శపధాల ఆజ్యం పోసి దావానలం రాజేస్తాం!
(విప్లవ కమ్యూనిస్టు పార్టీ నేత మాదాల నారాయణ స్వామి గారు డిసెంబర్ 9 తేదీన 99 యేళ్ళ వయసులో మరణించారు. చివరి క్షణాల వరకూ విప్లవ రాజకీయాలను శ్వాసించిన స్వామి గారు ఎం.ఎన్.ఎస్ గా సుప్రసిద్ధులు. 1952లో ఒంగోలు అసెంబ్లీకి, 1962లో ఒంగోలు పార్లమెంటు సభ్యత్వానికి ఎన్నికయిన ఎం.ఎన్.ఎస్ గారు ధనిక కుటుంబంలో జన్మించినప్పటికీ తన జీవితం అంతా శ్రామికవర్గ విముక్తికి అంకితమై పని చేశారు. ప్రకాశం జిల్లా పల్లెలకు ‘స్వామిగారు’ గా చిరపరిచితులయిన ఎం.ఎన్.ఎస్ గారు…
