కాల్పుల్లో చిక్కి చనిపోలేదు, గురిపెట్టి కాల్చి చంపారు

ఈ ఫొటోలో ఉన్న అబ్బాయి వయసు 12 సంవత్సరాలు. శ్రీలంక ఎల్.టి.టి.ఇ దివంగత నాయకుడు వేలుపిళ్ళై ప్రభాకరన్ కుమారుడు బాలచంద్రన్ ప్రభాకరన్. తమిళ టైగర్‌లకు, శ్రీలంక సైన్యానికి మధ్య హోరాహోరీగా జరిగిన పోరాటంలో కాల్పుల మధ్య చిక్కి చనిపోయాడని శ్రీలంక ప్రభుత్వం ప్రపంచానికి చెప్పింది. కానీ అది వాస్తవం కాదని, సజీవంగా పట్టుబడిన బాలచంద్రన్ ను శ్రీలంక సైనికులే అతి సమీపం నుండి కాల్చి చంపారని బ్రిటిష్ వార్తల చానల్ ‘ఛానల్ 4’ ద్వారా వెల్లడయిన వీడియో…

శ్రీలంక పాలకుల ‘తమిళ జాతి హత్యాకాండ’ పై రెండో డాక్యుమెంటరీ

ఎల్.టి.టి.ఈ పై యుద్ధంలో చివరి రోజుల్లో తమిళ పౌరులపై శ్రీలంక పాలకుల పనుపున శ్రీలంక సైన్యం జరిపిన ‘జాతి హత్యాకాండ’ పై రెండవ వీడియో డాక్యుమెంటరీ వెలువడింది. “శ్రీలంకాస్ కిల్లింగ్ ఫీల్డ్స్: వార్ క్రైంస్ అన్ పనిష్డ్” పేరుతో పేరుతో బ్రిటన్ కి చెందిన చానెల్ 4 ఈ డాక్యుమెంటరీ తీసింది. ఇదే చానెల్ సంవత్సరం క్రితం వెలువరించిన డాక్యుమెంటరీకి ఇది కొనసాగింపు. ఈ వీడియోను బూటకం గా శ్రీలంక ప్రభుత్వం అభివర్ణించింది. వీడియో సాధికారతను, విశ్వసనీయతను…