గడ్డాఫీ మరణంపై పలు అనుమానాలు, అంతర్జాతీయ న్యాయస్ధానం విచారణ

గడ్డాఫీ మరణం చుట్టూ పలు అనుమానాలు వ్యక్తం అవుతుండడంతో అతని విగత శరీరానికి అంతిమ సంస్కారాలు ఆలస్యం అవుతున్నాయి. సజీవుడిగా పట్టుకున్న ముమ్మర్ గడ్డాఫీ ఎలా చనిపోయాడన్న అంశంపై పలు కధనాలు ప్రచారంలోకి వచ్చాయి. గడ్డాఫీని పట్టుకున్న అనంతరం ఒక ట్రక్కులో ఆసుపత్రికి తీసుకెళ్తుండగా గడ్డాఫీ మద్దతుదారులకూ, గడ్డాఫీని ఆసుపత్రికి తీసుకెళ్తున్న తిరుగుబాటుదారులకూ మధ్య కాల్పులు జరిగాయనీ, ఈ కాల్పుల్లో గడ్డాఫీ తలకు బులెట్ గాయం కావడంతో ఆసుపత్రికి వెళ్ళేలోపు చనిపోయాడనీ తాత్కాలిక ప్రభుత్వం ప్రధానంగా చెబుతోంది.…

గడ్డాఫీని ఎలా చంపేశారు?

ది గార్డియన్ పత్రిక గడ్డాఫీ మరణంపై కొంత సమాచారాన్ని అందించింది. గడ్డాఫీని పట్టుకున్నపుడు ఆయన సజీవంగా ఉన్న వీడియోను ప్రచురించింది. అందులో గడ్డాఫిని పట్టుకుని ట్రక్కులోకి మారుస్తున్న దృశ్యం ఉంది. గడ్డాఫీ బాగా తెలివిగానే ఉన్నట్లుగా ఆ వీడియో ద్వారా స్పష్టం అవుతోంది. ట్రక్కులోకి మారుస్తుండగా ‘అతన్ని సజీవంగా ఉంచండి’ అని ఒకరు అరిచారని గార్డియన్ తెలిపింది. తదనంతరం రక్తపు మడుగులో ఉన్న గడ్డాఫీ ఫొటో అన్ని వార్తా సంస్ధలూ ప్రచురించాయి. ఈ మధ్యలోనే గడ్డాఫీ తలలో…

పట్టుకున్నపుడు బతికే ఉన్న గడ్డాఫీ -ఫొటోలు

గడ్డాఫీ డ్రైనేజి పైపులో దాగి ఉన్నాడనీ, చివరి క్షణాల్లో ‘నన్ను కాల్చొద్దంటూ’ అరిచాడనీ, లిబియా ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారని పశ్చిమ దేశాల వార్తా సంస్ధలు పెద్ద ఎత్తున వార్తలు రాస్తున్నాయి. నలుగురైదుగురు చేతులు పైకిత్తి నవ్వుతున్న ఫొటోలు ప్రచురించి లిబియా అంతా సంబరాలు జరుపుకుంటున్నారని చెబుతున్నాయి. నాలుగు శవాలు పడిఉన్న డ్రైనేజి పైపులను చూపించి గడ్డాఫీ దాక్కున్నది ఇక్కడేనని చూపిస్తున్నాయి. ఇవన్నీ పచ్చి అబద్ధాలని అవి ప్రారంభంలో ప్రచురించిన వార్తలే చెబుతున్నాయి. గడ్డాఫీ పట్టుబడ్డాడని మొదట వార్తలు…

నాటో బాంబు దాడిలో గడ్డాఫీ మరణం -ఫొటో

గడ్డాఫీ చనిపోయింది లిబియా తిరుగుబాటు సైన్యాల చేతుల్లో కాదు. జన్మ పట్టణం సిర్టే నుండి వాహనాల కాన్వాయ్ లో కల్నల్ మౌమ్మర్ గడ్డాఫీ వెళుతుండగా నాటో బలగాలు అతని వాహనాలపై బాంబు దాడులు చేశాయి. రెండు కాళ్ళు, తలకు బలమైన గాయాలు కావడంతో అతని గాయాలతోనే చనిపోయాడు. గడ్డాఫీ విగత శరీరాన్ని మిస్రాటా నగరానికి తెచ్చినట్లుగా రాయిటర్స్ ప్రకటించింది. గడ్డాఫీ మృత శరీరం ఫోటోను యూట్యూబ్ లో ఉంచబడింది. – —

లిబియా అధ్యక్షుడు గడ్డాఫీని పట్టుకుని చంపేసిన నాటో బలగాలు?

లిబియా అధ్యక్షుడు మౌమ్మర్ గడ్డాఫీని అతని సొంత పట్టణం సిర్టే లోనే పట్టుకుని చంపినట్లుగా ఆల్ జజీరా టివి ఛానెల్ ప్రకటించింది. బిబిసి, రాయిటర్స్ తదితర ఛానెళ్ళు గడ్డాఫీని పట్టుబడ్డాడని చెబుతున్నప్పటికీ చంపేసిన సంగతిని ధ్రృవీకరించడం లేదు. ‘కాల్చొద్దు, కాల్చొద్దు’ అని గడ్డాఫీ కేకలు వేసినట్లుగా పశ్చిమ దేశాల వార్తా ఛానెళ్ళు అప్పుడే దుష్ప్రచారం మొదలుపెట్టాయి. గడ్డాఫీ గాయపడ్డాడని కొందరు చెబుతుండగా అతన్ని చంపేశారని మరికొందరు చెబుతున్నారని బిబిసి తెలిపింది. “అతను పట్టుబడ్డాడు. అతని రెండు కాళ్ళకూ…

“వెయ్యి మందికి ఒకరు, ఒకరికి వెయ్యి మంది” -కార్టూన్

మూడు రోజుల క్రితం పాలస్తీనా పోరాట సంస్ధ హమాస్, ఇజ్రాయెల్ ప్రభుత్వం మధ్య ఖైదీల మార్పిడి జరిగింది. హమాస్ తమ బందీగా ఉన్న ఒకే ఒక్క ఇజ్రాయెల్ సైనికుడు (గిలాద్ షాలిత్) ను వదిలిపెట్టగా, ఇజ్రాయెల్ ప్రభుత్వం దశాబ్దాల తరబడి విచారణ లేకుండా తాను ఖైదు చేసి ఉంచిన 1027 మంది పాలస్తీనీయులను విడుదల చేయవలసి వచ్చింది. ఈ మార్పిడి కోసం గత ఐదు సంవత్సరాలుగా చర్చలు జరుగుతున్నాయి. అసలు మార్పిడి జరగదని కూడా అనుకున్నా, ఇజ్రాయెల్…

ఆఫ్ఘనిస్ధాన్ నుండి ఫ్రాన్సు సైనికుల ఉపసంహరణ

ఫ్రాన్సు సైనికులలో మొదటి బ్యాచ్ ఆఫ్ఘనిస్ధాన్ నుండి స్వదేశం చేరుకోవడానికి సిద్ధమయ్యారు. బుధవారం ఈ సైనికుల విరమణ జరుగుతుంది. మొదటి విడతగా 200 మంది సైనికుల్ని వెనక్కి పిలిపిస్తున్నట్లుగా ఫ్రాన్సు ప్రకటించింది. గత జులైలో ఆఫ్గనిస్ధాన్ సందర్శించిన సందర్భంగా తమ సైనికులను ఉపసంహరించుకుంటామని ఫ్రాన్సు అధ్యక్షుడు నికోలస్ సర్కోజి ప్రకటించాడు. అది ఇప్పుడు ప్రారంభమయ్యింది. రెండవ విడతలో మరో 200 మంది సైనికులను విరమిస్తామని ఫ్రాన్సు తెలిపింది. రాబోయే క్రిస్టమస్ పండగలోపు రెండవ విడత సైనికులు ఫ్రాన్సు…

సంక్షోభంలో ‘అన్నా బృందం’, ఇద్దరు సభ్యులు దూరం

అన్నా బృందం ఐక్యత సంక్షోభంలో పడింది. ఇటీవల జరిగిన పరిణామాల పర్యవసానంగా బృందంలో ఇద్దరు ప్రముఖ సభ్యులు బృందం కార్యకలాపాలకు దూరంగా ఉండాలని నిశ్చయించుకోవడంతో బృందం బలహీనపడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. పి.వి.రాజగోపాల్, ‘వాటర్ మేన్’ రాజీందర్ సింగ్ లి మంగళవారం కోర్ గ్రూపునుండి తప్పుకోవాలన్న తమ ఉద్దేశ్యాన్ని బహిరంగపరిచారు. అన్నా బృందం రాజకీయ లక్షణాలను సంతరించుకుంటున్నదని వీరు భావిస్తుండడంతో వీరీ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కోర్ సభ్యులతో సంప్రదించకుండానే నిర్ణయాలు తీసుకోవడంతో తమవి కాని నిర్ణయాలకు బాధ్యత…

ఒక ఇజ్రాయెల్ సైనికుడి కోసం 1027 పాలస్తీనా ఖైదీలను విడుదల చేస్తున్న ఇజ్రాయెల్

పాలస్తీనా, ఇజ్రాయెల్ మధ్య చరిత్రాత్మక ఖైదీల మార్పిడి ఒప్పందం మంగళవారం అమలవుతోంది. పాలస్తీనీయులు పట్టుకున్న ఒకే ఒక్క ఇజ్రయెల్ సైనికుడుని విడుదుల చేస్తున్నందుకుగానూ ఇజ్రాయెల్ అనేక సంవత్సరాల తరబడి తమ జైళ్లలో ఉంటున్న పాలస్తీనా జాతీయులను విడుదల చేయడానికి సిద్దపడింది. దాదాపు ఐదు సంవత్సరాల పాటు, ఈజిప్టు మధ్యవర్తిత్వంతో ఇరు దేశాల మధ్య జరిగిన సుదీర్ఘ చర్చలు చివరికి ఫలవంతం అయ్యాయి. మంగళవారం 477 మంది, మరో రెండు నెలల్లో మరో 550 మంది పాలస్తీనా ఖైదీలు…

తెలంగాణ ఉద్యమం మరింత ఉధృతం, ఇక కాంగ్రెసే టార్గెట్

తెలంగాణ పొలిటికల్ జె.ఎ.సి సారధ్యసంఘం సమావేశం సుదీర్ఘ చర్చల అనంతరం సోమవారం రాత్రి పది గంటల సమయంలో ముగిసింది. సి.పి.ఐ (ఎం.ఎల్ – న్యూడెమొక్రసీ) రాష్ట్ర కార్యాలయం మార్క్స్ భవన్ లో ఈ సమావేశం జరిగింది. సమావేశం అనంతరం తెరాస, న్యూడెమొక్రసీ, ఉద్యోగ జె.ఎ.సి ప్రతినిధులు పత్రికలతో మాట్లాడారు. పొలిటికల్ జె.ఎ.సి కన్వీనర్ కోదండరాం మాట్లాడుతూ ఉద్యమం ఉధృతంగా జరుగుతుంటే కాంగ్రెస్ నాయకులు ఏ మాత్రం స్పందించకపోవడం దారుణమని అన్నారు. తెలంగాణ తరపున మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకులను,…

బాన్సువాడ ఉపఎన్నిక ఫలితాలు, తెరాస జైత్రయాత్రకు బ్రేకు?

బాన్సువాడ ఉప ఎన్నిక ఫలితాలు వెలువడ్డాయి. తెరాస తరపున నిలబడిన సిటింగ్ ఎం.ఎల్.ఎ పోచారం శ్రీనివాసులు దాదాపు యాభై వేల ఓట్ల మెజారిటీతో సమీప కాంగ్రెస్ ప్రత్యర్ధి శ్రీనివాస్ గౌడ్ పై విజయం సాధించినట్లుగా ఫలితం ప్రకటించారు. పోచారం ఎన్నిక అందరూ ఊహించినదే కాగా, శ్రీనివాస్ గౌడ్ కు వచ్చిన ఓట్ల సంఖ్య మాత్రం ఎవరూ ఊహించినవి కావడమే ఇప్పుడు వార్తగా నిలిచింది. తెలంగాణ రాష్ట్ర సమితి గతంలో తాము గెలిచిన పది స్ధానాలకు తెలంగాణ ఉద్యమంలో…

అరబ్ దేశాల్లో పరువు కోసం డ్రోన్ హత్యలకు పాల్పడుతున్న అమెరికా -2

ఖచ్చితంగా చెప్పవలసివస్తే, ఎ.క్యు.ఎ.పి నిర్వహించిందని చెబుతున్న చర్యలు సాంకేతిక నైపుణ్యంలో దాని అసమర్ధతను మాత్రమే వెల్లడించాయి. నిజానికి ముతాలబ్ స్వయంగా అంగీకరించినదాని ప్రకారం, అతను చేపట్టిన బాంబుదాడి పధకంలో గానీ, నిర్వహణలో గానీ అవలాకి పాత్ర లేనేలేదని ఆనాడే ఎన్.బి.సి వార్తా సంస్ధ వెల్లడించింది. ముతాలిబ్ ను ఆల్-ఖైదాకు పరిచయం చేయడంవరకే అవలాకి పాత్ర ఉందని ఆ పత్రిక తెలిపింది. యెమెన్ లో జరుగుతున్న రాజకీయ ఉద్యమంలో అవలాకి అత్యంత చిన్న వ్యక్తి. ఇతర అరబ్ దేశాలలోని…

అరబ్ దేశాల్లో పరువు కోసం డ్రోన్ హత్యలకు పాల్పడుతున్న అమెరికా -1

ప్రజాస్వామిక సంస్కరణల కోసం అరబ్ దేశాల్లో ప్రజానీకం ఈ సంవత్సరం ప్రారంభం నుండి ఉద్యమిస్తున్న నేపధ్యంలో మధ్యప్రాచ్యంలో అమెరికా, ఇజ్రాయెల్ దేశాల ఆధిపత్యానికి తీవ్రం ఆటంకాలు తలెత్తాయి. ఇజ్రాయెల్ కు అరబ్ దేశాలలో గట్టి మద్దతుదారులుగా ఉన్న ట్యునీషియా, ఈజిప్టు లలో నియంతృత్వ ప్రభుత్వాలు కూలిపోయాయి. కుట్రలు పన్ని ఆ రెండు దేశాలలో ప్రజా ఉద్యమాలు చివరివరకు కొనసాగకుండా అమెరికా చూసుకోగలిగింది. తమ పాత అనుచరులను, నమ్మకస్తులనే ఆ దేశాల్లో పాలకులుగా కొనసాగించగలుగుతోంది. అరబ్ ప్రజా ఉద్యమాలకు…

అభివృద్ధి చెందిన దేశాలన్నింటిలో ‘ఆకుపై వాల్‌స్ట్రీట్’ తరహా ఆందోళనలు

“ఆకుపై వాల్‌స్ట్రిట్!” నెల రోజుల క్రితం కేవలం కొద్ది డజన్ల మందితో ప్రారంభమైన ఈ అందోళన ఇపుడు ప్రపంచ స్ధాయి ఆందోళనగా మారింది. రెండు వారాలకే అమెరికా అంతటా పాకిన అమెరికన్ల ఆందోళనలు ఆ తర్వాత యూరప్ దేశాలకు కూడా పాకాయి. ఇపుడు జపాన్ నగరం టోక్యోకు పాకి “టోక్యో ఆక్రమిద్దాం” అంటూ జపనీయులు నినదిస్తున్నారు. ప్రపంచ ఆర్ధిక సంక్షోభం పేరు చెప్పి ట్రిలియన్ల కొద్దీ ప్రజా ధనాన్ని ‘బెయిలౌట్’లుగా వాల్‌స్ట్రీట్ కంపెనీలకు పందేరం పెట్టిన సంగతి…