“వినాశన దినం” (నక్బా) నాడు పాలస్తీనీయులు, ఇజ్రాయెల్ సైనికుల ఘర్షణ -రాయిటర్స్ ఫొటోలు

పాలస్తీనా భూభాగాన్ని అక్రమంగా ఆక్రమించి 1948 మే 15 తేదీన అమెరికా, బ్రిటన్ లు ఇజ్రాయెల్ దేశాన్ని స్దాపించాయి. లక్షలమంది పాలస్తీనీయులను వారి ఇళ్ళనుండి భూములనుండి బలవంతంగా తరిమేసి వివిధ దేశాల్లో ఉన్న ఇజ్రాయెలీయులను పాలస్తీనాకు రప్పించారు. వారికి పాలస్తీనీయుల ఆస్తులు, భూములను కట్టబెట్టారు. అలా తరిమివేయబడ్డ పాలస్తీనీయులు చుట్టుపక్కల ఉన్న సిరియా, లెబనాన్, జోర్డాన్ లలో శరణార్ధులుగా బతుకులు వెళ్ళదీస్తున్నారు. పాలస్తీనా భూభాగం వెస్ట్ బ్యాంక్ ను ఆక్రమించి అక్కడి పాలస్తీనియులను వెళ్ళగొట్టి సెటిల్‌మెంట్లను ఇప్పటికీ…

పాక్‌తో సంబంధాల మెరుగుకు అమెరికా ప్రయత్నాలు

సి.ఐ.ఏ ఏజెంట్ డేవిస్ అప్పగింత, ఒసామా బిన్ లాడెన్ హత్య లతో పాక్, అమెరికాల మధ్య అడుగంటిన సంబంధాలను పునరుద్ధరించుకోవడానికి అమెరికా ప్రయత్నాలు ప్రారంభించింది. దాన్లో భాగంగా సెనేటర్ జాన్ కెర్రీ ఆఫ్ఘన్, పాక్ లలో పర్యటిస్తున్నాడు. వచ్చింది సంబంధాల మెరుగుకే అయినా పాక్ పై నిందలు మోపడం మానలేదు. ఒసామా బిన్ లాడెన్ ఆరు సంవత్సరాల పాటు పాక్ లో ఉండటానికి పాక్ సంస్ధల సాయం ఉందన్న విషయం నమ్మకాన్ని చెదరగోట్టేదని కెర్రీ ఆఫ్ఘనిస్ధాన్ లో…

పాలస్తీనా పౌరులపై ఇజ్రాయెల్ సైన్యం కాల్పులు, పలువురు దుర్మరణం

ఆదివారం పాలస్తీనా పౌరులపై ఇజ్రాయెల్ సైన్యం కాల్పులు జరిపి పలువురిని పొట్టన బెట్టుకుంది. ఇజ్రాయెల్ ఆక్రమించుకున్న పాలస్తీనా భూభాగాలపైకి పాలస్తీనీయులు రావడంతో ఎటువంటి హెచ్చరికలు లేకుండా ఇజ్రాయెల్ సైన్యం, సిరియా, గాజాలతో ఉన్న సరిహద్దులోని గ్రామాల్లో కాల్పులు జరిపింది. కడపటి వార్తల ప్రకారం పన్నెండు మంది చనిపోయారని బిబిసి, రాయిటర్స్ వార్తా సంస్ధలు తెలిపాయి. ఇజ్రాయెల్ యధావిధిగా ఇరాన్‌ని ఆడిపోసుకుంది. ఇరాన్ రెచ్చగొడినందువల్లనే పాలస్తీనియులు తాము ఆక్రమించుకున్న పాలస్తీనా భూభాగాల్లోకి చొచ్చుకు వచ్చారని ఆరోపించింది. పనిలొ పనిగా…

లిబియా తిరుగుబాటు ప్రభుత్వ గుర్తింపుకు అమెరికా నిరాకరణ, కొనసాగుతున్న పౌరుల మరణాలు

లిబియా తిరుగుబాటుదారులు ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక ప్రభుత్వం “నేషనల్ ట్రాన్సిషనల్ కౌన్సిల్” (ఎన్.టి.సి) ను అధికారిక ప్రభుత్వంగా గుర్తించడానికి అమెరీక నిరాకరించింది. రెబెల్ కౌన్సిల్‌లోని సీనియర్ సభ్యుడొకరు అమెరికా గుర్తింపు పొందడానికి అధ్యక్ష భవనంలొ చర్చలకు హాజరయ్యాడు. రెబెల్ కౌన్సిల్ కోరికను అధ్యక్ష భవనం తిరస్కరించింది. మరో వైపు శుక్రవారం రాత్రి నాటో విమానాలు జరిపిన బాంబు దాడుల్లో బ్రెగా పట్టణంలో ప్రభుత్వ, తిరుగుబాటు వర్గాల మధ్య శాంతి చర్చలు జరిపే నిమిత్తం వచ్చి ఉన్న 11…

అబ్బోత్తాబాద్‌ దాడిపై స్వతంత్ర దర్యాప్తు జరపాలి, డ్రోన్ దాడులు ఆపాలి -పాక్ పార్లమెంటు

పాకిస్ధాన్ పార్లమెంటు ఊహించని విధంగా ఓ ముందడుగు వేసింది. అది సంకేతాత్మకమే (సింబాలిక్) అయినప్పటికీ ఇప్పటి పరిస్ధితుల్లో అది ప్రశంసనీయమైన అడుగు. దాదాపు పది గంటలపాటు జరిగిన సుదీర్ఘ చర్చలో అమెరికన్ కమెండోలతో కూడిన హెలికాప్టర్లు మే 2 తేదీన అనుమతి లేకుండా పాకిస్ధాన్ గగనతలం లోకి జొరబడి అబ్బొత్తాబాద్ లో సైనిక చర్య చేపట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తూ తీర్మానాన్ని ఆమోదించింది. అలాగే మానవ రహిత డ్రోన్ విమానాలు పాకిస్తాన్ ప్రభుత్వానికి ముందస్తు సమాచారం లేకుండా మిలిటెంట్లను…

లాడెన్ హత్య చట్టబద్ధమేనని నిరూపించుకోవడానికి అమెరికా తంటాలు

నిరాయుధుడుగా ఉన్న లాడెన్‌ను పట్టుకుని న్యాయస్ధానం ముందు నిలబెట్టకుండా హత్య చేసినందుకు అమెరికాపై నిరసనలు మెల్లగానైనా ఊపందుకుంటున్నాయి. లాడెన్ హత్య “హత్య” కాదనీ అమెరికా కమెండోలు చట్టబద్దంగానే అతన్ని చంపారని సమర్ధించుకోవడానికి అమెరికా తంటాలు పడుతోంది. తాజాగా అమెరికా అటార్నీ జనరల్ ఎరిక్ హోల్డర్ లాడేన్ హత్య చట్టబద్ధమేనని చెప్పడానికి విశ్వ ప్రయత్నం చేశాడు. లాడెన్ విషయంలో జరిగిన ఆపరేషన్ “కిల్ ఆర్ కేప్చర్” (చంపు లేదా పట్టుకో) ఆపరేషనే ననీ లాడెన్ లొంగుబాటుకు అంగీకరించినట్లయితే పట్టుకునేవారని…

బిన్ లాడెన్ హత్య ఆల్-ఖైదాపై ప్రభావం చూపుతుందా?

ఆల్-ఖైదాకు సంకేతాత్మకంగా నాయకత్వం వహిస్తూ వచ్చిన ఒసామా బిన్ లాడెన్ ను చంపేశామని అమెరికా అధ్యక్షుడు విజయ గర్వంతో ప్రకటించుకున్నాడు. హాలివుడ్ సినిమాల్లొ చూపినట్టు బిన్ లాడెన్ స్ధావరంగా చెబుతున్న ఇంటిలోకి అమెరికన్ కమేండోలు వెళ్ళడం అక్కడ ఉన్న ముగ్గురు యువకులను (ఒకరు లాడెన్ తనయుడుగా భావిస్తున్నారు) రక్తపు మడుగులో మునిగేలా కాల్చి చంపడం, బిన్ లాడెన్ తో ఉన్న అతని భార్యను మోకాలిపై కాల్చి అనంతరం లాడెన్ కంటిలోనా, గుండెపైనా కాల్చి చంపడం… వీటన్నింటినీ అమెరికా…

ప్రపంచ పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన లాడెన్ మృతి, పైశాచికానందంలో దురాక్రమణ గుంపు

ఒసామా బిన్ లాడెన్‌ను ఎట్టకేలకు దురాక్రమణదారులు చంపగలిగారు. రెండు అగ్ర రాజ్యాల దురాక్రమణలను ఎదిరించి పోరాడిన బిన్ లాడేన్ హీరోచిత మరణం పొందాడు. వరల్డ్ ట్రేడ్ సెంటర్ కి చెందిన జంట టవర్లపై విమానాలతో డీకొట్టి కూల్చడం వెనక బిన్ లాడేన్ పధకం ఉందని యుద్ధోన్మాదుల మానస పు(ప)త్రికలు చేసిన ప్రచారంతో రెండు మదపుటేనుగులతో కలబడిన లాడెన్ ప్రతిష్ట తాత్కాలికంగా మసకబారవచ్చు. అచ్చోసిన ఆంబోతుల్లా ప్రపంచంపై బడి దేశాల సంపదలనన్నింటినీ కొల్లగొట్టే దుష్టబుద్ధితో వెంపర్లాడే అమెరికా నాయకత్వంలోని…

ది గ్రేట్ ఎస్కేప్: అమెరికా భద్రతా వ్యవస్ధను హేళన చేస్తూ 488 తాలిబాన్ ఖైదీల పరారీ

ఆఫ్ఘనిస్ధాన్‌లో అమెరికా సైన్యం, దాని తొత్తు ప్రభుత్వం ఖైదు చేసిన కాందహార్ జైలునుండి 488 మంది తాలిబన్ ఖైదీలు పరారయ్యారు. ఐదు నెలలపాటు తవ్వీన్ సొరంగం ద్వారా, డూప్లికేట్ తాళాలను ఉపయోగించి వీరు పరారయ్యారు. సర్పోజా జైలుగా పిలిచే ఈ జైలునుండి తాలిబాన్లు పరారు కావడం ఇది రెండో సారి. 2008 సంవత్సరంలో వెయ్యిమందికి పైగా ఖైదీలు ప్రధాన ద్వారం నుండే పరారయ్యారు. ఆ సంఘటన తర్వాత అమెరికా కాందహార్ జైలుకు గట్టి భద్రతా ఏర్పాట్లు చేసింది.…

గడ్డాఫీని చంపడానికి పశ్చిమ దేశాల బాంబు దాడులు

లిబియా పౌరుల్ని రక్షించే పేరుతో లిబియా ప్రభుత్వ సైనిక సంపత్తిని నాశనం చేసే పనిలో ఉన్న పశ్చిమ దేశాలు మళ్ళీ గడ్డాఫీని చంపే ప్రయత్నాలను తీవ్రం చేశాయి. గడ్డాఫీ నివాస భవనాలపై సోమవారం నాటో సేనలు శక్తివంతమైన బాంబులను ప్రయోగించాయి. లిబియాలో అంతర్యుద్ధానికి “కాల్పుల విరమణ ఒప్పందాన్ని” ప్రతిపాదిస్తూ వచ్చిన “ఆఫ్రికన్ యూనియన్” ప్రతినిధులతో చర్చించడానికి వినియోగించిన భవనం సోమవారం నాటి బాంబుదాడుల్లో బాగా ధ్వంసం ఐనట్లు వార్తా సంస్ధలు తెలిపాయి. రీగన్ అమెరికా అధ్యక్షుడుగా ఉన్న…

టిబెటన్లపై కొనసాగుతున్న చైనా ప్రభుత్వ అణచివేత చర్యలు

టిబెటన్లపై చైనా ప్రభుత్వ అణచివేత చర్యలు కొనసాగుతున్నాయి. తాజాగా పశ్చీమ్ చైనాలోని బౌద్దుల మొనాస్టరీపై చైనా పోలీసులు దాడి చేశారు. పోలీసుల దాడిలో ఇద్దరు టిబెట్ వృద్ధులు చనిపోయారు. కృతి మొనాస్టరీ పై దాడి చేసిన పోలీసులు అక్కడ ఉన్న బౌద్ధ మత గురువులను అరెస్టు చేయకుండా అడ్డుకున్న ఒక వృద్ధుడు, మరో వృద్ధురాలు పోలీసుల బలప్రయోగంలో చనిపోయారు. “ఇంటర్నేషనల్ కాంపెయిన్ ఫర్ టిబెటన్స్‌” (ఐ.సి.టి) సంస్ధ ఈ విషయం తెలియజేసింది. మార్చి 16 న టిబెట్…

అమెరికా డ్రోన్ విమానదాడిలో మరో 25 మంది పాక్ పౌరుల దుర్మరణం

పాక్, ఆఫ్ఘనిస్ధాన్ సరిహద్దులోని నార్త్ వజీరిస్తాన్ రాష్ట్రంలో అమెరికాకి చెందిన డ్రోన్ విమానం దాడిలో మరో పాతిక మంది దుర్మరణం చెందారు. డ్రోన్ విమానదాడులకు తాను భాధ్యురాలిగా అమెరికా సాధారణంగా ధృవీకరించదు. కాని ఈ ప్రాంతంలో డ్రోన్ విమానాలు ఒక్క అమెరికాకి తప్ప మరొక దేశానికి లేవు. ప్రారంభంలో డ్రోన్ దాడులు కొన్నింటికి భాధ్యత తనదిగా పేర్కొన్నప్పటికీ, ఇటీవల కాలంలో అటువంటి ప్రకటనలు రావడం లేదు. డ్రోన్ విమాన దాడుల్లో వందల కొద్దీ పాకిస్తాన్ పౌరులు చనిపోతుండడంతో…

టెర్రరిస్టులకు ఐ.ఎస్.ఐ మద్దతునిస్తోంది -అమెరికా మిలట్రీ ఛీఫ్

ఆఫ్ఘనిస్ధాన్ టెర్రరిస్టులకు పాకిస్తాన్ గూఢచారి సంస్ధ ఐ.ఎస్.ఐ రహస్యంగా మద్దతునిస్తోందని అమెరికా మిలట్రీ ఉన్నతాధికారి “మైక్ ముల్లెన్” సంచలనాత్మక ఆరోపణ చేశాడు. మైక్ ముల్లెన్ పాకిస్తాన్ మిలట్రీ అధికారులతో చర్చల నిమిత్తం ఇస్లామాబాద్ లో ఉన్నాడు. ఆఫ్ఘనిస్ధాన్ మిలిటెంట్ల నాయకుడు జలాలుద్దీన్ హఖానీ నడుపుతున్న సంస్ధతో ఐ.ఎస్.ఐకి దీర్ఘకాలింగా గట్టి సంబంధాలు ఉన్నాయనీ ఆఫ్ఘనిస్ధాన్ లో అమెరికా సైనికులను చంపడంలో ఈ సంస్ధ నిమగ్నమై ఉందనీ ఆరోపించాడు. ఆఫ్ఘనిస్ధాన్ లో టెర్రరిస్టు సంస్ధలుగా అమెరికా పరిగణించే సంస్ధలను…

ఇరాక్ తరహాలో లిబియా దురాక్రమణకు ఏర్పాట్లు చేసుకుంటున్న అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సు

అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సు ల త్రయం తమ ఉద్దేశాలను మెల్ల మెల్లగా బైట పెట్టుకుంటున్నాయి. లిబియా తిరుగుబాటుదారులకు మిలట్రి సలదారులను పంపించడానికి బ్రిటన్ నిర్ణయించింది. గడ్డాఫీకి ఆయుధాలు అందకుండా చేయడానికి మొదట ‘అయుధ సరఫరా’ పై నిషేధం విధించారు. ఆర్ధిక వనరులు అందకుండా లిబియా ప్రభుత్వానికి అంతర్జాతీయ బ్యాంకుల్లో ఉన్న ఖాతాలను స్తంభింప జేశారు. గడ్డాఫీ విమానదాడులనుండి లిబియా ప్రజలను రక్షించచే పేరుతో “నో-ఫ్లై జోన్” అన్నారు. ఆ పేరుతో లిబియా తీర ప్రాంతాన్ని విమానవాహక నౌకలతో…

సిరియా ఆందోళనలకు అమెరికా రహస్య సహాయం

సిరియా అధ్యక్షుడు రాజీనామా చేయాలంటూ జరుగుతున్న హింసాత్మక ఆందోళనలకు అమెరికా 5 సంవత్సరాలనుండీ రహస్యంగా నిధులు అందజేస్తూ వచ్చిన విషయాన్ని వికీలీక్స్ ద్వారా వెల్లడి అయ్యింది. 2006లో జార్జి బుష్ అధికారంలో ఉన్నప్పటినుండి ప్రారంభమైన ఈ సహాయం ఒబామా అధ్యక్షుడు అయ్యాక కూడా కొనసాగిన విషయం వికీలీక్స్ వెల్లడించిన డిప్లొమేటిక్ కేబుల్స్ ద్వారా స్పష్టమయ్యింది. సిరియా అధ్యక్షుడు అస్సద్ 2000 సంవత్సరంలో తన తండ్రి చనిపోయినప్పటినుండీ అధికారంలో ఉన్నాడు. ఇరాక్ మాజీ అద్యక్షుడు సద్దాం హుస్సేన్ లాగానే…