భోపాల్ గ్యాస్ లీక్ బాధితులపై పోలీసుల లాఠీ ఛార్జి

ఇరవై ఏడేళ్ల క్రితం జరిగిన భోపాల్ విష వాయువు లీక్ దుర్ఘటనకు సంబంధించిన బాధితులకు పూర్తి న్యాయం చేకూరాలని కోరుతూ దుర్ఘటన దినం డిసెంబరు 3 తేదీన బాధితులు చేసిన ఆందోళనపై పోలీసులు విరుచుకుపడ్డారు. బాధితులకు న్యాయమైతే దక్కలేదు గానీ తమకు దక్కని న్యాయం కోసం ఆందోళన చేసే హక్కును కూడా లాక్కోవాలని ప్రయత్నించడం దారుణమంటూ సంఘటనను అనేకమంది ఖండించారు. 1984 డిసెంబరు 3 తేదీన భోపాల్ నగరంలో ఉన్న యూనియన్ కార్భైడ్ పురుగు మందుల ఫ్యాక్టరీ…

పాకిస్ధాన్ ప్రతినిధులు ఓ.కె అన్నాకే అమెరికా దాడి చేసింది -వాల్‌స్ట్రీట్ జర్నల్

ఇరవై నాలుగు మంది పాకిస్ధానీ సైనికులు చనిపోవడానికి కారణమైన అమెరికా హెలికాప్టర్లు, జెట్ ఫైటర్ల దాడిని ‘ఉమ్మడి కమాండ్ సెంటర్’ లోని పాకిస్ధాన్ ప్రతినిధులు ఆమోదించిన తర్వాతే చేశామని అమెరికా కమేండర్లు చెప్పినట్లుగా ‘ది వాల్‌స్ట్రీట్ జర్నల్’ పత్రిక తెలిపింది. కమాండ్ సెంటర్ లో ఉన్న పాకిస్ధాని ప్రతినిధులకు దాడి జరిగే చోట పాకిస్ధాన్ తాత్కాలిక పోస్టు నెలకొల్పిందని తెలియకపోవడంతో వారు దాడికి పచ్చ జెండా ఊపారని అమెరికా కమేండోలు తెలిపారు. అయితే కాల్పులు ప్రారంభం అయ్యాక…

శ్రీకాంత్ గారూ, కిషన్ జీ పార్టీ చేస్తున్నది సాయుధ పోరాటం, సాయుధ అల్లర్లు కాదు

శ్రీకాంత్ గారూ, మీ బ్లాగ్ లో నన్ను ఉద్దేశిస్తూ మంచి ప్రశ్న వేశారు. (ఆ పోస్టును ఇక్కడ చూడండి) సిరియాలో తిరుగుబాటు పేరుతో అక్కడి తిరుగుబాటుదారులు చేస్తున్నది కేవలం అమెరికా తదితర పశ్చిమ దేశాల ప్రయోజనాల కోసమే. వారు టర్కీ, ఉత్తర లెబనాన్ లలో ఫ్రాన్సు, అమెరికా, బ్రిటన్ గూఢచారుల వద్ద శిక్షణ పొంది సిరియాలో ప్రవేశించి ప్రజలపై కాల్పులు జరుపుతూ ఆ నేరాల్ని సిరియా అధ్యక్షుడు, సైన్యం పైన మోపుతున్నారు. పశ్చిమ దేశాల పత్రికలు కూడా…

అమెరికా పాకిస్ధాన్ ల మధ్య ఉద్రిక్తతలు ఏర్పడుతున్న ఆఫ్-పాక్ సరిహద్దు -ఫొటోలు

ఆఫ్ఘనిస్ధాన్, పాకిస్ధాన్ దేశాల మధ్య సరిహద్దు, ముఖ్యంగా డ్యురాండ్ లైన్ గా భావించే సరిహద్దు సరిగ్గా గుర్తించలేదు. ఆఫ్ఘనిస్ధాన్, పాకిస్ధాన్ లు పరస్పరం అంగీకరించిన సరిహద్దు రేఖ ఇంకా లేకపోవడమే దానికి కారణం. సరిహద్దులో ఉన్న ప్రాంతాలు ఇరు దేశాల్లో ఏ దేశానికి చెందినవన్న దానిపైన ఏకాభిప్రాయం లేకపోవడం వల్ల సమస్య పరిష్కారానికి నోచుకోక అలానే పడి ఉంది. ఈ ప్రాంతాలు అమెరికాను ముప్పు తిప్పలు పెడుతున్న పష్తూన్ తెగకు చెందిన మిలిటెంట్లకు గట్టి స్ధావరాలుగా ఉండడంతో…

ఈజిప్టు ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా జరిగాయట -కార్టూన్

ఈజిప్టు నియంత ముబారక్ గద్దె దిగి పది నెలల తర్వాత అక్కడి సైనిక ప్రభుత్వం ఈజిప్టు చట్ట సభలకు ఎన్నికలు ఈరోజు నిర్వహించింది. నిన్నటి వరకూ అక్కడ సైనిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజలు ఉద్యమించారు. ఉద్యమించిన ప్రజలపై సైనిక ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. కొన్ని వందలమందిని కాల్చి చంపింది. కొన్ని వేలమందిని అరెస్టు చేసి జైళ్లలో కుక్కింది. ఉన్న ప్రజాస్వామ్య హక్కులన్ని హరించివేసి ప్రశాంతంగా మొట్టమొదటి ప్రజాస్వామిక ఎన్నికలను నిర్వహించింది. జనవరి ఉద్యమం డిమాండ్…

పాక్ సైనికుల హత్యకు బదులు, ఆఫ్గన్ కాన్ఫరెన్సు బహిష్కరణకు పాక్ నిర్ణయం

ఆఫ్ఘనిస్ధాన్, పాకిస్ధాన్ సరిహద్దు వద్ద రెండు చెక్ పోస్టుల వద్ద మొహరించి ఉన్న పాక్ సైనికులను 28 మందిని అమెరికా హెలికాప్టర్లు, జెట్ ఫైటర్లు చంపినందుకు నిరసనగా జర్మనీ లోని బాన్ నగరంలో జరగనున్న ఆఫ్ఘనిస్ధాన్ కాన్ఫరెన్సుకు హాజరు కాకూడదని పాకిస్ధాన్ నిర్ణయించింది. కాన్ఫరెన్స్ ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. ఆఫ్ఘన్ యుద్ధానికి సంబంధించి కీలక పాత్ర పొషిస్తున్న పాకిస్ధాన్ గైర్హాజరీ లో ఆఫ్ఘనిస్ధాన్ పై కాన్ఫరెన్స్ జరగడం ఇదే మొదటిసారి కావచ్చు. పాకిస్ధాన్ సహాయం లేనట్లయితే ఆఫ్ఘనిస్ధాన్…

అమెరికా కండకావరం: కాల్పులు ఆపమని విజ్ఞప్తి చేసినా పట్టించుకోని వైనం

ఆఫ్ఘనిస్ధాన్ దురాక్రమణ యుద్ధంలో అమెరికాకి సహకరిస్తున్నందుకు పాకిస్ధాన్ తగిన మూల్యం చెల్లించుకుంటోంది. సంవత్సరం క్రితం అమెరికా హలికాప్టర్ల కాల్పుల్లో ఇద్దరు సైనికులను నష్టపోయిన పాకిస్ధాన్, గత శనివారం అమెరికా హెలికాప్టర్లు, ఫైటర్ జెట్ విమానాలు జరిపిన దాడిలో చెక్ పోస్టు వద్ద కాపలా ఉన్న 28 మంది సైనికులను (24 మంది అని ‘ది హిందూ‘, ‘ఫస్ట్ పోస్ట్‘ పత్రికలూ, 25 మంది అని ‘ది గార్డియన్‘ పత్రికా చెబుతున్నాయి) కోల్పోయిన సంగతి విదితమే. అమెరికా హెలికాప్టర్లు,…

కవి ఆవిష్కరించిన ‘కిషన్ జీ’ తల్లి గుండె ముచ్చట

కొడుకు మరణ వార్త విన్న కిషన్ జీ అమ్మ ఏమని తల్లడిల్లింది? కవి ‘అజ్ఞాతి‘ ఇలా ఆవిష్కరించాడు. (బొమ్మను క్లిక్ చేసి పెద్దది చూస్తూ చదవండి)

చందమామ నుంచి జంగల్ మహల్ దాకా….

–రచన: రాజశేఖర రాజు బాల్యంలో చందమామ కథలు చదువుకున్న ఆ కుర్రవాడు చందమామ కథలు చెప్పే మంచితనం తన చుట్టూ ప్రపంచంలో కనిపించడం లేదని మనసుకు తట్టినప్పుడు సంప్రదాయాలను, బాల్యంలో ఆచరించిన ఆర్.ఎస్.ఎస్ భావాలను కూడా త్యజించి పోరుబాట పట్టాడు. ఒక బ్రాహ్మణ కుర్రాడు –నమ్మిన విశ్వాసం కొరకు నేలకొరిగిన మాన్యుడి కులం గురించి ప్రస్తావిస్తున్నందుకు మన్నించాలి– జన్మతః వచ్చిన సమస్త సంప్రదాయ విలువలను తాను నమ్మిన లోకహితం కోసం వదులుకుని తుపాకి బాట పట్టాడు. ఇల్లు,…

భారత మీడియా కంటికి సి.ఆర్.పి.ఎఫ్ ఇలానే కనపడుతుంది -కార్టూన్

భారత ‘సెంట్రల్ రిజర్వ్‌డ్ పోలీస్ ఫోర్స్’ (సి.ఆర్.పి.ఎఫ్) కి చెందిన బలగాలు అడుగు పెట్టని రాష్ట్రం భారత దేశంలో లేదేమో. భారత దేశం లోని కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రజల సమస్యలను గాలికొదిలేసి ఆధిపత్య వర్గాల ప్రయోజనాలను మాత్రమే నెరవేర్చడంవలన పేద గొప్ప తారతమ్యాలు తీవ్రం అవుతున్నాయి. కోట్లమంది జనానికి బ్రతుకు తెరువు చూపించక పోగా ఈ ప్రభుత్వాలు తమ బ్రతుకు తాము బతుకుతున్న ప్రజల జీవితాల్లో చిచ్చు పెడుతున్నాయి. స్పెషల్ ఎకనమిక్ జోన్ లు కావచ్చు,…

అమెరికాపై ప్రతీకార చర్యలు తీవ్రం చేసిన పాక్, అమెరికా సారీ

పాకిస్ధాన్ గగన తలం లోకి మరోసారి జొరబడడమే కాకుండా, తాలిబాన్ పై పోరాడుతున్న 28 మంది పాక్ సైనికుల్ని అమెరికా హెలికాప్టర్లు చంపేయడంపైన పాకిస్ధాన్ లో ఆగ్రహం పెల్లుబుకుతోంది. పాకిస్ధాన్ ప్రభుత్వం, మిలట్రీలు ప్రతీకార చర్యలను ముమ్మరం చేశాయి. ఆఫ్ఘనిస్ధాన్ పై చేస్తున్న దురాక్రమణ యుద్ధంలో పాక్ ఇస్తూ వచ్చిన సహకారం తగ్గించే వైపుగా పాక్ మిలట్రీ వేగంగా చర్యలు తీసుకుంటోంది. పాక్ ప్రభుత్వం కూడా అదే బాటలో పయనిస్తోంది. శనివారం తెల్లవారు ఝామున 2 గంటలకు…

‘కిషన్ జీ’ అలియాస్ ‘మల్లోజుల కోటేశ్వరరావు’ గురించి మరిన్ని వివరాలు

పెద్దలు రాజశేఖర్ రాజు గారు ‘కిషన్ జీ’ గారి గురించి వివిధ పత్రికల వెబ్ సైట్లు అందించిన వివరాలను తన వ్యాఖ్య ద్వారా తెలియ జేశారు. ఆ వెబ్ సైట్ల లింకులను ఇక్కడ ఇస్తున్నాను. రాజశేఖర రాజు గారికి కృతజ్ఞతలతో. జీవితమే ఒక పండుగ కావాలమ్మా! – కిషన్ జీ https://www.andhrajyothy.com/EditorialShow.asp?qry=2011/nov/25/edit/25edit3&more=2011/nov/25/edit/editpagemain1&date=11/25/2011 లాల్‌గఢ్ యుద్ధభేరి ‘మల్లోజుల’! http://www.sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=31490&Categoryid=1&subcatid=1 గ్రీన్‌హంట్‌లో భాగమే ఈ హత్య https://www.andhrajyothy.com/EditorialShow.asp?qry=2011/nov/26/edit/26edit3&more=2011/nov/26/edit/editpagemain1&date=11/26/2011 కులాన్ని త్యజించిన కిషన్‌జీ https://www.andhrajyothy.com/EditorialShow.asp?qry=2011/nov/27/edit/27edit2&more=2011/nov/27/edit/editpagemain1&date=11/27/2011 ‘కిషన్ జీ’ నియస్ https://www.andhrajyothy.com/mainnewsshow.asp?qry=2011/nov/25/main/25main8&more=2011/nov/25/main/main&date=11/25/2011 బిటెక్…

సిరియా అద్దె విప్లవకారులకు ఫ్రాన్సు మిలట్రీ ట్రైనింగ్

సిరియా నుండి పారిపోయి వచ్చిన అద్దె విప్లవకారులకి ఫ్రాన్సు ప్రభుత్వం రహస్యంగా మిలట్రీ ట్రైనింగ్ అందించనున్నట్లుగా ఫ్రాన్సు కి చెందిన వార పత్రిక “లె కెనార్డ్ ఎన్‌షైన్” వెల్లడించింది. ఆ పత్రిక ప్రకారం ఫ్రాన్సు ఏజెంట్లు ప్రస్తుతం లెబనాన్, టర్కీలలో తిష్ట వేసుకుని ఉన్నారు. “‘సిరియా స్వేచ్ఛా సైన్యం’ నిర్మాణానికి ప్రారంభ సైనిక బలగాలను నిర్మించడం” ఆ ఏజెంట్ల ముఖ్య లక్ష్యం. లిబియాలో సోకాల్డ్ తిరుగుబాటు ప్రారంభం కాకముందే అక్కడి తిరుగుబాటుదారులు అమెరికాలో శిక్షణ తీసుకున్నట్లుగానే సిరియా…

పాకిస్ధాన్ లోకి జొరబడి 14 మంది పాక్ సైనికుల్ని చంపిన అమెరికా సైన్యం

అమెరికా హెలికాప్టర్లు మరోసారి పాకిస్ధాన్ లోకి జొరబడ్డాయి. అంతటితో ఆగకుండా ఒక మిలట్రీ చెక్ పాయింటు పై దాడి చేసి అక్కడ ఉన్న 14 మంది పాకిస్ధాన్ సైనికుల్ని చంపేశాయి. ఘటనలో మరో నలుగురు గాయపడ్డాఅరు. ఈ మేరకు పాకిస్ధాన్ ఇంటలిజెన్స్ అధికారులు పత్రికలకు సమాచారం అందించారు. దాడిలో మరో ఎనిమిది మంది సైనికులు గాయపడ్డారని స్ధానిక వార్తలను ఉటంకిస్తూ ‘ది గార్డియన్’ పత్రిక తెలిపింది. సలాలా చెక్ పాయింట్ గా పిలిచే ఈ మిలట్రీ చెక్…