికీ మినహాయింపు లభించిందని నిపుణులు వ్యాఖ్యానించారు. ఇది అరుదైన విషయమనీ…

అమెరికా సెనేట్‌లో విచిత్రం, వివాద పరిష్కారానికి చైనా బలప్రయోగంపై ఖండన తీర్మానం

అమెరికా సెనేట్‌లో సోమవారం ఒక విచిత్రం చోటు చేసుకుంది. బహుశా ప్రపంచ వింతల్లో ఒకటిగా ఇది స్ధానం సంపాదించుకోవచ్చు. దక్షిణ చైనా సముద్రంలో వివాదాల పరిష్కారానికి చైనా బల ప్రయోగం చేయడాన్ని ఖండిస్తూ అమెరికా సెనేట్ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. అదీ ఏకగ్రీవంగా. ఒక దేశానికి ‘బల ప్రయోగం చేయడం తగదు” అని సుద్దులు చెప్పే అర్హత అమెరికా తనకు తాను దఖలు పరుచుకోవడమే ఇక్కడ వింత. బల ప్రయోగం చేస్తే చైనాని నిస్సందేహంగా తప్పు పట్టవలసిందే.…

మాపై దాడి చేస్తే ఇజ్రాయెల్‌పైనా, అమెరికా సైనిక స్ధావరాలపైనా ప్రతిదాడికి మేం సిద్ధం -ఇరాన్

“ఇరాన్‌పై దాడికి తెగబడితే మేము కూడా ఇజ్రాయెల్ పైనా, ఈ ప్రాంతంలో అమెరికా ఏర్పాటు చేసుకున్న సైనిక స్ధావరాలపైనా దాడి చేసేందుకు మేం సిద్ధంగా ఉన్నాం” అని ఇరాన్ ప్రకటించింది. మధ్య ప్రాచ్యంలో ఇరాన్ తమ ప్రధాన శతృవుగా అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు భావిస్తాయి. ప్రాంతీయంగా ఇజ్రాయెల్ ఆధిపత్యానికి ఇరాన్ నుండే ముప్పు ఉందని అమెరికా, పశ్చిమ దేశాలు భావిస్తాయి. ఇజ్రాయెల్ వద్ద 300 కి పైగా అణ్వాయుధాలు ఉన్నప్పటికీ, అంతర్జాతీయ అణు ఇంధన సంస్ధ (ఐ.ఏ.ఇ.ఏ)…

ఆఫ్ఘనిస్ధాన్‌పై పాకిస్ధాన్ రాకెట్ల దాడి, తాలిబాన్‌కి మద్దతుగానేనని కర్జాయ్ ఆరోపణ

గత మూడు వారాలనుండి పాకిస్ధాన్ కనీసం 470 రాకెట్లు ప్రయోగించిందనీ, ఈ దాడిలో 36 మంది పౌరులు మరణించారనీ ఆఫ్ఘన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ ఆరోపించాడు. చనిపోయినవారిలో 12 మంది పిల్లలు కూడా ఉన్నారనీ ఆయన తెలిపాడు. పాకిస్ధాన్ సరిహద్దుల్లో ఉన్న కూనార్, నంగర్‌హార్ రాష్ట్రాలలో ఈ దాడులు చోటు చేసుకున్నాయని ఆఫ్గన్ సరిహద్దు అధికారులు తెలిపారని వాల్‌స్ట్రీట్ జర్నల్ పత్రిక తెలిపింది. నాటో బలగాలు ఈ రాష్ట్రాలనుండి ఖాళీ చేశాయి. రాకెట్ దాడులతో పౌరులు అక్కడినుండి…

ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ లు గ్రీసు ప్రజలపై రుద్దుతున్న పొదుపు చర్యలు ఇవే

గత బుధవారం ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ లు గ్రీసుకు రెండవ బెయిలౌట్ ప్యాకేజి ఇవ్వడానికి అంగీకారం కుదిరినట్లు ప్రకటించాయి. అందుకు ప్రతిగా గ్రీసు కఠినమైన పొదుపు విధానాలను అమలు చేయాల్సిందేనని షరతు విధించాయి. తాను అమలు చేయనున్న పొదుపు చర్యలను గ్రీసు ఇప్పటికే సిద్ధం చేసుకుంది. వీటిని రానున్న బుధ, గురువారాల్లో గ్రీసు పార్లమెంటు ఆమోదించాలి. ఐతే ఐర్లండు, పోర్చుగల్ దేశాల మాదిరిగా గ్రీసు ప్రతిపక్షాలు ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న పొదుపు చర్యలకు మద్దతు ఇవ్వడానికి నిరాకరించాయి. ప్రతిపక్షాలే కాదు,…

ఆఫ్ఘన్ సైనిక ఉపసంహరణ: ఆందోళనలో అమెరికా సైనికాధిపతులు

అమెరికా అధ్యక్షుడు ఒబామా ప్రకటించిన సైనిక ఉపసంహరణ అమెరికా సైనికాధికారులకు ఒక పట్టాన మింగుడుపడ్డం లేదు. ఉపసంహరించనున్న సైనికుల సంఖ్య చాలా ఎక్కువగా ఉందనీ, ఉపసంహరణ విషయంలో తమ అధ్యక్షుడు మరీ దూకుడుగా ఉన్నాడనీ వాళ్ళు భావిస్తున్నారు. జాయింట్ ఛీఫ్స్ ఆఫ్ స్టాఫ్‌కు ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న అడ్మిరల్ మైఖేల్ ముల్లెన్, ఆఫ్ఘనిస్ధాన్‌లో ఉన్నత స్ధాయి కమాండర్ డేవిడ్ పెట్రాస్‌లు ఒబామా ప్రకటించిన సంఖ్య “దూకుడు”గా ఉందని వ్యాఖ్యానించినట్లుగా వాల్‌స్ట్రీట్ జర్నల్పత్రిక తెలిపింది. వీరిద్ధరూ ఉపసంహరణ అమెరికా ఉపకరిస్తుందా…

బ్రిటన్ కూడా ఆఫ్ఘనిస్ధాన్‌నుండి సైన్యాన్ని ఉపసంహరిస్తుందట!

అమెరికా సైనికులను 33,000 మందిని వచ్చే సంవత్సరం సెప్టెంబరు లోపల ఆఫ్ఘనిస్ధాన్ దురాక్రమణ నుండి ఉపసంహరిస్తానని ప్రకటించాక ఫ్రాన్సు, తాను కూడా తన సైనికులు కొద్దిమందిని ఉపసంహరిస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బ్రిటన్ కూడా అమెరికాను అనుసరిస్తానని ప్రకటిస్తోంది. కనీసం 500 మంది బ్రిటిష్ సైనికుల్ని వెనక్కి రప్పించే అంశాన్ని బ్రిటన్ ప్రధాని కామెరూన్ పరిగణిస్తున్నట్లుగా వాల్‌స్ట్రీట్ జర్నల్ పత్రిక తెలిపింది. ఈ మేటర్‌తో సంబంధం ఉన్న విశ్వసనీయమైన వ్యక్తి తెలిపిన సమాచారంగా ఆ పత్రిక…

అణ్వాయుధ సామర్ధ్యంపై పరస్పర విశ్వాసం పెంపొందించుకుంటాం -పాక్, ఇండియా

అణ్వాయుధాలు, ఇతర సాంప్రదాయక ఆయుధాల సామర్ధ్యాలపై పరస్పరం విశ్వాసం పెంపొందించుకుంటామని పాకిస్ధాన్, ఇండియా దేశాలు ప్రకటించాయి. ఇతర అంశాల్లో కూడా నమ్మకం, విశ్వాసాలు పెంపొందించుకోవడానికి వీలుగా అదనపు చర్యలను తీసుకునే విషయం కూడా పరిశీలిస్తామనీ, అందుకోసం నిపుణుల సమావేశం జరిపి శాంతి, భద్రతల మెరుగుదలకు కృషి చేస్తామనీ ఇరు దేశాల విదేశాంగ కార్యదర్శులు అంగీకార పత్రంపై సంతకాలు చేశారు. భారత విదేశాంగ కార్యదర్శి నిరుపమా రావు పాకిస్ధాన్ విదేశీ కార్యదర్శితో చర్చల నిమిత్తం రెండు రోజుల క్రితం…

లిబియాపై దాడుల కొనసాగింపుకు అమెరికా ప్రతినిధుల సభ నిరాకరణ

శనివారం అమెరికా కాంగ్రెస్ లిబియాకి సంబంధించి రెండు బిల్లులపై ఓటింగ్ నిర్వహించింది. రెండు బిల్లులపై ప్రతినిధుల సభ ఇచ్చిన తీర్పు పరస్పర విరుద్ధంగా ఉన్నట్లు కనిపించడం ఆశ్చర్యకరం. నాటో నాయకత్వంలో లిబియాపై కొనసాగుతున్న మిలట్రీ ఆపరేషన్‌ను కొనసాగించడానికి అధ్యక్షుడు ఒబామాకు అధికారం ఇవ్వడానికి ప్రవేశపెట్టిన బిల్లును మెజారిటీ సభ్యులు తిరస్కరించారు. గత కొద్దివారాలుగా లిబియాలో అమెరికా నిర్వహిస్తున్న పాత్ర వివాదాస్పదం అయ్యింది. కాంగ్రెస్ ఆమోదం లేకుండానే అధ్యక్షుడు లిబియా యుద్ధంలో కొనసాగుతుండడాన్ని రిపబ్లికన్ పార్టీ సభ్యులు వ్యతిరేకించారు.…

ఆఫ్ఘనిస్ధాన్‌నుండి సైన్యం ఉపసంహరణలో అమెరికాతో పాటే ఫ్రాన్సు కూడా

ఆఫ్ఘనిస్ధాన్ దురాక్రమణ నుండి సైన్యాన్ని మొదటి దశలో మూడువిడతలుగా 33,000 మంది సైనికులను ఉపసంహరించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఫ్రాన్సు అధ్యక్షుడు నికోలస్ సర్కోజీ కూడా అమెరికాను అనుసరించనున్నట్లు ప్రకటించాడు. తమ సైనికుల్ని కూడా ఉపసంహరిస్తామని ప్రకటించింది. ఐతే, అమెరికా తర్వాత అత్యధిక సంఖ్యలో సైనికులను ఆఫ్ఘనిస్ధాన్‌ దురాక్రమణకు పంపిన ఇంగ్లండు ఇంతవరకూ ఈ విషయమై ఏ ప్రకటనా చేయకపోవడం విశేషం. అమెరికా ఉపసంహరించునే సైనికుల సంఖ్యకు దామాషాలో తాము తమ…

మిలట్రీకి ఎక్కువ, కాంగ్రెస్‌కి తక్కువ; సేనల ఉపసంహరణతో ఒబామా రాజకీయ క్రీడ

ఆఫ్ఘనిస్ధాన్‌లో దురాక్రమణ యుద్ధం కొనసాగిస్తున్న ఒక లక్షా ఒక వెయ్యి మంది అమెరికా సైనికుల్లో 33,000 మందిని 2012 సెప్టెంబరు మాసాంతంలోపు వెనక్కి రప్పిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు, అమెరికా త్రివిధ దళాల సర్వ సైన్యాధ్యక్ధుడు అయిన బారక్ ఒబామా బుధవారం ప్రకటించాడు. ఒబామా ప్రకటించిన ఉపసంహరణ సంఖ్య అమెరికాలోని వివిధ అధికార కేంద్రాలు ఒకే దృష్టితో చూడలేకపోవడం, భిన్న ధృవాలుగా చీలి ఉండడం గమనార్హమైన విషయం. 2012 చివర్లో మరోమారు అధ్యక్షుడిగా పోటీ చేయాలని భావిస్తున్న ఒబామా…

పాకిస్ధాన్‌పై దాడి చేశారా, జాగ్రత్త! -ఇండియాకు ‘జమాత్ ఉద్-దవా’ హెచ్చరిక

ఇండియా, పాకిస్ధాన్ దేశాల విదేశీ కార్యదర్శులు ఈ వారంలోనే పాకిస్ధాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో చర్చలు జరపనున్నారు. దీనికి సంబందించిన ఏర్పాట్లలో ఇరు దేశాలు మునిగి ఉండగా, తలవని తలంపుగా ఊడిపడిందో ప్రకటన. అది “జమాత్ ఉద్-దవా” (జెయుడి) అనే సంస్ధ, తన సంస్ధాగత సమావేశాలను జరుపుకుంటున్న సందర్భంగా ఇండియాకు చేసిన హెచ్చరిక. కరాచిలో కాన్ఫరెన్సు జరుపుకున్న ఈ సంస్ధ ముగింపులో ఓ డిక్లరేషన్‌ను విడుదల చేసింది. కాన్ఫరెన్సులో పాల్గొన్న నాయకులంతా ఒకే కల కన్నారేమో తెలియదు గానీ…

ఆఫ్ఘనిస్ధాన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్, అమెరికాల మధ్య పెరుగుతున్న దూరం!?

గత శనివారం ఆఫ్ఘనిస్ధాన్ అధ్యక్షుడు, అమెరికా కీలుబొమ్మ హమీద్ కర్జాయ్ అకస్మాత్తుగా అమెరికాపైన విరుచుకు పడ్డాడు. అమెరికాకి చెప్పకుండానే అమెరికా తాలిబాన్‌తో చర్చలు ప్రారంభించిందనీ, చర్చలు కొనసాగుతున్నాయని కూడా పత్రికలకు చెప్పేశాడు. ఆ తర్వాత అనివార్యంగా అమెరికా డిఫెన్స్ సెక్రటరీ రాబర్ట్ గేట్స్ కూడా తాము తాలిబాన్‌తో చర్చలు జరుపుతున్నామని అంగీకరించవలసి వచ్చింది. పనిలో పనిగా ఐక్యరాజ్యసమితిలో తాలిబాన్, ఆల్-ఖైదాలపై గల ఆంక్షలు, నిషేధాల జాబితాను విడదీస్తూ తీర్మానం కూడా ఆమోదించారు. ఆ తీర్మానానికి ఇండియా కూడా…

నాటో “డ్రోన్ హెలికాప్టర్” ను కూల్చివేసిన లిబియా సైన్యం

మానవ రహిత “డ్రోన్ హెలికాప్టర్” ను నాటో దళాలు కోల్పోయాయని నాటో తెలియజేసింది. లిబియాపై సాగిస్తున్న మిలట్రీ క్యాంపెయిన్‌లో లిబియా గగనతలం నుండి గూఢచర్యం నిర్వహిస్తున్న మానవ రహిత “డ్రోన్ హెలికాప్టర్,” నేపుల్స్ (ఇటలీ) లొ ఉన్న కమాండ్ సెంటర్ తో కాంటాక్టు కోల్పోయిందని నాటోకి చెందిన వింగ్ కమాండర్ మైక్ బ్రాకెన్ చెప్పాడని బిబిసి తెలిపింది. మౌమ్మర్ గడ్డాఫీకి చెందిన బలగాలు లిబియా పౌరులను భయోత్పాతాలకు గురిచేస్తూ, వారి ప్రాణాలకు ప్రమాదకరంగా మారిందీ లేనిదీ గగనతలం…

అమెరికా చర్చలు జరపనున్న తాలిబాన్ ఇక టెర్రరిస్టు సంస్ధ కాదట!?

తాలిబాన్‌తో పోరాటంలో డస్సిపోయిన అమెరికా తాలిబాన్‌తో చర్చలకు సిద్ధమై అందుకు తగిన ఏర్పాట్లను చేసుకుంటున్నది. మంచి తాలిబాన్‌తో చర్చలు జరుపుతామంటూ మూడు, నాలుగేళ్ళనుండే ప్రకటనలు చేస్తూ వచ్చిన అమెరికా అధికారులు అందుకోసం ఒక్కో అడుగూ వేస్తున్నారు. ఆఫ్ఘనిస్ధాన్ అధ్యక్షుడు, అమెరికా కీలుబొమ్మ హమీద్ కర్జాయ్ చేత “తాలిబాన్ తో అమెరికా చర్చలు జరుపుతున్నదంటూ రెండు రోజుల క్రితం ప్రకటన ఇప్పించింది. సంబంధాలు మెరుగుపరుచుకునే దిశలో తాలిబాన్‌ను ప్రోత్సహించడానికని చెబుతూ ఇప్పుడు ఆంక్షలు, నిషేధాలు విధించడానికి ఐక్యరాజ్యసమితి తాలిబాన్,…