‘పవిత్రం’ కనుక గంగా నదిని శుద్ధి చేయాలా?

“పవిత్ర” గంగానది ని శుద్ధి చేసే కార్యక్రమాన్ని బి.జె.పి ప్రభుత్వం ఎందుకు వెనక్కి నెట్టేసిందని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. బి.జె.పి నేతృత్వంలోని ఎన్.డి.ఏ ప్రభుత్వంలో గంగా నదిని పరిశుభ్రం చేయాలన్న ఆతృత (urgency) చూపించడం లేదని వ్యాఖ్యానించింది. ‘దేశంలో 2,500 దూరం ప్రవహించే గంగా నదిని శుద్ధి చేసే పధకాల పట్ల ప్రభుత్వం ఆసక్తి కోల్పోయిందా?’ అని ప్రశ్నించింది. 20 యేళ్ళ నాటి ప్రజా ప్రయోజన వ్యాజ్యం పైన విచారణ కొనసాగిస్తూ సుప్రీం కోర్టు బెంచి బుధవారం…

బి.జె.పి మేనిఫెస్టో: చెవిలో పూలు, తోకకు ముడులు -కార్టూన్

చివరి నిమిషంలో ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన బి.జె.పి ఏక కాలంలో వివిధ సర్కస్ ఫీట్లను ప్రజల ముందు ప్రదర్శించింది. హిందూత్వ కేడర్ ని సంతృప్తిపరచడానికి ఒకవైపు మతోన్మాద హామీలు గుప్పిస్తూ మరోవైపు హిందూత్వను ఆదరించని జనం కోసం అభివృద్ధి, ఉద్యోగాలు హామీలు ఇచ్చింది. హిందూత్వను వదులుకోలేని బలహీనత ఒకవైపు వెనక్కి లాగుతుండగా, బూటకపు అభివృద్ధి మంత్రంతో అయినా ప్రజల దృష్టిని ఆకర్షించాల్సిన ఆగత్యం ఆ పార్టీకి కలిగింది. విదేశీ ప్రచార కంపెనీల సారధ్యంలో జాతీయతా సెంటిమెంట్లు…