తాలిబాన్, ఆల్-ఖైదా లది టెర్రరిజమా, స్వాతంత్ర్య పోరాటమా?

‘ఏసియా టైమ్స్’ ఆన్‌లైన్ ఎడిషన్‌కి సంపాదకుడుగా ఉన్న పాకిస్ధాన్ విలేఖరి సలీమ్ షాజద్ కిడ్నాప్‌కి గురై, ఆ తర్వాత దారుణంగా హత్య చేయబడ్డాడు. అతని శరీరంపై చిత్ర హింసలకు గురైన ఆనవాళ్ళు తప్ప బలమైన గాయమేదీ కనిపించలేదు. తుపాకితో కాల్చిన గుర్తులసలే లేవు. ఎటువంటి గాయాలు కనిపించకుండా చంపగల నేర్పరితనం ఆంధ్ర ప్రదేశ్ పోలీసులకు ఉందని తెలుగు ప్రజలకు తెలుసు. షాజద్ హత్య ద్వారా ఆ నేర్పరితనం ఐ.ఎస్.ఐ గూఢచారులకు కూడా ఉందని వెల్లడయ్యింది. షాజద్‌ని చంపింది…

ప్రభుత్వం మమ్మల్ని మోసం చేయాలని ప్రయత్నించింది -అన్నా హజారే

భారత దేశంలోని ప్రఖ్యాత యోగా గురువు బాబా రామ్ దేవ్ జూన్ 4 తారీఖునుండి ఆమరణ నిరాహార దీక్ష చేయబోతున్నారు. విదేశీ బ్యాంకుల్లో భారత దేశ రాజకీయ నాయకులు, అవినీతి అధికారులు రహస్యంగా దాచుకున్న నల్ల ధనాన్ని భారత దేశానికి తిరిగి తెప్పించాలని ఆయన ప్రధాన డిమాండు. బాబా రామ్ దేవ్ తన దీక్షను ప్రారంభించడానికి బుధవారం ఢిల్లీకి ప్రయాణం కట్టగా ప్రధాని మన్మోహన్ సింగ్ దీక్ష ఆలోచనని విరమించుకోవాలని స్వయంగా రామ్ దేవ్‌కి విజ్ఞప్తి చేశాడు.…

పాకిస్ధాన్ మిలట్రీ, ఐ.ఎస్.ఐ సంస్ధల్లోకి చొచ్చుకెళ్ళిన ఆల్-ఖైదా; విలేఖరి పరిశోధన

ఆదివారం కిడ్నాప్‌కి గురై మంగళవారం శవమై తేలిన విలేఖరి సలీం షాజద్ మరణంపై ఇపుడు అంతర్జాతీయ స్ధాయిలో దృష్టి కేంద్రీకృతమై ఉంది. షాజద్ కొన్ని రోజులుగా పాకిస్ధాన్ నౌకాదళ అధికారులతో కలిసి విస్తృతంగా సమాచారం సేకరించాడు. మే 22 న కరాచిలోని గట్టి భద్రతా ఏర్పాట్లు ఉండే నౌకాదళ స్ధావరంపై జరిగిన ఆల్-ఖైదా దాడిగురించి వివరాలు సేకరించాడు. మిలిటెంట్ల సమాచారాన్నీ సేకరించాడు. ఆయన జరిపిన పరిశోధనలో ఆల్-ఖైదా పాకిస్ధాన్ నౌకాదళంలో జొరబడిన సంగతి తెలిసింది. ఆల్-ఖైదా చొరబాటు…

ఆల్-ఖైదా, పాక్‌ నేవీ ల సంబంధాలు వెల్లడించిన పాక్ విలేఖరి దారుణ హత్య

(విలేఖరి పరిశోధన అనంతరం తన మరణానికి ముందు రాసిన ఆర్టికల్ అనువాదం దీని తర్వాత పోస్టులో చూడండి) పాకిస్తాన్ గూఢచార సంస్ధకు ఆల్-ఖైదా, తాలిబాన్ లాంటి సంస్ధలతో దగ్గరి సంబంధాలున్నాయని భారత ప్రభుత్వం చాలా కాలంగా ఆరోపిస్తోంది. ఒసామా హత్య తర్వాత ఆరు సంవత్సరాల పాటు ఒసామా పాక్‌లో తలదాచుకోడానికి కారణం పాక్ మిలట్రీ, ఐ.ఎస్.ఐ లతో మిలిటెంట్ సంస్ధలకు సంబంధాలుండడమే కారణమని అమెరికా కూడా ఆరోపించింది. ఆ తర్వాత పాక్ మంత్రి మిలట్రీ, ఐ.ఎస్.ఐ సంస్ధల…

కాలుష్య రహిత విద్యుత్ ఉత్పత్తిలో జర్మనీ ఆదర్శంగా నిలుస్తుంది -జర్మనీ ఛాన్సలర్

భవిష్యత్తులో కాలుష్యంలేని విద్యుత్ ఉత్పత్తిలో జర్మనీ ట్రెండ్ సెట్టర్‌గా నిలుస్తుందనీ, తద్వారా విద్యుత్ పరికరాల వ్యాపారంలో జర్మనీ లాభపడుతుందనీ జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ ఆశాభావం వ్యక్తం చేసింది. 2022 సంవత్సరానికల్లా అణు విద్యుత్ వినియోగానికి స్వస్తి పలకాలని జర్మనీ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అణు రియాక్టర్ల మూసివేత ద్వారా ఇతర విద్యుత్ ఉత్పత్తి మార్గాలను ఆవిష్కరించడానికి చేసే ప్రయత్నాలు జర్మనీని రెన్యుబుల్ ఎనర్జీ రంగంలో అగ్రస్ధానంలో నిలుపుతాయనీ, తద్వారా జర్మనీ ఆర్ధికంగా లాభపడుతుందనీ ఆమె…

అమెరికన్లపై నిఘా, ప్రపంచదేశాలపై శాశ్వత యుద్ధం: నల్లచట్టాలకు కాంగ్రెస్ ఆమోదం

అమెరికా లోపలా, బయటా తన అమానుషకృత్యాలను మరింత తీవ్రంగా, శక్తివంతంగా కొనసాగించడానికి అమెరికా ప్రతినిధుల సభ రెండు నల్ల చట్టాలను ఆమోదించింది. ఇప్పటికే దేశం లోపల అమలు చేయడానికి ఉన్న ఓ నల్ల చట్టాన్ని మరింతకాలం కొనసాగించడానికి ఆమోదం తెలుపుతూ, దేశం బైట ప్రపంచం మీద పెత్తనం కోసం అంతం లేని యుద్ధాలు చేసే హక్కును తమకు తాము దఖలుపరుచుకుంటూ రిపబ్లికన్ పార్టీ సభ్యులు మెజారిటీగా కల అమెరికా ప్రతినిధుల సభ, గతవారం చట్టాలను ఆమోదించింది. అమెరికా…

ఒక తీవ్రవాది, ఒక స్నేహబంధం, కొన్ని కార్టూన్లు

అమెరికాకీ, అమెరికా వాదనని నమ్మినవారికీ ఒసామా బిన్ లాడెన్ నెం. వన్ తీవ్రవాది. దక్షీణాసియాలో అమెరికాకి పాకిస్ధాన్ అత్యంత నమ్మకమైన మిత్రుడు. వారిది ఆరు దశాబ్దాల స్నేహబంధం. లాడెన్‌ని వెతకటంలో తన మిత్రుడు సహాయపడుతున్నాడని అమెరికా సెప్టెంబరు 11, 2001 నుండి ఇప్పటి వరకు 20.7 బిలియన్ డాలర్లను పాకిస్ధాన్‌కి ధారపోసింది. పది సంవత్సరాల నుండీ వెతుకుతున్న తన శత్రువు తన మిత్రుడి బెడ్ రూంలోనే హాయిగా సేద తీరడం చూసిన అమెరికా బిత్తరపోయింది. మిత్రుడుగా భావిస్తున్న…

చైనాలో కారు బాంబు పేలుళ్ళు, ఇద్దరు మృతి

చైనాలోని జీయాంక్సి రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు ముందు కారు బాంబులు పేలాయి. కనీసం మూడు పేలుళ్ళు జరిగాయని, ఈ పేలుళ్ళలొ ఇద్దరు పౌరులు చనిపోయారనీ బిబిసి తెలిపింది. ఫుఝౌ పట్టణంలో జరిగిన ఈ పేలుళ్ళలో మరో ఆరుగురు గాయపడ్డారు. రాష్ట్ర ప్రాసిక్యూటర్ కార్యాలయం, నగర ఆహరము మందుల ఏజెన్సీ కార్యాలయం, జిల్లా పాలనా కార్యాలయ భవనాల ముందు ఉన్న కారు బాంబులుంచారని తెలుస్తోంది. ఇవన్నీ ఒకేసారి పేలినట్లు జిన్‌హువా వార్తా సంస్ధ తెలిపింది. పేలుళ్ళకు కారణాలను…

పాకిస్ధాన్ నావల్ బేస్‌పై పాక్ తాలిబాన్ దాడి దృశ్యాలు -ఫోటోలు

సోమవారం పాకిస్ధాన్ తాలిబాన్‌కి చెందిన 6 గురు మిలిటెంట్లు కరాచిలోని “పి.ఎన్.ఎస్ మెహ్రాన్” అనే పేరుగల నావల్ అండ్ ఎయిర్ బేస్ పై ఆకస్మిక దాడి చేశారు. ఈ బేస్ లోనే పాకిస్ధాన్ తన అణ్వస్త్రాలను భద్రం చేసిందని భావిస్తున్నారు. దాదాపు 16 గంటలపాటు ఆరుగురు మిలిటెంట్ల వందలమంది పాక్ సైనికుల్ని నిలువరించారు. జలాంతర్గాముల్ని నాశనం చేయగల రెండు యుద్ధ విమానాల్ని (అమెరికా తయారీ) వాళ్ళూ ధ్వంసం చేశారు. 12 మంది సైనికుల్ని చంపేశారు. ఆరుగురిలో నలుగురు…

పాకిస్ధాన్ మిలట్రీని పరిహసిస్తూ తిట్టిపోస్తున్న పాక్ మీడియా

వరుసగా ఎదురవుతున్న అవమానాలతో పాక్ మిలట్రీ అందరినుండీ దూషణలను, తిరస్కారాలనూ ఎదుర్కొంటోంది. అమెరికా కమెండోలు పాక్ లోకి జొరబడి లాడెన్ హత్య చేయనున్న విషయం తమకు తెలియకుండా జరిగిందని చెప్పడం, సి.ఐ.ఏ గూఢచారులు వందల సంఖ్యలో పాక్‌లో ఉన్నట్లు వెల్లడి కావడం, ఇద్దరు పాక్ పౌరులను కాల్చి చంపినా సి.ఐ.ఏ గూఢచారి రేమండ్ డేవిస్ ను ఏ శిక్షా లేకుండా విడిచిపెట్టడం, అవసరమైతే ఇంకోసారైనా పాక్‌లో జొరబడ్డానికి వెనకాడం అని ఒబామా ప్రకటించినా అదేమని అడగకుండా నోర్మూసుకుని…

పాకిస్తానే కాదు అవసరమైతే ఏదేశంపైనైనా దాడి చేస్తాం! -ఒబామా

అమెరికా మరోసారి తన అహంభావాన్ని బైట పెట్టుకుంది. అధ్యక్షుడు ఒబామా నోటి ద్వారా అమెరికా ప్రపంచ పోలీసు బుద్ధి మరోసారి బైట పడింది. అంతర్జాతీయ చట్టాలు తనకు పూచిక పుల్లతో సమానమని చాటి చెప్పుకుంది. టెర్రరిస్టు ఉన్నాడని తెలిస్తే పాకిస్ధాన్ పై మరోసారి అక్కడి ప్రభుత్వానికి చెప్పకుండా దాడి చేస్తామని ఒబామా ప్రకటించాడు. అసలు పాకిస్ధానేం ఖర్మ, తాను చంపదలుచుకున్న వాళ్ళెవరైనా ఉన్నాడని తెలిస్తే ఏ దేశంపైనైనా దాడి చేస్తామని ప్రకటించాడు. తమకు కావలసింది అమెరికా ప్రజల…

పొదుపు చర్యలపై ఈజిప్టు తరహాలో ఉద్యమిస్తున్న స్పెయిన్ యువత

ఇప్పటికే మూడు దేశాలను, గ్రీసు, ఐర్లండు, పోర్చుగల్, బలితీసుకున్న యూరప్ అప్పు సంక్షోభం స్పెయిన్‌ను అతలాకుతలం చేస్తోంది. బడ్జెట్ లోటు తగ్గించడానికి స్పెయిన్ ప్రభుత్వం వరుసగా ప్రవేశపెడుతున్న పొదుపు చర్యలు స్పెయిన్ ప్రజలను వీదులపాలు చేస్తున్నది. యూరోపియన్ యూనియన్‌లోనే అత్యధికంగా స్పెయిన్‌లో 21.3 శాతం నిరుద్యోగం ఉంది. పొదుపు విధానాల పుణ్యమాని ఇది ఇంకా పెరుగుతోంది. యువతలో నూటికి 45 మంది నిరుద్యోగులుగా ఉన్నారు. పరిస్ధితి ఇలా ఉంటే ప్రభుత్వం పదవీ విరమణ వయస్సును పెంచి నిరుద్యోగుల…

చైనా, రష్యాల్లో సోషలిజం – నెహ్రూ సోషలిజం – నిజా నిజాలు

రష్యాలో 1917 లో బోల్షివిక్ పార్టీ అధ్వర్యంలో ప్రజలు సోషలిస్టు విప్లవం తెచ్చుకున్ననాటినుండి 1954 లో స్టాలిన్ చనిపోయేంత వరకూ సోషలిస్టు సమాజ నిర్మాణం జరిగింది. ఆయన చనిపోయాక కృశ్చేవ్ నుండి గోర్బచెవ్ వరకూ జరిగింది సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణం కాదు. వారు సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణం వదిలేసి పెట్టుబడిదారీ వ్యవస్ధవైపుకి ప్రయాణం కట్టారు. అమెరికాతో ప్రపంచ ఆధిపత్యంకోసం పోటీపడి తూర్పు యూరప్, ఆఫ్ఘనిస్ధాన్ తదితర దేశాల్ని అమెరికా లాగానే మార్కెట్ల కోసం తమ ప్రభావంలో ఉంచుకున్నారు.…

ఇజ్రాయెల్ ఉక్కుపాదాన్ని గేలి చేస్తూ పాలస్తీనీయుల స్వాతంత్ర్య పిపాస -వీడియోలు

అమెరికా, ఇంగ్లండుల అండతో పాలస్తీనా భూభాగాన్ని చెరబట్టిన ఇజ్రాయెల్ ఆక్రమణని నిరసిస్తూ, 63 ఏళ పాశవిక నిర్బంధాన్నీ, పశు ప్రవృత్తితో సమానమైన ‘యూదు జాత్యహంకారాన్ని’ ఎదిరిస్తూ వేల మంది పాలస్తీనీయులు మే 15 తేదీన ఇజ్రాయెల్ లోని జాఫా పట్టణంలో ఉద్రిక్తల నడుమ నక్బా (వినాశన దినం – పాలస్తీనీయుల భూభాగంపై ఇజ్రాయెల్‌ని సృష్టించిన రోజు) ని పాటించారు. రోమాంఛితమైన ఆ ఘటనను చిత్రించినప్పటి వీడియోలే ఇవి. ప్రదర్శనలో పాల్గొన్న ఓ కార్యకర్త ఒమర్ సిక్సిక్ ప్రకటన:…

లిబియాకు నాటో మానవతా సాయం బండారం

NATO: “Bah!  It’s just African immigrants dying of hunger.” [నాటో: అబ్బే! వీళ్ళు ఆకలితో చస్తున్న ఆఫ్రికా శరణార్ధులే. (లిబియన్లు కాదులే, మనకనవసరం)] Victor Nieto is a cartoonist in Venezuela.  His cartoons frequently appear in Aporrea and Rebelión among other sites.  Translation by Yoshie Furuhashi.  Cf. Barbara Lewis, “U.N. Says 10 Percent Fatality for Libya Sea Migrants” (Reuters, 13…