బోసిపోయిన రైలు పట్టాలు ‘తెలంగాణ’ను డిమాండ్ చేస్తున్నాయి -రైల్ రోకో ఫొటోలు

తెలంగాణ రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి ఇచ్చిన మూడు రోజుల రైల్ రోకో పిలుపు మేరకు మొదటిరోజు శనివారం నాడు రైల్ రోకో విజయవంతంగా జరిగింది. శుక్రవారం రోజే తెలంగాణ జిల్లాలన్నింటా మూడు వందల మంది వరకూ నాయకులను అరెస్టు చేసిన పోలీసులు శనివారం మరో 2300 వరకూ అరెస్టు చేశామని ఐ.జి.అనూరాధ తెలిపింది. ముందస్తు అరెస్టులు ఇంకా కొనసాగుతాయని తెలిపింది. పట్టాలపై కూర్చున్నవారిపైన రైల్వే యాక్టు కింద అరెస్టు చేసి రిమాండ్…

మా బృందంలో ప్రశాంత్ భూషణ్ కొనసాగేదీ లేనిదీ తర్వాత నిర్ణయిస్తాం -అన్నా హజారే

అన్నా హజారే బృందంలో ప్రముఖ సభ్యుడు లాయర్ ప్రశాంత్ భూషణ్ పై శ్రీరాం సేన, భగత్ సింగ్ క్రాంతి సేన సభ్యులుగా చెప్పుకుంటున్న ముగ్గురు వ్యక్తులు దాడి చేసి కొట్టాక అన్నా హజారే బృందం కేంద్రంగా కొన్ని మార్పులు వేగంగా జరిగిపోతున్నాయి. ‘కాశ్మీరు ప్రజలలో ప్రజాభిప్రాయ సేకరణ జరిపి వచ్చే ఫలితాల్లో వేరు పడాలని వారు కోరితే వారికా అవకాశం ఇవ్వాలి” అని ప్రశాంత్ భూషణ్, వారణాసిలో జరిగిన ఒక సమావేశంలో చెప్పడమే తమ దాడికి కారణమని…

అమెరికా పచ్చి అబద్ధాల చరిత్రలో ఇంకొక పేజీ

ఈ సారి ఇరాన్ ప్రభుత్వం నేరుగా అమెరికా గడ్డపైనే సౌదీ అరేబియా రాయబారి హత్యకు కుట్ర చేసింది. అందుకు విచిత్రంగా మెక్సికో ‘హిట్ మేన్’ (ఖచ్చితంగా చెబితే కిరాయి గూండా) ను ఇరాన్ కాంట్రాక్టుకు మాట్లాడుకుంది. కాంట్రాక్టు కిల్లర్ ను మాట్లాడాడని అమెరికా చెబుతున్న వ్యక్తి, డ్రగ్స్ కేసుల్లో సి.ఐ.ఎ కి ఇన్‌ఫార్మర్ అన్న విషయం కూడా మరిచిపోయి అమెరికా గొప్ప కుట్రను బైటపెట్టాయి. ఇరాన్ కుట్రకు శిక్షగా అమెరికా తాజాగా మరికొన్ని ఆంక్షలను ఇరాన్ పైన…

ఇప్పుడు, తెలంగాణ పరిష్కారం కోసం రెండో ఎస్సార్సీ వేయడం అంటే……

ప్రస్తుత పరిస్ధితుల్లో తెలంగాణ సమస్య పరిష్కారం కోసం రెండో ఎస్.ఆర్.సి వేయడం అంటే, నిద్రపోతున్న గాడిదను లేపి తన్నించుకోవడమే. —–సి.పి.ఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ – (ఇంతకీ గాడిద ఎవరు చెప్మా!!!) — —

తెలంగాణ అంశాన్ని కేంద్ర త్వరలోనే తేల్చేస్తుంది -సి.ఎం కిరణ్ కుమార్

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సమస్యను కేంద్ర ప్రభుత్వం త్వరలోనే పరిష్కరిస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శనివారం ఢిల్లీలో విలేఖరులకు తెలిపాడు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో కేంద్ర తెలంగాణ సమస్యను పరిష్కరిస్తుందని ఆయన పేర్కొన్నాడు. కాంగ్రెస్ అధిష్టానం పిలుపుతో ఢిల్లీ వచ్చిన సి.ఎం కిరణ కుమార్ రెడ్డి, డెప్యుటి సి.ఎం దామాదర రాజ నరసింహరాజు లు సీనియర్ మంత్రులు ప్రణబ్ ముఖర్జీ, ఎ.కె.ఆంటోని, పి.చిదంబరం, గులాం నబీ ఆజాద్ లతో…

అమెరికా దరిద్రం అమెరికన్ల రాతల్లోనే చూద్దాం

ప్రపంచ ఆర్ధిక సంక్షోభం దెబ్బకు అమెరికా ఆర్ధికంగా కునారిల్లుతోంది. అమెరికా దరిద్రం ఒడిలో కునుకు తీస్తోందని అమెరికా ప్రభుత్వ సర్వే తెలుపుతున్నా అమెరికాను ఆరాధించే మూఢ భక్తులకు కళ్ళు తెరుచుకోవడం లేదు. అమెరికా గడ్డపై పుట్టి పెరిగిన తెల్ల, నల్ల, రంగు అమెరికన్లు అంతా ఇపుడు తమ భవిష్యత్తును తామే రూపొందించుకోవాల్సిన అవసరాన్ని గుర్తిస్తున్నారు. వాల్‌స్ట్రీట్ కంపెనీలు తమ జీవితాల్ని ఎలా బలితీసుకుంటున్నదీ తెలుసుకుని వీధుల్లోకి వస్తున్నారు. సెప్టెంబరు 17న ప్రారంభమైన “ఆకుపై వాల్‌స్ట్రీట్” ఉద్యమంలో ఇప్పుదు…

లాడెన్ ఆచూకి తెలిపిన పాక్ డాక్టర్ పై దేశ ద్రోహం కేసు నమోదు

ఒసామా బిన్ లాడెన్ హత్యకు దారి తీసేలా సి.ఐ.ఏ కి సమాచారం అందించిన పాకిస్ధాన్ డాక్టర్ పైన పాక్ ప్రభుత్వం దేశద్రోహం కేసు నమోదు చేయడానికి నిర్ణయించింది. ఒసామా బిన్ లాడెన్ హత్యపై దర్యాప్తు జరుపుతున్న పాకిస్ధాన్ పానెల్ డాక్టర్ పై విద్రోహం కేసు నమోదు చెయాల్సిందిగా సలహా ఇచ్చింది. బూటకపు టీకా కార్యక్రమాన్ని రూపొందించి లాడెన్ ఆశ్రయం తీసుకుంటున్నాడని చెబుతున్న ఇంటిలో నివసిస్తున్నవారినుండి లాడెన్ కుటుంబ డి.ఎన్.ఎ సంపాదించాడని డాక్టర్ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. డాక్టర్ షకీల్…

హక్కానీ గ్రూపు నాయకుడు పట్టివేత, అమెరికా అబద్ధాల సీరియల్‌లో మరొక పేజీ

ఆఫ్ఘన్ టెర్రరిస్టు సంస్ధల్లో హక్కానీ గ్రూపుకు అమెరికా అధికంగా భయపడుతున్న సంగతి తెలిసిందే. ఆఫ్ఘనిస్ధాన్‌ను సోవియట్ రష్యా ఆక్రమించుకున్న కాలంలో ఈ గ్రూపును అమెరికా పాకిస్ధాన్ దేశాలు అత్యంత ఇష్టంగా సాకాయి. జలాలుద్దీన్ హక్కానీ నాయకత్వంలొని హక్కానీ గ్రూపుతో పాటు ఆల్-ఖైదాను కూడా అమెరికా పెంచి పోషించింది. రోజులు మారాయి. సోవియట్ రష్యా మొదట ఆర్ధికంగా అనంతరం రాజకీయంగా కూడా కుప్పకూలడంతో అది తన ప్రభావిత ప్రాంతాలనుండి సైన్యాలను ఉపసంహరించుకుంది. రష్యా సైన్యాలు వెళ్ళాక ఆఫ్ఘనిస్ధాన్‌పై నియంత్రణ…

‘బోస్టన్ ఆక్రమిద్దాం’ ఉద్యమ అతి పెద్ద ర్యాలి -వీడియో

సెప్టెంబరు 30 తేదీన అమెరికాలోని బోస్టన్ నగరంలో వివిధ ప్రాంతాల వద్ద ప్రదర్శనలు నిర్వహించారు. ప్రపంచ ఆర్ధిక సంక్షోభానికి కారణభూతులైన వాల్‌స్ట్రీట్ కంపెనీలకు పెద్ద మొత్తంలో బెయిలౌట్లు పంచిపెట్టిన ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ బోస్టన్ శాఖ ముందు అందోళనకారులు భారీ ప్రదర్శన నిర్వహించారు. హైస్కూల్ విద్యార్ధులనుండి యూనివర్సిటీ ప్రొఫెసర్ల వరకూ పాల్గొన్న ఈ ర్యాలికి పోలీసులు కాపలా కాశారు. వికలాంగులు సైతం పాల్గొన్న ఈ ఊరేగింపు తర్వాత బోస్టన్ నగరం నుండి అనేకమంది ఇతర నగరాలకు వెళ్ళి…

బోస్టన్ ను ఆక్రమించండి -ఫొటో + వీడియో

“ఆకుపై వాల్‌స్ట్రీట్’ ఉద్యమం అమెరికాలో అక్టోబరు 3 నాటికి 50 నగరాలకు పైగా వ్యాపించింది. బోస్టన్ నగరవాసులు “ఆకుపై బోస్టన్” ఉద్యమం కింద సమీకృతులవుతున్నారు. సెప్టెంబరు 30 తేదీన వెయ్యిమందికి పైగా ప్రజానీకం బ్యాంక్ ఆఫ్ అమెరికా ముందు ప్రదర్శన నిర్వహించి ఇళ్ళ రుణాలను ఫోర్ క్లోజ్ చేయడంపై మారిటోరియం విధించాలని డిమాండ్ చేసారు. ఆ తర్వాత డీవే స్క్వేర్ కు ఊరేగింపు నిర్వహించారు. అక్కడ “ఆకుపై బోస్టన్” ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ ఉద్యమంలో 7…

రక్తం ఓడుతున్న బహ్రెయిన్ -కార్టూన్

లిబియా ప్రజలను గడ్డాఫీ నుండి రక్షించడం కోసం ఆరు నెలలపాటు లిబియా ప్రజలపైనే బాంబులు కురిపించాయి అమెరికా, ఫ్రాన్సు, ఇంగ్లండ్ దేశాలు. బహ్రెయిన్ పోలీసులే కాకుండా సౌదీ అరేబియా, కతార్ ల నుండి వచ్చిన పరాయి దేశాల పోలీసులు కూడా బహ్రెయిన్ ప్రజలపై హత్యాకాండ సాగిస్తున్నప్పటికీ ఆ దుష్ట త్రయం బధిరాంధులుగా మిగిలిపోయింది. అమెరికా సైనిక స్ధావరం ఉంచడానికి రాజు “హమద్ బిన్ ఇసా ఆల్ ఖలీఫా” అంగీకరించాడు కనుక అక్కడ ప్రభుత్వం ఎన్ని అరాచకాలకు పాల్పడినా…

అమెరికా అంతటా విస్తరిస్తున్న వాల్‌స్ట్రీట్ వ్యతిరేక ఆందోళనలు

అమెరికాలొ వాల్‌స్ట్రీట్ కంపెనీల దోపిడికి, వాల్‌స్ట్రీట్ కంపెనీలకు సహకరిస్తున్న పాలకుల విధానాలకూ వ్యతిరేకంగా అమెరికన్లు సాగిస్తున్న ఆందోళనలు అక్టోబరు 4 తేదీతో 19 వ రోజుకి చేరుకున్నాయి. సెప్టెంబరు 17 తేదీన న్యూయార్క్ లో కొద్దిమందితో మొదలైన “వాల్‌స్ట్రీట్ ను ఆక్రమించండి” ఉద్యమం, క్రమంగా ఇంతింతై, వటుడింతై అన్నట్లుగా అమెరికాలోని అన్ని రాష్ట్రాలకూ పాకింది. అస్ధిర ఆర్ధిక వ్యవస్ధపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ, కార్పొరేట్ కంపెనీల అత్యాశను నిరసిస్తూ ఫెడరల్ రిజర్వ్ బ్యాంకుల శాఖలను ప్రదర్శనలు, ఆందోళనలతో…

అమెరికాలో కదం తొక్కుతున్న “వాల్‌స్ట్రీట్ ను ఆక్రమిద్దాం” ఉద్యమం -ఫొటోలు

వాల్ స్ట్రీట్ కంపెనీల దోపిడికి వ్యతిరేకంగా వాల్ స్ట్రీట్ కు అమెరికా సంపదను దోచిపెడుతున్న అమెరికా పాలకులకు వ్యతిరేకంగా “వాల్ స్ట్రీట్ ను ఆక్రమిద్దాం” ఉద్యమం న్యాయార్క్ నగర వీధుల్లో కదం దొక్కుతున్న దృశ్యాలివి. సి.బి.ఎస్ న్యూస్ సంస్ధ వీటిని ప్రచురించింది.