క్రీమీ లేయర్: కొండ నాలుకకు మందేస్తే…
సుప్రీం కోర్టు నియమించిన 7గురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనంలో 4గురు సభ్యులు తమకు అప్పగించని పనిని నిర్వర్తించారు. ఒకరైతే ఏకంగా ఏ భగవద్గీత అయితే భారత ప్రజలను నాలుగు వర్ణాలుగా విభజించి పంచముల గురించి అసలు మాట్లాడలేదో అదే భగవద్గీతను తన తీర్పు సందర్భంగా ఉటంకించటానికి వెనకాడ లేదు. అసలు భగవద్గీత శ్లోకాలను తమ తీర్పులలో ఈ మధ్య తరచుగా తెస్తున్న న్యాయమూర్తులకు మన దేశానికి ఒక రాజ్యాంగం, శిక్షా స్మృతి ఉన్నాయనీ, కోర్టులు వాటిని మాత్రమే…
