లిబియా తిరుగుబాటు బలగాల ఉసురు తీస్తున్న పశ్చిమదేశాల దాడులు
లిబియాపై పశ్చిమ దేశాల దాడులు వాటిని సహాయం కోసం పిలిచిన వారినే చంపుతున్నాయి. బుధవారం అజ్దాబియా పట్టణం నుండి వెనక్కి వెళ్తున్న తిరుగుబాటు బలగాలపై పశ్చిమ దేశాలు నాలుగు క్షిపణులను పేల్చడంతో కనీసం 13 మంది చనిపోగా మరింతమంది గాయపడ్డారని బిబిసి తెలిపింది. లిబియా అధ్యక్షుడు కల్నల్ గడ్డాఫీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, తూర్పు లిబియాలో తిరుగుబాటు ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. వారిపై వైమానికి బాంబుదాడులు చేస్తూ పౌరులను కూడా గడ్డాఫీ చంపుతున్నాడనీ పశ్చిమ దేశాలు నిందించాయి.…