2జి ఫీజు 36,000 కోట్లు ఉండాలని చెప్పా, ప్రధాని పట్టించుకోలేదు -కేబినెట్ కార్యదర్శి

2జి కుంభకోణం విషయంలో ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రకటిత అమాయకత్వం ఒట్టి నటనే అన్న సంగతి అనూహ్య రీతిలో వెల్లడయింది. జాయింట్ పార్లమెంటరీ కమిటీ విచారణలో సి.పి.ఐ సభ్యుడు గురుదాస్ దాస్ దాస్ గుప్తా తరచి తరచి అడిగిన ప్రశ్నలకు ఉక్కిరి బిక్కిరి అయిన మాజీ కేబినెట్ కార్యదర్శి అసలు సంగతి కక్కడంతో ప్రధాని దాపరికం గుట్టు రట్టయ్యింది. 2జి స్పెక్ట్రమ్ ఎంట్రీ ఫీజు అప్పటి మార్కెట్ ధరల ప్రకారం 36,000 కోట్ల రూపాయలుగా నిర్ణయించాలని తాను…

కలైజ్గ్నర్ టీ.వి ఛానల్ కార్యాలయంపై సి.బి.ఐ దాడి, షేర్ మార్కెట్ పతనం

  తమిళనాడులో అధికార పార్టీగా ఉన్న డి.ఎం.కె పార్టీ అధినేత కరుణానిది కుటుంబానికి చెందిన కలైజ్గ్నర్ టీ.వి చానల్ కార్యాలయాలపై శుక్రవారం సి.బి.ఐ దాడులు నిర్వహించింది. 2-జి స్పెక్ట్రం స్కాముకు సంబంధించి లైసెన్సు పొందిన టెలి కంపెనీల్లో ఒకటైన స్వాన్ టెలికం సంస్ధ లైసెన్సు పొందటం కోసం టి.వి ఛానెల్ కు 47 మిలియన్ డాలర్లు (దాదాపు 214 కోట్ల రూపాయలు) ముడుపులుగా చెల్లించినట్లుగా ఆరోపణలు రావడంతో ఈ దాడులు నిర్వహించినట్లు తెలుస్తోంది. సి.బి.ఐ దాడులు జరిగిన…