హజారే అరెస్టుపై రెండు వారాల్లో నివేదిక కావాలి -జాతీయ మానవ హక్కుల కమిషన్ జోక్

భారత దేశ ప్రజల మానవ హక్కులను కాపాడవలసిన జాతీయ మానవ హక్కుల కమిషన్ ఓ విషాధకరమైన జోక్ పేల్చింది. శక్తివంతమైన లోక్ పాల్ బిల్లు కోసం శాంతియుతంగా అమరణ నిరాహార దీక్ష చేపట్టనున్న అన్నా హజారేతో పాటు ఆయన మద్దతుదారులను అరెస్టు చేయడానికి వ్యతిరేకంగా మానవహక్కుల కార్యకర్త ఒకరు పిటిషన్ దాఖలు చేయడంతో దానికి స్పందించింది. అన్నా హజారే, అతని మద్దతుదారుల అరెస్టుపై రెండు వారాల్లొగా నివేదిక సమర్పించాలని హోం మంత్రిత్వ శాఖ కార్యదర్శిని కమిషన్ కోరింది.…

అన్నా హజారే అరెస్టుపై దేశ వ్యాపిత స్పందన -ఫోటోలు

సమర్ధవంతమైన లోక్ పాల్ బిల్లును పార్లమెంటు ముందు ప్రవేశపెట్టాలనీ, లోక్ పాల్ పరిధిలోనికి ప్రధాని, ఛీఫ్ జస్టిస్ లను తీసుకురావాలని డిమాండ్ చేస్తూ పౌర సమాజ కార్యకర్త అన్నా హజారే నిరవధిక నిరాహార దీక్షకు తలపెట్టడంతో పోలీసులు ముందుగానే అరెస్టు చేశారు. బెయిల్ కోసం పోలీసులు విధించిన షరతులను నిరాకరించడంతో అన్నా హజారే, అరవింద్ కేజ్రీవాల్, శాంతి భూషణ్, కిరణ్ బేడీ లను కోర్టు ఏడు రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఈ పరిణామాల క్రమంలొ దేశవ్యాపితంగా…

హజారేతో పాటు నలుగురికి 7 రోజుల జ్యుడీషియల్ కస్టడీ, తీహార్ జైల్లో ఉంచే అవకాశం

ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన అన్నా హజారే, ఆయన బృందంలోని సభ్యులైన కిరణ్ బేడీ, అరవింద్ కేజ్రీవాల్, శాంతి భూషన్ లకు ప్రత్యేక మెజిస్టీరియల్ కోర్టు ఏడు రోజుల పాటు జ్యుడిషయల్ కస్టడీ విధించింది. నిషేధాజ్ఞలను ఉల్లంఘించి జయప్రకాష్ నారాయణ పార్కులో నిరవధిక నిరాహార దీక్షకు కూర్చుంటానని అన్నా హజారే ప్రకటించడంతో ఆయనని అరెస్టు చేశామని ఢిల్లీ పొలీసులు ప్రకటించిన సంగతి తెలిసిందే. అన్నా హజారే వ్యక్తిగత బాండు సమర్పించడం ద్వారా బెయిల్ పొందవచ్చునని కోర్టు షరతు…

అన్నా హజారే తిరస్కరించిన ఆరు ఫాసిస్టు షరతులు ఇవే

సమర్ధవంతమైన లోక్ పాల్ బిల్లుని పార్లమెంటు ముందుకు తేవాలనీ, ప్రధాని, న్యాయ వ్యవస్ధలను కూదా లోక్ పాల్ పరిధిలోకి తేవాలని డిమాండ్ చేస్తూ అన్నా హజారే నిరవధిక నిరాహార దీక్షకు తలపెట్టాడు. అయితే అన్నాహజారే నిరాహార దీక్షకు కూర్చోకముందే ఆగస్టు 16 తేదీన పొద్దున్నే  పోలీసులు ఆయనని అరెస్టు చేసి పట్టుకెళ్ళారు. వ్యక్తిగత ష్యూరిటి ఇవ్వడానికి హజారే నిరాకరించడంతో హజారేకి ఆరు రోజులు జ్యుడిషియల్ కస్టడీ విధించినట్లు వార్తలు తెలుపుతున్నాయి. తాము విధించిన షరతులను హజారే అంగీకరించక…

ఏ ముఖం పెట్టుకుని ఆగష్టు 15న జాతీయ జెండా ఎగరేస్తారు? -ప్రధానికి హజారే ప్రశ్న

“మా నిరసనను తెలియజేయడానికి అనుమతిని నిరాకరించడం ద్వారా, మీరూ మీ ప్రభుత్వమూ మా మౌలిక హక్కులను ఉల్లంఘించడం లేదా? దేశా స్వాతంత్ర్య దినోత్సవానికి రెండు రోజుల ముందే మా స్వాతంత్ర్యాన్ని మీరు లాగేసుకోవడం లేదా? ఏ మొఖం పెట్టుకుని 65 వ స్వాతంత్ర్య దినం రోజున జాతీయ జెండా ఎగరేస్తారు?” తూటాల్లా తాకుతున్న ఈ ప్రశ్నలు భారత దేశ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ కు సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే రాసిన లేఖలో వేసిన ప్రశ్నలు.…

తిరుగుబాటులో చీలిక! లిబియా దాడిలో పట్టు కోల్పోతున్న నాటో?

లిబియాలో తిరుగుబాటుగా చెబుతున్న యుద్ధంలో బ్రిటన్, ఫ్రాన్సు, అమెరికాలు వైమానిక దాడులతో మద్దతు, సహకారం ఇస్తున్నప్పటికీ లిబియా తిరుగుబాటుదారులు ముందంజ వేయడంలో విఫలమవుతుండం పశ్చిమ రాజ్యాలను నిరాశకు గురి చేస్తోంది. తిరుగుబాటు ప్రారంభం అయిన ప్రారంభ దినాల్లొనే లిబియా తిరుగుబాటుదారుల పక్షం చేరిపోయిన మిలటరీ కమాండర్ జనరల్ అబ్దెల్ ఫత్తా యోనెస్ హత్యతో లిబియా తిరుగుబాటుదారుల్లో ఉన్న విభేదాలు లోకానికి వెల్లడయ్యాయి. ఫ్రంట్ లైన్ యుద్ధంలో పాల్గొంటున్న కమాండర్ ను వెనక్కి పిలిపించి మరీ హత్య చేయడతో…

సర్వేలో ‘జన లోక్‌పాల్’కు 80% మద్దతు, ఎన్నికల్లో పోటీచేయాలని కాంగ్రెస్ సవాల్

కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి కపిల్ సిబాల్ నియోజక వర్గం ‘చాందినీ చౌక్’ పార్లమెంటరీ నియోజక వర్గంలో అన్నా హజారే బృందం లోక్ పాల్ డ్రాఫ్టులపై సర్వే నిర్వహించిన సంగతి విదితమే. సర్వేలో ప్రభుత్వ డ్రాఫ్టు ‘లోక్ పాల్’ బిల్లు, అన్నా బృందం రూపొందించిన ‘జన్ లోక్‌పాల్’ బిల్లులు వివిధ ప్రధాన అంశాలపై ఏమేం ప్రతిపాదిస్తున్నదీ ఉదహరిస్తూ, అందులో ఏ అంశాలకు తాము మద్దతు ఇస్తున్నదీ గుర్తించవలసిందిగా కోరారు. మొత్తం 4 లక్షల కుటుంబాలలో అన్నా…

లిబియా తిరుగుబాటు సైన్యాధ్యక్షుడి హత్య, బ్రిటన్‌లో అంతర్మధనం?!

లిబియాలో తిరుగుబాటు ఆరంభం ఐనప్పటి ప్రారంభ దశలోనే తిరుగుబాటుదారుల పక్షం చేరిపోయి వారితో కలిసి గడ్డాఫీ బలగాలపై పోరాటం చేస్తున్న అత్యున్నత మిలట్రీ అధికారి జనరల్ అబ్దుల్ ఫతా యూనెస్, దారుణంగా హత్యకు గురికావడం లిబియాతో పాటు లిబియా తిరుగుబాటుకి మద్దతు తెలిపిన బ్రిటన్, ఫ్రాన్సు దేశాలకు కూడా కలవరపాటుకి గురిచేసింది. ఆయిల్ పట్టణం బ్రెగా వద్ద ఫ్రంట్ లైన్ యుద్ధంలో పాల్గొంటున్న అబ్దుల్ ఫతాను గురువారం తిరుగుబాటుదారుల రాజధాని బెంఘాజికి వెనక్కి పిలిపించిన తర్వాత అక్కడ…

నార్వేని కుదిపేసిన బాంబు పేలుళ్ళు, కాల్పులు; 87 మంది దుర్మరణం

నార్వే రాజధాని ఓస్లోను బాంబు పేలుళ్ళు కుదిపేశాయి. గంట నుండి రెండు గంటల వ్యవధిలో వరుసగా జరిగిన రెండు సంఘటనల్లో మొత్తం 87 మంది ప్రజలు దుర్మరణం పాలయ్యారు. ప్రపంచంలోనే అత్యంత భద్రత గల ప్రాంతంగా భావించే దేశాల్లో ఒకటైన నార్వే రాజధానిలో ఈ ఘటన జరగడం నార్వే వాసులను షాక్ కి గురిచేసింది. శుక్రవారం సాయంత్రం జరిగిన బాంబు పేలుడులో ఏడుగురు చనిపోగా, ఒకటి లేదా రెండు గంటల అనంతరం సమీపంలోని ఉటోయా ద్వీపంలో పోలీసు…

మృతవీరుడి మరణం పట్ల శంకరుడిని నిలదీస్తూ, నిరసిస్తూ హృదయాన్ని పిండేసే పాట -వీడియో

మిత్రులు కొణతం దిలీప్ గారి బ్లాగ్ నుండి సంగ్రహించిన వీడియో ఇది. తెలంగాణ రాష్ట్రం కోసం యువకులు తమను తాము దహించుకుంటున్న రోజుల్లో 28 ఏప్రిల్, 2010 తేదీన అటువంటి ఒక యువకుడి ఆత్మాహుతి పట్ల నిరసన తెలుపుతూ జరిగిన సభలో శంకరుడినే ప్రశ్నిస్తున్న కళాకారుడి హృదయం ఈ పాట. కొన్ని వందల తల్లుల కడుపు శోకానికి అక్షర రూపం ఈ పాట. అంతమంది తల్లుల గర్భశోక ధ్వని రూపం కూడా ఈ పాట. పాషాణ హృదయులనైనా…

తెలంగాణ రాష్ట్రం కోరడం వేర్పాటువాదం కాదు

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కోరడాన్ని వేర్పాటువాదంగా కొంతమంది సంభోదిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి వేరుపడాలని కోరుతున్నారు గనక అది ‘వేర్పాటు వాదమే’ అని వారి వాదనగా ఉంది. వాస్తవానికి భారత రాజ్యాంగం ప్రకారం చూసినా ఒక రాష్ట్రం నుండి విడిపోయి కొత్త రాష్ట్రంగా ఏర్పడడం వేర్పాటు వాదం కాజాలదు. దేశం నుండి విడిపోయి కొత్త దేశంగా ఏర్పడాలని కోరుకోవడం వేర్పాటువాదం అవుతుంది తప్ప రాష్ట్రాలుగా విడిపోవడం వేర్పాటువాదం కాదు. కాశ్మీరు ప్రజలు తమది ప్రత్యేక…

తెలంగాణ ఉద్యమం తెలంగాణ ప్రజలది, ఉద్యమాన్ని చూపి రౌడీ చర్యలకు దిగడం కట్టిపెట్టాలి

ఢిల్లీలోని ఆంధ్ర ప్రదేశ్ భవన్‌లొ కె.సి.ఆర్ అల్లుడు హరీష్ రావు వేసిన వీరంగం ఖండనార్హం. ఏపి భవన్‌లో ఛానెళ్ళ కెమెరాల సాక్షిగా ఆయన చేసిన అరాచకం ఏ విధంగానూ సమర్ధనీయం కాదు. ఫర్నిచర్‌ని కాళ్ళతో తన్నుకుంటూ, పెద్ద పెద్దగా కేకలు వేస్తూ, తలుపుల్ని బాదుతూ అంతిమంగా అక్కడ అందుబాటులో ఉన్న అధికారిని రెండు చెంపలపైన కొట్టడం ఒక రాజకీయనాయకుడు, అందునా వెనకబడిన ప్రాంతం హక్కుల కోసం ఉద్యమిస్తున్నామని చెబుతున్న పార్టీకి చెందిన నాయకుడు, చేయకూడని పని. చట్ట…

ఐ.ఎస్.ఐ అధిపతి అమెరికా పర్యటన విజయవంతం, బాగుపడిన ఐ.ఎస్.ఐ, సి.ఐ.ఎ ల సంబంధాలు

90 మందికి పైగా సి.ఐ.ఎ గూఢచారులను పాకిస్ధాన్ ప్రభుత్వం దేశం నుండి వెళ్ళగొట్టడంతో పాక్, అమెరికాల మధ్య సంబంధాలు బెడిసి కొట్టిన సంగతి విదితమే. సి.ఐ.ఎ గూఢచారులను వెనక్కి పంపడంతో అమెరికా కూడా పాకిస్ధాన్ కి ఇవ్వవలసిన 800 మిలియన్ డాలర్ల సహయాన్ని నిలిపివేసింది. తమ గూఢచారులు పాకిస్ధాన్ సైన్యానికి శిక్షణ ఇవ్వడానికే అక్కడ ఉన్నారనీ, వారే లేకపోతే ఇక శిక్షణకి ఇచ్చే సొమ్ము ఇవ్వవలసిన అవసరం లేదనీ సి.ఐ.ఏ అధికారులు, సహాయం నిలిపివేస్తున్నట్లు చేసిన ప్రకటన…

ఆఫ్ఘన్‌లో కొనసాగుతున్న ‘నాటో’ నరమేధం, పౌర నష్టంపై పచ్చి అబద్ధాలు, బుకాయింపులు

ఆఫ్ఘనిస్ధాన్‌లో అర్ధ రాత్రుళ్ళు గ్రామాలపై దాడి చేసి పౌరుల ఇళ్ళపై కాల్పులు జరిపి వారిని కాల్చి చంపడం కొనసాగుతోంది. టెర్రరిస్టు గ్రూపుల సమావేశం జరుగుతోందని చెప్పడం, పౌరుల ఇళ్ళపై విచక్షణా రహితంగా కాల్పులు జరపడం, పౌరులను కాల్చి చంపి చనిపోయినవారు టెర్రరిస్టులను బుకాయించడం నాటో దళాలకు ముఖ్యంగా అమెరికా సైన్యానికి నిత్యకృత్యంగా మారింది. ఆఫ్ఘనిస్ధాన్ దురాక్రమణను ప్రతి ఒక్క ఆఫ్ఘన్ దేశీయుడూ వ్యతిరేకిస్తున్నాడనీ, తమ దేశం నుండి అమెరికా సైనికులు తక్షణమే వెళ్ళిపోవాలని ప్రతీ ఆఫ్ఘన్ జాతీయుడు…

ఎట్టకేలకు హమీద్ కర్జాయ్ సోదరుడిని చంపేసిన మిలిటెంట్లు

అనేక సార్లు మిలిటెంట్ల హత్యా ప్రయత్నాలనుండి తప్పించుకున్న ఆఫ్ఘన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ సోదరుడు అహ్మద్ వాలి కర్జాయ్ మంగళవారం హత్యకు గురయ్యాడు. ఆఫ్ఘన్ ప్రభుత్వంలొ చోటు చేసుకున్న అనేక తప్పులకు అహ్మద్ కర్జాయ్ కారణంగా ఆరోపణలు ఎదుర్కొన్నాదు. హమీద్ కర్జాయ్ అవినీతిలో అహ్మద్ కర్జాయ్ అసలు పాత్రధారి అని ఆరోపణలు వెల్లువెత్తాయి. అమెరికా వైపు నుండి కూడా ఈయనపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఎందరు ఎన్ని విధాలుగా ఆరోపించినప్పటికీ ఆఫ్ఘన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్,…