మమత ఒంటరితనం స్వయంకృతం! -కార్టూన్

ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ప్రజలకు వ్యతిరేకంగా ఉపయోగించడం భారత పాలకుల నైజం. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ఇందులో నాలుగాకులు ఎక్కువే చదివింది. ఎన్నికల నాటి ప్రమాణాలను సంవత్సరం లోపే పూర్తి చేసేశానని ప్రకటించిన మమత ‘వాగ్దానాలను అమలు  చేయండి’ అని అడిగిన ఒక సాధారణ రైతు పైన మావోయిస్టు అని ముద్ర వేసి అరెస్టు చేయించింది. తద్వారా మావోయిస్టులు రైతుల కోసం పని చేస్తున్నారని చెప్పకనే చెప్పింది. మహిళల హక్కులు, ప్రజల ప్రజాస్వామిక హక్కులు హరించబడుతున్నాయని ఒక…

మమతకు ప్రజల ప్రశ్నలు సుత్తీ కొడవళ్ళుగా కనిపిస్తున్నాయా? -కార్టూన్

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఫాసిస్టు విన్యాసాలు కొనసాగుతున్నాయి. ప్రజలిచ్చిన అధికారాన్ని ప్రజలపై విరుచుకు పడడానికే వినియోగిస్తున్నది. ప్రజలకు కావలసింది శుష్క వాగ్దానాలు కావనీ, ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయడానికి ముఖ్యమంత్రిగా ఏం చేస్తున్నావని ప్రశ్నించినందుకు టి.బి తో బాధపడుతున్న ఒక సాధారణ రైతును అరెస్టు చేసి దొంగ కేసులు బనాయించింది. బుధవారం పశ్చిమ మిడ్నపూర్ లో బహిరంగ సభ పూర్తయ్యాక ఎప్పటిలాగే ప్రశ్నలు అడగాలని కోరిన మమత రైతులకోసం ఏమి చేస్తున్నారన్న ప్రశ్నను సహించలేకపోయింది.…

మమతాగ్రహం: సి.ఎన్.ఎన్-ఐ.బి.ఎన్ స్టూడియోలో ఏం జరిగింది?

శుక్రవారం సాయంత్రం సి.ఎన్.ఎన్-ఐ.బి.ఎన్ చానెల్ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీతో లైవ్ ముఖా ముఖి నిర్వహించింది. కలకత్తాలో ప్రఖ్యాతి చెందిన ‘టౌన్ హాల్’ లో జరిగిన ఈ ముఖాముఖీలో యూనివర్సిటీ విద్యార్ధినులు అడిగిన  ప్రశ్నలకు అసహనం చెంది, వారిపైన ‘మావోయిస్టు’ ముద్రవేసి ఇంటర్వ్యూ నుండి అర్ధాంతరంగా లేచి వెళ్లిపోయింది. ముఖాముఖీలో హాజరై ఆమెకి నచ్చని ప్రశ్నలు అడిగినందుకు విద్యార్ధినీ, విద్యార్ధులకు మావోయిస్టులతోనూ, సి.పి.ఐ(ఎం) తోనూ సంబంధాలున్నాయేమో విచారించాలని పోలీసులకు ఆదేశాలిచ్చింది. టౌన్ హాల్ లో ఏం…

టి.వి ఇంటర్వ్యూ మధ్యలోనే ఆగ్రహంతో వెళ్ళిపోయిన మమత

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ తన ఫాసిస్టు ఉద్దేశాలను మరోసారి వెళ్లగక్కింది. విద్యార్ధులు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి బదులు “మీరంతా మావోయిస్టులు, సి.పి.ఐ (ఎం) పార్టీ వాళ్ళు” అని ఆరోపిస్తూ టి.వి ఇంటర్వూని మధ్యలోనే వదిలి వెళ్లిపోయింది. ప్రశ్నలను అడుగుతున్న విద్యార్ధులందరినీ ఫోటోలు తీసి విచారించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. సి.ఎన్.ఎన్-ఐ.బి.ఎన్ చానెల్ మోడరేటర్ సాగరికా ఘోష్ వారంతా విద్యార్ధులని చెబుతున్నా వినకుండా స్టూడియో నుండి ఆగ్రహంతో ఊగిపోతూ వెళ్లిపోయింది. పోలీసులు ఇప్పటికే…

కొత్త పుంతలు తొక్కుతున్న ‘మమత’ ఫాసిస్టు పాలన

పశ్చిమ బెంగాల్ లో మమత బెనర్జీ నేతృత్వంలోని ప్రభుత్వ ఫాసిస్టు పాలన కొత్త పుంతలు తొక్కుతోంది. భారత దేశంలోని పాలక వర్గ పార్టీలు నామ మాత్రంగా ఏర్పరుచుకున్న నియమాలను, సూత్రాలనూ సైతం ఉల్లంఘిస్తోంది. రేపిస్టులకూ, హంతకులకు మద్దతుగా రావడమే కాకుండా రైతుల ఆత్మహత్యలను బూటకంగా అభివర్ణిస్తూ ‘పచ్చి ప్రజా వ్యతిరేకి’ గా తనను తాను రుజువు చేసుకుంటోంది. మమత వ్యవహార సరళితో బెంగాల్ లోని వివిధ రంగాల మేధావులు తీవ్రంగా నిరసిస్తూ ఓ ప్రకటన జారీ చేశారు.…