‘కిషన్ జీ’ ఉరఫ్ ‘మల్లోజుల కోటేశ్వర రావు’ ఎవరు?

(మిత్రుడు డేవిడ్ రాసిన వ్యాఖ్యను పోస్టు గా మలిచాను -విశేఖర్) ఒక ఉత్తరం, సందేశం (అమ్మను చూడాలను ఉంది -రచన: కిషన్ జీ) ..కంటికి కానరాని, సుదూర తీరాలనుండి, అమ్మ కోసం తపించిన, తల్లడిల్లిన గుండె కాయ..మల్లోజుల కోటేశ్వర రావు, ఉత్తరం చదివిన ప్రతి ఒక్కరికి కళ్ళల్లో నీరు. దేశ రాజకీయాలని గడ గడ లాడించిన కిషన్ జి కూడ ఒక బిడ్డనే, కన్న తల్లి కోసం తపించిపోయిన గుండెనే. ఒక గొప్ప ఆదర్శం ముందు, బంధాలను…

ఎన్‌కౌంటర్ లో కాదు, ‘కిషన్ జీ’ ని చిత్ర హింసలు పెట్టి చంపారు -వరవర రావు

మావోయిస్టు నాయకుడు ‘కిషన్ జీ’ ఉరఫ్ ‘మల్లోజుల కోటేశ్వర రావు’ ను బెంగాల్ పోలీసులు చిత్ర హింసలు పెట్టి బూటకపు ఎన్‌కౌంటర్ లో కాల్చి చంపారని ‘విప్లవ రచయితల సంఘం’ (విరసం) సభ్యుడు వరవర రావు శుక్రవారం ఆరోపించాడు. “కిషన్ జీ దేహంపై అనేక గాయాలున్నాయి. ఆయన్ని బూటకపు ఎన్‌కౌంటర్ లో కాల్చి చంపే ముందు చిత్ర హింసలు పెట్టారని ఆ గాయలను బట్టి అర్ధమవుతోంది” అని వరవర్రావు కోల్‌కతా లో మాట్లాడుతూ అన్నాడు. ఒక రోజు…

‘కిషన్ జీ’ ఎన్‌కౌంటర్

మావోయిస్టులతో చర్చలు అంటూనే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వారి నాయకుడు కిషన్ జీ ని ఎన్‌కౌంటర్ లో చంపేసింది. బెంగాల్ రాష్ట్రంలోని పశ్చిమ మిడ్నపూర్ జిల్లాలో ప్రభుత్వ బలగాల నుండి తృటిలో తప్పించుకున్నాడన్న వార్తలు వచ్చిన మరుసటి రోజే ఆయన ఎన్‌కౌంటర్ లో చనిపోయాడన్న వార్త వెలువడింది. మావోయిస్టు పార్టీలో నెం.2 గా పత్రికలు అభివర్ణిస్తున్న మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్ జీ గతంలో అనేకసార్లు ఎన్‌కౌంటర్ నుండి తృటిలో తప్పించుకుపోయాడని పత్రికలు రాశాయి.…

మావోయిస్టు పార్టీ అగ్రనాయకుడు ‘కిషన్ జీ’ ఎన్‌కౌంటర్ లో మృతి

మావోయిస్టులతో చర్చలు అంటూనే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వారి నాయకుడు కిషన్ జీ ని ఎన్‌కౌంటర్ లో చంపేసింది. బెంగాల్ రాష్ట్రంలోని పశ్చిమ మిడ్నపూర్ జిల్లాలో ప్రభుత్వ బలగాల నుండి తృటిలో తప్పించుకున్నాడన్న వార్తలు వచ్చిన మరుసటి రోజే ఆయన ఎన్‌కౌంటర్ లో చనిపోయాడన్న వార్త వెలువడింది. మావోయిస్టు పార్టీలో నెం.2 గా పత్రికలు అభివర్ణిస్తున్న మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్ జీ గతంలో అనేకసార్లు ఎన్‌కౌంటర్ నుండి తృటిలో తప్పించుకుపోయాడని పత్రికలు రాశాయి.…

కల్నల్ మౌమ్మర్ గడ్డాఫీ చిరస్మరణీయుడు -అద్భుతమైన కవిత

వాడ్ని గిరజాల జుట్టోడని వాళ్ళు తెగ ఆడిపోసుకున్నారు, అది తమ బర్బర ఆదివాసీ సాంస్కృతిక వారసత్వ సంపద అన్నాడు.           సర్వ సేనానిగా ఉండి ఆఫ్ట్రాల్ కల్నల్ బిరుదేమిటన్నారు,           జనరల్ కంటే కల్నలే సిపాయిల్లో మమేకతకి సాధనమన్నాడు. రాజై రాజ దుస్తులొదిలి సైనిక దుస్తుల ధారణేమిటని వెక్కిరించారు, అది ‘ప్రపంచ పోలీసు’ పై సాయుధ ప్రతిఘటనా సంకేతమన్నాడు.           విదేశీ సభలకీ ఒంటె, టెంటు, మందీ, మార్బలాలు ఆటవికమన్నారు,           ఎడారి మూలవాసుల బిడారి వృత్తిపట్ల…

పాకిస్ధాన్ ప్రభుత్వంతో పాక్ తాలిబాన్ చర్చలు

పాకిస్ధాన్ కి చెందిన తాలిబాన్, పాక్ ప్రభుత్వంతో శాంతి చర్చలు జరుపుతున్ననట్లుగా ఒక సీనియర్ తాలిబాన్ కమాండర్ ప్రకటించాడు. దక్షిణ వజీరిస్ధాన్ ప్రాంతంపైన చర్చలు కేంద్రీకృతమయ్యాయని ఆయన చెప్పినట్లుగా రాయిటర్స్ వార్తా సంస్ధ ప్రకటించింది. వజీరిస్ధాన్ చర్చలు సఫలం ఐతే చర్చలను ఇతర ప్రాంతాలకు కూడా విస్తరిస్తామని తాలిబాన్ కమాండర్ తెలిపాడు. చర్చలు ఫలప్రదం కావడానికి తాలిబన్ అనేక డిమాండ్లు చేసినట్లుగా తెలుస్తోంది. అందులో ఖైదీల విడుదల కూడా ఒకటని కమాండర్ తెలిపాడు. తెహరీక్-ఎ-తాలిబాన్ పాకిస్ధాన్ (టిటిపి)…

ఈజిప్టులో మళ్ళీ ఉద్యమం, పోలీసులతో ఆందోళనకారుల ఘర్షణలు -ఫొటోలు

ప్రజాస్వామిక ఈజిప్టు కోసం తాము ఉద్యమించినప్పటికీ సైన్యం చొరబడి ఆధికారాన్ని హస్తగతం చేసుకుందని ఈజిప్టు ప్రజలు భావిస్తున్నారు. సైన్యం వెంటనే తప్పుకుని ఎన్నికలు జరిపి పౌర ప్రభుత్వానికి అధికారం అప్పజెప్పాలని వారు కోరుతున్నారు. అధికారాన్ని చేతిలో ఉంచుకున్న సైనిక ప్రభుత్వం ప్రజాస్వామిక సంస్కరణలవైపుగా చర్యలు తీసుకోవడం లేదనీ, తీసుకున్నా అత్యంత నెమ్మదిగా చర్యలు తీసుకుంటున్నదనీ ప్రజలు భావిస్తున్నారు. ప్రజల్లో అసంతృప్తి జ్వాలలు చల్లారకపోవడంతో ఎన్జీఓ సంస్ధలకు మళ్ళీ ఉద్యమాలకు దిగక తప్పలేదు. క్రమంగా ఎన్జీఓ సంస్ధల చేతుల్లోనుండి…

“ఆకుపై” ఉద్యమాలు ప్రపంచంలో ఎక్కడెక్కడ జరుగుతున్నాయి? -మ్యాప్

18-11-2011 తేదీ నాటికి తనకు అందిన సమాచారం మేరకు ‘ది గార్డియన్’ పత్రిక ‘ఆకుపై’ ఉద్యమాలు నడుస్తున్న ప్రాంతాలను ప్రపంచ పటంపై గుర్తించి ప్రచురించింది. ప్రపంచవ్యాపితంగా 82 దేశాల్లోని 951 నగరాల్లో ‘ఆకుపై’ ఉద్యమాలు జరుగుతుండగా తాను 750 నగరాలను గుర్తించినట్లుగా ‘ది గార్డియన్’ చెబుతోంది. అమెరికాలో ‘ఆకుపై వాల్ స్ట్రీట్’ గా ప్రారంభమైన చోట (జుకొట్టి పార్క్) ఆందోళనకారులను రెండు రోజుల క్రితం పోలీసులు బలవంతంగా ఖాళీ చేశారు. అమెరికాలోని ఇతర నగరాల్లో కూడా ఇలాగే…

నియంతృత్వ కువైట్ లో ప్రజాందోళనలు -ఫొటోలు

అరబ్ ఉద్యమాల ప్రభావం ఎట్టకేలకు కువైట్ కి కూడా పాకింది. ఆందోళనకారులు కువైట్ నగరంలోని నేషనల్ అసెంబ్లీ వద్ద ప్రదర్శన నిర్వహించారు. గేట్లను తోసుకుని లోపలికి వెళ్లడానికి ప్రయత్నించారు. ప్రధాని రాజీనామా చేయాలని డిమాండ్ చేసారు. కొంతమంది నేషనల్ అసెంబ్లీలోనికి చొచ్చుకుని వెళ్లగా మరి కొందరు పార్లమెంటు బైట ప్రదర్శన నిర్వహించారు. దానికి సంబంధించిన ఫొటోలివి: ‘ది గార్డియన్’ పత్రిక ఈ ఫొటోలను ప్రచురించింది.

కార్మిక వర్గ పోరాటాలను హైజాక్ చేసిన “వాల్ స్ట్రీట్ ఆక్రమిద్దాం” ఉద్యమం -4

OTPOR మరియు CANVAS (కేన్వాస్) OTPOR అన్నది సెర్బియా భాషా పదం. ‘ప్రతిఘటన’ అని దాని అర్ధం. సెర్బియాలో 1998లో తలెత్తి 2003వరకూ కొనసాగిన ఉద్యమంగా ఇది చరిత్రలో రికార్డయి ఉంది. అహింసా పద్ధతుల్లో ఉద్యమించి నాటో దాడులకు, సామ్రాజ్యవాద ఆక్రమణలకు ఎదురొడ్డి నిలిచిన అప్పటి సెర్బియా నాయకుడు స్లోబోడాన్ మైలోసెవిక్ ను అక్టోబరు 5, 2000 న కూలదోయగలిగిందని ఈ సంస్ధకు పేరు ఉంది. మైలోసెవిక్ ప్రభుత్వం కూలిపోయాక కూడా ఈ సంస్ధ కొనసాగి కొత్త…

కార్మిక వర్గ పోరాటాలను హైజాక్ చేసిన “వాల్ స్ట్రీట్ ఆక్రమిద్దాం” ఉద్యమం -3

అక్టోబరు 15 తేదీనజరిగిన “ఆకుపై యూజీన్” ప్రదర్శనలో ‘మంత్లీ రివ్యూ‘ పత్రిక ఎడిటర్ ‘జాన్బెల్లమీ ఫాస్టర్‘ పాల్గొని ప్రసంగించాడు. తన ప్రసంగంలో ఆమెరికాలో ఆదాయఅంతరాలపై ఆయన చెప్పిన కొన్నివివరాలు ఇలా ఉన్నాయి. పైన ఉన్న ఒక శాతం మంది, అమెరికా మొత్తం ఆదాయంలో 25 శాతానికి సొంతదారులు. పైన ఉన్న పది శాతం మంది, మొత్తం ఆదాయంలో దాదాపు 50 శాతానికి సొంతదారులు. 1950, 1970 సం.ల మధ్య కాలంలో కింది 90 శాతం మంది సంపాదించిన…

కార్మిక వర్గ పోరాటాలను హైజాక్ చేసిన “వాల్ స్ట్రీట్ ఆక్రమిద్దాం” ఉద్యమం -2

అమెరికా అసమానతలు అక్టోబరు 26 తేదీన కాంగ్రెషనల్ బడ్జెట్ ఆఫీసు (సి.బి.ఒ) అమెరికాలో ఆర్ధిక అంతరాయాలపైన ఒక నివేదికను వెలువరించింది. దాని ప్రకారం అమెరికాలో అత్యంత ధనికులైన ఒక శాతం మంది ఆదాయాలు 1979, 2007 మధ్య మూడు రెట్లు (275 శాతం) పెరగ్గా, జాతీయ సంపదలో వారి వాటా రెట్టింపు (8 శాతం నుండి 17 శాతానికి) పెరిగింది. ఇదే కాలంలో ఆందరికంటె పైన ఉన్న 20 శాతం మంది జాతీయాదాయంలో తమ వాటా పెంచుకోగా,…

కార్మిక వర్గ పోరాటాలను హైజాక్ చేసిన “వాల్ స్ట్రీట్ ఆక్రమిద్దాం” ఉద్యమం -1

“వాల్ స్ట్రీట్ ఆక్రమిద్దాం (ఆకుపై వాల్‌స్ట్రీట్).” ఇప్పుడు అమెరికాలో ప్రజలను, పాలకులను ఆకర్షిస్తున్న ఉద్యమం ఇది. సమస్యలపై అందరి దృష్టినీ ఆకర్షించినందుకు ప్రశంశలనూ, ఒక నాయకుడు గానీ, నిర్ధిష్ట డిమాండ్లు గానీ లేనందుకు విమర్శలను ఈ ఉద్యమం ఎదుర్కొంటోంది. ప్రజలు ఆ ఉద్యమానికి తమ మద్దతు తెలుపుతుండగా, కొందరు పాలకులు సంపన్నులు కూడా ప్రత్యక్ష, పరోక్ మద్దతును ప్రకటిస్తున్నారు. మరికొందరు తమ మౌనంతో ఉద్యమానికి ప్రచారం రాకుండా ప్రయత్నిస్తున్నారు. అక్కడక్కడా సంపన్నులు నోరు తెరిచి ఉద్యమం, అసంతృప్తుల…

శ్రీకృష్ణ కమిటీ విశ్వసనీయత

శ్రీకృష్ణ కమిటీ విశ్వసనీయత ‘ఛాప్టర్ 8′ తోనే మట్టిగొట్టుకు పోయింది. ఏ కమిషన్ అయినా, స్వతంత్ర భారత దేశంలో ఈ విధంగా ఒక ప్రజా ఉద్యమాన్ని ఎలా అణచివేయాలో సూచించిన సందర్భాలు లేవు. భారత దేశమే కాదు. ఆధునిక ప్రజాస్వామ్య దేశాలలో దేనిలోనైనా ప్రజా ఉద్యమాలను అణచివేయడానికి సూచనలిచ్చిన కమిషన్ ఉందా అన్నది నాకు అనుమానమే. ప్రభుత్వాలు గూడచారులను నియమించుకుని ప్రజా ఉద్యమాలను అణిచివేసేందుకు తగిన సమాచారం తెప్పించుకుంటాయి అది వేరే సంగతి. కాని ప్రధాని భాషలోనే…

‘భాషాప్రయుక్త రాష్ట్రాల’ సిద్ధాంతానికి తెలంగాణ ఏర్పాటు వ్యతిరేకం కాదు

“ఒక రాష్ట్రంలో ఒకే భాష మాట్లాడే వారు” ఉండడమే భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకి మూల సిద్ధాంతం. “ఒక రాష్ట్రంలో ఒకే భాష మాట్లాడేవారు” ఉండడం అన్న ప్రాతిపదికన మాత్రమే హిందీ భాషకు అన్ని రాష్ట్రాలు ఉండడాన్ని అర్ధం చేసుకోగలం. “ఒక రాష్ట్రంలో ఒకే భాష మాట్లాడేవారు” ఉండడం అంటే ఒక రాష్ట్రంలో రెండు భాషలు మాట్లాడెవారు ఉండకూడదన్నదే అర్ధం తప్ప ఒకే భాష మాట్లాడేవారు ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాలలో ఉండకూడదని అర్ధం కాదు. హిందీ…