రెండు యుద్ధాలు, మూడు ఫోటోలు, కొన్ని వాస్తవాలు

రెండు యుద్ధాలు అమెరికా, దాని మిత్ర రాజ్యాలైన బ్రిటన్, ఫ్రాన్సు, కెనడా, ఇటలీ మొదలైన నాటో సభ్య దేశాలు దశాబ్ద కాలంగా “టెర్రరిజంపై ప్రపంచ యుద్ద్యం” అని ఒక అందమైన పేరు పెట్టి, తాము జన్మనిచ్చి, పెంచి, పోషించిన సంస్ధలపైనే యుద్ధం ప్రకటించి ఆఫ్ఘనిస్ధాన్, ఇరాక్‌ లపై దురాక్రమణ యుద్ధాలు సాగిస్తున్నాయి. పశ్చిమ దేశాలు అన్యాయంగా సాగిస్తున్న ఇరాక్, ఆఫ్ఘనిస్ధాన్ దురాక్రమణ యుద్ధాలే రెండు యుద్ధాలు. మూడు ఫోటోలు

అమెరికా యుద్ధాల ఖర్చు $3.7 ట్రిలియన్, చావులు 2.25 లక్షలు

అమెరికా ఆఫ్ఘనిస్ధాన్, ఇరాక్ యుద్ధాల ఖర్చు 1 ట్రిలియన్ డాలర్లని ఒబామా బలగాల ఉపసంహరణ ప్రకటిస్తూ అన్నాడు. బలగాల ఉపసంహరణకు ఈ ఖర్చు కూడా ఒక కారణమని ఆయన చెప్పాడు. కాని ఒబామా చెప్పిన లెక్క పూర్తిగా తప్పు. బ్రౌన్ యూనివర్సిటీకి చెందిన ‘వాట్సన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ స్టడీస్’ సంస్ధ అమెరికా సాగిస్తున్న యుద్ధ ఖర్చులపై అధ్యయనం చేసింది. 2001 నుండి అమెరికా, ఆఫ్ఘనిస్ధాన్, ఇరాక్, పాకిస్ధాన్ లలో సాగించిన యుద్ధాలకు ఖర్చయిన సొమ్ము, అన్ని…

ఆఫ్-పాక్ లతో కలసి అమెరికా వ్యతిరేక కూటమి నిర్మిస్తున్న ఇరాన్?

అమెరికా-ఇరాన్ దేశాల వైరం జగద్విదితం. ఇరాన్ అణు విధానానికి అడ్డుపడుతూ అణ్వాయుధాలు నిర్మిస్తున్నదన్న ప్రచారంతో ఆ దేశంపై ఇప్పటికి నాలుగు విడతలుగా అంతర్జాతీయ వాణిజ్య ఆంక్షలను విధింపజేసింది అమెరికా. అమెరికా నాయకత్వంలో ఇరాన్‌పై విధించిన ఆంక్షలు “వాడి పారేసిన రుమాలు”తో సమానమని ఇరాన్ అధ్యక్షుడు అహ్మది నెజాద్ పశ్చిమ దేశాల అహంపై చాచి కొట్టినంత పని చేశాడు. ఆంక్షలు అమలులో ఉండగానే ఇరాన్ నేరుగా అమెరికా కంపెనీతోనే వ్యాపారం చేసి వారి ఆంక్షలను తిప్పికొట్టింది ఇరాన్. మధ్య…

సి.బి.ఐని ఆర్.టి.ఐ చట్టం నుండి మినహాయించడం ఆర్.టి.ఐ చట్టానికే విరుద్ధం

సమాచార హక్కు చట్టం నుండి సి.బి.ఐ (Central Bureau of Investigation) సంస్ధను మినహాయించడం సమాచార హక్కు చట్టానికే విరుద్ధం అని ప్రముఖ ఆర్టీఐ కార్యకర్త అరవింద్ కేజ్రివాల్ తెలిపాడు. అరవింద్ కేజ్రీవాల్ లోక్ పాల్ బిల్లు డ్రాఫ్టింగ్ కమిటీలో పౌరసమాజ ప్రతినిధిగా నియమించబడిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం సి.బి.ఐని తన రాజకీయ అవసరాల కోసం వినియోగించుకోవాలని ప్రయత్నిస్తున్నదనీ, ఆ సంస్ధ ద్వారా రాజకీయ ప్రత్యర్ధులను సాధించడానికే దానిని ఆర్.టి.ఐ చట్టం నుండి మినహాయించడానికి నిర్ణయించిందని అరవింద్…

సమాచార హక్కు చట్టం నుండి మరిన్ని సంస్ధల మినహాయింపు

సమాచార హక్కు చట్టం (Right to Information Act) ప్రభుత్వ విధానాల్లో, ప్రభుత్వ సంస్ధలు పనిచేస్తున్న పద్ధతుల్లో పారదర్శకతను పెంచడానికి ఉద్దేశించిన చట్టం. ఈ చట్టం 2005 లో ప్రవేశ పెట్టిన దగ్గర్నుండీ, చట్టాన్ని ఇప్పటికి అనేకసార్లు తూట్లు పొడిచారు. ప్రజలకు జవాబుదారీగా ఉండవలసిన అత్యున్నత సంస్ధలు అన్నింటినీ దీనినుండి మినహాయించారు. తాజాగా మినహాయింపుల జాబితాలో మరో మూడు సంస్ధలను కలుపుతూ కేంద్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి జూన్ 9 నే దీనికి…

ఆఫ్ఘన్ సైనిక ఉపసంహరణ: ఆందోళనలో అమెరికా సైనికాధిపతులు

అమెరికా అధ్యక్షుడు ఒబామా ప్రకటించిన సైనిక ఉపసంహరణ అమెరికా సైనికాధికారులకు ఒక పట్టాన మింగుడుపడ్డం లేదు. ఉపసంహరించనున్న సైనికుల సంఖ్య చాలా ఎక్కువగా ఉందనీ, ఉపసంహరణ విషయంలో తమ అధ్యక్షుడు మరీ దూకుడుగా ఉన్నాడనీ వాళ్ళు భావిస్తున్నారు. జాయింట్ ఛీఫ్స్ ఆఫ్ స్టాఫ్‌కు ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న అడ్మిరల్ మైఖేల్ ముల్లెన్, ఆఫ్ఘనిస్ధాన్‌లో ఉన్నత స్ధాయి కమాండర్ డేవిడ్ పెట్రాస్‌లు ఒబామా ప్రకటించిన సంఖ్య “దూకుడు”గా ఉందని వ్యాఖ్యానించినట్లుగా వాల్‌స్ట్రీట్ జర్నల్పత్రిక తెలిపింది. వీరిద్ధరూ ఉపసంహరణ అమెరికా ఉపకరిస్తుందా…

గ్రీసు రెండో బెయిలౌట్‌కి ఇ.యు+ఐ.ఎం.ఎఫ్ అంగీకారం, గ్రీకులపై నడ్డి విరిగే భారం

“ఎద్దు పుండు కాకికి ముద్దు” అని సామెత. గ్రీసు అప్పు సంక్షోభం యూరప్‌లోని ధనిక దేశాల ప్రైవేటు బహుళజాతి గుత్త సంస్ధలకు సిరులు కురిపించబోతోంది. అదే సమయంలో గ్రీసు ప్రజలకు “పెనం మీదినుండి పొయ్యిలోకి జారిన” పరిస్ధితి దాపురిస్తోంది. గ్రీసు మరిన్ని పొదుపు చర్యలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, లేనట్లయితే రెండో బెయిలౌట్ ప్యాకేజి ఇచ్చేది లేదని నెలరోజుల నుండి బెదిరిస్తూ వచ్చిన ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ లు తాము కోరింది సాధించుకుని రెండో బెయిలౌట్‌ ఇవ్వడానికి…

ఆఫ్ఘనిస్ధాన్‌నుండి సైన్యం ఉపసంహరణలో అమెరికాతో పాటే ఫ్రాన్సు కూడా

ఆఫ్ఘనిస్ధాన్ దురాక్రమణ నుండి సైన్యాన్ని మొదటి దశలో మూడువిడతలుగా 33,000 మంది సైనికులను ఉపసంహరించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఫ్రాన్సు అధ్యక్షుడు నికోలస్ సర్కోజీ కూడా అమెరికాను అనుసరించనున్నట్లు ప్రకటించాడు. తమ సైనికుల్ని కూడా ఉపసంహరిస్తామని ప్రకటించింది. ఐతే, అమెరికా తర్వాత అత్యధిక సంఖ్యలో సైనికులను ఆఫ్ఘనిస్ధాన్‌ దురాక్రమణకు పంపిన ఇంగ్లండు ఇంతవరకూ ఈ విషయమై ఏ ప్రకటనా చేయకపోవడం విశేషం. అమెరికా ఉపసంహరించునే సైనికుల సంఖ్యకు దామాషాలో తాము తమ…

“న్యాయం కోసం నేలపై పడుకున్నాం,” పిల్లలు చూపుతున్న పోరు దారి -ఫోటోలు

పోస్కో: దక్షిణ కొరియాకి చెందిన బహుళజాతి సంస్ధ. ఐదేళ్ళనుండి ఒడిషాలోని ఐదు గ్రామాల ప్రజల బతుకులపై కొట్టడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ముడుపులు మెక్కి కొందరు, ప్రపంచ పెట్టుబడికి సలాం కొట్టి మరికొందరు, భారత పాలకులే ఈ ప్రజల పాలిట యమదూత లయ్యారు. తమలపాకు తోటలపై ఆధారపడి కుంటుతూనే గడుపుతున్న వీరి జీవితాల్లోకి విషం పోశారు. రు.50,000 కోట్ల విదేశీ పెట్టుబడికి సలాం కొట్టిన మన్మోహన్, నవీన్‌లు  తమకు ఓట్లేసిన గ్రామీణుల నోట్లో మట్టి కొట్టారు. తమలపాకు తోటల్ని…

ఆఫ్ఘనిస్ధాన్ నుండి సైన్యం ఉపసంహరణ ప్రకటించిన ఒబామా, పొరాటం కొనసాగుతుందన్న తాలిబాన్

అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా ఆఫ్ఘనిస్ధాన్ నుండి అమెరికా సైనికులను పాక్షికంగా ఉపసంహరిస్తున్నట్లుగా ప్రకటించాడు. మొదటి విడత ఉపసంహరణ నామమాత్రంగా ఉంటుందని విశ్లేషకులు భావించినప్పటికీ, వారి అంచనాల కంటే ఎక్కువగానే సైనిక ఉపసంహరణను ఒబామా ప్రకటించాడు. ఆయాన ప్రకటన ప్రకారం, ఈ సంవత్సరం మొత్తం 10,000 మంది సైనికుల్ని ఉపసంహరిస్తారు. మరో 23,000 మందిని 2012 సెప్టెంబరు లోపు ఉపసంహరిస్తారు. మిగిలిన 68,000 మంది ఆఫ్ఘనిస్ధాన్‌లో కొనసాగుతారు. వారి ఉపసంహరణగురించి ఒబామా ఏమీ చెప్పలేదు. ఆఫ్ఘనిస్ధాన్ జాతీయ…

సింగూరు భూమి పునః స్వాధీనంపై కోర్టుకెళ్తాం -టాటా మోటార్స్

లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ సుదీర్ఘ పాలనకు చరమగీతం పాడి అధికారంలోకి వచ్చిన త్రిణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీల కూటమి సింగూరు భూమిని తిరిగి రైతులకు ఇచ్చేస్తామని ఎన్నికల్లో వాగ్దానం చేసింది. చెప్పినట్లుగానే సింగూరులో రైతులనుండి బలవంతంగా సేకరించిన భూమిని తిరిగి రైతులకు స్వాధీనం చేయడానికి వీలుగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలను నిర్వహించి చట్టం కూడా ఆమోదించింది. అయితే లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం ద్వారా సింగూరు భూమిని వశం చేసుకున్న టాటా మోటార్స్ సంస్ధ…

మెరుగైన సేవలు కావాలంటే ప్రైవేటు కంపెనీలకి పట్టణ ప్రజలు మరింత చెల్లించుకోవాల్సిందే -కేంద్ర మంత్రి

భారత దేశ ప్రజలకు ఇప్పటివరకూ అన్నీ ఉచితంగా వాడుకోవడం అలవాటయ్యిందనీ, కానీ రోడ్లు, నీరు, విద్యుత్ లాంటి సేవలు మెరుగుపడాలంటే మరింతగా చెల్లించడానికి సిద్ధమైతే తప్ప సాధ్యం కాదనీ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖా మంత్రి కమల్ నాధ్ తెగేసి చెబుతున్నాడు. రాయిటర్స్ వార్తా సంస్ధకి నాలుగు రోజుల క్రితం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పట్టణాల్లొ సేవలను మెరుగుపరచడం కోసం ఇప్పటివరకూ ప్రభుత్వం ఒక్కటే బాధ్యత తీసుకున్నదనీ, ఇకనుండి ప్రైవేటు కంపెనీలకు పట్టణాల్లో మౌలిక సౌకర్యాల నిర్మాణానికి భాగస్వామ్యం…

లిబియాపై నాటో బాంబు దాడిలో ఓ కుటుంబంతో సహా ఐదుగురు పౌరుల మరణం

గడ్డాఫీ బలగాల కాల్పులనుండి లిబియా పౌరులను రక్షించండంటూ భద్రతా సమితి నాటో దళాలకు అనుమతినిచ్చింది. పౌరులను కాపాడ్డానికి “అన్ని చర్యలూ తీసుకోండి” అని తమకు అనుమతి దొరికిందే తడవుగా అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సుల యుద్ధ విమానాలు లిబియా అంతటా బాంబుదాడులు మొదలు పెట్టాయి. వీరి దాడుల్లో లిబియా అంతటా పట్టణాలు, గ్రామాలు స్మశానాల్లా మారిపోయాయి. గడ్డాఫీ ఇంటిపై దాడి చేసి అతని మనవళ్ళను ముగ్గురినీ, చివరి కొడుకునీ చంపిన నాటో బలగాలు తాజాగా ట్రిపోలిలోని సౌక్ ఆల్-జుమా…

అమెరికా చర్చలు జరపనున్న తాలిబాన్ ఇక టెర్రరిస్టు సంస్ధ కాదట!?

తాలిబాన్‌తో పోరాటంలో డస్సిపోయిన అమెరికా తాలిబాన్‌తో చర్చలకు సిద్ధమై అందుకు తగిన ఏర్పాట్లను చేసుకుంటున్నది. మంచి తాలిబాన్‌తో చర్చలు జరుపుతామంటూ మూడు, నాలుగేళ్ళనుండే ప్రకటనలు చేస్తూ వచ్చిన అమెరికా అధికారులు అందుకోసం ఒక్కో అడుగూ వేస్తున్నారు. ఆఫ్ఘనిస్ధాన్ అధ్యక్షుడు, అమెరికా కీలుబొమ్మ హమీద్ కర్జాయ్ చేత “తాలిబాన్ తో అమెరికా చర్చలు జరుపుతున్నదంటూ రెండు రోజుల క్రితం ప్రకటన ఇప్పించింది. సంబంధాలు మెరుగుపరుచుకునే దిశలో తాలిబాన్‌ను ప్రోత్సహించడానికని చెబుతూ ఇప్పుడు ఆంక్షలు, నిషేధాలు విధించడానికి ఐక్యరాజ్యసమితి తాలిబాన్,…

ప్రభుత్వ వైఖరితో విసుగు చెందిన అన్నా హజారే, మరోసారి ఆమరణ నిరాహార దీక్ష

కేంద్ర ప్రభుత్వ వైఖరితో అన్నా హజారే విసుగు చెందాడు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను విశ్వసించి ఏప్రిల్ లో ఆమరణ నిరాహార దీక్షను విరమించిన అన్నా హజారే, మరునాటి నుండే పౌర సమాజ కార్యకర్తలపై కేంద్ర మంత్రులు వివిధ ఆరోపణలతో దాడి ప్రారంభించడంతో ఖిన్నుడయ్యాడు. శాంతి భూషణ్, ఆయన కొడుకు ప్రశాంత్ భూషన్ ఇరువురూ కమిటీలో ఉండడం పట్ల మొదట అభ్యంతరం వ్యక్తం చేసిన మంత్రులు తర్వాత శాంతి భూషణ్ పై అవినీతి ఆరోపణను ఎక్కడో పాతాళం నుండి…