ఫోన్లు, ఈ-మెయిళ్ళు ట్యాప్ చెయ్యడానికి అనుమతి పొందిన ‘రా’
పాకిస్ధాన్ కి ఐ.ఎస్.ఐ ఉన్నట్లే, ఇండియాకి కూడా ఓ గూఢచార సంస్ధ ఉంది. దాని పేరు ‘రీసర్చ్ అండ్ అనాలసిస్ వింగ్’. దీన్ని సంక్షిప్తంగా ఆర్.ఎ.డబ్ల్యు లేదా ‘రా’ అని పిలుస్తారు. ఇది ప్రధానంగా పాకిస్ధాన్, చైనా విషయాల్లో చురుకుగా పని చేస్తుంటుంది. దీనికి ఇప్పుడు భారతీయులు చేసే ఫోన్ కాల్స్, ఈ-మెయిళ్ళు, ఇంకా ఇతరేతర డేటా కమ్యూనికేషన్లు అన్నింటినీ దొంగచాటుగా వినే అధికారం చట్టపరంగా దక్కింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం…