ప్రధాని జర్మనీ పర్యటన, ఏ రోటి కాడ ఆ పాట!

భారత ప్రధాని మన్మోహన్ ప్రస్తుతం జర్మనీ పర్యటనలో ఉన్నారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కోసం జర్మనీ కంపెనీలు ఆతృతగా ఎదురు చూడగా అది పెద్దగా ముందుకు సాగలేదని తెలుస్తోంది. ఆరు వాణిజ్య ఒప్పందాలు కుదిరాయని ప్రకటించాయి. సోలార్ ఎనర్జీ లాంటి సాంప్రదాయేతర ఇంధన టెక్నాలజి, విద్య, వ్యవసాయం తదితర రంగాలలో ఈ ఒప్పందాలు కుదిరినట్లు తెలుస్తోంది. ఆరేళ్లలో ఒక బిలియన్ యూరోలు రుణం ఇస్తామని హామీ ఇచ్చారుట. జర్మనీ కార్ల దిగుమతులపై అధిక పన్నులు వేయడం పట్ల…

ఆరు నెలల్లో మరిన్ని సంస్కరణలు -ప్రధాని ఆర్ధిక సలహాదారు

వచ్చే ఆరునెలల్లో భారత దేశంలో ముఖ్యమైన ఆర్ధిక సంస్కరణలు  మరిన్ని అమలు  చేయనున్నామని ప్రధాని ప్రధాన ఆర్ధిక సలహాదారు కౌశిక్ బసు ప్రకటించాడు. 2014 వరకూ ‘బిగ్ టికెట్’ సంస్కరణలేవీ సాధ్యం కాదని ప్రకటించి రాజకీయ, ఆర్ధిక వర్గాల్లో ప్రకంపనలు సృష్టించిన కౌశిక్ బసు బి.జె.పి తో పాటు ప్రవేటు కంపెనీలు ఆందోళన వ్యక్తం చేయడంతో తన గొంతు సవరించుకున్నాడు. సబ్సిడీలను తగ్గించే చర్యలను ప్రభుత్వం చేపడుతుందని ఆయన సూచించాడు. డీజెల్ ధర్లపై నియంత్రణ, రిటైల్ రంగంలో…

కుదంకుళం ‘అణు వ్యతిరేక’ ఆందోళనలు, నాలుగు ఎన్.జి.ఓ లపై కేసులు

రష్యా సహాయంతో నిర్మించిన తమిళనాడు, కుదంకుళం అణు కర్మాగారానికి వ్యతిరేకంగా జరుగుతున్నా ప్రజాందోళనలకు ఆర్ధిక సహాయం చేసి రెచ్చగొడుతున్నాయన్న ఆరోపణలతో నాలుగు ఎన్.జి.ఓ (నాన్-గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్) సంస్ధలపైన కేసులు నమోదు చేయడానికి ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. రెండు సంస్ధలపై సి.బి.ఐ కేసు నమోదు చేయగా, మరో రెండింటిపైన తమిళనాడు పోలీసులు కేసులు పెట్టారని కేంద్ర హోమ్ శాఖ కార్యదర్శి ఆర్.కె.సింగ్ మంగళవారం విలేఖరులకు తెలిపాడు. కుదంకుళం కర్మాగారానికి వ్యతిరేకంగా అమెరికా, స్కాండినేవియా దేశాలు ఆందోళనకు రెచ్చగొడుతున్నాయని ప్రధాని ఆరోపించిన…

బహుళజాతి కంపెనీలకు మద్దతుగా కేంద్ర మంత్రివర్గంలో మార్పులు చేసిన ప్రధాని

భారత ప్రధాని రెండో సారి తన మంత్రివర్గంలో మార్పులు తలపెట్టారు. ఈ సారి మార్పుల్లో ప్రధానంగా సంస్కరణలను దృష్టిలో పెట్టుకుని చేసినట్లుగా కనిపిస్తోంది. బహుళజాతి కంపెనీల ప్రవేశానికి అడ్డంకిగా ఉన్నారని భావిస్తున్న మంత్రులను వారి శాఖలనుండి తొలగించారు. పెద్ద ఎత్తున మార్పులు జరుగుతాయని భావించినప్పటికీ అలాంటిదేమీ జరగలేదు. ప్రధాన విధానాల అమలుతో ముడిపడి ఉన్న మంత్రిత్వ శాఖలను పెద్దగా కదిలించలేదు. మిత్ర పార్టీల శాఖలను కూడా పెద్దగా మార్చలేదు. డి.ఎం.కె మంత్రి దయానిధిమారన్ రాజీనామా చేసిన స్ధానాన్ని…

కాంగ్రెస్ ప్రభుత్వంలో సోనియా, మన్మోహన్ ల నేతృత్వంలో గ్రూపులున్నది నిజమేనా?

భారత దేశం ఎమర్జింగ్ ఎకానమీగా చెలామణి అవుతోంది. చైనా తర్వాత అత్యధిక జిడిపి వృద్ధి రేటు నమోదు చేస్తోంది. ఇంకా చెప్పాలంటే చైనా అధిగమించాలని కలలు కంటోంది. చైనాకు పోటీదారుగా చెప్పుకుంటున్నప్పటికీ చైనా వివిధ రంగాల్లో సాధిస్తున్న ఆర్ధిక ప్రగతితో పోలిస్తే ఇండియా ప్రగతి చాలా దూరంలోనే ఉంది. చైనా ప్రపంచంలో అమెరికా తర్వాత రెండవ అతిపెద్ద ఆర్ధిక వ్యవస్ధ కాగా ఇండియా 11 వ స్ధానంలొ ఉంది. ఆసియాలో చూస్తే చైనా మొదటి స్ధానంలో ఉండగా…