‘ఆకుపై వాల్‌స్ట్రీట్’ సైగల భాష -బొమ్మలు

ఉద్యమాలు సృజనాత్మకతకు కేంద్రాలుగా భాసిల్లడం అనాదిగా వస్తున్న చరిత్ర. ఉద్యమాలకు ఉండే వివిధ అవసరాలు సృజనాత్మకతకు పదును పెడుతుంటాయి. వందలు, వేల మందిని ఆర్గనైజ్ చెయ్యవలసిన పరిస్ధితుల్లో ఒకరు వందల మందితో, తిరిగి వందలమంది ఒకరితో సంభాషించవలసిన పరిస్ధితుల్లో, దూరంగా ఉంటూ పరస్పరం సంభాషించుకోవలసిన పరిస్ధితుల్లో సైగల భాషకు ‘ఆకుపై వాల్ స్ట్రీట్’ ఉద్యమం జన్మనిచ్చింది. జన్మనిచ్చింది అనడం కంటే పదును పెట్టింది అనడం సరిగా ఉంటుంది. ‘ఆకుపై’ ఉద్యమాలకు మైక్ పర్మిషన్ ఇవ్వని పరిస్ధుతులనుండి ‘హ్యూమన్…

వ్యక్తిగత విద్వేష ప్రచారమే ‘కెబ్లాస’ లక్ష్యం, దయచేసి బ్లాగర్లందరూ ఇది చదవండి

బ్లాగింగ్ కి ఒక పేరు, కెలకడానికి ఒక పేరు. బూతులకి ఒక పేరు. బ్లాగింగ్ పేర్లతో కెలుకుడు ఉండదు. కెలుకుడు పేర్లతో బూతు ఉండదు. బూతులకి వాడే పేర్లతో బ్లాగింగ్, కెలుకుడులు ఉండవు. వీరంతా టెక్నీషియన్లు. పేర్లు, ఐ.పిలు లాంటివాటిలో జాగ్రత్తలు తీసుకోగలరు. ఆ ధైర్యంతోనే “కెలుకుడు పేర్ల కింద ఒక్క బూతు చూపండి చూద్దాం” అని తుంటరి సవాళ్ళు విసురుతారు. కెలుకుడు గాళ్ళే బూతు గ్యాంగ్ అని శైలి ద్వారా, వే ఆఫ్ రియాక్షన్ ద్వారా,…

మాయావతి పక్కనుంటే అవినీతి పరుడు, బి.జె.పి లోకి దూకితే ఒ.బి.సి నాయకుడు

భారతీయ జనతా పార్టీ అవినీతి వ్యతిరేకత మట్టి గొట్టుకుపోయింది. ఒ.బి.సిలకు నాయకుడని, ఓట్లు తెస్తాడనీ తాను నమ్మినందున, ఆయన బి.జె.పి తలుపు తట్టినందున అప్పటివరకూ అవినీతి మంత్రిగా ఉన్న వ్యక్తి కాస్తా వెనుకబడిన తరగతులకు నాయకుడుగా మారిపోయాడు. భారత దేశంలోని రాజకీయ పార్టీల అవినీతి వ్యతిరేకతలో నిజాయితీ నేతి బీరలో నెయ్యి చందమేనని రుజువు కావడం ఇది ఎన్నోసారో! లోక్ పాల్ చట్టం కోసం అన్నా హజారే చేసిన అవినీతి వ్యతిరేక పోరాటానికి భావోద్వేగాలతో మద్దతు పలికిన…

ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రచారానికి వెళ్ళరాదని హజారే నిర్ణయం

ఉత్తర ప్రదేశ్ తో సహా త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల శాసన సభల ఎన్నికల్లో కాంగ్రెస్ వ్యతిరేక ప్రచారానికి వెళ్లరాదని అన్నా హజారే నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు అన్నా బృందం కోర్ గ్రూపు సభ్యురాలు కిరణ్ బేడీ గురువారం ప్రకటించింది. అన్నా అనారోగ్యంగా కారణంగా ముందు అనుకున్న ఈ కార్యక్రమాన్ని రద్దు చేసుకుంటున్నట్లుగా ఆమె తెలిపింది. “రాష్ట్రాల ఎన్నికల్లో అన్నా ప్రచారం చేయడం లేదు. అన్నా ప్రయాణాలు చెయ్యరు. ఆయన ప్రయాణాలు చెయ్యవద్దని మేమూ కోరాము. ఆయన…

‘ఆకుపై వాల్‌స్ట్రీట్’ ఉద్యమంలో వెల్లువెత్తిన సృజనాత్మక నినాదాలు -ఫొటోలు

“ఆకుపై వాల్ స్ట్రీట్” ఉద్యమంలో ప్లెకార్డులపై రాసిన నినాదాలు ఒక పెద్ద వార్తగా మారాయి. ముందుగా అనుకుని రాసి తెచ్చుకున్న నినాదాలు కొన్నయితే, అప్పటికప్పుడు చేతికి అందిన అట్టపైనో, కార్డ్ బోర్డ్ అట్టపైనో, కాగితంపైనో రాసి ప్రదర్శించిన నినాదాలు అనేకం. – –

అన్నా హజారే పై విమర్శలు, అవినీతి వ్యతిరేక ఉద్యమ విశ్లేషణ -1

అన్నా హజారే భారత దేశంలో రాజకీయ నాయకులు, బ్యూరోక్రసీ అధికారుల అవినీతికి వ్యతిరేకంగా గత సంవత్సర కాలంలో పోరాడుతున్నాడు. నిజానికి అన్నా హజారే పోరాడుతున్నాడు అనడం సమంజసం కాదు. అన్నా హజారే గానీ, ఆయన లాంటివారు గానీ వ్యక్తిగా తలపడి అవినీతి లాంటి సామాజిక, రాజకీయ, ఆర్ధిక చెడుగు పై పోరాడడం సాధ్యమయ్యే పని కాదు. అవినీతి వ్యతిరేక ఉద్యమంలో అన్నా క్రెడిట్ అంతా ఆయన ప్రజలను కూడగట్టగలగడం లోనే ఉంది. అంటే అన్నా చరిత్ర, నిబద్ధత,…

అన్నా హజారే దృష్టిలో ‘గొడ్రాలు’ చులకన!

రాజకీయ నాయకులు, బ్యూరోక్రట్ అధికారుల అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న అన్నా హజారే, పిల్లలు కలగని స్త్రీలపైన తన అవగాహనా రాహిత్యాన్నీ, చిన్నచూపును చాటుకున్నాడు. తన జీవితంలో అత్యధిక భాగం గ్రామంలో నివసించే అన్నా, గ్రామీణ భారతంలో ఉన్న వెనకబాటు భావనలకు తాను అతీతుడిని కానని మంగళవారం దీక్షలో ప్రసంగిస్తున్న సందర్భంగా వెల్లడించుకున్నాడు. ప్రసంగం సందర్భంగా అన్నా హజారే “బంఝ్ క్యా జానె ప్రసూతి వేదనా (గొడ్రాలికేం తెలుసు ప్రసవ వేదన)?” అని వ్యాఖ్యానించినట్లుగా హిందూస్ధాన్ టైమ్స్ వెల్లడించింది.…

ముంబై తో పాటు ఢిల్లీ కూడా విస్మరించిన ‘అన్నా పిలుపు’

‘పటిష్టమైన లోక్ పాల్ బిల్లు’ తేవాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అన్నా ఇచ్చిన ఆందోళన పిలుపును ఈసారి ప్రజలు పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించలేదు. గతంతో పోలిస్తే ప్రజలు ఆన్నా ఆందోళనకు అంత తీవ్రంగా పట్టించుకోనట్లు కనిపిస్తోంది. లోక్ పాల్ బిల్లు ఆమోదం పొందాక తమ ఆందోళన ఎన్నికల సంస్కరణలపై కేంద్రీకరిస్తుందని ప్రకటించిన అన్నా బృందం, అప్పటికి ఎంతమంది ప్రజలను ఆకర్షించగలుగుతారన్నదీ ఇపుడు ప్రశ్నగా మారింది. ప్రభుత్వం తలపెట్టిన ‘బలహీన’ లోక్ పాల్ బిల్లుకి వ్యతిరేకంగా ఆందోళన జరపాలని…

‘బ్యాట్ మేన్’ రెక్కలు కత్తిరించిన చైనా పోలీసు గూండాలు

చైనాలో ‘పోలీసులు’ అనబడే గూండాలు ‘బ్యాట్ మేన్’ సినిమా హీరో రెక్కలు కత్తిరించారు. తన తాజా సినిమా ప్రచారం కోసం చైనాలో పర్యటిస్తున్న ‘బ్యాట్ మేన్’ హీరో క్రిస్టియన్ బేల్, ఒక చైనా న్యాయవాద కార్యకర్తను కలవడానికి చేసిన ప్రయత్నాలను స్ధానిక పోలీసులు వమ్ము చేసారు. పోలీసు నిర్భంధం నుండి విడుదలైన కార్యకర్త ఇంటివద్ద ఉన్నప్పటికీ, ఆయనను కలవడం పైన ప్రస్తుతం నిషేధమేమీ లేనప్పటికీ అతన్ని సినిమా స్టార్ కలవడానికి పోలీసులు ఇష్టపడకపోవడం విశేషం. బేల్ ను…

నష్టపరిహారం ఇవ్వకుండా భూములు లాక్కొని వెళ్ళగొట్టడం చైనాలోనూ మామూలే

ఇండియా, చైనా. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన దేశాల్లో మొదటి రెండు స్ధానాల్లో ఉన్న దేశాలు ఇవి. ‘ఎమర్జింగ్ మార్కెట్ ఎకానమీ’ లుగా ప్రపంచ ఆర్ధిక పండితులచేత ప్రశంసలు అందుకుంటున్న దేశాలు. కాని ఈ రెండు దేశాలు తమ ప్రజల జీవితాలను అల్లకల్లోలం చేసి, వారి వర్తమానాన్ని, భవిష్యత్తును కూడా ఫణంగా పెట్టిమరీ ఆర్ధిక వృద్ధిని సాధిస్తున్నాయన్నది ఆ దేశాల ప్రజలకు మాత్రమే తెలిసిన సత్యం. భారత దేశంలో పోస్కో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించ తలపెట్టిన…

ఆఫ్-పాక్ ‘హోం మేడ్’ బాంబులకు హడలుతున్న అమెరికా, పాక్‌కి సహాయం నిలిపివేత

ఆఫ్ఘనిస్ధాన్, పాకిస్ధాన్ దేశాలలోని మిలిటెంట్లు వాడుతున్న హోం మేడ్ బాంబుల ధాటికి అమెరికా ఠారెత్తుతోంది. అమెరికా, నాటో సైనికులను ఇంటి తయారీ బాంబులే వణికిస్తున్నాయి. ‘ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజెస్’ (ఐ.ఇ.డి) గా పిలిచే ఈ బాంబులవల్లనే పలువురు అమెరికా, నాటో సైనికులు చనిపోవడంతో వాటిని ఎలా కట్టడి చేయాలో అర్ధం కాక సతమతమవుతోంది. ‘ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు’ అమెరికా తన నిస్సహాయతను అంతా పాకిస్ధాన్ పైన చూపిస్తోంది. ఐ.ఇ.డిలను కట్టడి చేయడానికి పాకిస్ధాన్ సరైన…

ఐక్యరాజ్య సమితి తప్పుడు సమాచారం ఇస్తోంది -సిరియా అధ్యక్షుడు

సిరియాలో ప్రజల మరణాలపై ఐక్యరాజ్య సమితి ఇస్తున్నవి తప్పుడు లెక్కలని సిరియా అధ్యక్షుడు బషర్ ఆల్-అస్సద్ తెలిపాడు. అమెరికా వార్తా సంస్ధ ఎబిసి న్యూస్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయం చెప్పాడు. సిరియా లో నాలుగు వేల మంది చనిపోయారని ఐక్యరాజ్యసమితి చెబుతోంది. సిరియా వచ్చి ఇక్కడ సర్వే జరిపి నిజా నిజాలు వెల్లడించాలని సిరియా అధ్యక్షుడు కోరాడు. సిరియా భద్రతా దళాలు తన సొంత దళాలు కాదని బషర్ అన్నాడు. దళాలను తాను…

12 వ సంవత్సరంలోకి ప్రవేశించిన “ఇరోం షర్మిలా” నిరాహార దీక్ష

-రచన: డేవిడ్ ఉక్కు సంకల్పం ఆమె. మొక్కవోని మనో నిబ్బరం ఆమె. అత్మరవం నుంచి జనించిన ఆగ్రహం ఆమె. తల్లడిల్లుతున్న యుద్ధభుమిలో తపోదీక్ష చేస్తున్న శాంతికపోతం ఆమె. తుపాకి గొట్టాల విచ్చలవిడీ తనాన్ని ప్రశ్నించిన ప్రజాస్వామిక గొంతు. నిరంకుశ చట్టాన్ని నిరసించిన నిప్పు కణిక. జాతికోసం జంగ్ చేస్తున్న జ్వలిత. అన్యాయంపై తిరగబడ్డ అగ్గిబరాట. శరీరాన్నే ఆయుధంగా మలుచుకున్న సాహస వనిత. పుష్కర కాలంగా అన్నపానియాలు ముట్టని అసలు సిసలు సత్యాగ్రహి. కన్నీళ్ళను, కష్టాలను కలబోసిన నెత్తుటి…

పాక్ చెక్ పోస్టులపై దాడి మిలట్రీ ఆపరేషన్ లో భాగమే -అమెరికా

ఎట్టకేలకు అమెరికా మిలట్రీ అధికారి ద్వారా పాక్షికంగానైనా నిజం బైటకి వచ్చింది. ఆఫ్ఘన్, పాకిస్ధాన్ (ఆఫ్-పాక్) సరిహద్దులో పాక్ చెక్ పోస్టులపైన అమెరికా హెలికాప్టర్లు, జెట్ ఫైటర్లు జరిపిన దాడి అమెరికా మిలట్రీ ఆపరేషన్ లో భాగంగానే జరిగిందని అమెరికా మిలట్రీ ప్రతినిధి, నేవీ కెప్టెన్ జాన్ కిర్బీ చెప్పినట్లుగా ‘ది హిందూ’ వెల్లడించింది. ఈ దాడిలో పాకిస్ధాన్ సైనికులు 24 మంది చనిపోవడం పట్ల అమెరికా రక్షణ శాఖ ఉన్నత స్ధాయి వర్గాలు ఇప్పటికే విచారం…