ఉపాధి పొందే హక్కు ప్రతి ముస్లిం సొంతం -ఆర్ఎస్ఎస్ చీఫ్

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్ సంఘ్ చాలక్ అయిన మోహన్ భగవత్ ముస్లింల పట్ల దయ తలిచారు. హిందువులు, ముస్లింలు అన్న తేడా కూడదనీ, వాళ్ళిద్దరూ ఇప్పటికే ఒక్కటయ్యారని తేల్చి చెప్పారు. భారత దేశంలో ఉపాధి పొందే హక్కు ప్రతి ఒక్క ముస్లిం వ్యక్తికీ ఉన్నదని కూడా చాటారు. ఆర్ఎస్ఎస్ సంస్థ రెండవ గురువు, సిద్ధాంత కర్తగా పేర్కొనే గురు గోల్వాల్కర్ గారు ముస్లిం లకు అలాంటి స్వేచ్ఛ ఉందన్న సంగతి నిరాకరించారు. ముస్లిం మతావలంబకులు…

మూతపడని నోళ్ళు, గీత దాటితే సీత గతేనట!

అత్యాచారాలకి వ్యతిరేకంగా అంతపెద్దఎత్తున జనం ఉద్యమించినా పురుష పుంగవుల నోళ్ళు మూతపడబోమంటున్నాయి. గీత దాటితే సీతకి పట్టిన గతే పడుతుందని బి.జె.పి నాయకుడొకరు నోరు పారేసుకుంటే, మహిళలపై అత్యాచారాలు ఇండియాలో జరుగుతున్నాయి గానీ భారత్ లో జరగడం లేదని ఆర్.ఎస్.ఎస్ సుప్రీం నాయకుడు స్పష్టం చేస్తున్నాడు. మధ్య ప్రదేశ్ బి.జె.పి మంత్రి కైలాస్ విజయ్ వర్గియా, ఆర్.ఎస్.ఎస్ సర్ సంఘ్ చాలక్ మోహన్ భగవత్ తాజాగా మహిళాలోకం ఆగ్రహాన్నీ, పౌర ప్రపంచం ఖండన మండనలను ఎదుర్కొన్నారు. “Ek…