కార్పొరేట్ కంపెనీల అధిపతుల నెల జీతాలు కోట్లపైనే
2004-05 లెక్కల ప్రకారం పట్టణాల్లో తలకు రోజుకి రు.20/, గ్రామాల్లో తలకు రు.15/ సంపాదిస్తున్నట్లయితే వారు దారిద్ర్య రేఖకు ఎగువన ఉన్నట్లేనని ప్రణాళికా సంఘం కోర్టుకి అఫిడవిట్ సమర్పించడం పట్ల వివిధ వర్గాలు, సంస్ధలు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాయి. దారిద్ర్య రేఖను కృత్రిమంగా కిందికి జరిపి దరిద్రుల సంఖ్యను తగ్గించి చూపే ప్రయత్నం చేస్తున్నారనీ, తద్వారా ప్రభుత్వం సబ్సిడీ అందించాల్సిన వారి సంఖ్యను తగ్గించడానికీ, బాధ్యతనుండి తప్పించుకోవడానికీ ప్రయత్నిస్తున్నదని నిపుణులు ఆరోపించారు. ప్రణాళికా సంఘం సభ్యులు కొందరు…