తెరచాప కడితే హెలికాప్టర్ ఎగురుతుందా? -కార్టూన్
దేశాల విదేశాంగ విధానాలకు ఆయా దేశాల ప్రజల ప్రయోజనాలే పరమావధిగా ఉండాలి. అందులో సందేహం లేదు. కానీ ప్రజల ప్రయోజనాలు ఏమిటన్నదీ సంకుచిత, స్వల్పకాలిక స్వార్ధ పూరిత ఎత్తుగడలు నిర్ణయించరాదని ఈ కార్టూన్ లో ‘ది హిందూ‘ కార్టూనిస్టు కేశవ్ చెబుతున్నారు. బహుశా శ్రీలంక మానవ హక్కుల తీర్మానం, కాశ్మీరులో భారత్-పాక్ సైనికుల ఘర్షణలు, (ఇటలీ మెరైన్ల వ్యవహారం కూడానా?) కార్టూనిస్టు దృష్టిలో ఉన్నాయనుకుంటాను. ఎల్.టి.టి.ఇ తో పోరాటం గెలిచిన చివరి రోజుల్లో శ్రీలంక సైన్యం తమిళ…