తెలంగాణ బిల్లు ఆమోదించారు
ఒక ముఖ్యమైన అంకం పూర్తయింది. ఎంత ముఖ్యం అనుకున్నారో అంత వివాదాస్పదంగా ముగిసిపోయింది. ఒక ప్రాంత ప్రజల ప్రజాస్వామిక కోర్కెను మన్నించడానికి మరో ప్రాంత ధనిక వర్గాలు ససేమిరా అంగీకరించకపోవడంతో చివరికి మూజువాణి ఓటే తెలంగాణకు శరణం అయింది. ‘సీమాంధ్రకు కూడా న్యాయం’ నినాదం మాటున తెలంగాణ రాష్ట్ర ప్రతిపత్తినే మూల్యంగా చెల్లించుకోవాల్సిన డిమాండ్లు సీమాంధ్ర నాయకులు ముందుకు తేవడంతో సామరస్య వాతావరణానికి చోటు లేకుండా పోయింది. వెరసి గందరగోళం మధ్యనే లోక్ సభ ‘ఆంధ్ర ప్రదేశ్…





