ప్రభుత్వానికీ, అన్నా బృందానికి మద్య తలెత్తిన ప్రధాన విభేదాలు ఏమిటి?
కేంద్ర ప్రభుత్వం తన లోక్ పాల్ బిల్లుని రూపొందించుకుని కేబినెట్ లో ఆమోదింపజేసుకుంది. అన్నా హజారే బృందం ముందుకు తెస్తున్న జన్ లోక్ పాల్ డ్రాఫ్టులోని అనేక అంశాలు తమ డ్రాఫ్టులో పొందుపరిచామని చెప్పుకుంది. ప్రభుత్వం తయారు చేసిన బిల్లుని చూసిన అన్నా బృందం దానిని తీవ్రంగా వ్యతిరేకించారు. కోరలు లేని బిల్లుని తెచ్చారనీ, అది దేశ ప్రజలపై విసిరిన ఓ పెద్ద జోక్ అనీ చెబుతూ తిరస్కరించారు. తాను ముందే హెచ్చరించినట్లుగా అమరణ నిరాహార దీక్షకు…