ఇజ్రాయెల్ గూండా బాంబు దాడుల్లొ ఇద్దరు సూడాన్ కారు ప్రయాణికుల దుర్మరణం

మధ్యప్రాచ్యం ప్రాంతంలో ఇజ్రాయెల్ రౌడీ చర్యలు కొనసాగుతున్నాయి. ప్రపంచ పోలీసు అమెరికాకి అనుంగు మిత్రుడైన ఇజ్రాయెల్ తాజాగా సూడాన్ లో కారులో ప్రయాణిస్తున్న ఇరువురిని పొట్టన బెట్టుకుంది. చనిపోయినవారు ఎవరైందీ ఇంకా గుర్తించలేదు. పాలస్తీనా ప్రాంతం ‘గాజా’ లోని ప్రభుత్వానికి ఇతర దేశాలు గానీ వ్యక్తులు గానీ ఆయుధాలు సరఫరా చేయకుండా ఉండడానికి ఇజ్రాయెల్ కాపలా కాస్తుంటుంది. పశ్చిమాన మధ్యధరా సముద్రంలో, దక్షిణాన ఎర్ర సముద్రంలోనూ ఇజ్రాయెల్ వాయు, నౌకా బలగాలు కాపలా కాస్తూ అనుమానం వచ్చిన…

గడ్డాఫీపై అమెరికా రాయబారి రాసింది కరెక్టు కాదు -ఉక్రెయిన్ నర్సు

గడ్డాఫీ తనకు సేవచేసిన ఐదుగురు ఉక్రెయిన్ నర్సులలో ఒకరితో ప్రత్యేక సంబంధం ఉందంటూ లిబియాలోని అమెరికా రాయబారి రాసింది కరెక్టు కాదని ఐదుగురిలో ఒకరైన “ఒక్సానా బాలిన్స్కాయా” రష్యా పత్రికకు తెలిపింది. గడ్డాఫీ ఆనారోగ్యంతో ఉండగా ఉక్రెయిన్ కి చెందిన అయిదుగురు నర్సులు నర్సింగ్ సేవలు అందించారు. వారిలో ఒకరైన “గాలినా కొలోట్నిట్స్కా” తో గడ్డాఫీకి ప్రత్యేక సంబంధం ఉందనీ, ఆమే లేకుండా గడ్డాఫీ ఒక్క క్షణం కూడా ఉండలేడనీ 68 సంవత్సరాల వయసుగల గడ్డాఫీ గురించి…

లిబియా తిరుగుబాటు ప్రభుత్వానికి మరిన్ని దేశాల గుర్తింపు, మొదలైన ఆయిల్ ఎగుమతులు

లిబియా తూర్పు ప్రాంతంలో పెద్ద పట్టణమైన బెంఘాజీ కేంద్రంగా ఏర్పదిన తాత్కాలిక తిరుగుబాటు ప్రభుత్వం (లిబియా జాతీయ కౌన్సిల్) మరిన్ని దేశాల గుర్తింపును పొందింది. కౌన్సిల్ ఏర్పడడంతోనే ఫ్రాన్సు గుర్తించిన సంగతి విదితమే. ఫ్రాన్సు, బ్రిటన్ లు కాలికి బలపం కట్టుకుని మరీ యూరోపియన్ దేశాలను కోరినప్పటికీ అవి తిరుగుబాటు ప్రభుత్వాన్ని గుర్తించడానికి ముందుకు రాలేదు. యూరోపియన్ యూనియన్ కు ఆర్ధికంగా నాయకత్వం వహిస్తున్న జర్మనీ తిరుగుబాటు ప్రభుత్వాన్ని గుర్తించడానికి గట్టిగా నిరాకరించింది. పశ్చిమ దేశాలు లిబియాపై…

మళ్ళీ పురోగమిస్తున్న గడ్డాఫీ బలగాలు, ఐక్యరాజ్యసమితి తీర్మానాన్ని అతిక్రమించే దిశలో పశ్చిమ దేశాలు

గడ్డాఫీ బలగాల ధాటికి లిబియా తిరుగుబాటు బలగాలు మళ్ళీ వెనక్కి పారిపోతున్నాయి. పశ్చిమ దేశాల వైమానిక దాడుల మద్దతు లేకుండా తిరుగుబాటు బలగాలు పురోగమించడం అసాధ్యమని స్పష్టమై పోయింది. గడ్డాఫీకి వ్యతిరేకంగా ఆయుధాలు చేపట్టిన పౌర సైన్యానికి శిక్షణ కొరవడడంతో తాము స్వాధీనం చేసుకున్న ప్రాంతాల్ని నిలబెట్టుకోలేక పోతున్నాయి. పశ్చిమ దేశాల వైమానిక దాడులతో స్వాధీనం చేసుకున్న పట్టణాలను తిరుగుబాటు దారులు వదిలిపెట్టి తూర్పువైపుకు పారిపోతున్నాయి. దీనితో ఐక్యరాజ్యసమితి తీర్మానాన్ని అతిక్రమిస్తూ తిరుగుబాటు బలగాలకు ఆయుధ సాయం…

గడ్డాఫీకి మద్దతుగా లిబియా ప్రజలు?

  Retreating rebels in Libya పశ్చిమ దేశాల వైమానిక దాడులు లేకుండా లిబియా తిరుగుబాటు బలగాలు ముందుకు కదల్లేక పోతున్నాయి. మంగళవారం లండన్ లో లిబియా విషయమై ప్రపంచ దేశాల కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. ఈ లోపల సిర్టే పట్టణాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న తిరుగుబాటు బలగాలపై గడ్డాఫీ బలగాలు భారీగా దాడి చేశాయి. దానితో లిబియా తిరుగుబాటు దారులు సిర్టే పట్టణం స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు వదిలేసి తూర్పువైపుకు పలాయనం ప్రారంభించారు. సిర్టే పట్టణ…

పశ్చిమ దేశాల దాడుల్లో వందకు పైగా లిబియన్ల మరణం, కొనసాగుతున్న దురాక్రమణ దాడులు

లిబియాపై నో-ఫ్లై జోన్ అమలు చేసే పేరుతో పశ్చిమ దేశాల యుద్ద విమానాలు విచక్షణా రహితంగా చేస్తున్న దాడుల్లొ ఇప్పటికి వందకు పైగా లిబియా పౌరులు మరణించినట్లు లిబియా ప్రభుత్వం ప్రకటించింది. ఐక్యరాజ్య సమితి తీర్మానం గడ్డాఫీకి చెందిన భూతల సైనిక దళాలపై దాడులకు అనుమతి ఇవ్వలేదనీ, అయినా పశ్చిమ దేశాలు గడ్డాఫీ సైనికులపై వైమానిక దాడులు చేస్తుండడం ఆమోదనీయం కాదనీ రష్యా విదేశాంగ మంత్రి “సెర్గీ లావరోవ్” రాయిటర్స్ వార్తా సంస్ధతో మట్లాడుతూ అన్నాడు. గడ్డాఫీ…

సంకీర్ణ సేనల దాడుల సాయంతో కీలక పట్టణం తిరుగుబాటుదారుల స్వాధీనం

పశ్చిమ దేశాల సంకీర్ణ సేనల భారీగా దాడులు చేస్తుండడంతో గడ్డాఫీ బలగాలు కీలకమైన అజ్దాబియా పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నారు. లిబియా తూర్పు ప్రాంతానికి ముఖ ద్వారంగా చెప్పుకునే అజ్దాబియా కోల్పోవడంతో గడ్డాఫీ బలగాల పురోగమనం ఆగిపోయినట్లే. దాదాపు రెండు వారాలనుండి తిరుగుబాటుదారుల నుండి ఒక్కొక్క పట్టణాన్నీ స్వాధీనం చేసుకుంటూ వెళ్తున్న గడ్డాఫీ బలగాలకు పశ్చిమ దేశాల సైనిక చర్య గట్టి దెబ్బ తీసింది. తిరుగుబాటుదారుల ప్రతిఘటన కారణంగా కాకుండా పశ్చిమ దేశాల దాడుల వలన అజ్దాబియాని చేజిక్కించుకున్న…

యెమెన్ లో ఆగని అనుకూల, ప్రతికూల ప్రదర్శనలు, షరతులతో రాజీనామాకి సిద్ధమన్న అధ్యక్షుడు

యెమెన్ లో అధ్యక్షుడికి వ్యతిరేకంగా ప్రదర్శనలు జరుగుతుండగా అధ్యక్షుడు కూడా తనకు అనుకూలంగా ర్యాలీలు నిర్వహింప జేస్తున్నాడు. అధ్యక్షుడు ఆలీ అబ్దుల్లా సలే వెంటనే గద్దె దిగాలని డిమాండ్ చేస్తూ నెలన్నర క్రితం రాజధాని సనా లోని యూనివర్సిటీ విధ్యార్ధులు మొదలు పెట్టిన ఉద్యమం ఇతర సెక్షన్ల ప్రజల చేరికతో తీవ్ర రూపం దాల్చింది. శుక్రవారం (మార్చి, 25) ఇరుపక్షాలు పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించాయి. ర్యాలిల్లొ పదుల వేల సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారని బిబిసి తెలిపింది.…

తొత్తు అరబ్ ప్రభుత్వాల మద్దతుతో లిబియాపై దాడికి ‘నాటో’ నాయకత్వం

తమ మాట వినే అరబ్ దేశాల మద్దతుతొ లిబియాపై జరుపుతున్న దాడులకు ఆమోద యోగ్యత సాధించడానికి పశ్చిమ దేశాలు ప్రయత్నిస్తున్నాయి. మొదట లిబియాపై సైనిక చర్యను తీవ్రంగా వ్యతిరేకించిన కతార్ ఇప్పటికే దాడుల్లో పాల్గొంటున్నది. తాజాగా టర్కీ కూడా కతార్ తో జత కలిసింది. “అరబ్ దేశాల్లో ప్రజాస్వామిక ఉచ్యమాలు తలెత్తడానికి పశ్చిమ దేశాలు అరబ్ దేశాల పట్ల అనుసరిస్తూ వచ్చిన విధానాలే కారణమ”ని హెచ్చరించిన టర్కీ ఇప్పుడు నో-ఫ్లై అమలుకు నాటొ నాయకత్వానికి అంగీకరించింది. గురువారం…

జెరూసలేంలో సూట్ కేసు బాంబు పేలుడు, ఒకరి మృతి

పాలస్తీనా, ఇజ్రాయెల్ మధ్య తాజాగా ఘర్షణలు రాజుకుంటున్నాయి. మంగళవారం ఇజ్రాయెల్ సైనిక విమానం జరిపిన దాడిలో  పాలస్తీనా మిలిటెంట్ల రాకేట్ దాడులకు ప్రతిగా ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిగిన తర్వాత పశ్చిమ జెరూసలేం లోని ఒక బస్ స్టేషన్ లో ఉంచిన సూట్ కేసు బాంబు పేలింది. ఇద్దరు పిల్లలతో సహా 8 మంది పాలస్తీనీయులు ఈ దాడిలో చనిపోయారు. ఇజ్రాయెల్ వైమానిక దాడికి ప్రతీకార చర్యగా గాజాలోని ఇస్లామిక్ జీహాద్ సంస్ధ రెండు రాకెట్లను ఇజ్రాయెల్…

ఇరాన్ అధ్యక్షుడి సందర్శన వార్త అమెరికాకి ముందుగా తెలిపిన భారత అధికారులు -వికీలీక్స్

ఇరాన్ అధ్యక్షుడు భారతదేశాన్ని సందర్శించబోతున్న విషయం భారత ప్రభుత్వంలోని ఇతర మంత్రిత్వశాఖలకు తెలపడానికి ముందు అమెరికా రాయబారికి భారత విదేశీ మంత్రిత్వశాఖ అధికారులు తెలియజేసిన విషయం వికీలీక్స్ బయట పెట్టిన ‘డిప్లొమేటిక్ కేబుల్స్’ ద్వారా వెల్లడయ్యింది. ఏప్రిల్ 29, 2008 తేదీన ఇరాన్ అధ్యక్షుడు అహ్మది నెజాద్ ఇండియా రానున్నాడని కొత్తఢిల్లీ లోని అమెరికా రాయబారి కార్యాలయంలో ఉండే రాజకీయ విభాగాధిపతికి భారత విదేశీ మంత్రిత్వ శాఖ లొని ఓ సీనియర్ అధికారిణి సమాచారం ఇచ్చినట్లుగా రాజకీయ…

యెమెన్ ఆందోళనకారులతో చేతులు కలుపుతున్న మిలట్రీ అధికారులు

యెమెన్ అధ్యక్షుడు ఆలీ అబ్దుల్లా సలే కి వ్యతిరేకంగా ఆందోళనలు తీవ్రం అయ్యేకొద్దీ మిలట్రీ అధికారులు ఒక్కరొక్కరుగా అధ్యక్షుడిని వదిలి ఆందోళనకారులతో చేరుతున్నారు. మిలట్రీ జనరల్ ఆలీ మొహసేన్ అల్-అమ్హర్ సోమవారం తన పదవికి రాజీనామా చేశాడు. “పోరాటం రాను రానూ క్లిష్ట సమస్యగా మారుతోంది. హింస, అంతర్యుద్ధం వైపుగా వెళ్తోంది. నా ఆలోచనలు, నాటోటి కమాండర్ల, సైనికుల ఆలోచనల ప్రకారం మేము యువకుల విప్లవానికి శాంతియుత మద్దతు తెలుపుతున్నాము. భద్రత, దేశ సుస్ధిరత లను కాపాడటంలో…

లిబియా పౌరుల రక్షణకై చేసే దాడుల్లో పౌరులే చనిపోతున్నారు -అరబ్ లీగ్

అరబ్ లీగ్ సెక్రటరీ జనరల్ అమీర్ మౌసా లిబియాపై పశ్చిమ దేశాల దాడులు తీవ్ర స్ధాయిలో ఉండడాన్ని ఆదివారం విమర్శించాడు. లిబియా పౌరులను గడ్డాఫీ విమానాల దాడులనుండి రక్షించడకోసం భద్రతా సమితి అనుమతి ఇచ్చింది తప్ప వారిని చంపడానికి కాదన్నాడు. లిబియాలో జరుగుతున్నది లిబియాపై ‘నో-ఫ్లై జోన్’ అమలు చేయాలన్న లక్ష్యానికి భిన్నంగా ఉన్నదని విమర్శించాడు. పౌరుల రక్షణనే మేం కోరాం తప్ప మరింతమంది పౌరులపై దాడులు చేయడం కాదన్నాడు. ఆదివారం పశ్చిమ దేశాలను విమర్శించిన అమిర్…

లిబియాపై అమెరికా, ఐరోపా దేశాల క్షిపణి దాడులు, పౌరుల మరణం

లిబియా పౌరులను గడ్డాఫీ నుండి రక్షించే పెరుతో అమెరికా, ఫ్రాన్సు, బ్రిటన్ దేశాలు లిబియాలోని తిరుగుబాటుదారుల కేంద్ర పట్టణం ‘బెంఘాజీ’ పై మిస్సైళ్ళతో దాడులు చేశాయి. ఈ దాడుల్లో పదుల సంఖ్యలో లిబియా పౌరులు మరణించినట్లు తెలుస్తున్నది. మరో వైపు గడ్డాఫీ పశ్చిమ దేశాలతో దీర్ఘకాలిక యుద్ధం సాగిస్తానని ప్రతిన బూనాడు. ఐక్యరాజ్యసమితి లోని భద్రతా సమితి చేత దాడులకు అనుకూలంగా తీర్మానం చేయించుకుని, ఆ తీర్మానాన్ని అమలు చేయడానికి దాడులు చేస్తున్నామని పశ్చిమ దేశాలు చెప్పడంలో…

లిబియాపై దాడికి రెడీ, పశ్చిమదేశాల మరో దుస్సాహసం

గడ్డాఫీ నుండి లిబియా ప్రజలను రక్షించే పేరుతో లిబియాపై దాడి చేయడానికి పశ్చిమ దేశాలు సిద్ధమయ్యాయి. వాటికి కొన్ని అరబ్ దేశాలు సహకరించనున్నాయి. గడ్డాఫీ తనపై తిరుగుబాటు చేస్తున్న ప్రజలను చంపుతున్నాడనే సాకుతో అతని యుద్ధవిమానాలు ఎగరకుండా ఉండటానికి “నిషిద్ధ గగనతలం” అమలు చేస్తామని పశ్చిమ దేశాలు కొన్ని వారాలుగా హెచ్చరిస్తున్న విషయం తెలిసిందే. లిబియాలోని తూర్పు ప్రాంతాన్నీ, పశ్చిమ ప్రాంతంలోని కొన్ని పట్టణాలను స్వాధీనం చేసుకున్న తిరుగుబాటుదారులపై గడ్డాఫీ బలగాలు వారం రోజులనుండి దెబ్బమీద దెబ్బ…