అవినీతిపై విచారణ కోరినందుకు అధికారిని పిచ్చాసుపత్రిలో చేర్చబోయిన యు.పి ప్రభుత్వం

మాయావతి పాలన అవినీతి మయం అయిందంటూ ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన సమాజ్ వాదీ పార్టీ, రాష్ట్ర ప్రభుత్వ స్కీముల్లో జరుగుతున్న అవినీతి పై విచారణ కోరుతూ ధర్నా చేస్తున్న రాష్ట్ర అధికారిని పిచ్చాసుపత్రిలో చేర్చడానికి ప్రయత్నించింది. అధికారిని చేర్చుకోవడానికి డాక్టర్లు నిరాకరించడంతో పోలీసులు వెనుదిరగవలసి వచ్చింది. రెండేళ్ల క్రితం మాఫియా కాల్పుల్లో కన్ను కోల్పోయినప్పటికీ అవినీతి వ్యతిరేక పోరాటం కొనసాగిస్తున్నందుకు ‘రింకు సింగ్ రాహి’ని పిచ్చివాడుగా ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. గూండా పాలనను…

చైనా అధ్యక్షుడి రాకను నిరసిస్తూ ఢిల్లీలో టిబెటన్ ఆత్మాహుతి -ఫొటోలు

చైనా అధ్యక్షుడు హు జీంటావో భారత దేశం సందర్శించడాన్ని నిరసిస్తూ టిబెట్ జాతీయుడొకరు న్యూఢిల్లీలో ఆత్మాహుతికి పాల్పడ్డాడు. ఢిల్లీలో నిరసన ప్రదర్శన జరుగుతుండగా దుర్ఘటన చోటు చేసుకుంది. తనకు తాను నిప్పంటించుకున్న జాన్ఫెల్ యేషి హు సందర్శనను వ్యతిరేకిస్తూ నినాదాలు ఇచ్చుకుంటూ యాభై మీటర్లు పరిగెత్తాడు. దానితో వెంటనే మంటలు ఆర్పడానికి చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. బాధితుడిని సమీపంలోని ఆసుపత్రిలో చేర్చారు. శరీరం ఎంతవరకు కాలిందీ వివరాలు తెలియలేదని పత్రికలు చెప్పాయి. టిబెట్ స్వతంత్రాన్ని కాంక్షిస్తూ…

ఇజ్రాయెల్ అక్రమ సెటిల్ మెంట్ల పై విచారణకు ఐక్యరాజ్య సమితి ఆదేశం

పాలస్తీనా భూభాగాలను అక్రమంగా ఆక్రమించుకుని నిర్మించిన సెటిల్ మెంట్ల పై విచారణ చేయాలని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంస్ధ తీర్మానం ఆమోదించింది. ఒక్క అమెరికా తప్ప ఇతర సభ్యులందరూ తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయడమో లేక ఓటింగ్ లో పాల్గొనకపోవడమో చేశారు. ఇజ్రాయెల్ సాగించే అక్రమ వలస పాలనకూ, పాలస్తీనీయులపై అది సాగించే దౌర్జన్యాలకూ నిరంతరం వత్తాసు వచ్చే అమెరికా, మానవ హక్కుల సంస్ధ తీర్మానం ఇజ్రాయెల్ కి వ్యతిరేకంగా పక్ష పాతంగా కూడి ఉందని…

పాలస్తీనాపై కొనసాగుతున్న ఇజ్రాయెల్ హంతక దాడులు

ఇజ్రాయెల్ వరుసగా మూడో రోజు కూడా గాజా పై దాడి చేసి 7 గురు అమాయక పౌరులను బలి తీసుకుంది. శనివారం గాజాపై వైమానిక దాడులు జరిపి పది మందిని చంపిన ఇజ్రాయెల్, ఆదివారం మళ్ళీ అత్యాధునిక విమానాలతో జరిపిన బాంబు దాడుల్లో మరో 7 గురుని చంపేసింది. చనిపోయినవారిలో 12 యేళ్ళ బాలుడు కూడా ఉన్నాడు. గత కొద్ది నెలలుగా చెదురు ముదురు ఘటనలు తప్ప ప్రశాంతంగా ఉన్న వాతావరణం, ముఖ్యమైన పాలస్తీనా నాయకుడిని ఇజ్రాయెల్…

Water problem in India

భారత దేశంలో నీటి సమస్య ‘విశ్వరూపం -ఫొటో

ఇన్ఫర్మేషన్ అన్న పేరుతో ఉన్న ఫేస్ బుక్ ఎకౌంట్ లో ఈ ఫొటో లబ్యమయింది. భారత దేశంలో తాగు నీరు సమస్య కళ్లకు కట్టినట్లు ప్రతిబింబిస్తున్న ఈ ఫొటో తీసిన ఫొటో గ్రాఫర్ ని అభినందించకుండా ఎవరైనా ఉండగలరా? ఫొటోగ్రఫీ కళతో ప్రజల సమస్యలను ఎంత శక్తివంతంగా చెప్పవచ్చో ఈ ఫోటో తెలుపుతోంది. కళలన్నవి ప్రజలకు ఉపయోగపెట్టాలన్న స్పృహ ఉన్నపుడు కళలతో అద్భుతాలు సాధించవచ్చు.

అమెరికా-తాలిబాన్ చర్చలు, ‘కాల్పుల విరమణ’ కోసం దేబిరిస్తున్న అమెరికా

తాలిబాన్ తో జరుగుతున్న చర్చల్లో అమెరికా ‘కాల్పుల విరమణ’ కోసం దేబిరిస్తుండగా, తమ సుప్రీం నాయకుడి కోసం ‘రాజ్యాంగ హోదా’ కావాలని తాలిబాన్ డిమాండ్ చేస్తోంది. గ్వ్యాంటనామో బే లో ఖైదీగా ఉన్న తమ నాయకులను, కమాండర్లనూ విడుదల చేయాలనీ, కీలు బొమ్మ కర్జాయ్ ప్రభుత్వం రూపొందించిన రాజ్యాంగాన్ని పూర్తిగా రద్దు చేయాల్సిందేననీ తాలిబాన్ డిమాండ్ చేస్తోంది. ఋణ సంక్షోభం, మళ్ళీ రిసెషన్ లోకి జారిపోతుందేమోనని భయపెడుతున్న ఆర్ధిక వ్యవస్ధ, నిరుద్యోగం లాంటి సమస్యలతో సతమతమవుతున్న అమెరికా,…

‘భోపాల్ గ్యాస్ లీక్’ ఉద్యమం పై నిఘా పెట్టిన ‘డౌ కెమికల్స్’

భోపాల్ గ్యాస్ లీక్ బాధితులకు నష్ట పరిహారం కోసం పోరాడుతున్న సంస్ధలపైన అమెరికా కంపెనీ ‘డౌ కెమికల్స్’ అనేక సంవత్సరాలుగా నిఘా పెట్టిన సంగతి వెల్లడయ్యింది. అమెరికాలో టెక్సాస్ లో ఉన్న ‘స్ట్రాట్ ఫర్’ అనే ప్రవేటు డిటెక్టివ్ కంపెనీని ఇందుకు వినియోగించినట్లుగా వెల్లడ్యింది. ప్రవేటు డిటెక్టివ్ కంపెనీ ‘స్ట్రాట్ ఫర్’ కి సంబంధించిన 5.5 మిలియన్ల (55 లక్షలు) ఈ మెయిళ్ళు వికీ లీక్స్ కు అందడంతో స్ట్రాస్ ఫర్ పాల్పడిన పాపాల పుట్ట బద్దలయింది.…

కుదంకుళం ‘అణు వ్యతిరేక’ ఆందోళనలు, నాలుగు ఎన్.జి.ఓ లపై కేసులు

రష్యా సహాయంతో నిర్మించిన తమిళనాడు, కుదంకుళం అణు కర్మాగారానికి వ్యతిరేకంగా జరుగుతున్నా ప్రజాందోళనలకు ఆర్ధిక సహాయం చేసి రెచ్చగొడుతున్నాయన్న ఆరోపణలతో నాలుగు ఎన్.జి.ఓ (నాన్-గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్) సంస్ధలపైన కేసులు నమోదు చేయడానికి ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. రెండు సంస్ధలపై సి.బి.ఐ కేసు నమోదు చేయగా, మరో రెండింటిపైన తమిళనాడు పోలీసులు కేసులు పెట్టారని కేంద్ర హోమ్ శాఖ కార్యదర్శి ఆర్.కె.సింగ్ మంగళవారం విలేఖరులకు తెలిపాడు. కుదంకుళం కర్మాగారానికి వ్యతిరేకంగా అమెరికా, స్కాండినేవియా దేశాలు ఆందోళనకు రెచ్చగొడుతున్నాయని ప్రధాని ఆరోపించిన…

కుదంకుళం ఆందోళనల అనుమానంతో జర్మన్ దేశీయుడిని గెంటేసిన భారత ప్రభుత్వం

తమిళనాడు కుదంకుళం అణు కర్మాగారం కి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల వెనుక ఉన్నాడన్న అనుమానంతో ఓ జర్మన్ దేశీయుడిని భారత ప్రభుత్వం దేశం నుండి వెళ్ళగోట్టింది. ఆదివారం అర్ధ రాత్రి నాగర్ కోయిల్ లోని ఒక ప్రవేటు లాడ్జి పైన రాష్ట్ర, కేంద్ర గూఢచార సంస్ధల అధికారులు, స్ధానిక పోలీసుల సహాయంతో దాడి చేసి ఈ జర్మన్ దేశీయుడిని అరెస్టు చేశారు. తదుపరి విచారణం కోసం చెన్నై తీసుకెళ్ళిన పోలీసులు, అతనిని చెన్నై విమానాశ్రయం నుండి వెనక్కి…

అరగంటకోసారి విశ్రాంతి కోరే పని అది, పదేళ్ళుగా సెలవే లేదు

భారత దేశ రాజధాని న్యూఢిల్లీలోనే వాజీర్ పూర్ పారిశ్రామిక ప్రాంతంలో గల అనేక స్టీల్ ప్లాంట్లలో పదేళ్ళుగా సెలవన్నది తెలియకుండా పని చేస్తున్న కార్మికుల సంగతి వెలుగులోకి వచ్చింది. వారానికొక విశ్రాంతి దినం కోసం అక్కడి కార్మికులు స్వచ్ఛందగా సమ్మెకు దిగడంతోనే ఇప్పటికైనా వారి దుస్థితి వెలుగులోకి వచ్చింది. దాదాపు పదేళ్ళ తర్వాత మొదటిసారిగా వాజీర్ పూర్ స్టీల్ ప్లాంటుల కార్మికులు బుధవారం రోజు (ఫిబ్రవరి 29) వారాంతపు సెలవు దినాన్ని పొందనున్నారు. ఆ రోజు వారు…

ఖురాన్ దహనంపై ఆఫ్ఘన్ల నిరసనలు -ఫొటోలు

ఆఫ్ఘనిస్ధాన్ లోని అమెరికా సైనిక స్ధావరంలో సైనికులు ఖురాన్ ప్రతులను దగ్ధం చేయడంతో వారం రోజుల నుండి అక్కడ ప్రజల నిరసనలు వెల్లువెత్తాయి. ఆదివారం ఇద్దరు సీనియర్ అమెరికా సైనికాధికారులను ఆఫ్ఘన్ పోలీసు కాల్చి చంపాడు. శనివారం నిరసనకారులు విసిరిన గ్రేనేడ్ పేలి పది మందికి పైగా అమెరికా సైనికులు, అధికారులు గాయపడ్డారు. నిరసన ప్రదర్శనలపై ఆఫ్ఘన్ పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇప్పటికి పాతిక మందికి పైగా నిరసనకారులు ప్రాణాలు కోల్పోయారు. అమెరికా అధ్యక్షుడు ఒబాబా తో…

కుదంకుళం అణు కర్మాగారం, ప్రధాన మంత్రిపై పరువు నష్టం దావా

రష్యా సహకారంతో మొదటి దశ నిర్మాణం పూర్తి చేసుకున్న కుదంకుళం అణు విద్యుత్ కర్మాగారంపై పోరాటం చేస్తున్న ఎన్.జి.ఓ (నాన్-గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్) సంస్ధలకు అమెరికా, స్కాండినేవియా దేశాల నుండి డబ్బు ముడుతోందంటూ వ్యాఖ్యానించిన ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ పై ‘పరువు నష్టం’ దావా వేయడానికి ఉద్యమ నాయకుడు ఉదయ కుమార్ సిద్ధమవుతున్నాడు. తమకు ఏ దేశం నుండీ నిధులు అందడం లేదనీ, ఆమేరకు ప్రధాని చేసిన వ్యాఖ్యలు దురుద్దేశపూరితంగా ఉన్నాయనీ ఉదయకుమార్ ఆరోపిస్తున్నాడు. అణు విద్యుత్…

నక్సల్ జిల్లాల్లో పోలీసులకి రు.800 కోట్లు, ప్రజలకి రు.30 కోట్లు

దేశంలో నక్సల్ పీడిత జిల్లాలలో దుర్భేధ్యమైన కోటల్లాంటి పోలీసు స్టేషన్ల నిర్మాణానికి కేంద్ర ప్రభ్యుత్వం రు.120 కోట్లు మేరకు విడుదల చేసింది. పోలీసు ఠాణాల నిర్మాణం కోసం విడుదల చేస్తున్న ఈ సొమ్ము కేవలం మొదటి వాయిదా మాత్రమే.  మరింత సొమ్ముని మరిన్ని వాయిదాలలో విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇదిలా ఉండగా నక్సల్ పీడిత జిల్లాలలోని ప్రజలకు సౌకర్యాలు కల్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం 2010-11 లో కేవలం రు.25 కోట్లు మాత్రమే…

‘ఖురాన్’ దగ్ధం పై ఆఫ్టనిస్ధాన్ లో వెల్లువెత్తుతున్న నిరసనలు

అమెరికా సైనికులున్న సైనిక స్ధావరంలో ఖురాన్ ప్రతులను అనేకం దగ్ధం చేసిన తర్వాత అక్కడ నిరసన ప్రదర్శనలు రోజు రోజుకీ తీవ్రమవుతున్నాయి. ఇద్దరు అమెరికా సైనికులతో సహా మొత్తం పదకొండు మంది ఆఫ్ఘన్ల నిరసనలలో మరణించారు. అమెరికా సైనికులు నిరసనకారుల చేతుల్లో చనిపోగా ఆఫ్ఘన్ నిరసన కారులు ఆఫ్ఘన్ పోలీసుల కాల్పుల్లో చనిపోయారు. అమెరికా అధ్యక్షుడు ఒబామా తమ సైనికుల చర్యకు క్షమాపణ చెప్పినప్పటికీ నిరసనలు చల్లారకపోవడంతో అమెరికా, ఆఫ్ఘన్ పాలకులు తలలు పట్టుకున్నారు. ఒబామా చెబుతున్న…

వైట్ హౌస్‌పై పొగ బాంబు విసిరిన నిరసనకారులు

అమెరికా అధ్యక్ష భవనం ఆవరణలోకి మంగళవారం ఆకుపై ఉద్యమకారులు పొగబాంబు విసిరి సంచలనం సృష్టించారు. ఈ సంఘటనతో వైట్ హౌస్ ని తాత్కాలికంగా మూసివేశారు. వైట్ హౌస్  చుట్టూ ఉన్న కంచె పై నుండి ఈ పొగబాంబు విసిరినట్లు తెలుస్తోంది. అమెరికా సీక్రెట్ సర్వీస్ పోలీసులను ఉటంకిస్తూ ‘ది హిందూ’ వార్తా పత్రిక ఈ వార్తను ప్రచురించింది. వెయ్యిమందికి పైగా ఉన్న నిరసనకారులు ప్రదర్శన నిర్వహిస్తుండగా ఈ సంఘటన జరిగిందని పత్రికలు, ఛానెళ్ళు తెలిపాయి. వైట్ హౌస్…