మమత హిపోక్రసీ: పాలు, విద్యుత్ రేట్లు పెంచి, రైలు చార్జీలపై నాటకం

అధికారంలోకి వచ్చిన సంవత్సరం లోపే పశ్చిమ బెంగాల్ ముఖ్య మంత్రి మమత బెనర్జీ మూడు సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచింది. ట్రామ్ వేస్ కార్పొరేషన్ కి ఇస్తున్న సబ్సిడీ రద్దు చేయడమే కాక త్వరలో ఛార్జీలు కూడా పెంచబోతోంది. ప్రతి వంట గదిలో అత్యవసరంగా ఉపయోగించే పాల ఛార్జీలు పెంచింది. ఇన్ని చేసిన మమత రైలు ఛార్జీలు పెంచాడంటూ తన పార్టీ నాయకుడిని కేంద్ర మంత్రి పదవి నుండే తొలగించింది. “రైల్వే ఏ.సి ఛార్జీలు పెంచినా ఫర్వాలేదు…

Railway budget 2012-13

మమత, త్రివేది, రైల్వే బడ్జెట్ -కార్టూన్

రైల్వే మంత్రి దినేష్ త్రివేది తృణమూల్ నేత. ఆయన మమత మాటను జవదాటేవాడేమీ కాదు. భారత దేశంలో రాజకీయ పార్టీలు భూస్వామ్య వ్యవస్ధలకు ప్రతీకలుగా ఉన్నాయే తప్ప ప్రజాస్వామ్య బద్ధగా లేవు. పార్టీ కార్యకర్తల కంటే పార్టీ నాయకులే అక్కడ సుప్రీం. అలాంటి ప్రజాస్వామ్య రహిత పార్టీల్లో తృణమూల్ కూడా ఒకటి. అదీ కాక ఎన్.డి.ఎ ప్రభుత్వంలో మమత రైల్వే మంత్రిగా పని చేసింది. యు.పి.ఎ ప్రభుత్వంలో కూడా మూడేళ్ళు రైల్వే మంత్రిగా పని చేసింది. బెంగాల్…

సొమ్ములు నొక్కడానికి పాపులిస్టు ఫోజులు, మమత నక్క జిత్తులు

పెట్రోలు ధరలు ఈ సంవత్సరం ఇప్పటికి ఐదు దార్లు పెంచారు. పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పదకొండు సార్లు పెంచారు. పెట్రోలియం ఉత్పత్తుల ధరల పెంపుపై గతంలో ఎన్నడూ నోరు విప్పని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ కొద్ది రోజుల క్రితం రు1.80 లు పెంచితే గయ్యిమని లేచింది. పెంచిన రేట్లు తగ్గిస్తారా లేక కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించమంటారా? అంటూ తాఖీదు పంపింది. పెట్రోల్ ధరలు తగ్గించకపోతే మద్దతు ఉపసంహరిస్తామని తన ఎం.పిలు (తనకు తెలియకుండా)…