గిరిజన విద్యకు గుజరాత్ వరస్ట్ రాష్ట్రం -బి‌జే‌పి నేత

కేంద్ర మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు, తొలగింపులు జరిగాక అసమ్మతి స్వరాలు మెల్లగా బయలు దేరుతున్నా యి. అయితే ఆ అసమ్మతి పదవి పేరుతో కాకుండా పార్టీ పనితనం పేరుతో వ్యక్తం కావటం విశేషం. ‘కాంగ్రెస్ కంటే మాది భిన్నమైన పార్టీ’ అని బి‌జే‌పి నేతలు చెబుతుంటారు. అసమ్మతిలో కూడా భిన్నం అన్నమాట! కేంద్ర మంత్రివర్గంలో మన్సుఖ్ వాసవ నిన్నటి వరకు గిరిజన శాఖ మంత్రిగా పని చేశారు. బి‌జే‌పి/మోడి ప్రభుత్వం అధికారం చేపట్టిన మే 2014 నుండి…