ప్రజలూ అవినీతిపరులేనట! -కార్టూన్

అవినీతిని రూపుమాపాలని ప్రజలు కోరుతుంటే అతితెలివిపరులు లంచం ఇవ్వడం మానేస్తే అవినీతి అదే తగ్గుతుందని బుద్ధుడి లెవల్లో బోధిస్తారు. తెలుగు ఛానెళ్లలో ఒక ప్రకటన వస్తోంది. “అవినీతి నిర్మూలన మననుండే ప్రారంభిద్దాం” అని. అందులో లంచం ఇస్తుండబట్టే, తీసుకునే వాళ్ళున్నారని చూపిస్తున్నారు. ఆర్.టి.ఒ ఆఫీసుకి గానీ, రిజిస్ట్రార్ ఆఫీసుకి గానీ లేదా ట్రెజరీ ఆఫీసుకి గానీ పనికి వెళ్ళి నేను లంచం ఇవ్వను అంటే పనవుతుందా? నానుండే అవినీతి నిర్మూలన ప్రారంభించాలి అని శపధం చేసి లంచం…

లిబియాలో గడ్డాఫీ ఉన్నాడా, పోయాడా? -కార్టూన్

నాటో బాంబుదాడులు తోడు రాగా లిబియా తిరుగుబాటుదారులు రాజధాని ట్రిపోలిలో ప్రవేశించారు. ట్రిపోలీ ప్రజలు ఆనందోత్సాహాలతో వారికి స్వాగతాలు పలికారని పశ్చిమ కార్పొరేట్ పత్రికలు బాకాలుదాయి. తిరుగుబాటుదారుల నాయకత్వ కమిటీ ‘ట్రాన్సిషనల్ నేషనల్ కౌన్సిల్’ గడ్డాఫీ ఇద్దరు కొడుకులనూ అరెస్టు చేశామని ప్రకటించింది. వారాల ప్రకటించిన గంటలలోపే గడ్డాఫీ కుమారుడు, ఎలైట్ ఫోర్స్ నాయకుడు సైఫ్ ఇస్లాం తిరిగి ట్రిపోలిలోనే ప్రత్యక్షమయ్యాడు, మద్దతుదారులకు విక్టరీ సిగ్నల్ చూపుతూ. ఇదేలా సాధ్యం? అరెస్టయినవాడు నవ్వుతూ, చేతులూపుతూ ఎలా ప్రత్యక్షమైనట్లు?…

జన్‌లోక్ పాల్ బిల్లుని పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి ప్రధాని అంగీకారం, దీక్ష మానాలని వినతి

అన్నా బృందం డిమాండ్ చేస్తున్నట్లుగా “జన్ లోక్ పాల్ బిల్లు” ని పార్లమెంటు ముందు ప్రవేశపెట్టడానికి అంగీకరిస్తున్నట్లు ప్రధాని మన్మోహన్ అన్నాకు రాసిన ఉత్తరంలో ప్రకటించాడు. ఎనిమిది రోజుల నిరాహార దీక్షను ఇంతటితో ఆపివేయాలని ప్రధాని తన లేఖలో కోరాడు. నెల రోజుల పాటు దేశంలోని ఇతర ప్రధాన సమస్యలనుండి పత్రిల కేంద్రీకరణను తనవైపుకు తిప్పుకున్న అన్నా హజారే అవినీతి వ్యతిరేక నిరవధిక నిరాహార దీక్ష మరి కొన్ని గంటల్లో ముగిసే అవకాశం కనిపిస్తోంది. అన్నా హజారే…

అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమం సంపూర్ణమైనదేనా?

భారత దేశానికి స్వాతంత్రం తేవడానికి ఏర్పడిందంటున్న కాంగ్రెస్ పార్టీ నిజానికి 1920 ల వరకూ సంపూర్ణ స్వాతంత్ర్యం అన్న నినాదం ఇవ్వలేదు. అంటే అప్పటివరకూ జరిగిన ఉద్యమం కొన్ని రాయితీల కోసమే జరిగింది. నామమాత్ర ఎన్నికలు నిర్వహించడం, పాలనలో భారత లెజిస్లేచర్ల అభిప్రాయాలు కూడా పరిగణించడం (అమలు చేయాలని రూలేమీ లేదు) ఇత్యాధి రాయితీల కోసం మాత్రమే కాంగ్రెస్ పార్టీ (గాంధీతో సహా) ఉద్యమించింది. ఆ తర్వాత అతివాదుల ప్రాబల్యం, కమ్యూనిస్టు విప్లవకారుల ఉద్యమ వ్యాప్తి అన్నీ…

ప్రభుత్వ లోక్‌పాల్ బిల్లుని 80 శాతం సవరించవచ్చు -స్టాండింగ్ కమిటీ సభ్యుడు

“స్టాండింగ్ కమిటీ అందర్నీ ఆశ్చర్యపరుస్తుంద”ని సోమవారం ప్రకటించిన స్టాండింగ్ కమిటీ సభ్యుడు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వి మంగళవారం అలాంటిదే మరో కబురు చెప్పాడు. ప్రభుత్వం పార్లమెంటు ముందు ప్రవేశపెట్టిన లోక్‌పాల్ బిల్లులో 80 శాతం సవరణలు చేయవచ్చునని ప్రకటించాడు. అన్ని వర్గాలవారూ కొంత ఇచ్చిపుచ్చుకునే ధోరణిని కనపరచాలని స్టాండింగ్ కమిటీ నాయకుడు అభిషేక్ సింఘ్వీ అన్నాడు. వ్యక్తిగత, ప్రజా సమస్యలు మరియు చట్టం, న్యాయం విషయాలలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నాయకుడు అభిషేక్…

స్ట్రాస్ కాన్ పై కేసు ఉపసంహరించుకున్న న్యూయార్క్ ప్రాసిక్యూటర్లు

ఐ.ఎమ్.ఎఫ్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ డొమినిక్ స్ట్రాస్ కాన్ పై రేప్ ఆరోపణలను ఉపసంహరించుకుంటున్నట్లుగా ప్రాసిక్యూటర్లు కోర్టుకు తెలిపారు. దీనితో న్యూయార్క్ హోటల్ మెయిడ్ ను రేప్ ప్రయత్నం చేశాడంటూ స్ట్రాస్ కాన్ పై వచ్చిన ఆరోపణల కేసు పూర్తిగా రద్దయినట్లే. బాధిత మహిళ ప్రవేటు కేసు దాఖలు చేస్తే తప్ప స్ట్రాస్ కాన్ మళ్ళీ కోర్టు గడప తొక్కనవసరం లేదు. బాధిత మహిళ సాక్ష్యం ద్వారా ‘అనుమాన రహితంగా’ రేప్ కేసును రుజువుచేయగలమన్న నమ్మకాన్ని ప్రాసిక్యూటర్లు…

అన్నా అరెస్టు, లోక్‌పాల్ బిల్లు లపై రెండు కార్టూన్లు

జైలులో ఉండవలసినవారు సమాజంలో సంచరిస్తుంటే, సమాజం బాగు కోసం సమాజంలో ఉండవలసినవారు జైలులో మగ్గుతున్నారని అనేక మంది పెద్దలు అనేకసార్లు చెప్పారు. ప్రభుత్వాల చర్యలు, చట్టాలు కూడా అలాగే ఉన్నాయి. అన్నా హజారే, ఆయన స్నేహితుల అరెస్టుతో అది మరొకసారి రుజువయ్యింది. “మనకంటే ప్రమాదకరమైన వాళ్ళని ఉంచడానికి జైలులో ఖాళీ లేదట!“ ————————————————— కోరలు లేని లోక్‌పాల్ బిల్లుని పార్లమెంటులో ప్రవేశ పెట్టి కేంద్ర ప్రభుత్వం చేతులు దులుపుకుంది. శక్తివంతమైన బిల్లుని తెమ్మని అన్నా హాజారే బృందం…

బ్రిటన్‌ యువతలో పెరుగుతున్న నిరుద్యోగం, అల్లర్లకు అదే కారణం

బ్రిటన్ ప్రభుత్వం వెల్లడించిన గణాంకాల ప్రకారం అక్కడ నిరుద్యోగం భూతం జడలు విప్పింది. ప్రభుత్వరంగం ఉద్యోగులను తొలగిస్తుండంతో పాటు ప్రవేటు రంగ ఉత్పత్తి స్తంభించిపోవడంతో నిరుద్యోగం పెరుగుతున్నదని భావిస్తున్నారు. లండన్ తో పాటు ఇతర నగరల్లోని పేద కుటుంబాల యువకులు కొద్ది రోజుల క్రితం పెద్ద ఎత్తున అల్లర్లకు పాల్పడిన నేపధ్యంలో వెలువడిన ఈ వివరాలు అల్లర్లకు కారణమేమిటో చెప్పకనే చెపుతున్నాయి. రాజకీయ నాయకులు, కార్పొరేట్ మీడియా కూడబలుక్కుని అల్లర్లకు, నిరుద్యోగం కారణం కాదంటూ నమ్మబలుకుతున్నప్పటికీ వాస్తవాలు…

అన్నా దీక్ష విరమణకు తెరవెనుక ప్రయత్నాలు ముమ్మరం?

అన్నా బృందానికీ, ప్రభుత్వానికి మద్య విభేధాలను సామరస్య పూర్వకంగా పరిష్కరించడానికి తెరవెనుక ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయన్న ఊహాగానాలు ఆదివారం వెలువడ్డాయి. మాహారాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఒక సీనియర్ ప్రభుత్వాధికారి ఆదివారం అన్నాను కలవడంతో ఈ ఊహాగానాలు బయలుదేరాయి. అన్నా హజారే మహారాష్ట్ర వాసి కావడం ఈ సందర్భంగా గమనార్హం. సదరు అధికారి, అన్నాల మధ్య జరిగిన చర్చలను “వ్యక్తిగతమైనవి”గా అన్నా బృందం అభివర్ణించడం అనుమానాలకు బలం చేకూర్చినట్లయింది. ఐతే ప్రధానిని, ఉన్నత న్యాయ వ్యవస్ధను లోక్ పాల్…

అన్నాకి గురువైనందుకు మహాత్మాగాంధి సైతం జైల్లోకే -కార్టూన్

కేంద్ర ప్రభుత్వం అన్నా హజారే అంటేనే ఉలిక్కిపడుతోంది. దీక్ష మొదలు కాక ముందే అన్నా బృందాన్ని అరెస్టు చేసి చేతులు కాల్చుకుంది. నాలిక్కరుచుకుని విడుదల చేయబోయి అక్కడా దెబ్బతిన్నది. మరోపక్క అన్నా హజారే తన అరెస్టునే ఆందోలనకు అనువుగా మార్చుకోగలిగాడు. అన్నా బృందం పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టే ఈ కార్టూన్‌ని భారతీయ కార్టూనిస్టు మంజుల్ గీసింది. – “అన్నా హజారేకి ఆయనే గురువని ప్రభుత్వానికి తెలిసిందట మరి!” —

అమెరికా చర్చలు జరుపుతున్నది తాలిబాన్ డూప్ తో -తాలిబాన్

తాలిబాన్ పేరు చెప్పి మోసం చేస్తున్న డూప్ వ్యక్తితో అమెరికా చర్చలు జరుపుతోందని తాలిబాన్ ప్రకటించి సంచలనం సృంష్టించింది. తాలిబాన్ తరపున అమెరికాతో చర్చలు జరుపుతున్నాడని వ్యక్తి నిజానికి తమ వద్దనే ఉన్నాడని చెబుతూ, సదరు వ్యక్తి ఇంతవరకు ఎప్పుడూ అమెరికాతో చర్చలు జరపడానికి వెళ్ళలేదని తాలిబాన్ వెల్లడించింది. తాలిబాన్‌కి చెందిన ఉన్నత స్ధాయి అధికారితో ఖతార్, జర్మనీలలో చర్చలు జరిపామంటూ ప్రకటించిన అమెరికాకు ఇది ఆశనిపాతం లాంటి వార్తే. తాలిబాన్ ప్రతినిధి జబీయుల్లా ముజాహిద్ ఆదివారం…

కమ్యూనిస్టు విప్లవకారుల అవగాహనకు దగ్గరలో అన్నా హజారే ప్రసంగాలు

పౌర సమాజ నాయకుడుగా ఆవిర్భవించిన గాంధేయవాది అన్నా హజారే శక్తివంతమైన లోక్‌పాల్ బిల్లుకోసం అయిదు రోజుల నుండి నిరాహార దీక్ష చేస్తుండడమే కాక మధ్య మధ్యలో ప్రసంగాలు కూడా చేస్తున్నాడు. నిరాహార దీక్ష ప్రారంభం అయినప్పటినుండీ అన్నా చేస్తున్న ప్రసంగాలు కమ్యూనిస్టు విప్లవకారులుగా ఉన్న పార్టీల అవగాహనకు సమీపంలో ఉన్న సంగతి గమనార్హం. సి.పి.ఐ (ఎం.ఎల్ – మావోయిస్టు), సి.పి.ఐ (ఎం.ఎల్ – న్యూడెమొక్రసీ), సి.పి.ఐ (ఎం.ఎల్ – జనశక్తి) తదితర పార్టీలు భారత దేశంలో విప్లవ…

ఫేస్‌బుక్, ట్విట్టర్… లండన్‌లో మోస్ట్ వాంటెడ్ నేరగాళ్ళు -కార్టూన్

లండన్ పోలీసుల దృష్టిలో ఫేస్ బుక్, ట్విట్టర్ లు ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ నేరగాళ్ళు. బ్రిటన్‌లో ప్రజాస్వామ్యం ఉంది అని ప్రపంచం భావిస్తోంది కనుక ఆగారు కానీ ఈ పాటికి ఈ ఇద్దరు నేరగాళ్ళని లండన్ పోలీసులు పబ్లిక్ లో కనపడకుండా చేసేవారే. జోర్డాన్ బ్లాక్‌షా (20 సం.లు), సట్‌క్లిఫ్ కీనన్ (22 సం.లు) అనే ఇద్దరు యువకులకి లండన్ మెజిస్ట్రేట్ కోర్టు నాలుగు సంవత్సరాల కారాగార శిక్ష విధించింది. ఫేస్ బుక్, ట్విట్టర్ లలో సందేశాలు…

ఈజిప్టు పోలీసులను చంపిన ఇజ్రాయెల్, రాయబారిని ఉపసంహరించుకుంటున్న ఈజిప్టు

ప్రజాస్వామిక హక్కుల కోసం జరిగిన ప్రజా ఉద్యమం అనంతరం నియంత ముబారక్ గద్దె దిగాక ఈజిప్టు, ఇజ్రాయెల్ ల మధ్య సంబంధాలు కొంతవరకు దెబ్బతిన్నాయి. మిలిటెంట్లకోసం వెతుకుతూ ఈజిప్టు భూభాగంలోనికి వచ్చిన ఇజ్రాయెల్ సైనికులు మిలిటెంట్లన్న నెపంతో ఎనిమిది మంది పోలీసులను కాల్చి చంపడం ఈజిప్టు ప్రజలకు ఆగ్రహం తెప్పించింది. ఇజ్రాయెల్‌తో సంబంధాలు తెంచుకుని ఇజ్రాయెల్ రాయబారిని దేశం నుండి బహిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈజిప్టు ప్రజలు ఆందోళన నిర్వహించడంతో తమ రాయబారిని ఇజ్రాయెల్ నుండి విరమించుకోబోతున్నట్లుగా…

ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణ ముగిసింది -పాలస్తీనా సంస్ధ హమాస్

పాలస్తీనా మిలిటెంట్ సంస్ధ “హమాస్,” శనివారం ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. పాలస్తీనాను అక్రమించిన ఇజ్రాయెల్ తో తనంత తానుగా ప్రకటించిన కాల్పుల విరమణ ముగిసినట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో మధ్య ప్రాచ్యం ప్రాంతంలో ఉద్రిక్తలు మరోమారు ఉచ్ఛ స్ధాయికి చేరనున్నాయి. గత కొన్ని రోజులుగా ఇజ్రాయెల్, కారణం లేకుండా తమ ఆధీనంలో ఉన్న గాజాపై దాడులు చేస్తూ ప్రజలను చంపుతున్నందున తాము పాటిస్తున్న “కాల్పుల విరమణకు” ఇక అర్ధం లేదని హమాస్ సంస్ధ ప్రకటించింది. గత రెండు…