“దైవ దూషణ” హత్య నిందితుడికి పాక్ కోర్టు మరణ శిక్ష

“దైవ దూషణ”కు పాల్పడ్డాడంటూ పాకిస్ధాన్ లోని రాష్ట్ర గవర్నర్ ను దారుణంగా కాల్చి చంపిన పోలీసు అధికారికి పాకిస్ధాన్ కోర్టు మరణ శిక్ష విధించింది. పాకిస్ధాన్ లో ‘దైవ దూషణ’ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్ గవర్నర్ సల్మాన్ తసీర్ అనేక సార్లు ఉపన్యాసాలు ఇచ్చాడు. అటువంటి చట్టాలు ప్రజాస్వామిక వ్యవస్ధలకు ఆటంకాలని పేర్కొంటూ వాటిని రద్దు చేయాలని తస్సీర్ ప్రచారం చేశాడు. బ్లాస్ఫెమీ నేరానికి శిక్ష పడ్డ ఆసియా బీబీ అనే వ్యక్తి శిక్షకు వ్యతిరేకంగా ప్రచారం…

తెలంగాణ సకలజనుల సమ్మె, 17వ రోజు మంత్రుల ఇళ్ల నిర్బంధం

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సకల జనుల సమ్మె అప్రహతిహతంగా కొనసాగుతోంది. భారత దేశ చరిత్రలోనే మున్నెన్నడూ లేనంతగా, ఒక్క నెల్లిమర్ల జూట్ కార్మిక ఉద్యమం తప్ప, సమాజంలోని దాదాపు అన్ని రంగాల ఉద్యోగులు, కార్మికులు తమ తమ విధులను బహిష్కరించి ఉద్యమించడమే కాక సమ్మెలు చేస్తున్నవారంతా రోడ్లపైకి వచ్చి నినదిస్తూ తెలంగాణ కావాలని డిమాండ్ చేస్తున్నారు. అనేక రకాల రూపాల్లో సమ్మెలో పాల్గొంటూ కనీ వినీ ఎరుగని సంయమనంతో శాంతియుతంగా ఉద్యమాలు నిర్వహిస్తున్నారు. శాంతియుత ఉద్యమమే…

పాలస్తీనా రాజ్య ప్రకటనకు ఇజ్రాయెల్ ఆటంకం -కార్టూన్

అరవై ఏళ్ళనుండి ఇజ్రాయెల్ రాజ్య జాత్యహంకార ప్రభుత్వం కింద నలుగుతున్న పాలస్తీనా ప్రజలు విముక్తి పొందకుండా అమెరికా, యూరప్ లు కాపలా కాస్తూ వచ్చాయి. జాత్యహంకార పదఘట్టనల కింద నలుగుతున్న పాలస్తీనా ప్రజల తరపున ఇజ్రాయెల్, అమెరికాలతో కుమ్మకయిన వెస్ట్ బ్యాంక్ అధ్యక్షుడు మహమ్మద్ అబ్బాస్ పాలస్తీనా దేశం ఏర్పాటును ఏక పక్షంగా సమితి సమావేశాల్లో ప్రకటిస్తానని కొన్ని నెలలుగా చెబుతూ వచ్చాడు. సేవకుడు ఎంత సేవ చేసినా యజమానులకు తృప్తి దొరకదు. అబ్బాస్ ఎన్నిమార్లు ఇజ్రాయెల్…

హక్కాని గ్రూపుపై దాడులు చేసే సమస్యే లేదు, అమెరికాకి తెగేసి చెప్పిన పాక్

ఆఫ్ఘనిస్ధాన్‌లోని తాలిబాన్ మిలెటెంటు గ్రూపుల్లో అమెరికా అమితంగా భయపడుతున్న హక్కానీ గ్రూపుపైన దాడులు చేసే సమస్యే లేదని పాకిస్ధాన్ ఆర్మీ తేల్చి చెప్పింది. అమెరికా ఎన్ని ఒత్తిడులు తెచ్చినప్పటికీ తాము ఇప్పటివరకూ చేస్తున్న దాని కంటే కొంచెం కూడా ఎక్కువ చేసేది లేదని పాకిస్ధాన్ ఆర్మీ నిర్ణయించుకున్నట్లుగా అభిజ్ఞవర్గాలను ఉటంకిస్తూ రాయిటర్స్ తెలిపింది. రెండు వారాల క్రితం తాలిబాన్ మిలిటెంట్లు కాబూల్ లోని హై సెక్యూరిటీ జోన్ లోకి ప్రవేశించి నిర్మాణంలో ఉన్న భవంతిని ఆక్రమించుకుని సమీపంలోని…

ఫ్రెంచి, బ్రిటిష్ కిరాయి సైనికులను పట్టుకున్న గడ్డాఫీ బలగాలు

ఫ్రాన్సు, బ్రిటన్, అమెరికాలు లిబియా తిరుగుబాటు పూర్తయ్యిందని ప్రకటించాయి. గడ్డాఫీ కబంధ హస్తాలనుండి లిబియా ప్రజలను విముక్తం చేసినట్లు ప్రకటించాయి. ఐనా నాటో వైమానిక దాడులు ఆగలేదు. లిబియా పౌరులను గడ్డాఫీబారినుండి కాపాడడానికి వైమానికదాడులు చేస్తున్నామని ఇన్నాళ్ళూ ప్రకటిస్తూ వచ్చిన ఫ్రాన్స్, అమెరికా, బ్రిటన్ ల నేతృత్వంలోని నాటో బలగాలు గడ్డాఫీ లిబియా వదిలి వెళ్ళినప్పటికీ ఎందుకు ఇంకా బాంబు దాడులు చేస్తున్నారు. గడ్డాఫీ బలగాలు ప్రస్తుతం గడ్డాఫీ సొంత నగరం సిర్టే, మరొక పట్టణం బాన్…

కాలుష్య ఫ్యాక్టరీపై చైనా గ్రామీణుల పోరాటం

తూర్పు చైనాలో వందలమంది గ్రామీణులు సోలర్ ప్యానెల్ ఫ్యాక్టరీ కాలుష్యం వెదజల్లుతుండడంతో ఫ్యాక్టరీని అక్కడినుండి తరలించాలని డిమాండ్ చేస్తూ ఉద్యమిస్తున్నారు. ఝెజియాంగ్ రాష్ట్రంలోని హైనింగ్ పట్టణంలో ఉన్న ఝెజియాంగ్ జింకో సోలార్ కంపెనీ ఎదుట ఐదొందల వరకూ గ్రామీణులు గురువారం గుమిగూడి ఆందోళన ప్రారంబించారు. ఆందోళనకారుల్లో కొందరు ఫ్యాక్టరీలోకి దూసుకెళ్ళి అక్కడ నిలిపి ఉన్న కంపెనీ కార్లను మూకుమ్ముడి బలంతో తిరగవేయడం, కార్యాలయంలో వస్తువులను ధ్వంసం చేయడం ప్రారంభించారని అధికారులు తెలిపారు. కంపెనీకి సమీపంలో ఉన్న హాంగ్-గ్జియావో…

కాశ్మీరులో 2,156 గుర్తు తెలియని సమాధులు, డి.ఎన్.ఎ సేకరణకు నిర్ణయం

గుర్తు తెలియని సమాధుల్లో పాతి పెట్టిన 2,156 శవాలను గుర్తించాలని జమ్మూ కాశ్మీరు “రాష్ట్ర మానవ హక్కుల సంఘం” సిఫారసు చేసింది. మానవ హక్కుల సంఘానికి చెందిన పోలీసు విభాగం ఈ సమాధులను గత నెలలో గుర్తించడం సంచలనం కలిగించింది. కాశ్మీరులో భారత భద్రతా బలగాలు దేశ రక్షణ పేరుతోనో, తీవ్రవాదం పేరుతోనో కాశ్మీరు యువకులను అనేక వేలమందిని మాయం చేశాయని చాలా కాలం నుండి కాశ్మీరు ప్రజలు ఆరోపిస్తున్నారు. 2001 జనాభా లెక్కల సేకరణ అనంతరం…

గ్రీసు రుణ సంక్షోభం -కార్టూన్

గ్రీస్ ప్రధాని జార్జి పపాండ్రూ: ఈ ఒక్కటే కత్తిరిస్తే అంతా అయిపోయినట్లే  కార్టూనిస్టు: అమోరిమ్, బ్రెజిల్ —————                   —————–                          ————–                       —————— గ్రీసు రుణ సంక్షోభం గత సంవత్సరం ప్రారంభంలో తలెత్తడంతో ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ లు దానికి 110 బిలియన్ యూరోల బెయిలౌట్ మంజూరు చేసాయి. బెయిలౌట్ ఇస్తూ విషమ షరతులు విధించాయి. షరతుల ఫలితంగా గ్రీసు ప్రధాని గత సంవత్సర కాలంగా అనేక విడతలుగా పొదుపు చర్యలు అమలు చేశాడు. కార్మికులు, ఉద్యోగుల వేతనాలు, ఫెన్షన్లు,…

మీపై దాడులకు మేమెలా బాధ్యులం? అమెరికాకి పాక్ సూటి ప్రశ్న

అమెరికా హెచ్చరికను పాకిస్ధాన్ తిప్పికొట్టింది. హెచ్చరికను స్వీకరించడానికి పాక్ సైనికాధికారులు నిరాకరించారు. మంగళవారం నుండి బుధవారం వరకూ కాబుల్ పట్టణ నడిబొడ్డున అమెరికా ఎంబసీపై తాలిబాన్ మిలిటెంట్లు చేసిన రాకెట్ దాడితో అమెరికా నేతృత్వంలోని నాటో అధికారులు తత్తరపాటుకి గురయ్యారు. ఆఫ్ఘన్ దురాక్రమణ తర్వాత ఇంతవరకూ మిలిటెంట్లు ఎన్నడూ కాబూల్ పై అంతసేపు దాడి చేయలేదని రాయిటర్స్ సంస్ధ పేర్కొంది. పాకిస్ధాన్ భూభాగంలో స్ధావరాలు ఏర్పరుచుకున్న హక్కాని మిలిటెంట్ల గ్రూపు ఈ దాడికి కారణమని అనుమానిస్తున్న అమెరికా…

మా రక్షణ కోసం మేం ఏమైనా చేస్తాం, పాక్‌కు అమెరికా హెచ్చరిక

పాకిస్ధాన్‌కి అమెరికా తాజాగా హెచ్చరిక జారీ చేసింది. తాలిబాన్ మిలిటెంట్లు ఆఫ్ఘన్ రాజధాని కాబూల్ నడిబొడ్డున ఉన్న అమెరికా ఎంబసీ, నాటో కార్యాలయం ఉన్న ప్రాంతంపైన రాకెట్లు, మెషిన్ గన్‌లతో దాడి చేసింది. మంగళవారం మధ్యాహ్నం నుండి బుధవారం ఉదయం వరకు ఇరవై గంటలపాటు సాగిన ఈ దాడిలో పెద్దగా నష్టం ఏమీ జరగనప్పటికీ, అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉండే ‘హై సెక్యూరిటీ జోన్’ లోకి రాకెట్ ప్రొపెల్డ్ గ్రెనేడ్స్, మెషిన్ గన్లతో సహా మిలిటెంట్లు…

మానసిక యుద్ధంలో భాగమే అమెరికా ఎంబసీపై తాలిబాన్ దాడి

20 గంటల పోరాటం అనంతరం తాలిబాన్ దాడి ముగిసింది. దాడిలో పాల్గొన్న తాలిబాన్ మిలిటెంట్లు అందరూ చనిపోవడంతో ఆపరేషన్ ముగిసింది. మంగళవారం ఆఫ్ఘన్ రాజధాని కాబూల్‌లో ‘అత్యున్నత భద్రతా జోన్’ లో తాలిబాన్ మిలిటెంట్లు దాడికి పూనుకున్న సంగతి విదితమే. అమెరికా ఎంబసీకి సమీపంలోనే ఉన్న ఒక నిర్మాణంలో ఉన్న భవంతిని అదుపులోకి తీసుకున్న తాలిబాన్ మిలిటెంట్లు బుధవారం వరకూ ఇరవై గంటలపాటు ఆఫ్ఘన్, అమెరికన్ సైనికుల ప్రతిఘటనను ఎదుర్కొని నిలబడ్డారు. దాడిలో భారీ ఆయుధాలు ఏవీ…

వ్యాపారానికి ఏదీ అనర్హం కాదు, 9/11 దాడులతో సహా -ఫొటోలు

పెట్టుబడిదారుడి దృష్టిలో ప్రతిదీ సరుకే. అది కూడా లాభాలు సంపాదించి పెట్టే సరుకులుగానే వస్తువుల్ని అతను చూస్తాడు. సేవల పేరుతో ఇప్పుడు వస్తువులతో పాటు భావాలనీ, బాధలనీ, కష్టాలనీ, కన్నీళ్ళనీ, సంతోషాన్ని, బంధాలనీ, అను బంధాలనీ కూడా మారకపు సరుకులుగా పెట్టుబడిదారుడు మార్చ గలిగిగాడు. ఏ అంశాన్నైనా పెద్ద ఎత్తున పతాక శీర్షికలకి నెట్టడం ద్వారా దానికి కొంత మారకపు విలువను జోడించగలుగుతున్నాడు. ఆ తర్వాత అమ్మకానికి పెడుతున్నాడు. బాబో, పాపో పుడితే సంతోషం. ఆ సంతోషాన్ని…

అమెరికా ఎంబసీపై తాలిబాన్ దాడి, బిల్డింగ్ అదుపులోకి తీసుకున్న తాలిబాన్

కాబూల్ నడిబొడ్డున తాలిబాన్ మరొకసారి ప్రత్యక్షమైంది. నిరంతరం అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య శతృ దుర్భేధ్యంగా ఉండే ఆఫ్ఘనిస్ధాన్ రాజధానిలో తాలిబాన్ ప్రతిఘటనా దళాలు మరొక దాడికి శ్రీకారం చుట్టాయి. పెద్ద ఎత్తున పేలుళ్ళు, తుపాకి కాల్పులు వినిపిస్తున్నాయని కాబూల్ పోలీసులు ధృవీకరించారు. కాబూల్ నడిబొడ్డున గల వివిధ భవనాల నుండి ఈ కాల్పులు వినిపిస్తున్నాయని పోలీసుల ప్రతినిధి ఒకరు తెలిపారు. “వరుస పేలుళ్ళు వినబడ్డాయి. ఆ తర్వాత తుపాకి కాల్పులు జరుగుతున్నట్లుగా శబ్దాలు వస్తున్నాయి.…

కొత్త ఆయుధంతో అమెరికాకు దడ పుట్టిస్తున్న తాలిబాన్

ఇటీవలి కాలంలో తాలిబాన్ బలగాలు నాటోకి చెందిన హెలికాప్టర్లను కూల్చివేస్తున్న వార్తలు వరుసగా వెలువడ్డాయి. దానికి కారణం తాలిబాన్ కొత్త ఆయుధాన్ని సమకూర్చుకోవడమేనని తాలిబాన్ వర్గాలను ఉటంకిస్తూ ఏసియా టైమ్స్ పత్రిక తెలిపింది. భూమి మీది నుండి గాలిలోకి ప్రయోగించే మిసైల్ ద్వారా తాము గణనీయమైన సంఖ్యలో హెలికాప్టర్లను కూల్చివేశామని తాలిబాన్ ప్రతినిధి చెప్పాడు. అయితే నాటో, అమెరికా వర్గాలు మాత్రం తమ హెలికాప్టర్లు కూలినప్పుడల్లా సాంకేతిక లోపం వలన కూలిందని చెబుతున్నాయి. తాలిబాన్ ఇంతవరకూ ఒకటీ…

“సెప్టెంబరు 11” కి పదేళ్ళు -కార్టూన్

న్యూయార్క్, అమెరికా, నగరంలోని ప్రపంచ వాణిజ్య సంస్ధకు చెందిన జంట టవర్లపై టెర్రరిస్టు దాడులు జరిగి నేటితో (సెప్టెంబరు 10) పదేళ్ళు నిండాయి. దాడుల్లో మూడువేలకు పైగా చనిపోయారని అమెరికా తెలిపింది. టెర్రరిస్టు దాడుల్లో చనిపోయిన అమెరికన్లకు పూర్తిగా సానుభూతి, సహకారం అందించే లోపే, అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్, అదే దుర్ఘటనను అడ్డు పెట్టుకుని దురాక్రమణ యుద్ధాలకి తెర లేపాడు. రుజువుకాని నేరాన్ని మోపి, రుజువు కానవసరం లేదన్నట్లుగా, ఘటనతో సంబంధం లేని రెండు దేశాలు,…