మూడు రోజుల్లో 24 మంది ఆఫ్ఘన్ పౌరుల్ని చంపేసిన నాటో బలగాలు

గత మూడు రోజుల్లోనే దేశవ్యాపితంగా జరిపిన దాడుల్లో 24 మంది అమాయక ఆఫ్ఘన్ పౌరులను నాటో దురాక్రమణ బలగాలు చంపేశాయి. మరింతమందిని గాయపరిచాయి. పాతిక మందిని చంపినందుకు రెండు రోజుల్లో సారీ చెబుతామని నాటో అధికారి చెప్పాడు. చనిపోయినవారిలో మహిళలు పిల్లలు ఉన్నారు. వాయవ్య ఆఫ్ఘనిస్ధాన్ లో ఉన్న బాద్ఘిస్ రాష్ట్రంలో సోమవారం నాటో విమానాలు జరిపిన బాంబు దాడుల్లో ఐదుగురు మరణించారనీ, మరో 15 మంది గాయపడ్డారనీ ప్రెస్ టి.వి తెలిపింది. అయితే వాషింగ్టన్ పోస్ట్…

ఆఫ్-పాక్ యుద్ధ కల్లోలం -ఫొటోలు

యుద్ధాలు జన జీవనంలో మిగిల్చే భీభత్సం అంతా ఇంతా కాదు. లక్షల మందిని విగత జీవుల్ని చేసే యుద్ధాలు మరిన్ని లక్షల మందిని అవయవాలు లేని జీవచ్చవాలుగా మారుస్తాయి. ఇంకా అనేక రెట్ల మంది జీవితాల్లో తీరని విషాధాలు మిగిల్చి తరాల తరబడి ప్రభావాన్ని కలుగు జేస్తాయి. యుద్ధాల వల్ల బాగు పడేది పెట్టుబడిదారీ కంపెనీలు, ఆ కంపెనీల దగ్గర కమీషన్లు మెక్కే రాజకీయ నాయకులు, అధికారులే. ప్రజలు మాత్రం ధన, మాన, ప్రాణాలను కోల్పోయి చెట్టుకొకరు,…

క్లుప్తంగా… 05.05.2012

జాతీయం వేచి చూస్తాం -రాష్ట్రపతి ఎన్నికపై లెఫ్ట్ పార్టీలు రాష్ట్ర పతి ఎన్నికకు సంబంధించి వేచి చూడడానికి నిర్ణయించుకున్నామని లెఫ్ట్ పార్టీలు తెలిపాయి. సి.పి.ఐ, సి.పి.ఎం, ఆర్.ఎస్.పి ఫార్వర్డ్ బ్లాక్ న్యూఢిల్లీలో సమావేశమై మాట్లాడుకున్న అనంతరం తమ నిర్ణయం ప్రకటించాయి. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్.సి.పి పార్టీ మాత్రం ఉప రాష్ట్రపతి ‘హమీద్ అన్సారీ’ కంటే ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ యే తమకు ఆమోదయోగ్యమని ప్రకటించింది. అంతిమ నిర్ణయం తీసుకునే ముందు ‘సెక్యులర్’ పార్టీల అభిప్రాయం…

క్లుప్తంగా… 04.05.2012

జాతీయం మణిపూర్ విద్యార్ధి డ్రగ్స్ వల్ల చనిపోలేదు –ఫోరెన్సిక్ నివేదిక బెంగుళూరు లో చదువుతున్న మణిపూర్ విద్యార్ధి రిచర్డ్ లోయితం డ్రగ్స్ వల్ల చనిపోలేదని ఫోరెన్సిక్ ఫలితాలు నిర్ధారించినట్లు ‘ది హిందూ’ తెలిపింది. ఆర్కిటెక్చర్ విద్యార్ధి అతని సీనియర్ విద్యార్ధులు కొట్టడం వల్ల చనిపోయాడని అతని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సీనియర్ విద్యార్ధుల దాడిలో చనిపోయినప్పటికీ బెంగుళూరు పోలీసులు కేసు నమోదు చేయలేదని మణిపూర్ విద్యార్ధులపైన వివక్ష పాటిస్తున్నారని ఆరోపిస్తూ దేశ వ్యాపితంగా మణిపూర్ విద్యార్ధులు నిరసన ప్రదర్శనలు…

‘నీరు, అడవి, భూమి’ ల యజమానులు ఎవరన్నదే మావోయిస్టు సమస్య -బి.డి.శర్మ

గిరిజన ప్రాంతాల్లో “జల్, జంగిల్, జమీన్” యజమానులు ఎవరన్నదే మావోయిస్టులు, ప్రభుత్వం మధ్య ఉన్న ప్రధాన సమస్య అని మాజీ జిల్లా మేజిస్ట్రేట్ బి.డి.శర్మ అన్నారు. ఛత్తీస్ ఘర్ లో కిడ్నాపయిన కలెక్టర్ అలెక్స్ పాల్ మీనన్ విడుదల కోసం మధ్యవర్తిత్వం వహించి బి.డి.శర్మ సఫలం అయ్యారు. న్యూఢిల్లీలో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ బి.డి.శర్మ ఖనిజ సంపదలున్న భూములకు యజమానులైన గిరిజనులపైన రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు వారి ప్రయోజనాలకు వ్యతిరేకమైన అభివృద్ధి నమూనాను బలవంతంగా రుద్దుతున్నాయని, సమస్యకు…

‘ఒలింపిక్స్’ ని రాజకీయం చేయడానికి అడ్డదారిలో బ్రిటన్ ప్రయత్నం?

‘లండన్ ఒలింపిక్స్’ ని రాజకీయం చేయడానికి అర్జెంటీనా ప్రయత్నిస్తోందని బ్రిటన్ కొన్ని రోజులుగా ఆరోపిస్తోంది. ఒలింపిక్ క్రీడల ప్రచారం కోసం తన భూభాగాన్ని వినియోగించడం ద్వారా ఒలింఫిక్స్ లో రాజకీయాలు చొప్పించడానికి అర్జెంటీనా ప్రయత్నిస్తోందని బ్రిటన్ అంటోంది. వివాదానికి కారణమైన ప్రచార ప్రకటనను రూపొందించింది బ్రిటన్ కంపెనీయేనని తెలియడంతో అసలు ఒలింపిక్స్ ని రాజకీయం చేస్తున్నది అర్జెంటీనా దేశమా లేక బ్రిటన్ దేశమా అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బ్రిటన్ కి వేల మైళ్ళ దూరంలో దూరంలోనూ,…

ఇరాన్ కి వ్యతిరేకంగా టెర్రరిస్టులను మోహరిస్తున్న అమెరికా, ఇజ్రాయెల్

ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ మద్దతు పొందిన ఇరానియన్ టెర్రరిస్టు సంస్ధ ‘ముజాహిదీన్-ఎ ఖల్క్ ఆర్గనైజేషన్’ (ఎం.కె.ఒ) (లేదా ఎం.ఇ.కె) ను ఇరాన్ కి వ్యతిరేకంగా అజర్ బైజాన్ లో మోహరించడానికి ఇజ్రాయెల్, అమెరికాలు నిర్ణయించాయని ప్రెస్ టి.వి తెలిపింది. అజర్ బైజాన్ లో వాడుకలో లేని వైమానిక స్ధావరాలలో ఎం.కె.ఒ టెర్రరిస్టులకు నివాసం కల్పించడానికి ఆ దేశంపై అమెరికా, ఇజ్రాయెల్ లు ఒత్తిడి తెస్తున్నాయని ఒక నివేదికను ఉటంకిస్తూ ప్రెస్ టి.వి తెలిపింది. నివేదిక…

ఈజిప్టు అధ్యక్ష అభ్యర్ధికి బ్రిటన్ గూఢచార సంస్ధ ‘ఎం.ఐ6’ ప్రచారం

ఈజిప్టు అధ్యక్ష ఎన్నికల్లో ‘ఫ్రంట్ రన్నర్’ గా పశ్చిమ దేశాల పత్రికలు ప్రచారం చేస్తున్న ‘ఆమిర్ మౌస్సా’ కు బ్రిటన్ కి చెందిన విదేశీ గూఢచారులు ప్రచారం చేస్తున్నారని ఈజిప్టు పత్రికలు వెల్లడించాయి. ‘ఇస్లామిక్స్ టైమ్స్’ పత్రిక విలేఖరి పరిశోధనాత్మక కధనాన్ని ఉటంకిస్తూ ప్రెస్ టి.వి ఈ సంగతి తెలిపింది. దుష్ట త్రయ దేశాలయిన అమెరికా, ఫ్రాన్సు, బ్రిటన్ దేశాలకు ‘ఇష్టుడు’ గా ఆమిర్ మౌస్సా ఇప్పటికే పేరు సంపాదించాడు. అమీర్ మౌస్సా ప్రచారం చుట్టూ అల్లుకున్న…

ఇంటర్నెట్ బందిపోటు దొంగ గూగుల్, మైనర్ పెనాల్టీతో వదిలేసిన ఎఫ్.సి.సి

ఇంటర్నెట్ వినియోగదారుల సమాచారాన్ని నాలుగేళ్లపాటు దొంగిలించిన గూగుల్ సంస్ధను అమెరికా ‘ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్’ (ఎఫ్.సి.సి) కేవలం $25,000 పెనాల్టీతో వదిలిపెట్టింది. తనకు తెలియకుండా జరిగిందని పదే పదే అబద్ధాలు చెప్పినా గూగుల్ ‘బందిపోటు దోపిడి’ ని లైట్ తీసుకుంది. వేరే అవసరం కోసం రాసిన ప్రోగ్రామ్ పొరబాటున స్ట్రీట్ వ్యూ ప్రోగ్రామ్ లో కలిసిందని పచ్చిగా నాటకాలాడినా ‘మరేం ఫర్వాలేదు’ పొమ్మంది. కార్పొరేట్ కంపెనీలు, ఫెడరల్ రెగ్యులేటర్ సంస్ధలు ఒకరినొకరు సహరించుకుంటూ అమెరికా ప్రజలను నిరంతరం…

క్లుప్తంగా…. 30.04.2012

జాతీయం లండన్ ఒలింపిక్స్ ని ఇండియా బహిష్కరించాలి -భోపాల్ బాధితుడు “డౌ కెమికల్స్” కంపెనీ సొమ్ముతో జరుగుతున్న లండన్ ఒలింపిక్స్ ను ఇండియా అధికారికంగా బహిష్కరించాలని భోపాల్ గ్యాస్ లీక్ బాధితుడు సంజయ్ వర్మ డిమాండ్ చేశాడు. గ్యాస్ లీక్ ప్రమాదానికి ఐదు నెలల ముందు జన్మించిన సంజయ్ గ్యాస్ దుర్ఘటన వల్ల అనాధగా మారాడని ‘ది హిందూ’ తెలిపింది. డౌ కంపెనీ చేతులకు భోపాల్ బాధితుల రక్తం అంటిందని, ఆ రక్తం ఇపుడు లండన్ పయనమైందని…

అమెరికా డ్రోన్ దాడుల్లో 2,800 పాక్ పౌరుల మరణం

గత యేడేళ్ళలో అమెరికా మానవ రహిత విమానాలు మూడువేల మంది అమాయక పాకిస్ధాన్ పౌరులను చంపేశాయని మానవ హక్కుల కార్యకర్త ఒకరు తెలిపాడు. మొత్తం దాదాపు మూడువేల మంది అమెరికా డ్రోన్ దాడుల్లో చనిపోగా వారిలో 2,800 మంది అమాయక పౌరులేనని పాకిస్ధాన్ మానవ హక్కుల కార్యకర్త షాజాద్ అక్బర్ ని ఉటంకిస్తూ ప్రెస్ టి.వి తెలిపింది. 170 మంది మాత్రమే అమెరికా దురాక్రమణపై పోరాడుతున్న “మిలిటెంట్లు” అని ఆయన తెలిపాడు. “ఫౌండేషన్ ఫర్ ఫండమెంటల్ రైట్స్”…

క్లుప్తంగా… 28.04.2012

జాతీయం సోనియా సభలో నల్లజెండా కర్ణాటక పర్యటిస్తున్న సోనియా గాంధీకి ఒక మహిళ నల్ల జెండా చూపి కలకలం రేపింది. పోలీసులు ఆమె పైకి లంఘించి నోరు నొక్కి బైటికి వెళ్లగొట్టారు. తమ కమ్యూనిటీకి ఎస్.సి రిజర్వేషన్లు కల్పించాలని మహిళ డిమాండ్ చేసినట్లు ‘ది హిందూ’ తెలిపింది. కేవలం నల్ల జెండా చూపిస్తేనే మహిళ నోరు నోక్కే పోలీసు చట్టాలు ఏ ప్రజాస్వామ్యానికి ప్రతీకలో సోనియా గాంధీ చెప్పవలసి ఉంది. సిద్దగంగ మఠం వ్యవస్ధాపకుడి 105 వ…

రాజకీయ సంస్కరణల కోసం లక్ష మంది మలేసియన్ల ప్రదర్శన

మలేసియా రాజధాని కౌలాలంపూర్ లో రాజకీయ సంస్కరణలను డిమాండ్ చేస్తూ ప్రదర్శన నిర్వహించినవారిపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. రసాయనాలు కలిపిన నీళ్ళు ప్రదర్శకులను చెదర గొట్టారు. ఎన్నికల విధానాన్ని పూర్తిగా సంస్కరించాలనీ, పాలక పక్షం పట్ల పక్షపాతం వహిస్తున్న ఎన్నికల కమిషన్ ను సంస్కరించాలనీ, విదేశాల్లో ఉన్న మలేసియన్లకు కూడా ఓటు హక్కు కల్పించాలనీ ప్రదర్శకులు డిమాండ్ చేశారు. ప్రదర్శనలో లక్ష మంది పాల్గొన్నారని మలేసియా పత్రిక ‘ది సన్’ తెలుపగా 80,000 పైగా పాల్గొన్నారని…

ఛత్తీస్ ఘడ్ కలెక్టర్ విడుదలకు ప్రభుత్వము, మావోయిస్టుల ఒప్పందం

మావోయిస్టు గెరిల్లాల చేత కిడ్నాప్ కి గురయిన ఛత్తీస్ ఘడ్ రాష్ట్ర జిల్లా కలెక్టర్ అలెక్స్ మీనన్ విడుదలకోసం మావోయిస్టు ప్రతినిధులకూ, ప్రభుత్వ ప్రతినిధులకు ఒప్పందం కుదిరినట్లు ‘ది హిందూ’ తెలిపింది. అయితే ఒప్పందానికి మావోయిస్టు పార్టీ ఆమోద ముద్ర వేయాల్సి ఉండని తెలుస్తోంది. శనివారం ఒప్పందాన్ని మావోయిస్టులకు సమర్పించనున్నారు. “ఇప్పటికీ చర్చలు పూర్తయ్యాయి. కానీ అంతిమ ఒప్పందాన్ని మావోయిస్టులు ఆమోదించాల్సి ఉంది” అని మావోయిస్టుల తరపున చర్చల్లో పాల్గొంటున్న బి.డి.శర్మ తెలిపాడు. ఒప్పందం వివరాలు తెలపడానికి…

అధికారం కోసం కుమ్ములాటలో ఈజిప్టు ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలు సమాధి

ఈజిప్టు ప్రజలు మరోసారి వీధుల కెక్కారు. చరిత్రాత్మక తాహ్రిరి స్క్వేర్ లో శుక్రవారం నుండి వేలాదిమంది నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. మే 23 న జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నవారిలో అనేకమందిని ‘అనర్హులు’ గా ప్రకటించడం రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల ఆగ్రహానికి తాజా కారణంగా నిలిచింది. ప్రజల న్యాయమైన ఆగ్రహాన్ని నియంత్రణలో ఉంచుకున్న ‘ప్రభుత్వేతర సంస్ధలు’ (ఎన్.జి.ఓ) నిరసనలలో ముఖ్య పాత్ర నిర్వహించడం కొనసాగుతోంది. నిన్నటి వరకూ మిలట్రీ పాలకులతో సాన్నిహిత్యాన్ని కొనసాగిస్తూ ఉద్యమాలలో…