బంగారం దిగుమతులు పైకి, వాణిజ్య లోటు ఇంకా పైకి
భారతీయుల బంగారం దాహం దేశ ఆర్ధిక వ్యవస్ధకు ముప్పుగా పరిణమిస్తోంది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో ఇండియా బంగారం దిగుమతులు 138 శాతం పెరిగాయి. దీనితో వాణిజ్య లోటు పెరిగి, విదేశీ మారక ద్రవ్య నిల్వలలో తరుగు ఏర్పడి, కరెంటు ఖాతా లోటు (Current Account Deficit) పై మరింత ఒత్తిడి పెరుగుతోంది. బంగారం దిగుమతులు పెరిగిన ఫలితంగా ఏప్రిల్ నెలలో వాణిజ్య లోటు అమాంతం 17.8 బిలియన్ డాలర్లకు పెరిగింది. ప్రపంచ…