మృ(మ)గత్వాన్ని ధిక్కరించి, రాజ్యాధిపత్యాన్ని వణికించిన సాహసి ఇక లేదు

యావత్భారతదేశాన్ని అశ్రుధారల్లో ముంచుతూ ఆ సాహసిక యువతి తుదిశ్వాస విడిచింది. క్రూర మృగాలు సైతం సిగ్గుపడేలా ఆరుగురు మగవాళ్ళు అత్యంత హేయమైన రీతిలో ఆడిన పాశవిక మృత్యుక్రీడలో ఆమె ఆవిసిపోయి సెలవు తీసుకుంది. శరీరాన్ని నిలిపి ఉంచే వివిధ అవయవాలు విషతుల్యమైన రక్తం ధాటికి ఒక్కొక్కటీ కూలి సోలిపోగా కుటుంబసభ్యుల మధ్యా, పేరు మోసిన వైద్యుల మధ్యా శాశ్వతంగా కన్నుమూసింది. పోతూ పోతూ అభివృద్ధి సాధించామని చెప్పుకుంటున్న నాగరీక మానవుల మానవత్వాన్ని పరిహసించి పోయిందామె. “ఆమెను బతికించడానికి…

బాధితురాలి సింగపూర్ తరలింపు రాజకీయం -డాక్టర్లు; కాదు -ప్రభుత్వం

ఢిల్లీ బస్సులో సామూహిక అత్యాచారానికి గురయిన అమానత్ (అసలు పేరు కాదు) ను సింగపూర్ లోని ‘మౌంట్ ఎలిజబెత్ హాస్పిటల్’ కి తరలించాలన్న నిర్ణయం ప్రభుత్వం తీసుకున్న రాజకీయ నిర్ణయమే తప్ప తాము తీసుకున్న వైద్య నిర్ణయం కాదని అమానత్ కి వైద్యం చేసిన డాక్టర్లు చెబుతున్నారు. ప్రభుత్వం మాత్రం వైద్యం కోసమే సింగపూర్ తరలింపు నిర్ణయం తీసుకున్నామని చెబుతోంది. బాధితురాలి ఆరోగ్యం మరింత క్షీణిస్తున్నదనీ, ఆమె శరీర అవయవాలు పని చేయడం లేదనీ, ఆమె మెదడుకు…