కాల్పుల్లో చిక్కి చనిపోలేదు, గురిపెట్టి కాల్చి చంపారు
ఈ ఫొటోలో ఉన్న అబ్బాయి వయసు 12 సంవత్సరాలు. శ్రీలంక ఎల్.టి.టి.ఇ దివంగత నాయకుడు వేలుపిళ్ళై ప్రభాకరన్ కుమారుడు బాలచంద్రన్ ప్రభాకరన్. తమిళ టైగర్లకు, శ్రీలంక సైన్యానికి మధ్య హోరాహోరీగా జరిగిన పోరాటంలో కాల్పుల మధ్య చిక్కి చనిపోయాడని శ్రీలంక ప్రభుత్వం ప్రపంచానికి చెప్పింది. కానీ అది వాస్తవం కాదని, సజీవంగా పట్టుబడిన బాలచంద్రన్ ను శ్రీలంక సైనికులే అతి సమీపం నుండి కాల్చి చంపారని బ్రిటిష్ వార్తల చానల్ ‘ఛానల్ 4’ ద్వారా వెల్లడయిన వీడియో…
